India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా విశాఖను మారుస్తామని CM చంద్రబాబు చెప్పారు. ‘భావనపాడులో 10వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తాం. విశాఖ నుంచి భావనపాడు(శ్రీకాకుళం) వరకు రోడ్డు నిర్మిస్తాం. 2025లోగా భావనపాడు పోర్టు పూర్తి చేస్తాం. వంశధార నుంచి నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా వరకు అన్ని నదులు అనుసంధానం కావాలి. సముద్ర తీర ప్రాంతాల్లో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తాం’ అని సీఎం వెల్లడించారు.
* బైక్ వేగాన్ని పదేపదే పెంచుతూ, తగ్గించడం వద్దు. ఒకే స్పీడుతో వెళ్లేందుకు ప్రయత్నించండి.
* సడన్ బ్రేకులు, వేగంగా గేర్లు మార్చడమూ మంచిది కాదు.
* టైర్లలో గాలి చాలినంత ఉందో లేదో చూసుకోండి.
* బైక్ చైన్ క్లీన్&స్మూత్గా ఉండాలి.
* మీ బైక్ను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించండి. బైక్ కంపెనీ సిఫార్సు చేసిన ఇంజిన్ ఆయిల్నే ఉపయోగించండి.
APకి రూ.30లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 10 బిలియన్ డాలర్ల FDIలను తీసుకురావాలని టార్గెట్గా పెట్టుకున్నామన్నారు. 40బిలియన్ డాలర్ల ఎగుమతులు రాష్ట్రం నుంచి వెళ్లేలా చూస్తామన్నారు. MSMEలను బలోపేతం చేసి, 5లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
దెబ్బతిన్న AP బ్రాండ్ను పునర్మిర్మించాల్సి ఉందని CM చంద్రబాబు తెలిపారు. ‘APని ఆక్వా హబ్గా మారుస్తాం. ఫుడ్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమను మారిస్తే రత్నాలసీమగా తయారవుతుంది. సీమలో ప్రతి ఎకరాకు నీళ్లిస్తే, అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. అభివృద్ధిలో మిన్నగా మారుతుంది. నవంబర్లో స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్ విడుదల చేస్తాం. భారీగా విదేశీ పెట్టుబడులు తీసుకురావాలి’ అని సీఎం వెల్లడించారు.
TG: హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తెలిపింది. హైడ్రా ఏర్పాటును తప్పు పట్టలేమని వ్యాఖ్యానించింది. జీవో 99, హైడ్రా చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జడ్జి ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు GHMC చట్టంలోని విశేషాధికారాలను హైడ్రాకు కల్పిస్తూ పురపాలక శాఖ తాజాగా ఉత్తర్వులిచ్చింది.
రైల్వేలో 8113 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ రైలు మేనేజర్, టైపిస్ట్, క్లర్క్ పోస్టుల్లో ఖాళీలున్నాయి. 18 నుంచి 36 ఏళ్లలోపు ఉన్న అభ్యర్థులు ఈ నెల 20 తేదీలోపు అప్లై చేసుకోవాలి. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. సికింద్రాబాద్ రీజియన్లో-478 ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసేందుకు ఈ <
AP: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి నెల టికెట్ల బుకింగ్ తేదీలను TTD వెల్లడించింది. రూ.300 దర్శనం టోకెన్లు ఈ నెల 24వ తేదీ ఉ.10 గంటల నుంచి TTD వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. 19 నుంచి 21 వరకు ఆర్జిత సేవా టికెట్లు, 22న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, 23వ తేదీ అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల కానున్నాయి. 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో గదుల బుకింగ్ ఓపెన్ కానుంది.
AP: 6 కొత్త <<14373945>>పాలసీలు <<>>రాష్ట్ర ప్రగతిని మారుస్తాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఐదు జోన్లలో 5 ఇన్నోవేషన్ రతన్టాటా హబ్లు వస్తాయని, అమరావతి కేంద్రంగా విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ/గుంటూరు, తిరుపతి, అనంతపురంలో హబ్లు వస్తాయన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి ఏపీ ఇన్నోవేషన్ హబ్గా మారాలనేది తమ టార్గెట్ అని బాబు చెప్పారు.
ఒబెసిటీ నిరుద్యోగులకు వెయిట్ లాస్ మెడికేషన్స్ ఇస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. వారు తిరిగి పనిలోకి వెళ్లేందుకు సాయపడాలనే ఈ నిర్ణయం తీసుకున్నామంది. ఒబెసిటీ సమస్యలతో NHSపై ఏటా 11bn పౌండ్ల భారం పడుతోందని వెల్లడించింది. చెడు అలవాట్లతో ఇది ఇంకా పెరగొచ్చని ఆవేదన చెందింది. దీంతో ఎకానమీ వెనక్కి పోతోందని, ప్రజలు అదనంగా 4 రోజులు ఎక్కువ సిక్ లీవ్స్ తీసుకుంటున్నారని UK మంత్రి స్ట్రీటింగ్ అన్నారు.
AP:క్యాబినెట్ సమావేశంలో 6 కొత్త పాలసీలను ఆమోదించామని CM చంద్రబాబు ప్రకటించారు. ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక, IT-వర్చువల్ వర్కింగ్ పాలసీలు తీసుకొచ్చామన్నారు. వచ్చే 5ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా వీటిని రూపొందించామన్నారు. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. యువత ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరాలనేది తమ ఆకాంక్ష అని చెప్పారు.
Sorry, no posts matched your criteria.