India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

<<15496614>>జ్ఞానేశ్ కుమార్ను<<>> భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కేంద్రం ప్రకటించింది. అయితే అంతకుముందు ఈ ఎంపికను <<15494229>>కాంగ్రెస్<<>> వ్యతిరేకించింది. ప్రతిసారి PM నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సీఈసీని ఎంపిక చేస్తుంది. ఇందులో CJI, లోక్సభ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. అయితే 2023లో ఈ కమిటీ నుంచి CJIని తొలగించిన కేంద్రం PM సూచించిన కేంద్రమంత్రిని అందులో చేర్చింది. దీన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

ఇక ఆనవాయితీ ప్రకారం ఎన్నికల సంఘంలో మోస్ట్ సీనియర్ను తదుపరి CECగా ఎన్నుకుంటూ వచ్చేవారు. ఆ విధానాన్నీ కేంద్రం పక్కనపెట్టడంతో విపక్షాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఈనెల 19 లేదా 22న దానిపై విచారణ జరిగే అవకాశముంది. SC తీర్పు తర్వాతే CEC ఎంపిక చేపట్టాలని INC డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని నిన్న PM నివాసంలో జరిగిన సమావేశంలోనూ LoP రాహుల్ గాంధీ లేవనెత్తారు. కానీ కేంద్రం నిన్న అర్ధరాత్రి CECని ప్రకటించేసింది.

AP: దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేశారు. పలువురికి డబ్బులు జమ కావడం లేదన్న ఫిర్యాదులపై సమాచారం సేకరించాలన్నారు. అటు సిలిండర్ డెలివరీ చేసే సమయంలో డబ్బులు అడుగుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై యాక్షన్ తీసుకోవాలని ఏజెన్సీలను, అధికారులను సీఎం ఆదేశించారు.

మధ్యప్రదేశ్లో ఉండే ఓంకారేశ్వర క్షేత్రం నర్మదా నదిఒడ్డున ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో <<15487669>>నాల్గవది<<>>. స్థలపురాణం ప్రకారం.. పూర్వం వింధ్య పర్వతుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతారు. అప్పుడు పర్వతరాజు ఎల్లప్పుడూ తన శిరస్సుపై ఉండేలా వరం కోరుతారు. దీంతో పరమేశ్వరుడు పార్థివాకారంలో అమలేశ్వరుడు, అమరేశ్వరుడు అనే రెండు రూపాల్లో ఇక్కడ వెలిశారు. ఈ రెండు లింగరూపాలను ఒకే జ్యోతిర్లింగంగా భావిస్తారు.

AP: తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు రూ.11 కోట్ల భారీ విరాళం అందింది. ముంబైలోని ప్రసీద్ యూనో ఫ్యామిలీ ట్రస్ట్కు చెందిన తుషార్ కుమార్ డొనేషన్ డీడీని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందించారు. ఈ సందర్భంగా తుషార్ను వెంకయ్య సన్మానించి, అభినందించారు.

AP: నంద్యాల(D) శ్రీశైలం క్షేత్రంలో రేపటి నుంచి MAR 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. రేపు ఉ.9గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేస్తారు. ఉత్సవాల్లో భాగంగా వాహన సేవలు, రథోత్సవం, రుద్రాభిషేకం, కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 23న స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున CM CBN పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

తెలంగాణలోని ఎస్సీ సంక్షేమ గురుకులాల్లోని 40శాతం విద్యార్థులకు కాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు లేవని గురుకుల సొసైటీ గుర్తించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 75శాతం సీట్లు ఆయా వర్గాలకు అందుబాటులో ఉన్నప్పటికీ సర్టిఫికెట్లు సమర్పించలేదని తేలింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంట్రన్స్ పరీక్షల నుంచే ఈ సర్టిఫికెట్లను తప్పనిసరి చేసింది. దీని ద్వారా అర్హులకే న్యాయం జరుగుతుందని అంచనా వేస్తోంది.

AP: కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో 140 మంది విద్యార్థులు ఆశ్రమంలో ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. స్థానికులు వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

2023-24లో దేశంలోని ఆరు జాతీయ పార్టీలకు వివిధ మార్గాల ద్వారా రూ.5,820 కోట్ల ఆదాయం వచ్చినట్లు ADR వెల్లడించింది. ఇందులో 74.56%(₹4,340Cr) వాటా బీజేపీకే చేరిందని తెలిపింది. ఆ తర్వాత కాంగ్రెస్(₹1,225Cr), సీపీఎం(₹167 కోట్లు), బీఎస్పీ(₹64Cr), ఆప్(₹22Cr), నేషనల్ పీపుల్స్ పార్టీ(₹22L) ఉన్నాయంది. 2022-23తో పోలిస్తే బీజేపీ ఆదాయం 83.85%, కాంగ్రెస్ ఆదాయం 170.82% పెరిగినట్లు పేర్కొంది.

రాజమౌళి డైరెక్షన్లో మహేశ్ బాబు నటిస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం SSMB29 షూటింగ్ రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్ శివారులో నిర్మించిన ఓ ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. సోదరుడి వివాహం కోసం బ్రేక్ తీసుకున్న ప్రియాంకా చోప్రా మళ్లీ సెట్లో అడుగుపెట్టారు. మరోవైపు ఈ వేసవిలో విదేశాల్లో షూటింగ్కు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.