News April 10, 2024

BIG BREAKING: పవన్ కళ్యాణ్‌కు ఈసీ నోటీసులు

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ఇటీవల అనకాపల్లి సభలో సీఎం జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసుల్లో పేర్కొంది. పవన్ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదుతో ఈసీ స్పందించింది. కాగా ఇటీవల చంద్రబాబు, జగన్‌కు కూడా ఈసీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

News April 10, 2024

జూన్ 20న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 AD’ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. మేకర్స్ ముందుగా ప్రకటించినట్లు మే 9వ తేదీన రిలీజ్ కావట్లేదని, జూన్ 20వ తేదీకి మారినట్లు సినీవర్గాలు తెలిపాయి. నిన్నటి వరకూ మే 30వ తేదీన ‘కల్కి’ వస్తుందని వార్తలొచ్చాయి. కానీ, లోక్‌సభ ఎన్నికల హడావిడి పూర్తయ్యాకే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.

News April 10, 2024

బీజేపీ ప్రచారానికి విదేశీ రాజకీయ పార్టీలు

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కొత్త పంథాను అనుసరిస్తోంది. తమ ప్రచారానికి 25 దేశాలకు చెందిన రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. వాటిలో 13 దేశాల పార్టీలు ఆహ్వానాన్ని ఓకే చేసినట్లు తెలుస్తోంది. బ్రిటన్, జర్మనీ, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాల పార్టీల ప్రతినిధులు భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో ఎన్నికలుండటంతో ఆ దేశపు పార్టీలను మాత్రం బీజేపీ ఆహ్వానించలేదని సమాచారం.

News April 10, 2024

కరణ్ జోహర్‌కు ‘దేవర’ నార్త్ హక్కులు

image

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులను కరణ్ జోహర్, ఏఏ ఫిల్మ్స్ సంయుక్తంగా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. భారీ ధరకే రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ్‌రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

News April 10, 2024

జనసేన స్టార్ క్యాంపెయినర్లు వీరే..

image

AP: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, అంబటి రాయుడు(క్రికెటర్), కొరియోగ్రాఫర్ జానీ, సినీ, టీవీ నటులు సాగర్, పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీనులను అధినేత పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్లుగా నియమించినట్లు Xలో ట్వీట్ చేసింది.

News April 10, 2024

ఎంతోమంది నితీశ్‌లు.. వెలికితీయాలంతే..!

image

SRH ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ పేరు నిన్నటి నుంచి మారుమోగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో జిల్లా, మండల స్థాయుల్లో అతడి వంటి యువకులు ఎంతోమంది ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు సహకరించకో, సరైన ప్రోత్సాహం, దిశా నిర్దేశం లేకనో ఈ మాణిక్యాలన్నీ మట్టిలోనే ఉండిపోతున్నాయి. బీసీసీఐ జిల్లా స్థాయుల్లో ఇలాంటివారిని గుర్తించి సానబెడితే ఎంతోమంది నితీశ్‌లు వెలుగులోకి వస్తారంటున్నారు క్రీడా విశ్లేషకులు.

News April 10, 2024

సాయంకాలం వ్యాయామం చేస్తే..

image

చక్కటి ఆరోగ్యం కోసం ఎక్కువశాతంమంది ఉదయాన్నే వ్యాయామం చేస్తుంటారు. అయితే, సాయంకాలం వ్యాయామంతో ఫలితం అధికంగా ఉంటుందట. సాయంత్రం వ్యాయామంతో మధుమేహం, ఊబకాయ సమస్యలు తగ్గుముఖం పడుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులు తెలిపారు. వ్యాయామం మాత్రమే కాక ఆహారపు అలవాట్లు, జీవన శైలి కూడా మెరుగ్గా ఉంటేనే ఫలితం ఉంటుందని సూచించారు. డయాబెటిస్ కేర్ జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురించారు.

News April 10, 2024

రేపు దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ టీజర్

image

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కుతోన్న ‘లక్కీ భాస్కర్’ నుంచి అప్డేట్ వచ్చింది. ‘ఈరోజు రంజాన్ జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. టీమ్ లక్కీ భాస్కర్ నుంచి మీకో చిన్న గిఫ్ట్. రేపు తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో సినిమా టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నాం’ అని దుల్కర్ ట్వీట్ చేశారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు.

News April 10, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఈడీకి ఫిర్యాదు

image

TG: రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై హైకోర్టు న్యాయవాది సురేశ్ ఈడీకి ఫిర్యాదు చేశారు. కేసులో నిందితులు వ్యాపారులను బెదిరించి రూ.కోట్లు వసూలు చేశారన్న సురేశ్.. దీనిపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదన్న సురేశ్.. ఈడీ దర్యాప్తు చేస్తే మూల కారకులు బయటకు వస్తారని పేర్కొన్నారు.

News April 10, 2024

వివిధ దేశాల్లో iPHONE ధరలిలా!

image

ఐఫోన్ కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ, ఖరీదవడంతో ఆండ్రాయిడ్ మొబైల్స్‌తో సరిపెట్టుకుంటుంటారు. మరికొందరైతే విదేశాల నుంచి తెప్పించుకొని వారి కోరికను తీర్చుకుంటారు. ట్యాక్సులు అధికంగా ఉండటం వల్ల ఇండియాలో ఐఫోన్స్ కాస్ట్లీ అయిపోయాయి. iPHONE 15 PRO ధర ఇండియాలో రూ.1.27 లక్షలు కాగా.. USAలో రూ.82 వేలకే లభిస్తుంది. UKలో రూ.1.03 లక్షలు, వియత్నాంలో రూ.99 వేలు, దుబాయ్‌లో రూ.96వేలు, చైనాలో రూ.92 వేలుగా ఉంది.