News December 29, 2024

₹12 కోట్ల ఘ‌రానా మోసం.. నిందితుల అరెస్టు

image

CRED యాప్‌ను ప‌ర్య‌వేక్షించే Dreamplug Paytech Solutions బ్యాంకు ఖాతాల నుంచి ₹12 కోట్లు లూటీ చేసిన న‌లుగురు నిందితుల‌ను బెంగ‌ళూరు సైబ‌ర్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. Axis బ్యాంకు రిలేష‌న్‌షిప్ మేనేజ‌ర్ వైభ‌వ్ పిథాడియా బ్యాంకు, ఇన్సూరెన్స్ ఏజెంట్ల‌తో క‌లిసి క్రెడెన్షియల్స్ మార్పు, త‌ప్పుడు ప‌త్రాల‌తో Dreamplug ఖాతాల యాక్సెస్ పొందారు. 37 లావాదేవీల ద్వారా ₹12.20 కోట్ల‌ను ఇత‌ర ఖాతాల‌కు మ‌ళ్లించారు.

News December 29, 2024

పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా?: హరీశ్ రావు

image

TGలో ఇటీవల పోలీసుల వరుస ఆత్మహత్య ఘటనలపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. పోలీసుల మరణ మృదంగంపై ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. పలు అంశాల్లో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వారిపై ప్రభావం చూపిస్తోందన్నారు. పోలీసులకు సూసైడ్ ఆలోచనలు రాకుండా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.

News December 29, 2024

ICC అవార్డు.. నామినేట్ అయింది వీరే!

image

ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కోసం ఐసీసీ నలుగురిని నామినేట్ చేసింది. అందులో భారత్ నుంచి అర్ష్‌దీప్ సింగ్, ఆస్ట్రేలియా నుంచి ట్రావిస్ హెడ్, పాకిస్థాన్ నుంచి బాబర్ ఆజమ్, జింబాబ్వే నుంచి సికందర్ రజాకు చోటు దక్కింది. ఈ నలుగురిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వారికి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వస్తుంది. ఓటు వేసేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News December 29, 2024

కొత్త ఆఫర్: రూ.277తో రీఛార్జ్ చేస్తే..

image

న్యూ ఇయర్ సందర్భంగా BSNL కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.277తో రీఛార్జ్ చేస్తే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 120GB హై-స్పీడ్ డేటా వస్తుంది. రోజుకు గరిష్ఠంగా 2GB వాడుకోవచ్చు. దీని వ్యాలిడిటీ 60 రోజులు ఉంటుంది. ఈ ఆఫర్ జనవరి 16, 2025 వరకే అందుబాటులో ఉంటుందని BSNL తెలిపింది. అయితే సిగ్నల్ సరిగా రావట్లేదని, నెట్ చాలా స్లో ఉంటోందని కస్టమర్లు BSNLపై ఫిర్యాదులు చేస్తున్నారు.

News December 29, 2024

ఇక పేర్ని నానికి అన్నీ నిద్రలేని రాత్రులే: మంత్రి

image

AP: పేర్ని నాని ఏ తప్పూ చేయకపోతే అజ్ఞాతానికి ఎందుకు వెళ్లారని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఆయనకు తెలియకుండా 7 వేల రేషన్ బియ్యం బస్తాలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. ప్రాథమిక విచారణ పూర్తి చేశామని, లోతైన దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఇక పేర్ని నానికి అన్నీ నిద్రలేని రాత్రులేనని, సూత్రధారి, పాత్రధారి అన్నీ ఆయనేనని విమర్శించారు. సానుభూతి కోసం భార్య పేరును వాడుకుంటున్నారని ఫైరయ్యారు.

News December 29, 2024

ఈ ఏడాది 2,34,158 కేసులు నమోదు: డీజీపీ

image

TG: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 2,34,158 కేసులు నమోదయ్యాయని డీజీపీ జితేందర్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 9.87% కేసులు పెరిగాయన్నారు. ఈ ఏడాది 1,942 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయన్నారు. 2024 వార్షిక క్రైమ్ రిపోర్టును ఆయన వెల్లడించారు. రూ.142.50 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్లు చెప్పారు. ఒకటి, రెండు ఘటనలు మినహా శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు.

News December 29, 2024

రైతు భరోసా అమలుపై భట్టి అధ్యక్షతన భేటీ

image

TG: రైతు భరోసా విధివిధానాల ఖరారుపై సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల ద్వారా అభిప్రాయ సేకరణ జరిగిన సంగతి తెలిసిందే. సాగు భూములకే భరోసా అందించాలనే అంశంపై కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. దీంతోపాటు ఎన్ని ఎకరాల లోపు వారికి ఇవ్వాలనే విషయమై ఖరారు చేయనుంది. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు సమాచారం.

News December 29, 2024

త్వరలో 32వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 32,438 గ్రూప్-డి పోస్టుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పాయింట్స్‌మెన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెనర్ వంటి పోస్టులు భర్తీ చేయనుంది. జనవరి 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం. పదోతరగతి, ఐటీఐ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. బేసిక్ సాలరీ రూ.18వేలు.

News December 29, 2024

H-1B వీసాలపై మౌనం వీడిన‌ ట్రంప్

image

రిప‌బ్లిక‌న్స్-ఎలాన్ మ‌స్క్ మ‌ధ్య H-1B వీసాల వివాదంపై ట్రంప్ మౌనం వీడారు. H-1B వీసాల జారీ గొప్ప కార్య‌క్ర‌మం అంటూ కొనియాడారు. గత త‌న హ‌యాంలో ప‌రిమితులు విధించినా తాజాగా స‌మ‌ర్థించారు. H-1B వీసాల కోసం యుద్ధం చేయడానికి సిద్ధమని మ‌స్క్ ప్ర‌క‌టించ‌డ‌ంపై రిప‌బ్లిక‌న్లు గుర్రుగా ఉన్నారు. MAGAలో భాగంగా స్థానికుల‌కు పెద్ద‌పీట వేయాల‌న్న రిప‌బ్లిక‌న్ల డిమాండ్‌పై ట్రంప్ స్పంద‌న కొత్త చ‌ర్చ‌కు దారితీసింది.

News December 29, 2024

‘ఆడబిడ్డలకే జన్మనిస్తావా?’.. భార్యకు నిప్పంటించిన భర్త

image

ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకెళ్తుంటే కొందరు తండ్రుల బుద్ధి మాత్రం మారట్లేదు. మగపిల్లలే కావాలంటూ భార్యను కడతేర్చుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మ‌హారాష్ట్ర‌లోని ప‌ర్భానీలో ఉత్త‌మ్ కాలే అనే వ్యక్తి ముగ్గురు ఆడపిల్లలకు జ‌న్మనిచ్చింద‌ని భార్య‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానికులు ర‌క్షించే ప్ర‌య‌త్నం చేసినా ఫలించలేదు. ఆమె సోద‌రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.