News January 3, 2025

మహిళలకు ఫ్రీ బస్.. బెంగళూరులో ఏపీ మంత్రులు

image

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సర్కార్ వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన మంత్రివర్గ సబ్ కమిటీ కర్ణాటకలోని బెంగళూరులో పర్యటిస్తోంది. మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణి అక్కడి బస్సులు ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డితో వారు భేటీ అయ్యారు. అక్కడ అమలవుతున్న ఫ్రీ బస్ జర్నీపై వారు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News January 3, 2025

తెలుగు డైరెక్టర్ కన్నుమూత

image

డైరెక్టర్, రచయిత అపర్ణ మల్లాది(54) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె USలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈమె ‘ది అనుశ్రీ ఎక్స్‌పరిమెంట్’ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తర్వాత తీసిన ‘పోష్ పోరిస్’ అనే వెబ్ సిరీస్ సూపర్ హిట్టయ్యింది. రెండేళ్ల కిందట ప్రిన్స్, అనీషా, భావన ప్రధాన పాత్రల్లో ‘పెళ్లి కూతురు పార్టీ’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈమె పలు చిత్రాలకు కథలను కూడా అందించారు.

News January 3, 2025

యువరాజ్-ఫ్లింటాఫ్ క్లాష్ రిపీట్!

image

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్సులో కోన్స్టస్- బుమ్రా మధ్య జరిగిన గొడవను 2007 T20 WCలో యువరాజ్- ఫ్లింటాఫ్ గొడవతో నెటిజన్లు పోల్చుతున్నారు. ఆ ఇన్నింగ్స్‌లో ఫ్లింటాఫ్‌పై ఉన్న కోపాన్ని యువరాజ్ బౌలర్ బ్రాడ్‌ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన కోపాన్ని ఖవాజాను ఔట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.

News January 3, 2025

త్వ‌ర‌లో ట్రంప్‌-పుతిన్ స‌మావేశం.. అది కూడా భార‌త్‌లో

image

ఉక్రెయిన్‌తో సంక్షోభ నివారణకు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకి ఆసక్తిగా ఉన్న రష్యా సరైన వేదిక కోసం వెతుకుతోంది. యుద్ధానికి స్వస్తిపలికేలా కృషి చేస్తాన‌ని ట్రంప్ ఇటీవ‌ల ఉద్ఘాటించారు. ట్రంప్‌తో చర్చలకు తామూ సిద్ధమేనని పుతిన్ తెలిపారు. దీంతో మిత్ర‌దేశం భార‌త్ త‌మ స‌మావేశానికి అనువైన‌ వేదికగా ర‌ష్యా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అదే జ‌రిగితే త్వ‌ర‌లో ట్రంప్‌-పుతిన్ భార‌త్‌లో స‌మావేశం కావ‌చ్చు!

News January 3, 2025

రైతులు, విద్యార్థులకు రూ.23,112 కోట్లు నష్టం: వైసీపీ

image

AP: సీఎం చంద్రబాబును నమ్మడం, నక్కను నమ్మడం ఒకటేనని మరోసారి నిజమైందని వైసీపీ Xలో విమర్శించింది. ‘ఘరానా దొంగ CBN రైతులను దర్జాగా మోసం చేశారు. రైతు భరోసాకు రిక్త హస్తం చూపారు. దీంతో 54 లక్షల మందికి ఏటా రూ.20వేల చొప్పున అందకపోవడంతో రూ.10,000 కోట్లు నష్టపోయారు. తల్లికి వందనం పథకంలో భాగంగా 87.42 లక్షల మంది విద్యార్థులకు రూ.15వేల చొప్పున అందకపోవడంతో రూ.13,112 కోట్లు నష్టపోయారు’ అని ఆరోపించింది.

News January 3, 2025

13 ఏళ్లకు థియేటర్లలోకి విశాల్ మూవీ

image

తమిళ హీరో విశాల్ నటించిన మదగజరాజ మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి రానుంది. 2011లోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తైనా పలు కారణాలతో విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సంక్రాంతికి తమిళంలో బడా చిత్రాలు లేకపోవడంతో ఈ నెల 12న రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. సుందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంజలి హీరోయిన్‌గా నటించారు. కమెడియన్ నుంచి హీరోగా మారిన సంతానం ఇందులో కీలక పాత్ర పోషించారు.

News January 3, 2025

రైతులు యాచించాలని కాంగ్రెస్ అంటోంది: కేటీఆర్

image

TG: రైతు భరోసా ఎవరికిస్తారో స్పష్టంగా చెప్పాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతు డిక్లరేషన్‌లో చాలా హామీలు ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నారని దుయ్యబట్టారు. రైతు శాసించాలని కేసీఆర్ అంటే రైతు యాచించాలని కాంగ్రెస్ అంటోందని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లను తీసేస్తామని చెబుతూ రైతు బంధు లేకుండా చేశారని విమర్శించారు. ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు.

News January 3, 2025

ఈ ఊర్లో ఆడపిల్ల పుడితే ఏం చేస్తారంటే?

image

ఆడపిల్ల పుడితే రాజస్థాన్‌లోని రాజసమంద్ జిల్లా పిప్లాంత్రి గ్రామంలోని ప్రజలంతా పండుగ చేసుకుంటారు. ఆడపిల్ల పుట్టగానే 111 మొక్కలు నాటే ఆచారం ఇక్కడ ఉంది. దీంతోపాటు ఆడపిల్ల భవిష్యత్తు కోసం గ్రామస్థులు రూ.21 వేలు, తల్లిదండ్రులు రూ.10వేలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆర్థికంగా తోడ్పాటునిస్తారు. సమాజంలో ఆడపిల్లలపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేందుకు 2006లో అప్పటి గ్రామ సర్పంచ్ శ్యామ్ సుందర్ దీనిని ప్రవేశపెట్టారు.

News January 3, 2025

ఏపీని జగన్ భ్రష్టు పట్టించారు: అచ్చెన్నాయుడు

image

AP: రాష్ట్రాన్ని వైఎస్ జగన్ భ్రష్టు పట్టించారని మంత్రి అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందన్నారు. కేంద్రం సహకారంతో ఆక్సిజన్ అందినట్లు తెలిపారు. మత్స్యకారులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అన్ని హామీలు నెరవేర్చాకే ఎన్నికలకు వెళ్తామన్నారు. రాష్ట్ర సంపద ఉద్యోగుల జీతాలకే సరిపోవడం లేదని చెప్పారు. అయినా మత్స్యకారులను ఆదుకుంటామని పేర్కొన్నారు.

News January 3, 2025

దున్నపోతుపై పెట్రోలింగ్ నిర్వహిస్తోన్న పోలీసులు

image

అత్యాధునిక వాహనాలు, గుర్రాలను వినియోగిస్తూ పోలీసులు గస్తీ కాయడం చూస్తుంటాం. అయితే, బ్రెజిల్‌లో కొందరు మిలిటరీ సైనికులు దున్నపోతులపై సవారీ చేస్తూ పెట్రోలింగ్ నిర్వహిస్తారు. వీటిని తడిసిన బురద నేలలో అనుమానితులను వెంబడించేందుకు, మడ చిత్తడి నేలల గుండా వెళ్లడానికి, నదుల్లో ఈదేందుకు ఉపయోగిస్తారు. వర్షాకాలంలో విస్తారమైన ద్వీపం అంతటా నేరస్థులను వేటాడేందుకు ఏకైక మార్గం ఇవే అని పోలీసులు చెబుతున్నారు.