News February 24, 2025

ఏడాదిలో 300 రోజులు అదే తింటా: మోదీ

image

ఫూల్ మఖానా అంటే తనకు ఎంతో ఇష్టమని, ఏడాదిలో 300 రోజులు అదే తింటానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనమని చెప్పారు. బిహార్‌లోని భాగల్‌పూర్‌లో ఆయన మాట్లాడారు. ‘దేశంలో చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌లో మఖానా తింటున్నారు. దీని ఉత్పత్తి ఇంకా పెరగాలి’ అని పేర్కొన్నారు. కాగా బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌లో ప్రకటించారు.

News February 24, 2025

ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా

image

AP: ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అలాగే టీడీపీకి, పార్టీ పదవులను కూడా వదులుకుంటున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని ప్రకటించారు. కాగా ఫైబర్‌నెట్ ఎండీ, IAS దినేశ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని జీవీ రెడ్డి ఆరోపించారు. దీనిపై జీవీ రెడ్డిని సీఎం చంద్రబాబు మందలించినట్లు సమాచారం.

News February 24, 2025

స్కూలు విద్యార్థులకు శుభవార్త

image

TG: మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలు, 7-10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 28వ తేదీతో ముగియనున్న గడువు తేదీని మార్చి 10వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. OC విద్యార్థులు రూ.200, SC, ST, BC, PHC, EWS విద్యార్థులు రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News February 24, 2025

GET READY: రేపు 3.33PM గంటలకు!

image

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ విడుదలకు సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 3.33 గంటలకు టీజర్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మార్చి 29న విడుదల కానుంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.

News February 24, 2025

జగన్ మరోసారి అసెంబ్లీకి రాక తప్పదా?

image

AP: మాజీ సీఎం జగన్ మరోసారి అసెంబ్లీకి రాక తప్పదని తెలుస్తోంది. ఇవాళ అసెంబ్లీ సెషన్‌లో సభ్యులు చేసిన సంతకాలను పరిగణనలోకి తీసుకోరని సమాచారం. గవర్నర్ ప్రసంగం కస్టమరీ సెషన్ మాత్రమేనని, స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాన్నే వర్కింగ్ డేగా పరిగణిస్తారని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ శాసనసభకు రాకపోతే సీటు వేకెంట్ అని ప్రకటించవచ్చని అంటున్నారు. దీంతో జగన్ మరోసారి అసెంబ్లీకి రాక తప్పదని సమాచారం.

News February 24, 2025

విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి

image

AP: గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం నెలకొంది. గోశాల వద్ద విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఓ రైతుతో పాటు ముగ్గురు కూలీలు ఉన్నట్లు సమాచారం

News February 24, 2025

AP మిర్చికి కేంద్రం మద్దతు ధర

image

AP: మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీం కింద ఏపీ మిర్చికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. క్వింటా మిర్చికి రూ.11,781 ధర ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ధర లేదంటూ ఏపీలో రైతులు ఆందోళన చేయగా, సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్రానికి దీనిపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేంద్రం మద్దతు ధరపై ఈ ప్రకటన చేసింది. తొలి క్వింటా మిర్చి సేకరణ నుంచి నెల రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి.

News February 24, 2025

నాని ‘ది పారడైజ్’ నుంచి అప్డేట్

image

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ‘ది పారడైజ్’ నుంచి అప్డేట్ వచ్చింది. నాని బర్త్ డే సందర్భంగా ‘RAW STATEMENT’ పేరుతో మార్చి 3న స్పెషల్ వీడియో లేదా ఫొటోను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, ఇప్పటికే నాని- శ్రీకాంత్ కాంబోలో వచ్చిన ‘దసరా’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

News February 24, 2025

వంశీపై కేసుల విచారణకు సిట్ ఏర్పాటు

image

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే అరెస్టైన ఆయనపై పలు కేసుల విచారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసింది. అక్రమ మైనింగ్, భూకబ్జాల ఆరోపణలపై జి.వి.జి అశోక్ కుమార్ నేతృత్వంలో నలుగురు అధికారులతో ప్రత్యేక SITను నియమిస్తూ జీవో జారీ చేసింది. వంశీ వల్ల రూ.195 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం భావిస్తోంది.

News February 24, 2025

రేవంత్ చుట్టూ భజనపరులు: అంజన్ కుమార్ యాదవ్

image

TG: సీఎం రేవంత్ చుట్టూ భజనపరులు ఉన్నారని కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. గతంలో రేవంత్‌ను సొంత కులం నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి ఇబ్బంది పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అప్పుడు రేవంత్‌ను ఇబ్బంది పెట్టినవారు ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారు. దానం నాగేందర్‌ వల్లే సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ ఓడింది. నేను పోటీ చేసి ఉంటే గెలిచేవాళ్లం’ అని ఆయన వ్యాఖ్యానించారు.