News January 26, 2025

మా గురించి ఒక్క మాటలో.. ఏం చెబుతారు..?

image

ఏ విషయాన్నైనా యూజర్లకు వే2న్యూస్ సరళంగా, సంక్షిప్తంగా చెబుతోంది. అలాంటి వే2న్యూస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. మీరేం చెబుతారు. మా గురించి మీకంటే బాగా ఎవరికీ తెలియదు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం. ‘వే2న్యూస్ అంటే ఇది’ అనేలా ఒక్కమాటలో మంచి ట్యాగ్ లైన్ ఇస్తే రూ.25 వేల ప్రైజ్ మనీ మీ సొంతం.
కింద Submit Now బటన్ క్లిక్ చేసి గూగుల్ ఫామ్‌‌లో మీ ట్యాగ్ లైన్ మాకు చెప్పండి.
<>Submit Now<<>>

News January 26, 2025

రైతుకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం అదే: రేవంత్

image

TG: భూమికి విత్తనానికి ఉండే బలమైన అనుబంధం రైతుకు కాంగ్రెస్ పార్టీకి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్(ని) చంద్రవంచ గ్రామంలో నూతన పథకాల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ముందు నుంచీ రైతు పక్షపాతిగా ఉందని చెప్పారు. వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయాన్ని పండగలా మారుస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు.

News January 26, 2025

భారత జట్టు విజయం

image

ఐసీసీ U19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ సూపర్-6లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచులో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. 65 పరుగుల టార్గెట్‌ను 7.1 ఓవర్లలోనే ఛేదించింది. త్రిష 40, కమలిని 3, సానిక 11*, నికీ ప్రసాద్ 5* రన్స్ చేశారు. భారత జట్టు ఎల్లుండి తన తర్వాతి మ్యాచులో స్కాట్లాండ్‌తో తలపడనుంది.

News January 26, 2025

నాలుగు పథకాలను ప్రారంభించిన సీఎం

image

TG: రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డు పథకాలను సీఎం ఆవిష్కరించారు. నారాయణపేట జిల్లా చంద్రవంచ గ్రామంలో లబ్ధిదారులకు సంబంధిత పత్రాలను అందజేశారు. అంతకుముందు పలు గ్రామాల్లో సీఎం మాట్లాడిన వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. రాష్ట్రంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.

News January 26, 2025

గ్రామ, వార్డు సచివాలయాలకు కీలక ఆదేశాలు

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయిస్తూ, సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించింది. ఇకపై A కేటగిరీ సచివాలయాల్లో ఆరుగురు, B కేటగిరీలో 7, C-కేటగిరీ సచివాలయాల్లో 8 మంది సిబ్బంది ఉండనున్నారు. కాగా పలు సచివాలయాల్లో ఎక్కువమంది, మరికొన్నిచోట్ల తక్కువ మంది ఉద్యోగులు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News January 26, 2025

క్రేజీ.. రామ్ చరణ్ సినిమాలో బాలీవుడ్ హీరో?

image

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘RC16’లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రణ్‌బీర్‌కు దర్శకుడు కథ వినిపించగా ఆయన ఓకే చెప్పారని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తారని సమాచారం.

News January 26, 2025

పద్మ అవార్డు గ్రహీతలకు YS జగన్ విషెస్

image

పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి (వైద్యం), నంద‌మూరి బాల‌కృష్ణ (క‌ళ‌లు), మంద కృష్ణ మాదిగ (ప్ర‌జా వ్య‌వ‌హారాలు), మాడుగుల నాగ‌ఫ‌ణి శ‌ర్మ (క‌ళ‌లు), కేఎల్ కృష్ణ (విద్య‌, సాహిత్యం), మిరియాల అప్పారావు (మ‌ర‌ణానంత‌రం) (క‌ళ‌లు), వాదిరాజు రాఘ‌వేంద్రాచారి పంచ‌ముఖి (విద్య, సాహిత్యం)’ అని వారి పేర్లను ట్వీట్ చేశారు.

News January 26, 2025

రోహిత్ రిటైరవ్వకండి.. 15 ఏళ్ల అభిమాని లేఖ

image

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ అభిమాని లేఖ రాశారు. ‘నేను క్రికెట్ చూసేందుకు మీరే కారణం. ఈ మధ్య కాలంలో మీరు విఫలమవుతున్నా ఛాంపియన్స్ ట్రోఫీలో తిరిగి ఫామ్‌లోకి వస్తారని ఆశిస్తున్నా. రంజీలో మీరు కొట్టిన సిక్సర్లు అద్భుతం. మీరు ఎప్పుడూ రిటైరవ్వకండి. మైదానంలో ప్రతి ఫార్మాట్‌లో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా అదరగొడుతారు’ అని ఇన్‌స్టా ఐడీతో ఫ్యాన్ రాసుకొచ్చారు. ఈ లేఖను రోహిత్ టీమ్ షేర్ చేసింది.

News January 26, 2025

అదరగొట్టిన భారత బౌలర్లు

image

ఐసీసీ U19 ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచులో భారత బౌలర్లు అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 64/8కే పరిమితమైంది. ఆ జట్టు ప్లేయర్లలో సుమియా (21) టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో వైష్ణవి 3 వికెట్లు పడగొట్టగా, షబ్నమ్, జోషిత, త్రిష తలో వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే 20 ఓవర్లలో 65 పరుగులు చేయాలి.

News January 26, 2025

రాజమౌళిపై నెటిజన్లు ఫైర్.. కారణమిదే!

image

పద్మ అవార్డులకు ఎంపికైన వారిని అభినందిస్తూ ఫిల్మ్ డైరెక్టర్ రాజమౌళి పెట్టిన పోస్టుపై పలువురు నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. ‘ఈసారి ఏడుగురు తెలుగు వాళ్లకు పద్మ అవార్డులు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భారతీయ పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు’ అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ‘అందరూ భారతీయులే. తెలుగు, ఇండియన్స్ అంటూ ఎందుకు మాట్లాడటం. ప్రాంతీయ భేదాలు ఎందుకు?’ అని పలువురు కామెంట్స్ పెడుతున్నారు.