News March 11, 2025

మణిపుర్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు జవాన్ల వీరమరణం

image

మణిపుర్‌లో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కు లోయలో పడటంతో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో 13మంది గాయాలపాలయ్యారు. సేనాపతి జిల్లాలోని చాంగౌబంగ్ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.

News March 11, 2025

బీరువాలో కాగితాలు.. వాటి విలువ రూ.12 లక్షలు!

image

ఇంట్లోని పాత కాగితాలు అతనికి దాదాపు రూ.12 లక్షలు తెచ్చిపెట్టాయి. రతన్ అనే వ్యక్తికి తన తండ్రి 1992లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కొన్న షేర్స్ అగ్రిమెంట్ పేపర్స్ బీరువాలో లభించాయి. ఒక్క షేర్‌ రూ.10 చొప్పున 30 షేర్లు కొనుగోలు చేశారు. దీని గురించి రతన్ ట్వీట్ చేయడంతో ట్రేడ్ నిపుణులు కామెంట్స్ చేస్తున్నారు. అన్ని బోనస్‌లు కలిపి ఇప్పుడవి 960 షేర్స్ అయ్యాయని, వీటి విలువ రూ.11.88 లక్షలని చెబుతున్నారు.

News March 11, 2025

పిల్లల ఆకలి తీర్చేందుకు..!

image

పిల్లల కోసం తల్లి ఏమైనా చేస్తుందనే విషయాన్ని లండన్‌కు చెందిన మేరీ ఆన్ బెవన్ నిరూపించారు. నలుగురు పిల్లలున్న ఆమె 1914లో భర్త చనిపోవడంతో కుటుంబ పెద్దగా మారారు. వారి పోషణ కష్టమవగా ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అక్రోమెగలీ వ్యాధి కారణంగా ఆమె ముఖం అందవిహీనంగా మారడంతో ‘వరల్డ్ అగ్లీయెస్ట్ ఉమెన్’ పోటీలో పాల్గొన్నారు. గెలిచిన డబ్బుతో వారి ఆకలి తీర్చారు. ఆ తర్వాత సర్కస్‌లో చేరి వారి బాగోగులు చూసుకోగలిగారు.

News March 11, 2025

నెలకు రూ.5,000.. దరఖాస్తు గడువు పెంపు

image

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు రేపటితో ముగియాల్సి ఉండగా ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ స్కీమ్ కింద SSC, ఇంటర్, డిప్లొమా, ITI, డిగ్రీ చదివిన 21-24 ఏళ్ల వయసు నిరుద్యోగులకు దేశంలోని టాప్-500 కంపెనీల్లో 1yr ఇంటర్న్‌షిప్ కల్పిస్తారు. నెలకు ₹5000 స్టైఫండ్, వన్‌టైం గ్రాంట్ కింద ₹6000 ఇస్తారు. అభ్యర్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి ₹8Lలోపు ఉండాలి. దరఖాస్తుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News March 11, 2025

CM రేవంత్‌ను కలిసిన మోహన్ బాబు, విష్ణు

image

TG: నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు సీఎం రేవంత్‌ను ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వచ్చిన వారిని సీఎం సాదరంగా పలకరించారు. అనంతరం నటులిద్దరూ ముఖ్యమంత్రికి శాలువాలు కప్పి సత్కరించారు. విష్ణు ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. పలు కీలక అంశాలపై చర్చించామని, రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి తన సహకారం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

News March 11, 2025

గ్రూప్-2 ఫస్ట్ ర్యాంకర్ ఇతనే

image

TG: టీజీపీఎస్సీ వెల్లడించిన గ్రూప్-2 ఫలితాల్లో నారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 600 మార్కులకుగానూ 447.088 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. కాగా హర్షవర్ధన్ సూర్యాపేట జిల్లా కోదాడ వాసి. ఆయన తండ్రి రమణారెడ్డి కేఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. హర్షవర్ధన్ ఏడో తరగతి వరకు ఖమ్మం, 8 నుంచి ఇంటర్ వరకు విజయవాడ, బీటెక్ తాడేపల్లిగూడెంలో చదివారు.

News March 11, 2025

రేవంత్ రెడ్డి పిటిషన్.. విచారణ వాయిదా

image

TG: నార్సింగి పీఎస్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని CM రేవంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జన్వాడ ఫామ్‌హౌస్‌పై డ్రోన్ ఎగరవేశారని 2020 మార్చిలో రేవంత్‌పై కేసు నమోదైంది. అదేమి నిషేధిత ప్రాంతమేమీ కాదని, తప్పుడు కేసులు పెట్టి రేవంత్‌ను జైలుకు పంపారని ఆయన తరఫు లాయర్లు వాదించారు. కౌంటర్ దాఖలు చేయాలని పీపీకి నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

News March 11, 2025

స్కూలు విద్యార్థులకు శుభవార్త

image

APలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి యూనిఫాం మారుస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. పిల్లల పుస్తకాల బరువు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. సెమిస్టర్ వారీగా పుస్తకాలు ఇస్తామని, ఒకటో తరగతికి రెండు పుస్తకాలే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ప్రతి శనివారం నో బ్యాగ్ డే‌గా ప్రకటించామని, టీచర్లకు కూడా దీనిపై శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు.

News March 11, 2025

విదేశీ విద్యపై మోజు తగ్గుతోంది!

image

ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావం భారత విద్యార్థులపై కనిపిస్తోంది. విదేశాలకు వెళ్తున్న భారత విద్యార్థుల సంఖ్య గత ఏడాది భారీగా తగ్గింది. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ వివరాల ప్రకారం.. US, కెనడా, UKకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 27శాతం మేర పడిపోయింది. వీటిలో ఒక్క కెనడాకు వెళ్లేవారే 41శాతం తగ్గిపోవడం గమనార్హం. కఠిన వీసా నిబంధనలు, ఆర్థిక నిబంధనలు, దౌత్యపరమైన సమస్యలు దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

News March 11, 2025

బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చండి: DK అరుణ

image

తెలుగు రాష్ట్రాల్లోని బోయ, వాల్మీకిలను ఎస్టీల జాబితాలో చేర్చాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించారు. తెలంగాణలో 5 లక్షల మందికిపైగా బోయ వాల్మీకులున్నారని, ఎస్టీలపై చెల్లప్ప కమిషన్ కేంద్రానికి నివేదిక పంపిందని తెలిపారు. ఈ విషయంపై గిరిజన శాఖ మంత్రి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.