News December 30, 2024

H1B వివాదం: మస్క్ దెబ్బకు తలొగ్గిన ట్రంప్!

image

H1B వీసా వివాదం సద్దుమణిగినట్టే. <<15002323>>టాప్<<>> టాలెంట్‌ను ఆకర్షించేందుకు వీసాలపై పరిమితి ఉండొద్దన్న మస్క్, రామస్వామి వాదనకు డొనాల్డ్ ట్రంప్ తలొగ్గారు. తానెప్పుడూ ప్రతిభకు వ్యతిరేకం కాదన్నారు. టెక్ సహా అనేక రంగాల్లో ప్రతిభావంతుల కొరతను మస్క్ ఎత్తిచూపడంతో ఆయన ఆలోచనలో పడ్డారని తెలిసింది. పరిమితి పెడితే భారతీయులు, చైనీయులు సొంత దేశాలకు వెళ్లి కంపెనీలు పెట్టి అక్కడే ఉపాధి కల్పిస్తారన్న వాదనకు అంగీకరించారు.

News December 30, 2024

పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు భేటీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్‌ను కలిశారు. రామ్‌చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏపీలో చేయాలని నిర్ణయించినట్లు రాజు ఆయనకు వివరించారు. వేడుకకు ముఖ్య అతిథిగా రావాలని పవన్‌ను ఆహ్వానించారు. అలాగే ఏపీలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి పైనా ఇరువురు చర్చిస్తున్నారు.

News December 30, 2024

BCలపై CBNకు ఉన్న చిత్తశుద్ధి ఇదే: మంత్రులు

image

AP: BCల పట్ల CM చంద్రబాబు మరోసారి చిత్తశుద్ధి నిరూపించుకున్నారని మంత్రులు అన్నారు. BC అయిన విజయానంద్‌‌కు CS బాధ్యతలు అప్పగించడం గొప్ప విషయమని, కూటమి ప్రభుత్వం అంటేనే BC, SC వర్గాల ప్రతినిధి అని అనగాని చెప్పారు. తొలిసారి BCని CSగా నియమించడం సంతోషమని కొల్లు రవీంద్ర అన్నారు. DGP, పార్టీ అధ్యక్షుడు, CS పదవులను BCలకు ఇచ్చి CBN వారి పట్ల ప్రేమాభిమానాలను చాటుకున్నారని పార్థసారథి కొనియాడారు.

News December 30, 2024

భారత్‌కు మరో షాక్.. జైస్వాల్ ఔట్

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓటమి కోరల్లో చిక్కుకుంది. క్రీజులో కుదురుకున్న జైస్వాల్(84) వివాదాస్పద రీతిలో ఔటయ్యారు. ఆస్ట్రేలియా DRS కోరగా రిప్లైలో బాల్ బ్యాటును తాకనట్లుగా కనిపించింది. పదే పదే పరిశీలించిన థర్డ్ అంపైర్ చివరకు ఔట్‌గా ప్రకటించారు. దీంతో జైస్వాల్ నిరాశగా వెనుదిరిగారు. భారత్ మ్యాచ్ ఓడకుండా ఉండాలంటే మరో 21 ఓవర్లు క్రీజులో ఆడాలి.

News December 30, 2024

శివలింగంతో అఖిలేశ్‌కు ప్రాబ్లమ్ ఏంటి: BJP

image

‘UP CM ఇంటి కింద శివలింగం ఉందని మా విశ్వాసం. అక్కడా తవ్వకాలు చేపట్టాలి. ఇది అభివృద్ధి కాదు వినాశనం’ అన్న SP చీఫ్ అఖిలేశ్ యాదవ్‌పై BJP విరుచుకుపడింది. ‘2013లో అఖిలేశ్ CMగా ఉండగా ప్రభుత్వం1000 టన్నుల బంగారం కోసం తవ్వకాలు చేపట్టింది. గోల్డ్ తవ్వకాలను ఇష్టపడే ఆయనకు శివలింగంతో ప్రాబ్లమ్ ఏంటి’ అని BJP నేత రాకేశ్ త్రిపాఠి అన్నారు. ఓటు బ్యాంకు కోసం శివలింగంపై SP రాజకీయాలు చేస్తోందని షెజాద్ విమర్శించారు.

News December 30, 2024

భారతరత్న ప్రతిపాదనకు మద్దతు: కేటీఆర్

image

TG: మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇచ్చేందుకు కేంద్రానికి ప్రతిపాదన పంపాలని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నట్లు అసెంబ్లీలో కేటీఆర్ తెలిపారు. ఆ అవార్డు పొందేందుకు సింగ్ పూర్తిగా అర్హులని అన్నారు. ముందుగా మన్మోహన్ సామర్థ్యాన్ని గుర్తించింది TGకి చెందిన పీవీ నర్సింహరావు అని చెప్పారు. ఆయన పీఎంగా ఉన్న సమయంలోనే కేసీఆర్ కేంద్రంలో మంత్రిగా పనిచేసినట్లు గుర్తుచేశారు.

News December 30, 2024

మన్మోహన్ ఎందరికో మార్గదర్శి: రేవంత్

image

TG: దేశ నిర్మాణం కోసం మన్మోహన్ సింగ్ ఎన్నో నిర్మాణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారని సీఎం రేవంత్ వెల్లడించారు. ఉపాధి హామీ, RTI, NRHM, ఆధార్‌ను ఆయన ప్రారంభించారని తెలిపారు. 2013లో భూసేకరణ చట్టం తెచ్చి నిరుపేదలను, 2006లో అటవీహక్కుల చట్టానికి సవరణలు చేసి ఆదివాసీలను ఆదుకున్నారని కొనియాడారు. ఐటీ రంగంలో ప్రస్తుతం దేశం శాసించగలుగుతోందంటే మన్మోహన్ విధానాలే కారణమన్నారు.

News December 30, 2024

భారత్‌లో ‘కార్టర్ పురి’.. మీకు తెలుసా?

image

అనారోగ్యంతో మరణించిన అమెరికా మాజీ అధ్యక్షుడు <<15016141>>జిమ్మీ కార్టర్<<>>(100) పేరుతో భారత్‌లో ఓ గ్రామం ఉందని మీకు తెలుసా?. జనవరి 3న 1978లో ఆయన భారత్ పర్యటనకు వచ్చి హరియాణాలోని దౌలతాపూర్ నసీరాబాద్‌లో పర్యటించారు. ఆయన గౌరవార్థం అప్పటి PM మోరార్జీ దేశాయ్ ఆ గ్రామానికి ‘కార్టర్‌పురి’గా నామకరణం చేశారు. 2002లో కార్టర్‌కు నోబెల్ బహుమతి రాగా గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. ఇక్కడ ఏటా జనవరి 3న హాలిడే.

News December 30, 2024

మన్మోహన్ తెలంగాణ ఆత్మబంధువు: రేవంత్

image

TG: మాజీ ప్రధాని, ప్రపంచం గర్వించదగ్గ ఆర్థికవేత్త మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటని సీఎం రేవంత్ అన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నేత మన్మోహన్ అని కొనియాడారు. జీవితాన్ని దేశానికి అంకితం చేశారని, పదేళ్లు ప్రధానిగా ఉన్నా నిరాడంబరంగానే జీవించారని గుర్తుచేశారు. 60 ఏళ్ల తెలంగాణ స్వరాష్ట్ర కలను ఆయన సాకారం చేశారని, మన్మోహన్ తెలంగాణకు ఆత్మబంధువు అని సీఎం వెల్లడించారు.

News December 30, 2024

BREAKING: కష్టాల్లో టీమ్ ఇండియా

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్సులో 130 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఇవాళ తొలి సెషన్లోనే 3 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా టీ బ్రేక్ వరకు కుదురుగా ఆడింది. అయితే 4 ఓవర్ల వ్యవధిలో పంత్, జడేజా వికెట్లను కోల్పోయింది. సెంచరీ హీరో నితీశ్ సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. క్రీజులో ఓపెనర్ జైస్వాల్(76*) ఉన్నారు. విజయానికి ఇంకా 210 పరుగులు చేయాలి.