India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

☛ SLBC టన్నెల్ వద్ద రెస్క్యూ పనులను పరిశీలించిన సీఎం రేవంత్
☛ మార్చి 31లోపు రైతు భరోసా పంపిణీ పూర్తి: భట్టి
☛ రెండున్నరేళ్లలో వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి: రామ్మోహన్
☛ AP సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెండ్
☛ APలో 28.62 లక్షల శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాల పంపిణీ
☛ ఛాంపియన్స్ ట్రోఫీ: న్యూజిలాండ్పై భారత్ విజయం
☛ రంజీ ట్రోఫీ (2024-25) విజేత విదర్భ

అమ్మాయిలను ఆకర్షించేలా తాను మెసేజ్లు చేస్తాననే ప్రచారాన్ని మాధవన్ ఖండించారు. ఈ ఆరోపణలు రావడానికి గల కారణాన్ని వెల్లడించారు. ‘మీ నటనంటే ఇష్టమంటూ కిస్, హార్ట్ ఎమోజీలతో గతంలో ఓ యువతి మెసేజ్ చేసింది. థాంక్యూ, గాడ్ బ్లెస్యూ అని రిప్లై ఇచ్చా. అయితే ఆమె తన మెసేజ్లోని సగాన్ని, నా సమాధానాన్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. ఆ తర్వాత SM వాడకంపై క్లారిటీ తెచ్చుకున్నా’ అని పేర్కొన్నారు.

ఐపీఎల్-2025లో జట్ల ప్రాక్టీస్ సెషన్లకు సంబంధించి BCCI ఆంక్షలు విధించింది.
☛ మ్యాచ్ ఉన్న రోజుల్లో స్టేడియాన్ని ప్రాక్టీస్కు వాడొద్దు.
☛ ఐపీఎల్ వేదికలలో ఇతర టోర్నీల నిర్వహణకు అనుమతి లేదు.
☛ ఒక్కో టీమ్కు 7 ప్రాక్టీస్ సెషన్స్ మాత్రమే ఉంటాయి. ఫ్లడ్ లైట్ల కింద కేవలం 3.30hrs ప్రాక్టీస్కే అనుమతి.
☛ రెండు జట్లు ఒకేసారి ప్రాక్టీస్ చేయాలనుకుంటే సెషన్ల వారీగా అవకాశం ఇస్తారు.

మహారాష్ట్రలో అధికార ‘మహాయుతి’లో అంతర్యుద్ధమంటూ వస్తున్న వార్తలకు నేతలు చెక్ పెట్టారు. ఇవాళ సీఎం దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, మంత్రి అజిత్ పవార్ ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించారు. ‘మా కూటమి ఎప్పటికీ విడిపోదు. పరిస్థితి కూల్గా ఉంది. మాలో గొడవలు అంటూ విపక్షాలు ఎంత ప్రచారం చేసినా ప్రయోజనం లేదు. 3 పార్టీల నేతలు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్తున్నాం’ అని పేర్కొన్నారు.

సందీప్రెడ్డి-ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీపై మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డార్లింగ్ అంటే తనకు అభిమానమని, అందుకే ఈ చిత్రం కోసం కసిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అద్భుతమైన సంగీతం అందిస్తానని చెప్పారు. సందీప్తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయన్నారు. ఆయనతో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ అని, దాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు.

ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 5వ తరగతి, ఇంటర్ ఫస్టియర్, డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాల్లో అన్ని స్థానాలకు, 6, 7, 8 క్లాసుల్లో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 25వ తేదీన ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 5న మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజులపాటు పర్యటన కొనసాగనుంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారని తెలుస్తోంది.

అమెరికా అధికార భాషగా ఇంగ్లిష్ను ఎంపిక చేస్తూ ఆదేశాలపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఫెడరల్ ప్రభుత్వ నిధులతో నడిచే ఆఫీసులు, సంస్థలు తమ సేవలను, పత్రాలను ఇంగ్లిషేతర భాషల్లో కొనసాగించాలా? వద్దా? అని ఎంచుకోవచ్చు. ఇంగ్లిష్ను అధికార భాషగా తీసుకోవడం ద్వారా ఉమ్మడి జాతీయ ప్రయోజనాలు బలోపేతం అవుతాయని, సమ్మిళిత, సమర్థవంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చని ఈ ఆదేశాల్లో అమెరికా ప్రభుత్వం పేర్కొంది.

CT: చివరి గ్రూప్ మ్యాచ్లో కివీస్పై భారత్ 44 పరుగుల తేడాతో గెలిచింది. విలియమ్సన్ 81, శాంట్నర్ 28, యంగ్ 22, మిచెల్ 17, టామ్ 14, ఫిలిప్స్ 12 రన్స్ చేశారు. వరుణ్ 5 వికెట్లతో సత్తా చాటగా, కుల్దీప్ 2, అక్షర్, హార్దిక్, జడేజా తలో వికెట్ తీశారు. గ్రూప్ స్టేజీలో 3 మ్యాచ్లలోనూ గెలిచి 6 పాయింట్లతో IND టాపర్గా నిలిచింది. సెమీస్లో AUSతో భారత్, SAతో కివీస్ తలపడనున్నాయి.
స్కోర్లు: భారత్ 249/9, కివీస్ 205/10

తెలంగాణ శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రోరోగ్ చేయకుండానే డిసెంబర్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి సంతాపం, ఎస్సీ వర్గీకరణ, కులగణన నివేదికలపై ప్రకటనలు చేశారు. ఈ నెలలో బడ్జెట్ సమావేశాలు జరగనుండగా, వాటిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది. దీంతో సభను ప్రోరోగ్ చేయగా, త్వరలోనే శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Sorry, no posts matched your criteria.