India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆస్కార్-2025 బరిలో నిలిచిన ఏకైక ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ‘అనుజా’కు నిరాశ ఎదురైంది. 22 నిమిషాల డచ్ మూవీ ‘ఐయామ్ నాట్ రోబోట్’కు బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అవార్డు దక్కింది. ఢిల్లీలోని గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే ఇద్దరు బాలికల జీవిత కథ ఆధారంగా ‘అనుజా’ను ఆడమ్ జే గ్రేవ్స్ తెరకెక్కించారు. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో OP ఛార్జీలు ఇష్టారీతిన ఉన్నాయి. ప్రైవేట్ నుంచి కార్పొరేట్ వరకు సగటున రూ.500-రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. ఫేమస్ డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే రూ.2000 కట్టాల్సిందే. సర్జరీల ధరలు చూస్తే పేషెంట్ల గుండెలు దడ పుట్టేలా ఉన్నాయి. నియంత్రణ లేని ఈ ఛార్జీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ విధించాలని ప్రజలు కోరుతున్నారు. రేట్లు ఫిక్స్ చేయాలంటున్నారు.

దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, అంతర్జాతీయ అనిశ్చితే ఇందుకు కారణాలు. నిఫ్టీ 22,103 (-21), సెన్సెక్స్ 73,096 (-102) వద్ద కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి సేల్స్ డేటా మెరుగ్గా ఉండటంతో ఆటో షేర్లు పుంజుకున్నాయి. ఐటీ, ఫైనాన్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. అల్ట్రాటెక్ సెమ్, ఐచర్ మోటార్స్, ఎం అండ్ ఎం, గ్రాసిమ్, విప్రో టాప్ గెయినర్స్.

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 2వ వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. CM రేవంత్ అధ్యక్షతన MAR 6న జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. 8 లేదా 10 నుంచి సభ ప్రారంభించి ఏప్రిల్ 3 వరకు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లులనూ ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

AP: ఉమ్మడి శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ పది మంది పోటీ చేయగా, సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, గాదె శ్రీనివాసులు నాయుడు, కోరెడ్ల విజయగౌరి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రఘువర్మకు టీడీపీ- జనసేన, శ్రీనివాసులుకు RSS, విజయగౌరికి వామపక్షాలు మద్దతుగా ఉన్నాయి. గత నెల 27న జరిగిన పోలింగ్లో 20,794 ఓట్లు పోలయ్యాయి. రాత్రిలోపు ఫలితం వెలువడనుంది.

TG: SC విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తోన్న ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఇక నుంచి నేరుగా స్టూడెంట్స్/పేరెంట్స్ ఖాతాల్లో జమ కానుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో 9th, 10th చదువుతున్న డే స్కాలర్లకు ఏడాదికి ₹3,500, హాస్టళ్లలో ఉండే వారికి ₹7వేలు, మురికివాడల్లో నివసించే, కార్మికుల పిల్లలకు (1-10th) ఏడాదికి ₹3,500, హాస్టళ్లలో ఉండే 3-10 తరగతుల వారికి ఏడాదికి ₹8వేలు చెల్లిస్తారు. epass సైట్లో <

TG: ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లలో రాష్ట్ర వృద్ధి ఒక్క శాతానికి పడిపోవడం సిగ్గుచేటు అని KTR ట్వీట్ చేశారు. ‘కరోనా కన్నా డేంజరస్ వైరస్ కాంగ్రెస్. అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధిని గొయ్యితీసి పాతరేశారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న TGని అట్టడుగుకి పడేశారు. మతిలేని CM చేస్తున్న ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభం. ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని అంటుతుంటే రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలుతున్నాయి’ అని విమర్శించారు.

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ మూడో రోజు ప్రారంభం కానున్నాయి. తొలుత ఇటీవల మరణించిన పాలవలస రాజశేఖరం మృతికి సభ్యులు నివాళులర్పిస్తారు. అనంతరం రూ.3.22 లక్షల కోట్లతో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై సభ్యులు చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాల్లో డీఎస్సీ నోటిఫికేషన్, గోదావరి పుష్కరాలు, వక్ఫ్ ఆస్తుల రికార్డు డిజిటలైజేషన్ తదితరాలపై మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.

కోలీవుడ్ హీరో అజిత్ నటించిన ‘పట్టుదల’ మూవీ OTTలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళంలోనూ ప్రసారమవుతోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది. మాగిజ్ తిరుమనేని తెరకెక్కించిన ఈ మూవీలో త్రిష, రెజీనా, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

అమెరికాతో ఉన్న బంధాన్ని తాను కాపాడుకోగలనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధీమా వ్యక్తం చేశారు. గత వారం ఖనిజాల ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఏకాభిప్రాయం కుదరకపోవడంపై స్పందించారు. ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని పేర్కొన్నారు. తీవ్రమైన, నిజమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి తాను సిద్ధమేనని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.