News March 29, 2024

ధర రూ.24 కోట్లు.. ఒక్క వికెట్టూ తీయలేదు

image

IPL చరిత్రలో మిచెల్ స్టార్క్ అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా నిలిచారు. మినీ వేలంలో అతడిని KKR రూ.24.75 కోట్లకు దక్కించుకుంది. అయితే ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 2 మ్యాచులాడిన అతడు.. ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. మొత్తం 8 ఓవర్లు వేసిన స్టార్క్.. ఏకంగా 100 రన్స్ ఇచ్చారు. దీంతో అతడి ప్రదర్శనపై నెట్టింట చర్చ జరుగుతోంది.

News March 29, 2024

BREAKING: టీడీపీలో చేరిన హీరో నిఖిల్

image

AP: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో ఈ ఎన్నికల్లో నిఖిల్ టీడీపీ తరఫున ప్రచారం చేయనున్నారు.

News March 29, 2024

GUNTUR EAST: 3 దశాబ్దాలుగా ముస్లిం ఎమ్మెల్యేలే

image

AP: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లింల హవా నడుస్తోంది. 1983 నుంచి ఇక్కడ వరుసగా ముస్లిం అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు. చివరిసారిగా 1978లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లింగంశెట్టి ఈశ్వరరావు గెలిచారు. ఆ తర్వాత మరే హిందూ అభ్యర్థి విజయం సాధించలేదు. ఇక్కడి నుంచి ఉమర్ ఖాన్ పఠాన్, మహ్మద్ జానీ, జియావుద్దీన్, సుబానీ, మస్తాన్ వలీ, ముస్తఫా MLAలుగా ఎన్నికయ్యారు.

News March 29, 2024

966 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మొత్తం 966 పోస్టులున్నాయి. ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థులు ఏప్రిల్ 18లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. జూన్ 4వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. వేతనం రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ https://ssc.gov.inను సంప్రదించాలి.

News March 29, 2024

క్షమాపణలు చెప్పిన మహిళా క్రికెటర్

image

భారత మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ క్షమాపణలు చెప్పారు. ‘నా సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఓ అభ్యంతరకర <<12948946>>పోస్ట్<<>> వచ్చినట్లు నా దృష్టికి వచ్చింది. కానీ అది జరిగిన సమయంలో నా ఫోన్ నా వద్ద లేదు. ఇందుకు నన్ను క్షమించాలి’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ‘వసూలి టైటాన్స్’ పేరుతో బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షా తదితర నేతలు క్రికెట్ ప్లేయర్లుగా ఉన్న పోస్టర్‌ను ఆమె ఇన్‌స్టా స్టోరీగా పెట్టినట్లు తెలుస్తోంది.

News March 29, 2024

రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

image

TG: మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇందుకు ఆర్బీఐ, బ్యాంకులతో కలిసి విధి విధానాలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు 6,47,589 మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేశాం. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది’ అని ఆయన తెలిపారు.

News March 29, 2024

‘ఓం’ ఆకారంలో ఆలయం

image

ప్రపంచంలోనే తొలి ఓం ఆకారం ఆలయాన్ని రాజస్థాన్‌లో నిర్మించారు. దీన్ని పాలి జిల్లాలోని జదాన్ గ్రామంలో 250 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇందులో 12 జ్యోతిర్లింగాలతో పాటు 1,008 శివుడి విగ్రహాలున్నాయి. 5వ శతాబ్దానికి చెందిన నాగర శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు.

News March 29, 2024

స్టేడియంలో కారు రూఫ్‌టాప్‌ను పగలగొట్టిన RCB ఫ్యాన్స్!

image

చిన్నస్వామి స్టేడియంలో RCBvsKKR మ్యాచ్‌కు ముందు కొందరు RCB అభిమానులు చేసిన విచిత్రమైన పనికి నెట్టింట విమర్శలొస్తున్నాయి. WPLలో RCB ప్లేయర్ పెర్రీ సిక్స్‌ కొట్టి కారు అద్దం పగలగొట్టడంతోనే వారు కప్ గెలిచారని, పురుషుల జట్టు కూడా అదే చేయాలని ఫ్యాన్స్ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో కొందరు ఆ కారు రూఫ్‌టాప్‌ను పగలగొట్టారు. మ్యాచ్ గెలిచేందుకు ఇలాంటి పిచ్చి పనులేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

News March 29, 2024

2024లో అత్యధిక సిక్సులు కొట్టిన IPL ప్లేయర్స్

image

IPL-2024 టోర్నీ ప్రారంభమై వారం రోజులు కావస్తుండగా ప్రతి మ్యాచ్‌లో ఆయా జట్ల ప్లేయర్లు సిక్సర్లతో అదరగొడుతున్నారు. అయితే, ఈ ఏడాది ఇప్పటివరకూ SRH ప్లేయర్లు క్లాసెన్ 2 మ్యాచుల్లో 15 సిక్సులు కొట్టగా, అభిషేక్ శర్మ 9 సిక్సులు బాదారు. వీరి తర్వాత RR ప్లేయర్ పరాగ్ 2 మ్యాచుల్లో 9 సిక్సులు, KKR రస్సెల్ ఒక్క మ్యాచులో 7 సిక్సులు, MI ప్లేయర్ తిలక్ వర్మ 2 మ్యాచుల్లో 7 సిక్సులు కొట్టారు.

News March 29, 2024

వారి ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డు

image

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేల్చిన ఇద్దరు కీలక నిందితుల కోసం వేట కొనసాగుతోంది. వారి ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డు ఇస్తామని NIA ప్రకటించింది. నిందితుల ఆచూకీ తెలిసిన వాళ్లు 89042 41100 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపింది. కాగా ఈ కేసులో ఇప్పటికే NIA ఓ అనుమానితుడిని అరెస్ట్ చేసింది. మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో నలుగురు గాయపడ్డ విషయం తెలిసిందే.