India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేలా ఎన్డీయే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అమిత్ షా కూడా ఈ మేరకు గతంలో నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు కూడా సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు బిల్లులపైనే కీలక చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది.
TG: మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8న తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ యాదాద్రి ఆలయంలో పూజలు చేయనున్నారు. అదే రోజు భువనగిరి నుంచి వలిగొండ వైపు నది వెంబడి ఆయన పాదయాత్ర చేసే అవకాశం ఉంది. అలాగే భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల పైపులైన్లకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
ఐబీపీఎస్ RRB పీవో మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.ibps.in వెబ్సైట్లో లాగిన్ అయి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 1 2 ,3 ఉద్యోగాలకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మెయిన్స్ ఎగ్జామ్ను ఐబీపీఎస్ నిర్వహించింది. మెయిన్స్లో పాసైన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సి ఉంటుంది.
తాను తెలుగు వారికి వ్యతిరేకంగా <<14525601>>మాట్లాడానంటూ<<>> DMK పార్టీకి చెందిన వారు ఫేక్ ప్రచారం చేస్తున్నారని నటి కస్తూరి అన్నారు. తెలుగు గడ్డ తనకు మెట్టినిల్లుతో సమానమని, తెలుగు వాళ్లను కుటుంబ సభ్యులుగా భావిస్తానన్నారు. తన వ్యాఖ్యలను తమిళ మీడియాలో వక్రీకరించి చూపిస్తున్నారని ఆమె చెప్పారు. తెలుగు ప్రజల ప్రేమను తనకు దూరం చేసేందుకే కొందరు కుట్ర చేశారని పేర్కొన్నారు. ఆమె కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు.
ఈ పండగ సీజన్లో ఇ-కామర్స్ ప్లాట్ఫామ్స్ సేల్స్ ఏకంగా రూ.లక్షకోట్లు దాటేశాయి. నాన్ మెట్రో కస్టమర్ల నుంచి ప్రీమియం బ్రాండ్లకు డిమాండ్ పెరిగిందని డాటమ్ ఇంటెలిజెన్స్ తెలిపింది. దీంతో సేల్స్ 23% వృద్ధితో రూ.81వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు పెరిగాయంది. సీజన్ మొదటి వారంలోనే సగం అమ్మకాలు నమోదయ్యాయని, స్మార్ట్ ఫోన్లు, గ్రాసరీ, బ్యూటీ, పర్సనల్ కేర్, హోమ్, కిచెన్ ఐటెమ్స్ ఎక్కువగా అమ్ముడయ్యాయని పేర్కొంది.
ఉత్తరాఖండ్ అల్మోరాలోని మార్చుల వద్ద లోయలో బస్సు పడిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 36కు చేరుకుంది. బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉండగా ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోయింది. NDRF, SDRF, స్థానిక పోలీసులు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. కొంతమంది ప్రయాణికులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. కాగా, సీఎం పుష్కర్ సింగ్ ధామి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
‘నేను హోంమంత్రి అయితే పరిస్థితి మరోలా ఉంటుంది’ అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయాల్లోనే కాదు, ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. వరుస ఘటనలపై ఆవేదనతోనే ఆయన అన్నారా? లేక ఇతర కారణాలున్నాయా? అనేది మున్ముందు తెలియనుంది. కానీ రీల్ లైఫ్ గబ్బర్ సింగ్ రియల్ లైఫ్లో హోం మినిస్టర్ అయితే? పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
SLతో వన్డే, NZతో టెస్ట్ సిరీస్లలో భారత్ ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు బీసీసీఐ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ కమిటీ మీటింగ్లకు ఇకపై ఆయనను దూరంగా ఉంచనున్నట్లు సమాచారం. ‘రూల్ ప్రకారం కోచ్లను సెలక్షన్ కమిటీ సమావేశాలకు అనుమతించరు. ద్రవిడ్, రవిశాస్త్రికి ఇదే వర్తించింది. కానీ AUS టూర్ విషయంలో గౌతీని అనుమతించారు’ అని BCCI వర్గాలు PTIకి తెలిపాయి.
AP: ఇసుకను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ‘ఉచిత ఇసుక విషయంలో ఇబ్బందులు కలిగిస్తే సొంత పార్టీ నేతలనైనా కేసులు పెడతామని CM చంద్రబాబు హెచ్చరించారు. చాలా మందికి ఇసుక సంపాదన మార్గం అయిపోయింది. రవాణా ఛార్జీలు చెల్లించి సొంత అవసరాలకు ప్రజలు ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు. మీ హక్కుకు ఎవరు భంగం కలిగించినా ఎదురుతిరగండి’ అని పిలుపునిచ్చారు.
బాడీ బిల్డింగ్పై నిజాలు ఒప్పుకునేందుకు కొందరు యాక్టర్లు వెనకాడుతుంటారు. ఎడిట్ ఫొటోలు వైరలయినా వాటిలో నిజమెంతుందో చెప్పేందుకు ఇష్టపడరు. కానీ, తమిళ హీరో శివ కార్తికేయన్ తన ఎడిటెడ్ ఫొటోపై స్పందించారు. అమరన్ మూవీ సెట్స్లోనిది అంటూ ఓ ఫొటో వైరల్ కాగా అది మార్ఫింగ్ చేసిందని వెల్లడించారు. తనకు సిక్స్ ప్యాక్ ఉన్నట్లు చాలా బాగా ఎడిట్ చేశారన్నారు. ఈ మూవీ కోసం తాను సిక్స్ ప్యాక్ ప్రయత్నించినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.