News April 1, 2024

‘కచ్చతీవు’పై స్పందించిన జైశంకర్

image

‘కచ్చతీవు’పై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. ఇది ఇప్పుడు తెరపైకి వచ్చిన అంశం కాదని తెలిపారు. ‘ఈ దీవి గురించి కేంద్రం, తమిళనాడు మధ్య చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు దాని గురించి 21 సార్లు తమిళనాడుకు సమాధానం ఇచ్చాను’ అని పేర్కొన్నారు. 1947 నాటికి భారత్‌ అధీనంలో ఉన్న దీవిని 5 దశాబ్దాల క్రితం కాంగ్రెస్ శ్రీలంకకు కట్టబెట్టిందని ప్రధాని మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

News April 1, 2024

కచ్చతీవు వివాదం ఏంటి?(1/2)

image

భారత్ – శ్రీలంకను వేరుచేసే పాక్ జల సంధిలో రామేశ్వరం దీవికి సమీపంలో ఈ కచ్చతీవు ఉంది. 1.9 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ <<12964536>>దీవి<<>>లో ఎవరూ నివసించరు. ఇక్కడ సెయింట్ ఆంటోనీ చర్చిలో జరిగే వేడుకల్లో తమిళులు పాల్గొంటారు. స్వాతంత్ర్యం రాకముందు ఈ దీవి రామ్‌నాడ్ పాలకుల ఆధీనంలో ఉండేది. అనంతరం భారత్‌లో చేరింది. మత్స్యసంపద ఎక్కువగా ఉండటంతో భారత మత్స్యకారులు చేపల వేట సాగిస్తారు.

News April 1, 2024

కచ్చతీవు వివాదం ఏంటి?(2/2)

image

శ్రీలంక మాత్రం ఈ ఒప్పందాన్ని పట్టించుకోవడం లేదు. మత్స్యకారులను తరుచూ అదుపులోకి తీసుకుంటోంది. న్యాయపరంగా ఈ <<12964536>>దీవి<<>> అప్పగింత చెల్లదని తమిళనాడులోని పలు పార్టీలు వాదిస్తున్నాయి. భారత భూభాగాలను రాజ్యాంగ సవరణ చేయకుండా ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ఆర్టీఐ దరఖాస్తు సేకరణతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

News April 1, 2024

అస్సాం సీఎం వ్యాఖ్యలపై బద్రుద్దీన్ కౌంటర్

image

మరోసారి పెళ్లి చేసుకోవాలని ఉంటే ఎన్నికలలోపే చేసుకోవాలని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలకు AIUDF చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ తీవ్రంగా స్పందించారు. ‘ఆయనకు శక్తి లేక ఒక్క బిడ్డనే కన్నారు. నాకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. నాకు మళ్లీ చేసుకోవాలని అనిపిస్తే నేను ముఖ్యమంత్రిని అడగను’ అని పేర్కొన్నారు. కాగా తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉందంటూ అజ్మల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది.

News April 1, 2024

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగంగా జరగాలి: సుప్రీం

image

AP: సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యంపై కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. దీనిపై 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల జాప్యం అవుతోందని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలియజేయగా.. రాజకీయ నేత, CM అన్న కారణాలతో విచారణ జాప్యం కావొద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ ప్రక్రియ వేగంగా జరగాలని సీబీఐని ఆదేశించిన కోర్టు.. విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది.

News April 1, 2024

హార్దిక్ కెప్టెన్సీకి నేడు అగ్ని పరీక్ష

image

నేడు రాజస్థాన్‌ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ముంబై తప్ప అన్ని జట్లూ పాయింట్స్ టేబుల్‌లో ఖాతా తెరిచాయి. రెండు మ్యాచులూ ఘోరంగా ఓడిన ముంబైని కెప్టెన్ హార్దిక్ పాండ్య ఏ విధంగా నడిపించనున్నారన్నది ఆసక్తికరం. హోం స్టేడియమైన వాంఖడేలో కూడా తనపై వచ్చే తీవ్ర స్థాయి వ్యతిరేకతను ఆయన అధిగమించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముంబైని విజయతీరాలకు చేర్చడం పాండ్యకు అగ్ని పరీక్షేనని విశ్లేషకులు అంటున్నారు.

News April 1, 2024

OTTలోకి టిల్లు స్క్వేర్.. ఎప్పుడంటే?

image

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ థియేటర్లలో సూపర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమా OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత మాత్రమే OTTలో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. దీని ప్రకారం ఏప్రిల్ చివరి వారం లేదా మే తొలి వారంలో టిల్లు స్క్వేర్ OTTలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సుంది.

News April 1, 2024

ముగిసిన కస్టడీ.. నేడు కోర్టుకు కేజ్రీవాల్

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో CM కేజ్రీవాల్ ED కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఆయనను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్‌ను Mar21న ED అరెస్ట్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. Mar28 వరకు కస్టడీకి ఇచ్చింది. మరోసారి దాన్ని Apr1కి పొడిగించింది. అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు April 3కి వాయిదా వేసింది.

News April 1, 2024

కొత్త పన్ను విధానంపై ప్రభుత్వం క్లారిటీ

image

కొత్త పన్ను విధానంలో నేటి నుంచి మార్పులుంటాయనేది తప్పుడు ప్రచారమని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. ఈమేరకు ఒక టేబుల్‌ను ట్విటర్‌లో షేర్ చేసింది. కొత్త పన్ను విధానం డీఫాల్ట్ అని, అయినప్పటికీ ట్యాక్స్ పేయర్లు తమకు నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చని తెలిపింది. కొత్త పన్ను విధానం వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.

News April 1, 2024

డీఎంకే, కాంగ్రెస్‌పై ప్రధాని విమర్శలు

image

‘కచ్చతీవు దీవి’ అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్, డీఎంకే పార్టీలపై PM మోదీ విమర్శలకు దిగారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాలపై డీఎంకేకు ఎలాంటి ఆసక్తి లేదని విమర్శించారు. కచ్చతీవు అంశంలో బయటకు వస్తున్న కొత్త విషయాలు DMK ద్వంద్వ ప్రమాణాలను బయటపెడుతున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్, డీఎంకే వంటి కుటుంబ పార్టీలు వారి వారసులకే రక్షణ కల్పిస్తాయని విమర్శించారు. వేరే అంశాలను పట్టించుకోవని మండిపడ్డారు.