India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆయనను స్వాగతిస్తూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘బలహీనుడి గళం. సామాజిక న్యాయ రణం. రాహుల్ గాంధీకి స్వాగతం’ అని పేర్కొన్నారు. ఇవాళ HYDకు రానున్న రాహుల్, కులగణనపై మేధావులు, పలువురు నేతలతో సమావేశమై అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఈ సమావేశం తర్వాత ఆయన అశోక్ నగర్కు వెళ్లి నిరుద్యోగులతో చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఫ్లైట్, ఫోర్ వీలర్తో పోలిస్తే రైలు ప్రయాణ పరిస్థితులు భిన్నం. విమానాలు, వెహికిల్స్ వెళ్లే ఎత్తు-ఒంపుల/గతుకుల రూట్ కాకుండా స్థిర, చదునైన మార్గంలో ఇవి వెళ్తాయి. పైగా అకస్మాత్తుగా వేగం తగ్గి ప్రయాణించడం అరుదు. మిగతా వాటితో పోలిస్తే ప్రమాదాలు, మరణాలూ తక్కువే. అటు పట్టాలు తప్పడం, ఢీకొనడం, మంటలు రావడం లాంటి దుర్ఘటనల్లో సీటు బెల్టులతో వెంటనే బయటపడలేరు. ఇలా రైళ్లో సీటు బెల్టుతో లాభాల కంటే రిస్కులెక్కువ.
ఈ దీపావళి పెళ్లిళ్ల సీజన్ భారత ఎకానమీకి భారీ స్థాయిలో కాంట్రిబ్యూట్ చేయబోతోంది. ఈ నెల రోజుల్లోనే దేశవ్యాప్తంగా 48 లక్షల వివాహాలు జరుగుతాయని CAIT తెలిపింది. దీంతో రూ.6లక్షల కోట్ల బిజినెస్ జనరేట్ అవుతుందని అంచనా వేసింది. ఢిల్లీలోనే 4.5 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని, దాంతో రూ.1.5లక్షల కోట్ల వ్యాపారం నమోదవుతుందని పేర్కొంది. గతేడాది ఇదే సీజన్లో 38 లక్షల పెళ్లిళ్లతో రూ.4.2 లక్షల కోట్ల బిజినెస్ జరిగింది.
TG: ప్రజాసేవ చేయాలన్న తపన ఆయనతో DSP ఉద్యోగానికి రాజీనామా చేయించింది. నిజామాబాద్(D) ఆర్మూర్కు చెందిన మందనం గంగాధర్ DSP ఉద్యోగం నుంచి VRS తీసుకున్నారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల MLC ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ఆయన చెప్పారు. నిరుపేద కుటుంబానికి చెందిన గంగాధర్ 1998 బ్యాచ్ ఎస్సైగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించారు.
AP: టెట్ ఫలితాల్లో పలువురు పేదింటి విద్యార్థులు సత్తా చాటారు. 150కి 150 మార్కులు సాధించి అదరగొట్టారు. విజయనగరానికి చెందిన కొండ్రు అశ్విని, నంద్యాల(D) గొర్విమానుపల్లె వాసి మంజుల, నిచ్చెనమెట్లకు చెందిన క్రాంతికుమార్ వంద శాతం మార్కులు సాధించారు. వీరి తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు. టీచర్ ఉద్యోగం సాధించి పేద విద్యార్థులకు ఉత్తమ బోధన అందించడమే లక్ష్యమని వారు వెల్లడించారు.
అమెరికాలో చిన్నాచితకా పార్టీలు ఎన్ని ఉన్నా డెమొక్రటిక్(గుర్తు గాడిద), రిపబ్లికన్ల(సింబల్ ఏనుగు) మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. 1854 నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. 1790లో ఏర్పడిన డెమొక్రటిక్ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పార్టీల్లో ఒకటి. ఆ పార్టీ తరఫున ఇప్పటి వరకు 16 మంది అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1854లో ప్రారంభమైన రిపబ్లికన్ పార్టీ నుంచి 19 మంది ప్రెసిడెంట్లుగా పనిచేశారు.
భారత జట్టులోకి తిరిగిరావడానికి ప్రయత్నిస్తున్న పేసర్ మహ్మద్ షమీకి షాక్ తగిలింది. రంజీ ట్రోఫీ నెక్స్ట్ రెండు రౌండ్లకు బెంగాల్ టీమ్లో అతనికి చోటు దక్కలేదు. అక్కడ ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాలనుకున్న అతనికి ఇది బ్యాడ్ లక్ అని చెప్పవచ్చు. 2023 ODI WC తర్వాత గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైన షమీ, సర్జరీ తర్వాత కోలుకుని బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇటీవల తాను 100% ఫిట్నెస్ సాధించినట్లు చెప్పారు.
AP: భారీగా పెరిగిన నిత్యావసర ధరలతో సతమతం అవుతున్న సామాన్యులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సబ్సిడీ ధరలపై సరకులు అందజేసేందుకు సిద్ధమవుతోంది. లీటర్ పామాయిల్ రూ.110, కేజీ కందిపప్పు రూ.67, అరకేజీ చక్కెర 16 రూపాయలకే అందించాలని మంత్రులు నాదెండ్ల, పయ్యావుల, అచ్చెన్నాయుడుతో కూడిన కమిటీ నిర్ణయించింది. రైతు బజార్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 2200 రిటైల్ ఔట్లెట్ల ద్వారా సరకులు విక్రయించనుంది.
TG: కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ నమోదు గడువు రేపటితో ముగియనుంది. 2019తో (1.96లక్షలు) పోల్చితే ప్రస్తుతం ఓటరు దరఖాస్తుల సంఖ్య(2.40 లక్షలు) పెరిగింది. అయినా ఇంకా సగం మంది గ్రాడ్యుయేట్లు ఓటు నమోదుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఈనెల 23న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్, అభ్యంతరాల స్వీకరణ తర్వాత డిసెంబర్ 30న ఫైనల్ లిస్ట్ను రిలీజ్ చేస్తామని అధికారులు తెలిపారు.
1876లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో US చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. ఆ ఎలక్షన్లలో ఏకంగా 81.8 శాతం మంది అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 1792 ఎలక్షన్స్లో కేవలం 6.3 శాతం మందే ఓట్లు వేశారు. ఇదే అమెరికా చరిత్రలో అత్యల్ప ఓటింగ్ శాతం. గత ఎన్నికల్లో దాదాపు 66 శాతం ఓటింగ్ నమోదు కాగా ఈ సారి అది పెరుగుతుందని అంచనా.
Sorry, no posts matched your criteria.