News March 8, 2025

ఫైనల్ కోసం టీమ్ ఇండియా కసరత్తులు

image

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం టీమ్ ఇండియా కసరత్తులు చేస్తోంది. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రేపు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది.

News March 8, 2025

ఇందిరమ్మ ఇళ్లపై BIG UPDATE

image

TG: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుభవార్త అందించారు. మరో వారంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పారు. అర్హులైన వారిని ఎంపిక చేసి, పనులు మొదలు పెడతామన్నారు. జాబితాలో పేర్లు రాని వారికి ఆందోళన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఒక నిరంతర ప్రక్రియ అని, మరో విడతలో లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేస్తామని వెల్లడించారు.

News March 8, 2025

ఆధార్ వెరిఫికేషన్‌తో 225 కోట్ల లావాదేవీలు

image

ప్రభుత్వ పథకాలతోపాటు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇతర డిజిటల్ లావాదేవీలకు ఆధార్ కీలకంగా మారుతోంది. ఫిబ్రవరిలో ఆధార్ నంబర్ వెరిఫికేషన్‌తో 225 కోట్లు, E-KYCతో 43 కోట్లు, ఫేషియల్ రికగ్నిషన్‌తో 12.54 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. మొత్తంగా ఇప్పటి వరకు ఆధార్ ధ్రువీకరణతో(నంబర్, E-KYC, ఫేషియల్) 16,981 కోట్ల లావాదేవీలు పూర్తయ్యాయి. అన్ని రంగాల్లోనూ ఆధార్‌కు ఆదరణ పెరుగుతోందని కేంద్రం వెల్లడించింది.

News March 8, 2025

ఉద్యోగులకు GOOD NEWS

image

TG: తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని Dy.CM భట్టి విక్రమార్క చెప్పారు. వారికి APR నుంచి ప్రతినెలా ₹500-600 కోట్ల చొప్పున ₹8,000 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని JAC నేతలకు హామీ ఇచ్చారు. ఇకపై కొత్త బకాయిలు లేకుండా చూస్తామని తెలిపారు. ఉద్యోగులు బకాయిల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థికేతర అంశాలను సబ్ కమిటీలో చర్చించి పరిష్కరిస్తామని వెల్లడించారు.

News March 8, 2025

మహిళల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం: సీఎం

image

AP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా CM చంద్రబాబు వారికి శుభాకాంక్షలు తెలిపారు. TDP ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత, భద్రత, గౌరవం కోసం కృషి చేస్తున్నామని ట్వీట్ చేశారు. 2025-26 బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమం కోసం ₹4,332Cr కేటాయించామని గుర్తుచేశారు. దీపం-2 కింద 90L మందికి ఉచిత సిలిండర్లు, పెన్షన్లు, అంగన్వాడీ సెంటర్ల బలోపేతం లాంటి చర్యలతో వారి అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు.

News March 8, 2025

ఉచితాలపై చర్చ జరగాలన్న సీఎం.. మీరేమంటారు?

image

TG: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందంటూనే <<15677567>>ఉచిత పథకాల<<>>పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉచితాలు పంచడం తన ఒక్కడి సమస్యే కాదని, ఢిల్లీలోనూ బీజేపీ ఉచితాలు ప్రకటించిందని వెల్లడించారు. ఈ ఉచిత పథకాల కారణంగా మౌలిక సదుపాయాలపై రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

News March 8, 2025

స్టార్టప్‌లలోనూ నారీ శక్తి

image

రాజకీయ, ఉద్యోగ రంగాల్లోనే కాకుండా ధైర్యంగా స్టార్టప్ కంపెనీల నిర్వహణలోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. రిటైల్, ఎడ్‌టెక్, ఈకామర్స్, ఫ్యాషన్ తదితర రంగాల్లో సంస్థలను వృద్ధి చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దేశంలో నారీమణుల సారథ్యంలో 7వేలకు పైగా అంకుర సంస్థలున్నాయి. మొత్తం స్టార్టప్‌లలో వీటి వాటా 7.5 శాతం. ఇవి ఇప్పటి వరకు $26 బిలియన్లను సమీకరించినట్లు ఓ నివేదిక వెల్లడించింది.

News March 8, 2025

తెలంగాణలో కొత్త ESI డిస్పెన్సరీలు

image

తెలంగాణలో పలు జిల్లాలకు ESIC డిస్పెన్సరీలు మంజూరు చేసింది. మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, హనుమకొండ, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. కొత్తగా 20 డిస్పెన్సరీలు అవసరమని అధికారులు ప్రాథమికంగా గుర్తించి ప్రతిపాదనలు రూపొందించారు. తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాక ఆర్థిక శాఖ అనుమతితో జీవో జారీ కానుంది.

News March 8, 2025

స్టార్ షిప్ ఎఫెక్ట్: 240కి పైగా విమానాలకు అంతరాయం

image

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ షిప్ నిన్న ఉదయం భూకక్ష్యలో ప్రవేశించే సమయంలో ముక్కలైపోయిన సంగతి తెలిసిందే. దాని శకలాలు ఫ్లోరిడా, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై పడ్డాయి. దీంతో తమ దేశవ్యాప్తంగా 240 విమానాల రాకపోకలు నిలిచిపోయాయని అమెరికా ఏవియేషన్ యంత్రాంగం తెలిసింది. మియామీ, ఫోర్ట్ లాడర్‌డేల్, ఓర్లాండో, పామ్ బీచ్ ఎయిర్ పోర్టులు ప్రధానంగా సమస్యల్ని ఎదుర్కొన్నాయని పేర్కొంది.

News March 8, 2025

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినకపోతే?

image

ఆరోగ్యకరమైన జీవనానికి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కానీ అల్పాహారాన్ని స్కిప్ చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే టిఫిన్ తినకపోతే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. జీవక్రియ మందగించి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. తలనొప్పి, వికారం, వాంతులు రావచ్చు. ఊబకాయం, అల్సర్, గ్యాస్ సమస్యలకూ దారితీస్తుంది. నిద్ర లేచిన రెండు గంటల్లోగా అల్పాహారం తీసుకోవడం బెటర్.