India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. సాధారణం కన్నా నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. మరోవైపు సోమవారం ఖమ్మంలో 35, హైదరాబాద్లో 32 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.

చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ 3.7 బిలియన్ ఏళ్ల నాటిదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. హై రిజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ డేటా సెట్లను ఉపయోగించి బెంగళూరులోని ఇస్రో ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ సెంటర్, అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ, చండీగఢ్లోని పంజాబ్ వర్సిటీ శాస్త్రవేత్తల బృందం ‘శివశక్తి’ పాయింట్ను (69.37°S, 32.32°E) మ్యాప్ చేసింది. అక్కడ చిన్న బండరాళ్లు, రాతి శకలాలున్నాయని పేర్కొంది.

AP: మద్యం ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ స్పందించారు. బ్రాండ్, సైజుతో సంబంధం లేకుండా బాటిల్పై రూ.10 పెంచినట్లు తెలిపారు. రూ.15, రూ.20 పెరిగినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. రూ.99 మద్యం బాటిల్, బీర్ల ధరల్లో మార్పులు లేవని వెల్లడించారు. అన్ని బ్రాండ్ల ధరలను షాపుల్లో కచ్చితంగా ప్రదర్శించాలని యజమానులను ఆదేశించారు.

TG: రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. 3 స్థానాలకు మొత్తం 118 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. KNR-ADB-NZB-MDK గ్రాడ్యుయేట్ స్థానానికి 80, టీచర్స్ స్థానానికి 15 మంది, WGL-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 23 మంది నామినేషన్లు వేశారు. ఈనెల 13న మ.3 గంటలలోగా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 27న పోలింగ్ జరగనుంది.

అట్లీ డైరెక్షన్లో సల్మాన్ ఖాన్ నటించాల్సిన సినిమా ఆగిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కాల్సిన ఈ మూవీలో రజినీకాంత్ లేదా కమల్ హాసన్ కూడా నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ కాంబోలో మూవీ రావడం లేదని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్తో చేసే సినిమా కోసం అట్లీ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. దీనిపై ఆయన నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప.బెంగాల్ CM, TMC అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ‘ఢిల్లీలో AAPకు కాంగ్రెస్, హరియాణాలో కాంగ్రెస్కు AAP మద్దతివ్వలేదు. అందుకే BJP గెలిచింది. కానీ ఇక్కడ మన పార్టీ ఒక్కటే చాలు. వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని పార్టీ MLAల సమావేశంలో వ్యాఖ్యానించారు.

ఈనెల 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. జట్టులో మార్పులకు ఇవాళ్టితో గడువు ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆయన పరిస్థితిని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది. ఒకవేళ ఆయన ఈ టోర్నీకి దూరమైతే భారత జట్టుకు పెద్ద లోటే అని చెప్పవచ్చు.

మహారాష్ట్రలో ఇప్పటివరకు 192 మంది గిలియన్ బార్ సిండ్రోమ్ (<<15225307>>GBS<<>>) అనుమానిత రోగులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 167 మందికి GBS ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపింది. మొత్తం 7 అనుమానిత మరణాలు నమోదయ్యాయని, ఒకరు GBSతో మరణించినట్లు తేలిందని పేర్కొంది. రోగుల్లో 20-29 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.

నిండు నదులు పాఱు నిల్చి గంభీరమై
వెర్రివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ వినురవేమ.
భావం: గొప్ప నదులు నిదానంగా, గంభీరంగా ప్రవహిస్తాయి. పిల్లవాగులు అతివేగంగా గట్లుదాటి పొర్లి ప్రవహిస్తాయి. అట్లే యోగ్యుడు నిదానంగా, గంభీరంగా మాట్లాడతాడు. నీచుడు బడ బడ వాగుతూ ఉంటాడు.

జేఈఈ మెయిన్ 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. https://jeemain.nta.nic.in/ వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు. అయితే వెబ్సైట్లో ఎర్రర్ వస్తోందని, రిజల్ట్స్ చూపించడం లేదని పలువురు అభ్యర్థులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 22 నుంచి 29 వరకు ఈ పరీక్షను నిర్వహించారు. ఫైనల్ ఆన్సర్ కీ కోసం ఇక్కడ <
Sorry, no posts matched your criteria.