India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. మళ్లీ 26వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఆమెను కోర్టులో హాజరుపర్చాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. కాగా ఈ 3 రోజులు అరవింద్ కేజ్రీవాల్తో కలిపి కవితను ఈడీ విచారించే అవకాశం ఉంది.
పంజాబ్లో సంగ్రూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురై దాదాపు 40 మంది ఆస్పత్రిపాలవగా, వారిలో ఇప్పటి వరకు 21 మంది మరణించారు. ఈ ఘటనకు కారణమైన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో ఓ ఇంటిపై దాడి చేసి 200 లీటర్ల ఇథనాల్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా కేసు విచారణకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్లు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఇవాళ తొలి మ్యాచ్ ఆడనున్నారు. కమిన్స్ను రూ.20.50 కోట్లకు దక్కించుకున్న SRH కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. రూ.24.75 కోట్ల రికార్డు ధరతో KKR సొంతం చేసుకున్న పేసర్ స్టార్క్ కీలక బౌలర్గా బరిలోకి దిగనున్నారు. అతడు ఒక్క బంతి వేస్తే సుమారు రూ.7.36 లక్షలు సంపాదిస్తారు. మరి ఈ కోట్ల వీరుల ప్రదర్శన ఎలా సాగుతుందన్నది ఆసక్తికరం.
కవిత ఈడీ కస్టడీ పొడిగింపు పిటిషన్పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఆమెను మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ వాదించింది. తన క్లయింట్కు బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు లాయర్ కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి కాసేపట్లో తీర్పు వెలువరించనున్నారు. అయితే కోర్టు రూమ్లోనే తన పిల్లలు, కుటుంబ సభ్యులను కలవడానికి కవితకు జడ్జి అనుమతి ఇచ్చారు.
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆరోజు గేమ్ ఛేంజర్ నుంచి ‘జరగండి’ అనే పాట ఫస్ట్ సింగిల్ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఆమె కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో కోర్టులో హాజరుపర్చిన అధికారులు.. మరో 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని జడ్జిని కోరారు. దీంతో జడ్జి నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో 67.40%తో ఆల్ టైమ్ హై నమోదైంది. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం 75% దాటాలని రాజకీయ వర్గాలు ఆశిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ మినహా ఇతర ప్రాంతాల్లో 2014తో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది. J&Kలో 2014లో 49.72% నమోదు కాగా 2019లో అది 29.39%కు పరిమితమైంది. కాగా 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంతో తెలుసా? 45.67శాతం.
AP: చంద్రబాబు శిష్యుడు సీఎం రమేశ్ బీజేపీకి వెన్నుపోటు పొడిచాడంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ‘టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికై ఆ తర్వాత బాబు సలహాతో సీఎం రమేశ్ బీజేపీలోకి వెళ్లారు. గతేడాది కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రిత్విక్ ప్రాజెక్ట్స్ కంపెనీ పేరుతో రూ.30 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనిచ్చారు. బాబు సలహా మేరకు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు ఆర్థిక సాయం చేశారు’ అంటూ బాండ్ల వివరాలను జత చేసింది.
TG: సైబర్ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. రివ్యూస్ రాసే పార్ట్టైమ్ జాబ్ అంటూ హైదరాబాద్లో ఓ వ్యక్తిని నిలువునా ముంచేశారు. ఆన్లైన్లో బాధితుడికి పరిచయమైన మోసగాళ్లు.. హోటల్స్ను ప్రమోట్ చేయడంలో భాగంగా రివ్యూస్ రాస్తే డబ్బు ఇస్తామన్నారు. తొలుత పనికి తగ్గ డబ్బులు ఇస్తూ వచ్చారు. ఆపై మరింత పెట్టుబడి పెడితే లాభాలొస్తాయని బాధితుడిని నమ్మించి రూ.13,57,288 దోచేశారు.
ఐపీఎల్లో సీఎస్కే మ్యాచ్ అనగానే ధోనీపైనే అందరి దృష్టి ఉంటుంది. ఈ సీజన్లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే కెమెరామెన్ కూడా ధోనీనే ఎక్కువ చూపిస్తుంటారు. అయితే నిన్నటి మ్యాచ్లో ఈ మోతాదు ఎక్కువైందని అనిపించింది కాబోలు.. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో సెటైర్ వేశారు. ధోనీతో పాటు రుతురాజ్ను కూడా చూపించాలని, అతను చెన్నై కెప్టెన్ అని గుర్తుచేశారు.
Sorry, no posts matched your criteria.