News January 13, 2025

రూ.582 కోట్లతో తెలంగాణ ప్రభుత్వ స్టార్ హోటల్.. త్వరలో నిర్మాణం!

image

TG: హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ-గ్రేడ్‌ ట్రేడ్‌ సెంటర్‌‌తో కూడిన ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను నిర్మించనుంది. 3 ఎకరాల్లో ₹582 కోట్లతో 15 అంతస్తుల భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. వరల్డ్‌లోనే టాప్-10లో ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో బిల్డ్ చేయనుంది. ఇప్పటికే బిడ్డర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది. 36 నెలల్లో హోటల్‌ను అందుబాటులోకి తేవాలని పేర్కొంది.

News January 13, 2025

ట్రంప్‌కు జగ్మీత్ సింగ్ వార్నింగ్

image

కెనడాను అమెరికాలో భాగం చేసుకోవాలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్‌కు న్యూ డెమోక్రటిక్ పార్టీ (NDP) లీడర్ జగ్మీత్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘మా దేశం అమ్మకానికి లేదు. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ స్వతంత్రంగానే ఉంటాం. ఒకవేళ మాతో ఫైట్ చేయాలనుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మా దేశంపై ట్రంప్ టారిఫ్స్ వేస్తే మేమూ అదే పని చేస్తాం’ అని హెచ్చరించారు. కాగా మాజీ PM ట్రూడోకు NDP గతంలో మిత్రపక్షంగా ఉండేది.

News January 13, 2025

ఆన్‌లైన్‌లో ‘డాకు మహారాజ్’ HD ప్రింట్!

image

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా విడుదలైన రోజునే ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. పైరసీ సైట్లలో HD ప్రింట్ రావడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. ఇటీవల రిలీజైన ‘గేమ్ ఛేంజర్’ మూవీని కూడా విడుదలైన రోజునే ఆన్‌లైన్‌లో పెట్టేశారు. అంతేకాకుండా బస్సులో సినిమాను ప్రదర్శించిన వీడియో సైతం వైరల్ అయింది. ఇలా సినిమాలను లీక్ చేయడం వల్ల నిర్మాతలు నష్టపోతారని, పైరసీని ఆపాలని పలువురు సినీ పరిశ్రమ అభిమానులు కోరుతున్నారు.

News January 13, 2025

హిస్టరీలో ఫస్ట్‌టైమ్: 23 పైసలు తగ్గి 86.27కు రూపాయి

image

డాలర్ పంచ్‌లకు రూపాయి విలవిల్లాడుతోంది. సోమవారం ఓపెనింగ్ ట్రేడ్‌లో సరికొత్త జీవితకాల కనిష్ఠాన్ని తాకింది. ఏకంగా 23 పైసలు బలహీనపడి చరిత్రలో తొలిసారి 86.27కు చేరుకుంది. డాలరుతో పోలిస్తే శుక్రవారం 14 పైసలు తగ్గి 86 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ ఏదో చేస్తాడన్న విశ్వాసం, డాలర్ ఇండెక్స్, ట్రెజరీ, బాండ్ యీల్డుల పెరుగుదల, FIIలు వెళ్లిపోవడమే ఇందుకు కారణాలు.

News January 13, 2025

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

భోగి పండగ వేళ హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.430 పెరిగి రూ.80,070 పలుకుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.400 పెరిగి రూ.73,400కు చేరింది. అటు కేజీ వెండి రూ.1,000 పెరిగి రూ.1,02,000 పలుకుతోంది.

News January 13, 2025

సంక్రాంతి: ఏపీ వైపు ఎన్ని వాహనాలు వెళ్లాయంటే?

image

సంక్రాంతి పండుగ కోసం చాలా మంది హైదరాబాద్ నుంచి ఏపీకి చేరుకుంటున్నారు. హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. నగరం నుంచి విజయవాడ, కర్నూలు. తమిళనాడు వెళ్లే రోడ్లన్నీ రద్దీగా మారాయి. గత 3 రోజుల్లో 11 టోల్ గేట్ల ద్వారా ఏపీ వైపు సుమారు 1,78,000 వెహికల్స్ వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

News January 13, 2025

నిఫ్టీ 200, సెన్సెక్స్ 700 డౌన్.. Rs3L CR లాస్

image

<<15141868>>అంచనా<<>> వేసినట్టే దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ గ్యాప్‌డౌన్‌తో ఆరంభమయ్యాయి. నిఫ్టీ 23,217 (-213), సెన్సెక్స్ 76,707 (-675) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో పొద్దున్నే రూ.3లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ 6.85 పాయింట్లు పెరిగి 15.94కు చేరుకుంది. ఆటో, మెటల్, ఫార్మా, ఫైనాన్స్, రియాల్టి, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు విలవిల్లాడుతున్నాయి.

News January 13, 2025

సంక్రాంతి: ఎమర్జెన్సీ సేవకులూ మీ త్యాగానికి సెల్యూట్!

image

ఇంటిల్లిపాది పండగ చేసుకుంటుంటే వారి ఇళ్లు మాత్రం బోసిపోతుంటాయి. తల్లిదండ్రులు, బామ్మా తాతలు, తోబుట్టువులు, మిత్రులతో కలిసి పిల్లలు సందడి చేస్తుంటే వారి ఇళ్లలోనేమో డ్యూటీకి వెళ్లిన నాన్న, అమ్మ ఎప్పుడొస్తారోనని ఎదురు చూస్తుంటారు. రైల్వే, RTC, పోలీస్, హాస్పిటల్, మీడియా సహా ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్లు పండగ వేళల్లోనే ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. మనకోసం వేడుకను త్యాగం చేస్తున్న వారికి థాంక్స్ చెబుదామా!

News January 13, 2025

PHOTOS: కుంభమేళాలో భక్తజన సంద్రం

image

యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇవాళ్టి నుంచి 45 రోజులపాటు కుంభమేళా కొనసాగనుంది. భూ మండలంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా దీనిని పేర్కొంటారన్న సంగతి తెలిసిందే.

News January 13, 2025

IPL: ఆ జట్టుకు 17 మంది కెప్టెన్లు

image

IPL చరిత్రలో ఎక్కువ మంది కెప్టెన్లు మారిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. ఇప్పటివరకు ఆ జట్టుకు 17 మంది సారథులు వచ్చారు. అందులో యువరాజ్, సంగక్కర, జయవర్దనే, గిల్‌క్రిస్ట్, డేవిడ్ హస్సీ, బెయిలీ, సెహ్వాగ్, మిల్లర్, మురళీ విజయ్, మ్యాక్స్ వెల్, రవిచంద్రన్ అశ్విన్, KL రాహుల్, మయాంక్ అగర్వాల్, ధవన్, సామ్ కరన్, జితేశ్ శర్మ ఉన్నారు. కానీ ఆ టీమ్ ఒక్క కప్పు కూడా కొట్టలేదు. తాజాగా శ్రేయస్ కెప్టెన్ అయ్యారు.