News November 4, 2024

బీటెక్ సీట్లలో ఈ మూడు రాష్ట్రాలదే అధిక వాటా!

image

ఇంజినీరింగ్ చదివే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. డిగ్రీ కంటే బీటెక్ చదివేందుకే విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. 2024-25లో దేశవ్యాప్తంగా 14.90 లక్షల బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా తమిళనాడులో 3,08,686 సీట్స్, ఆంధ్రప్రదేశ్‌లో 1,83,532 & తెలంగాణలో 1,45,557 సీట్లున్నాయి. ఇలా చూస్తే దేశంలోని ఇంజినీరింగ్ సీట్లలో ఈ మూడు రాష్ట్రాలే 40శాతం వాటా కలిగి ఉన్నాయి.

News November 4, 2024

BREAKING: టెట్ ఫలితాలు విడుదల

image

AP: గత నెల 3 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంత్రి లోకేశ్ విడుదల చేశారు. <>https://cse.ap.gov.in/ <<>>వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలకు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది హాజరయ్యారు. అందులో 1,87,256 (50.79 శాతం) మంది అర్హత సాధించారు. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. కాగా త్వరలోనే 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది.

News November 4, 2024

రేపు రాష్ట్రానికి రాహుల్ గాంధీ

image

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు రాష్ట్రానికి రానున్నారు. సా.4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన, అక్కడి నుంచి బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలు, విద్యావేత్తలతో సమావేశమై కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఈ సమావేశానికి దాదాపు 400 మందికి ఆహ్వానం అందినట్లు సమాచారం.

News November 4, 2024

GREAT: ₹5000 నుంచి ₹50,000 కోట్లకు..

image

యంగ్ ఆంత్రప్రెన్యూర్స్‌కు Waree టెక్నాలజీ ఛైర్మన్ హితేశ్ చిమన్‌లాల్ ఆదర్శనీయం. కిరాణాకొట్టు యజమాని కొడుకైన ఆయన చదువుకుంటున్నప్పుడే 1985లో బంధువుల దగ్గర రూ.5000 అప్పు తీసుకొని జర్నీ ఆరంభించారు. 1989లో వ్యాపారం విస్తరించి తొలి ఏడాదిలో రూ.12వేల టర్నోవర్ సాధించారు. కట్‌చేస్తే 40ఏళ్ల తర్వాత కంపెనీ మార్కెట్ విలువ రూ.71,244 కోట్లకు చేరింది. IPOకు రావడంతో ఆయన కుటుంబ నెట్‌వర్త్ రూ.50వేల కోట్లను తాకింది.

News November 4, 2024

అన్నపూర్ణ స్టూడియోలోనే చైతూ-శోభిత పెళ్లి?

image

అక్కినేని నాగ చైతన్య-శోభితల పెళ్లి పనులు మొదలవడంతో వెడ్డింగ్ వేదిక ఎక్కడనే చర్చ మొదలైంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని వార్తలు రాగా అందుకు భిన్నంగా HYD అన్నపూర్ణ స్టూడియోలోనే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సెట్టింగ్, డెకరేషన్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. ఇరు ఫ్యామిలీలు పెళ్లి పిలుపులను ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా డిసెంబర్ 4న వీరి వివాహం జరుగుతుందని టాక్.

News November 4, 2024

SUPER: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ‘చరిత్ర’ తెలుస్తుంది!

image

చారిత్రక కట్టడాల వివరాలు ప్రజలకు తెలిసేలా కేంద్ర పురావస్తుశాఖ ఆయా నిర్మాణాల వద్ద క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేస్తోంది. వరంగల్(D) ఖిలా వరంగల్‌లోనూ వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఈ కోడ్‌ను ఫోన్‌లో స్కాన్ చేస్తే తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో కాకతీయుల చరిత్ర, ఆలయాల విశేషాలు, పురాతన కట్టడాల గురించి చూపిస్తుంది. జిల్లాల పర్యాటక ప్రాంతాల వివరాలు, గూగుల్ మ్యాప్ లొకేషన్ వంటివి తెలుసుకునే వెసులుబాటు కల్పించింది.

News November 4, 2024

Be Ready: నవంబర్‌లో 4 అద్భుతాలు

image

ఈనెలలో 4 అద్భుతాలు స్పేస్ లవర్స్‌కు కనువిందు చేయనున్నాయి. అందులో ఒకటి.. భూమి నుంచి నేరుగా చూడగల నక్షత్రాల్లో ఒకటైన స్పైకా ఈ నెల 27న గంటపాటు మాయం కానుంది. ఆరోజు చందమామ ఈ తెలుపు, నీలి కాంతుల తారకు తెరగా అడ్డు వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. తూర్పు అమెరికా, కెనడాలో ఈ వండర్ వీక్షించవచ్చు. ఇక మరో 3.. అంగారక, గురు, శని గ్రహాలు ఈ మాసంలో భూమికి చేరువగా రానుండగా, రాత్రుళ్లు వీటిని నేరుగానే చూడవచ్చట.

News November 4, 2024

వారెన్ బఫెట్ ‘రెడ్ సిగ్నల్’ ఇస్తున్నారా?

image

స్టాక్ మార్కెట్ లెజెండ్ వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్‌షైర్ హాత్‌వే నగదు నిల్వలను మరింత పెంచుకుంది. చివరి త్రైమాసికంలో $276.9 బిలియన్లుగా ఉన్న క్యాష్ ఇప్పుడు $325.2 బిలియన్లకు పెరిగింది. ఆ కంపెనీ $300 బిలియన్లకు పైగా నగదు ఉంచుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో అమెరికా ఎన్నికల తర్వాత గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయని, అందుకే బఫెట్ షేర్లు అమ్మేస్తున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

News November 4, 2024

గొంతులో కోడిగుడ్డు ఇరుక్కొని..

image

TG: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బిజినేపల్లి(M) నందివడ్డేమాన్‌‌కు చెందిన తిరుపతయ్య(60) లింగాలలో ఉన్న బంధువు ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి అప్పాయిపల్లిలో ఉన్న మరో బంధువు ఇంటికి వెళ్లేందుకు లింగాల బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడి బజ్జీల బండి వద్ద కోడిగుడ్డు కొనుక్కొని తింటుండగా గొంతులో ఇరుక్కుంది. ఊపిరాడక తిరుపతయ్య కుప్పకూలాడు. స్థానికులు నీళ్లు తాగిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు.

News November 4, 2024

విద్యుత్ షాక్‌తో నలుగురి మృతి.. ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం

image

AP: తూర్పు గోదావరి(D) తాడిపర్రులో విద్యుత్ షాక్‌కు గురై నలుగురు యువకులు <<14523941>>మృతి<<>> చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.