News April 3, 2024

సిక్కింలో జాతీయ పార్టీలు బోణి కొడతాయా?

image

కాంగ్రెస్, బీజేపీలకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు ఉన్నా ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఉనికిని నిలుపుకునేందుకు శ్రమిస్తున్నాయి. అక్కడి తొలి లోక్‌సభ ఎన్నికల (1977) తర్వాత కాంగ్రెస్ గెలుపు రుచి చూడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఖాతా తెరవలేదు. BJP ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. అధికారం మాట అటుంచితే ఈసారి ఈ పార్టీలు కనీసం ఒక్క సీటు అయినా గెలుస్తాయా? అనేది చర్చనీయాంశమైంది.
<<-se>>#Elections2024<<>>

News April 3, 2024

వందకు వంద శాతం మనమే గెలుస్తున్నాం: CBN

image

ఏపీని గాడిలో పెట్టడానికే మూడు పార్టీలు జట్టుగా వచ్చాయని చంద్రబాబు అన్నారు. ‘ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అన్నారు.. చేశారా? బాబాయ్‌ను గొడ్డలితో చంపి సానుభూతితో గెలిచిన వ్యక్తి జగన్. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులే. వైసీపీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వందకు వంద శాతం మనమే గెలుస్తున్నాం’ అని కోనసీమ జిల్లా రావులపాలెం ప్రజాగళం సభలో అన్నారు.

News April 3, 2024

పవర్‌ఫుల్ MRI నుంచి ఫస్ట్ బ్రెయిన్ ఫొటో

image

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన MRI స్కానర్ నుంచి మనిషి మెదడు ఫొటో విడుదలైంది. ఫ్రాన్స్‌ పరిశోధకులు 2021లో ఓ గుమ్మడికాయను స్కాన్ చేయడానికి ఈ యంత్రాన్ని ఉపయోగించారు. తాజాగా మనుషుల మెదళ్లను స్కాన్ చేసేందుకు అనుమతి లభించింది. ఇది సాధారణ MRIల కంటే 10రెట్లు ఖచ్చితత్వంతో స్కాన్ చేస్తుందని చెబుతున్నారు. దీంతో మెదడు సమస్యలను సులభంగా గుర్తించి చికిత్స అందించవచ్చని అభిప్రాయపడుతున్నారు.

News April 3, 2024

రేప్ బాధితురాలిని బట్టలు విప్పమన్న జడ్జి

image

రేప్ కేసు బాధితురాలి గాయాలు చూసేందుకు బట్టలు విప్పమని మెజిస్ట్రేట్ ఆదేశించిన ఘటన రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాలో చోటుచేసుకుంది. గత నెల 19న తనపై అత్యాచారం జరిగిందని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై జిల్లా కోర్టులో విచారణ సందర్భంగా జడ్జి బట్టలు విప్పి గాయాలు చూపించాలని ఆదేశించారు. నిరాకరించిన ఆ యువతి జడ్జిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

News April 3, 2024

IPL: కోల్‌కతా బ్యాటింగ్

image

ఢిల్లీతో మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచింది. విశాఖలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.
★ ప్లేయింగ్ XI
DC: పృథ్వీ షా, వార్నర్, మిచెల్ మార్ష్, పంత్, స్టబ్స్, అక్షర్, సుమిత్ కుమార్, రసిఖ్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
KKR: ఫిలిప్ సాల్ట్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, రఘువంశీ, రస్సెల్, నరైన్, రమణదీప్, స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

News April 3, 2024

మృణాల్ ఠాకూర్‌కు బిగ్ ఆఫర్?

image

సీతారామం సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస విజయాలతో దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్‌కు భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చేయబోయే ఓ సినిమాలో నటించే అవకాశం ఆమెకు వచ్చినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఈనెల 5న థియేటర్లలో విడుదల కానుంది.

News April 3, 2024

ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల ఆస్తి కల్పించాం: జగన్

image

AP: రాష్ట్రంలోని ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల ఆస్తి కల్పించామని సీఎం జగన్ అన్నారు. ‘రూ.3 వేల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. ఎన్నో పథకాలతో అక్కచెల్లెమ్మలకు అండగా ఉన్నాం. మహిళలకు ఇచ్చిన ఒక్కో ఇంటి విలువ రూ.లక్షల్లో ఉంటుంది. ఇప్పటివరకు రూ.2.70 లక్షల కోట్లు మీ ఖాతాల్లో నేరుగా వేశాం. 130 సార్లు మీ బిడ్డ జగన్ బటన్ నొక్కారు. నా కోసం రెండు సార్లు బటన్లు నొక్కండి’ అని ఆయన పేర్కొన్నారు.

News April 3, 2024

15న కేసీఆర్ సభ

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 15న మెదక్ జిల్లాలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. కాగా కేసీఆర్ ఇటీవల మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ప్రకటించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి నీలం మధు బరిలో ఉన్నారు.

News April 3, 2024

మరమరాలు ఆరోగ్యానికి మంచివేనా?

image

తెలుగు రాష్ట్రాల్లో మరమరాలతో ఉగ్గాని, లడ్డూలు, భేల్ పూరి, స్వీట్స్ లాంటి స్నాక్స్ తయారు చేసుకుని తింటుంటారు. వీటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరమరాల్లో పోషకాలు ఎక్కువగా ఉండటంతో ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రించి బరువు తగ్గిస్తుంది. ఇవి తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. జీర్ణ సమస్యలు, పేగు ఆరోగ్యానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.

News April 3, 2024

బొగ్గు గనుల్లో చిక్కుకున్న 70మంది కార్మికులు

image

తైవాన్‌లో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే 9 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇక భూకంపం వల్ల రెండు బొగ్గు గనులు కూలడంతో అందులో 70 మంది కార్మికులు చిక్కుకున్నట్లు ప్రకటించారు. వీరంతా అందులో పనిచేస్తుండగా గనులు కూలాయి. వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.