News November 4, 2024

విశాఖ స్టీల్‌కు రూ.1650 కోట్ల సాయం

image

AP: ఆర్థిక, నిర్వహణ సవాళ్లతో ఇబ్బందిపడుతున్న విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.1650 కోట్ల సాయం అందించింది. సంస్థ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 19న ఈక్విటీ కింద రూ.500 కోట్లు, వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద రూ.1150 కోట్లు అందించినట్లు వివరించింది. సంస్థ సుస్థిరంగా నిలదొక్కుకునేలా SBI ఆధ్వర్యంలో ఒక నివేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.

News November 4, 2024

ఇవాళ్టి నుంచి ఫార్మసీ కౌన్సెలింగ్

image

TG: బీ ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఇవాళ్టి నుంచి సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్, స్లాట్ బుకింగ్‌కు ఇవాళ్టి వరకు అవకాశం ఉంది. రేపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. ఈ నెల 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 9న సీట్లు కేటాయిస్తారు. మరిన్ని వివరాలకు https://tgeapcetb.nic.inను చూడండి.

News November 4, 2024

కమల చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు: డొనాల్డ్ ట్రంప్

image

కమలా హారిస్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఆమెకు విజన్, ఐడియా, సొల్యూషన్స్ లేవని పేర్కొన్నారు. ట్రంప్ ఇది చేశాడు, అది చేశాడని చెప్పడం తప్ప ఇంకేమీ తెలియదని సెటైర్ వేశారు. ‘కమల గెలిస్తే బోర్డర్‌ను తెరిచేస్తుంది. ఇమ్మిగ్రెంట్స్, క్రిమినల్స్‌తో అమెరికాను నింపేస్తుంది. గెలిస్తే ధరలు, ట్యాక్సులు తగ్గించేందుకు ప్రయత్నిస్తానన్న ఆమె ఇప్పుడే ఎందుకు చేయడం లేదు’ అని ప్రశ్నించారు.

News November 4, 2024

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్!

image

TG: పంచాయతీ రాజ్, గ్రామీణ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు ఇవ్వాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఆన్‌లైన్‌లో ఏకకాలంలో జీతాల చెల్లింపు జరిగేలా కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీరికీ ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫైల్ ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉంది.

News November 4, 2024

మరో క్రేజీ ప్రాజెక్టుకు ప్రభాస్ గ్రీన్‌సిగ్నల్?

image

హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ చెప్పిన కథకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్-2 చిత్రాలతో డార్లింగ్ బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రశాంత్ జై హనుమాన్, మోక్షజ్ఞతో సినిమాలు చేయనున్నారు. వీటి తర్వాత క్రేజీ కాంబో పట్టాలెక్కుతుందని తెలుస్తోంది.

News November 4, 2024

రూ.524 కోట్లతో ప్రజాప్రతినిధులు, అధికారుల బిల్డింగ్స్

image

AP: అమరావతిలో ప్రజాప్రతినిధులు, IAS, IPSల కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ టవర్ల పెండింగ్ పనులను పూర్తి చేయడానికి CRDA సిద్ధమైంది. రూ.524 కోట్ల వ్యయ అంచనాతో త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఈ పనులను 9 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 18 టవర్ల నిర్మాణాన్ని 2017లో రూ.700 కోట్ల అంచనాతో ప్రారంభించి రూ.444 కోట్లు వెచ్చించింది. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు ఆగిపోయాయి.

News November 4, 2024

విజయవాడ-శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’.. 9న ప్రయోగం

image

AP: విజయవాడ పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’ జర్నీకి ఈ నెల 9న CM చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఆ 2 ప్రాంతాల మధ్య దీన్ని నడిపేందుకు ఉన్న అనుకూలతలపై అధికారులు తొలుత ప్రయోగం నిర్వహిస్తారు. ఇది విజయవంతమైతే రెగ్యులర్ సర్వీసును ప్రారంభిస్తారు. దీనివల్ల పర్యాటక రంగానికి మరింత ఊతం వస్తుందని భావిస్తున్నారు.

News November 4, 2024

నేడే ఫలితాలు విడుదల

image

ఏపీ టెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్‌ను అధికారికంగా రిలీజ్ చేస్తారు. అభ్యర్థులు <>aptet.apcfss.in<<>> వెబ్‌సైట్‌లో తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. గత నెల 3 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్ పరీక్షలకు 3,68,661 మంది హాజరయ్యారు. టెట్ ఫలితాలు రానుండటంతో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది.

News November 4, 2024

విజయ్ దేవరకొండ సినిమాలో ‘ది మమ్మీ’ నటుడు?

image

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఇందులో హాలీవుడ్ సినిమా ‘ది మమ్మీ’తో పాపులరైన ఆర్నాల్డ్ వోస్లూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. 1854-78 మధ్య కాలంలో జరిగే ఈ కథలో విజయ్ పాత్ర తర్వాత ఆయన క్యారెక్టర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఈ మూవీ షూటింగ్ 2025 జనవరి నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సుంది.

News November 4, 2024

ఇవాళే టెట్ నోటిఫికేషన్

image

TG: ఇవాళ టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈ ఏడాది మే, జూన్‌లో తొలి టెట్ నిర్వహించింది. ఇవాళ రెండో టెట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వనుండగా జనవరిలో పరీక్షలు జరపనుంది. మేలో నిర్వహించిన టెట్‌లో 1.09 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. ఇటీవల డీఎస్సీ కూడా పూర్తి కావడంతో ఈసారి పరీక్ష రాసే వారి సంఖ్య స్వల్పంగా తగ్గొచ్చని అధికారులు భావిస్తున్నారు.