News December 29, 2024

AUSvsIND: భారత్ ఆలౌట్

image

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో భారత్ 369 పరుగులకు ఆలౌట్ అయింది. నిన్న రాత్రి సెంచరీతో నాటౌట్‌గా ఉన్న నితీశ్, వేగంగా పరుగులు చేసే క్రమంలో లయన్ బౌలింగ్‌లో 114 పరుగులకు ఔటయ్యారు. ఆస్ట్రేలియాకు 105 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయన్‌కు తలో 3 వికెట్లు దక్కాయి.

News December 29, 2024

వచ్చే నెల 20న దావోస్‌కు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ వచ్చే నెల 20న దావోస్‌కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ వార్షిక ఆర్థిక సదస్సులో ఆయన, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొంటారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడుల్ని తీసుకురావడమే ఈ పర్యటన లక్ష్యమని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు సదస్సులో ప్రత్యేకంగా ‘తెలంగాణ పెవిలియన్’ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి.

News December 29, 2024

పేర్ని నానిపై ఎటువంటి కక్ష లేదు: నాదెండ్ల

image

వైసీపీ నేత పేర్ని నానిపై తమకు ఎలాంటి కక్షా లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘కుట్రలు చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. తప్పు చేయకపోతే నాని జరిమానా ఎందుకు కట్టారు? ఆ గోడౌన్‌ను తన భార్య పేరుతో ఎందుకు తీసుకున్నారు? ఎవరి పేరిట ఉంటే వారిపైనే కేసులు నమోదవుతాయి. గిడ్డంగుల తనిఖీల అనంతరం నోటీసులిచ్చినా నాని ఎప్పుడూ స్పందించలేదు. YSRCP ఐదేళ్లపాటు అరాచకపాలన సాగించింది’ అని విమర్శించారు.

News December 29, 2024

పెళ్లిలో విందు బాలేదని గొడవ.. ఆ వెంటనే వరుడికి మరో పెళ్లి!

image

యూపీలోని చందౌలీ జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. మెహతాబ్ అనే వరుడికి 7నెలల క్రితం స్థానిక యువతితో పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లి రోజున అతడి కుటుంబీకులు విందు విషయంలో ఆడపెళ్లివారితో గొడవపడ్డారు. ఎంత నచ్చచెప్పినా వినకుండా పెళ్లి ఆపేశారు. ఆ రాత్రే మెహతాజ్ వేరే అమ్మాయిని రహస్యంగా పెళ్లాడాడు. దీంతో పెళ్లి రద్దుకోసం అతడి కుటుంబీకులు డ్రామా ఆడి తమను మోసం చేశారని ఆడపెళ్లివారు పోలీసుల్ని ఆశ్రయించారు.

News December 29, 2024

14,300 అడుగుల ఎత్తులో ఛత్రపతి శివాజీ విగ్రహం

image

భారత్-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సో సరస్సు తీరం వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ నెల 26న ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్, మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీ కమాండర్లు విగ్రహాన్ని ఆవిష్కరించారని ఆర్మీ పేర్కొంది. విగ్రహం బలగాల్లో స్ఫూర్తి నింపడంతో పాట భారత వీరత్వాన్ని ప్రత్యర్థులకు గుర్తుచేస్తుందని స్పష్టం చేసింది.

News December 29, 2024

మా ఫోన్ ఎత్తాలంటే డీజీపీ భయపడుతున్నారు: బొత్స

image

AP: DGP ద్వారకా తిరుమలరావు బలహీనంగా మారారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కడప పర్యటనలో భద్రతావైఫల్యానికి ఎవర్ని బాధ్యుల్ని చేస్తారు? ఈ ప్రభుత్వం ఏమైపోయింది? డీజీపీ మా ఫోన్ ఎత్తాలంటేనే భయపడుతున్నారు. మంత్రి కొండపల్లిపై వార్తలన్నీ తెలుగుదేశం సృష్టి. అభద్రతాభావంతోనే ఇలాంటి ప్రచారాలు చేసి కొండపల్లిని ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారు’ అని స్పష్టం చేశారు.

News December 29, 2024

పాక్ చేతిలో భారత టెస్టు ఛాంపియన్‌షిప్ భవిష్యత్తు

image

భారత్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ అర్హత ఇప్పుడు పాక్ చేతిలో ఉంది. PAKvsSA మ్యాచ్‌లో ఆఖరి ఇన్నింగ్స్‌లో 148 పరుగుల లక్ష్యంతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగింది. మూడోరోజు స్టంప్స్ సమయానికి ఆ జట్టు స్కోరు 27/3గా ఉంది. మిగిలిన 121 రన్స్ చేస్తే టెస్టు ఛాంపియన్ షిప్‌కి సౌతాఫ్రికా అర్హత సాధిస్తుంది. ఆస్ట్రేలియాకు ఇంకా 2 టెస్టులు శ్రీలంకతో ఉన్న నేపథ్యంలో సౌతాఫ్రికా ఓడితేనే భారత్‌కు ఫైనల్‌కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

News December 29, 2024

సీఎం రేవంత్‌కు హరీశ్ బహిరంగ లేఖ

image

TG: కంది రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు CM రేవంత్‌కి లేఖ రాశారు. ‘మేనిఫిస్టోలో, వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కందులకు మద్దతు ధరతో పాటు అదనంగా రూ.400 బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు వాటి ఊసు లేదు. రైతులు ప్రతి క్వింటాలు కందులకు రూ.800 నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసి, మద్దతుధరను రైతులకు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.

News December 29, 2024

నితీశ్ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి: గవాస్కర్

image

తాను ఎక్కడి నుంచి వచ్చానన్న సంగతిని నితీశ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలని క్రికెట్ దిగ్గజం గవాస్కర్ సూచించారు. ‘ఇది నితీశ్‌కు తొలి సెంచరీ. మున్ముందు ఇలాంటి మరెన్నో సాధిస్తారు. భారత క్రికెట్‌కు ఇప్పుడు అతనో స్టార్. కానీ ఎప్పుడూ క్రికెట్‌ను తేలిగ్గా తీసుకోకూడదు. కుటుంబం తన కోసం చేసిన త్యాగాలను మరచిపోకూడదు. మూలాల్ని మరచిపోకుండా ఉంటే అతడికి ఉజ్వలమైన కెరీర్ ముందుంది’ అని పేర్కొన్నారు.

News December 29, 2024

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి: మల్లు రవి

image

దివంగత మాజీ పీఎం మన్మోహన్ సింగ్‌కు భారత దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. ‘మన్మోహన్ మృతి మన దేశానికి తీరని లోటు. ఆయన సంస్కరణలే దేశాన్ని అభివృద్ధివైపు పరుగులు పెట్టించాయి. దేశం ఓ మహానేతను కోల్పోయింది. ఆయన సేవలకు ‘భారతరత్న’ ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.