News March 22, 2024

ఎవరు ఎలాంటి వారో నేడు అర్థమైంది: శ్రీదేవి

image

AP: వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆసక్తికర ట్వీట్ చేశారు. టీడీపీ నుంచి బాపట్ల ఎంపీ సీటు ఆశించిన ఆమెకు భంగపాటే ఎదురైంది. ఈ నేపథ్యంలో ‘రాజకీయాలు ఎలా ఉంటాయో..ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థమయింది’ అని ట్వీట్ చేశారు. బాపట్ల జిల్లా మ్యాప్‌, ట్యాగ్‌ని జత చేసి పక్కన కత్తి సింబల్ ఉంచారు. కాగా ఈ సీటును మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్‌కు టీడీపీ కేటాయించింది.

News March 22, 2024

మనుషులు కాదు.. క్రూర మృగాలు

image

AP: ధన దాహంతో మనుషులు క్రూర మృగాళ్లలా మారుతున్నారు. బంగారు నగల కోసం ఓ వృద్ధురాలని ముక్కలుగా నరికి చంపేశారు. అనంతపురం(D) ఎర్రగుంట్లలో ఈ దారుణం జరిగింది. ఓబులమ్మ(84) అనే వృద్ధురాలు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి ఇంట్లో శుభకార్యం కోసం 7తులాల బంగారం ఇచ్చింది. వారు తిరిగి ఇవ్వకపోవడంతో పెద్దలను ఆశ్రయించింది. దీంతో కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు గొడవకు దిగి ఆమెను ముక్కలుగా నరికి పెనకచర్ల డ్యామ్‌లో పడేశారు.

News March 22, 2024

పురందీశ్వరిపై అసత్య ఆరోపణలు: యామినీ శర్మ

image

AP: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందని బీజేపీ నాయకురాలు యామినీ శర్మ ఆరోపించారు. పోలీసులు, నార్కోటిక్స్ విభాగం నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో డ్రగ్స్ కంటైనర్ వచ్చిందని.. ఆ సంస్థ యజమానికి వైసీపీతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ఇదంతా కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరిపై నిందలు మోపుతున్నారని ఫైర్ అయ్యారు.

News March 22, 2024

జంపా స్థానంలో తనుష్‌కు ఛాన్స్

image

IPLకు దూరమైన ఆడమ్ జంపా స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కొత్త కుర్రాడికి చోటిచ్చింది. ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీలో అదరగొట్టిన ముంబై స్పిన్నర్ తనుష్ కొటియన్‌ను రూ.20 లక్షల బేస్ ప్రైస్‌కు దక్కించుకుంది. రంజీలో అతడు 502 రన్స్, 29 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. పని ఒత్తిడి కారణంగా IPL ఆడలేనని జంపా నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. RR అతడిని మినీ వేలంలో రూ.1.50 కోట్లకు దక్కించుకుంది.

News March 22, 2024

MPగా పోటీ చేసే రాష్ట్రంలో ఓటు ఉండాలా?

image

రాజ్యసభ సభ్యత్వానికి కనీస వయస్సు 30సం.లు, లోక్‌సభకు పోటీ చేసేందుకు కనీస వయస్సు 25సం.లు ఉండాలి. భారత పౌరసత్వంతో పాటు, దేశంలో ఏదైనా <<12903689>>ఒక నియోజకవర్గంలో<<>> ఓటరై ఉండాలి. 2సం.ల కంటే ఎక్కువ జైలు శిక్షకు గురికావద్దు. గుర్తింపు పొందిన పార్టీ నుంచి పోటీకి ఆ నియోజకవర్గంలో ఒక ప్రపోజర్ సంతకం కావాలి. స్వతంత్ర అభ్యర్థికి పది మంది ప్రపోజర్లు ఉండాలి. రూ.25 వేల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. మానసికంగా పరిపక్వత తప్పనిసరి.

News March 22, 2024

తీర్పు రిజర్వ్

image

లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. కేజ్రీవాల్‌ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరఫు లాయర్ రాజు సుదీర్ఘ వాదనలు వినిపించారు.

News March 22, 2024

BREAKING: పరీక్షల తేదీల మార్పు

image

TG: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో అధికారులు మార్పులు చేశారు. EAPCET (పాత ఎంసెట్) అగ్రి అండ్ ఫార్మా పరీక్షను మే 7, 8 తేదీల్లో నిర్వహిస్తామని చెప్పారు. మే 9, 10, 11 తేదీల్లో ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఎగ్జామ్ ఉంటుందని తెలిపారు. ఐసెట్ పరీక్ష తేదీలను జూన్ 5, 6 తేదీలకు మార్చామన్నారు.

News March 22, 2024

‘నేను నమ్మిందే నిజమైంది’.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై సుప్రీంకోర్టు మాజీ జడ్జి

image

అధికారం వస్తే దురాశ మనల్ని ఆవహిస్తుందనే విషయం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌ స్పష్టం చేసిందన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే. “అవినీతిపై ఉద్యమిస్తున్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్తేనే అవినీతి అంతం చేయగలమని ఓ వర్గం వాదించింది. కానీ నేను ఏకీభవించలేదు. ఇప్పుడు నేను నమ్మిందే నిజమైంది” అని తెలిపారు. కాగా గతంలో అన్నా హజారే, కేజ్రీవాల్‌తో కలిసి హెగ్డే అవినీతిపై ఉద్యమించారు.

News March 22, 2024

పాత రూ.100 నోట్లు చెల్లవంటూ ప్రచారం

image

పాత రూ.100 నోట్లు చెల్లవంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ‘పాత రూ.100 నోట్లను మార్చి 31లోపు ఖర్చు పెట్టుకోండి. లేదా బ్యాంకులో రిటర్న్ చేయండి. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి అవి చెల్లుబాటు కావు’ అంటూ మెసేజ్‌లను కొందరు వైరల్ చేస్తున్నారు. అయితే పాత రూ.100 నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఫేక్ మెసేజ్‌ను నమ్మకండి. ఇతరులకు ఫార్వర్డ్ చేయకండి.

News March 22, 2024

కంటైనర్‌లోని డ్రగ్స్ శాంపిల్స్‌ పరిశీలన

image

AP: విశాఖలో నిన్న పట్టుబడిన కంటైనర్‌లోని డ్రగ్స్ శాంపిల్స్‌ను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. సీబీఐ న్యాయమూర్తి సమక్షంలో నేషనల్ ఫోరెన్సిక్ టీం డ్రగ్ టెస్ట్ చేస్తోంది. ఇందుకోసం 140 శాంపిల్స్ తీయాలని నిర్ణయించారు. కాగా, బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్‌లోని 25వేల కేజీల మాదకద్రవ్యాలను నిన్న సీబీఐ పట్టుకుంది.