India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రెండు రోజుల కింద విడుదలైన JEE మెయిన్స్ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని 12వ తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. యూపీలోని గోరఖ్పూర్ హాస్టల్లో ఉంటున్న 18 ఏళ్ల అమ్మాయి హాస్టల్ గదిలో ఉరేసుకొని చనిపోయింది. పోలీసులు సంఘటనా స్థలం వద్ద సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ‘మమ్మీ, పాపా నన్ను క్షమించండి. మీరు నన్ను ఎంతో ప్రేమించారు కానీ మీ ఆశలను నెరవేర్చలేపోయాను’ అని ఆమె అందులో రాసింది.

AP: వల్లభనేని వంశీని HYDలో <<15446091>>అరెస్ట్<<>> చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో గన్నవరం TDP ఆఫీసుపై దాడి జరిగినప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కేసు పెట్టారు. విచారణ జరుగుతుండగా ఇటీవల కేసు విత్ డ్రా చేసుకొని తనను బెదిరిస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీ కిడ్నాప్ చేసి బెదిరించడం వల్లే సత్యవర్ధన్ విత్ డ్రా చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులోనే వంశీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

AP: గన్నవరం మాజీ MLA, YCP నేత వల్లభనేని వంశీని హైదరాబాద్లో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ మండిపడింది. అక్రమ కేసులో అరెస్ట్ చేశారని, గన్నవరం TDP ఆఫీస్పై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ ఉందని గుర్తు చేసింది. ఆ దాడిపై ఫిర్యాదును ఇటీవల సత్యవర్ధన్ వెనక్కి తీసుకున్నారని ట్వీట్ చేసింది. కానీ, వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది.

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నారు. అత్యధికంగా 4 సార్లు వన్డే సిరీస్లను క్లీన్ స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్గా నిలిచారు. WI, శ్రీలంక, NZ, ఇంగ్లండ్పై ఈ ఘనత సాధించారు. తర్వాతి స్థానాల్లో మూడేసి క్లీన్ స్వీప్లతో కోహ్లీ, ధోనీ ఉన్నారు. గత 14 ఏళ్లలోనూ అత్యధిక క్లీన్ స్వీప్లు సాధించిన జట్టుగా భారత్(12) నిలిచింది. న్యూజిలాండ్ 10 క్లీన్ స్వీప్లతో రెండో స్థానంలో ఉంది.

ప్రాంతీయ, జాతీయ పార్టీలనే తేడా లేకుండా ప్రతి పార్టీ ఉచితాలకు మొగ్గు చూపుతోంది. ఎన్నికల హామీల్లో ఉచిత పథకాలను పొందుపరుస్తున్నాయి. ఇవి లేకుంటే ఓటర్లు ఓటెయ్యరేమోననే భయం. ఫ్రీ స్కీంలకు దూరంగా ఉండే బీజేపీ సైతం ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో హామీలు గుప్పించింది. వీటితో ప్రజలు పని చేసేందుకు ఇష్టపడట్లేదని తాజాగా సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. మరి ఈ హామీలను మన పార్టీలు ఆపగలవా? ప్రజలు మారుతారా?

TG: ములుగు జిల్లాలో జరుగుతున్న మినీ మేడారం జాతర వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అర్ధరాత్రి వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరినట్లు ఆమె తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించే ఈ పవిత్ర జాతరలో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ బెస్ట్ చీఫ్ మినిస్టర్ సర్వేలో ఏపీ సీఎం చంద్రబాబు 4వ స్థానంలో నిలిచారని టీడీపీ ట్వీట్ చేసింది. గత ఏడాది ఆగస్టులో 5వ స్థానంలో ఉన్న ఆయన తాజా సర్వేలో 4వ స్థానాన్ని పొందారని పేర్కొంది. కాగా తొలి మూడు స్థానాల్లో వరుసగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఉన్నారు. 5, 6 స్థానాల్లో ఫడ్నవీస్, సిద్ద రామయ్య నిలిచారు.

TG: కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు స్వీకరిస్తుండటంతో మీసేవ కేంద్రాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు 2.6 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే లక్షకుపైగా అప్లికేషన్లు వచ్చాయన్నారు. అటు రద్దీపై స్పందించిన పౌరసరఫరాల శాఖ మీసేవల్లో రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించింది. అప్లికేషన్ కోసం తొందరపడొద్దని సూచించింది.

AP: అమరావతికి మూడేళ్లలో ఓ రూపు తీసుకొచ్చేందుకు CRDA టైమ్ టేబుల్తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉగాదికి CRDA మెయిన్ ఆఫీస్ సిద్ధం కానుండగా, రెండున్నరేళ్లలో ఐకానిక్ భవనాలు పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకుంది. రాజధాని నిర్మాణానికి రూ.31వేల కోట్లు రుణంగా తీసుకోవాలని CRDA నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రపంచ బ్యాంక్, ADBల నుంచి రూ.15వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11వేల కోట్లు మంజూరైన విషయం తెలిసిందే.

TG: కాలేజీ విద్యార్థులకు 12 అంకెల ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ(అపార్) IDలను ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. కేంద్రం ఆదేశాల మేరకు వన్ నేషన్-వన్ స్టూడెంట్ ID ప్రోగ్రామ్ కింద వీటిని జూన్ నాటికి జారీ చేయాలని కాలేజీలను ఆదేశించింది. విద్యార్థుల అకడమిక్ అచీవ్మెంట్స్, సర్టిఫికెట్స్, క్రెడిట్స్ డిజిటల్గా స్టోర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి ఆధార్, పేరెంట్స్ అనుమతి తప్పనిసరి.
Sorry, no posts matched your criteria.