India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆస్ట్రేలియన్లకు తెలుగోళ్లు కొరకరాని కొయ్యలుగా మారారు. కంగారూలపై అప్పట్లో జైసింహా, అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్.. ఇప్పుడు నితీశ్ కుమార్ రెడ్డి తమ సత్తా చూపించారు. ముఖ్యంగా మన లక్ష్మణుడు కంగారూల విజయాలకు లక్ష్మణరేఖలు గీస్తే.. తాజాగా నితీశ్ హీరో అయ్యారు. ఈ సీజన్ BGTలో భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసింది ఈ తెలుగు కుర్రాడే.

తెలంగాణలో రీఎంట్రీ ఇచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్తలు ప్రశాంత్ కిశోర్, రాబిన్ శర్మలు గ్రౌండ్ వర్క్ చేసి, చంద్రబాబు, లోకేశ్కు డిటెయిల్డ్ ప్లాన్ ఇచ్చినట్లు సమాచారం. తొలుత మహబూబ్నగర్ నుంచి పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ బాదిన తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఇలాంటి ప్రదర్శనలతో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాలని సీఎం ఆకాంక్షించారు. తన ఆటతో దేశ కీర్తి ప్రతిష్ఠలను మరింత పెంచాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఈ సారి సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. జనవరి 10న గేమ్ ఛేంజర్, 12న డాకు మహారాజ్, 14న సంక్రాంతికి వస్తున్నాం విడుదల కానున్నాయి. సంక్రాంతి విన్నర్స్గా పేరున్న బాలయ్య, వెంకీ మామతో పాటు ఈసారి రామ్ చరణ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మూడు సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి మీరు ఏ మూవీ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి?

బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. 8వ వికెట్కు నితీశ్-సుందర్ 127 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నితీశ్ సెంచరీ చేసిన తర్వాత వెలుతురు లేమితో ఆట నిలిచిపోగా ఇవాళ్టికి ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలి ఇన్నింగ్సులో AUS 474 పరుగులు చేయగా భారత్ 116 పరుగులు వెనుకబడి ఉంది. AUS బౌలర్లలో కమిన్స్, బోలాండ్ చెరో 3 వికెట్లు తీశారు.

మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని BJP నేత సుధాంశు త్రివేది ఆరోపించారు. బతికున్నప్పుడు వాళ్లెప్పుడూ ఆయన్ను గౌరవించలేదని విమర్శించారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు తగవు. మోదీ ప్రభుత్వం ప్రణబ్, మాలవీయ, PVని భారతరత్నతో గౌరవించింది. కాంగ్రెస్లో గాంధీ-నెహ్రూ కుటుంబీకులు కాకుండా పదేళ్లు ప్రధానిగా చేసింది మన్మోహన్ ఒక్కరే. పటేల్, శాస్త్రి, పీవీని వాళ్లు అవమానించారు’ అని వివరించారు.

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఆస్ట్రేలియాతో మ్యాచులో నితీశ్ పుష్ప తరహాలో సెలబ్రేషన్స్ ఉద్దేశించి ‘‘ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న ‘పుష్ప’ హీరో AAని వేధిస్తూ తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానంటే నమ్మేదెలా అబ్బా?’’ అని ట్వీట్ చేశారు. ఇటీవల TGలో జరిగిన పరిణామాలపైన ఆయన వ్యంగ్యంగా ఈ ట్వీట్ చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Way2News.. తొమ్మిదేళ్ల క్రితం వేల మంది యూజర్లతో ప్రారంభమై నేడు కోట్లాది తెలుగు వారికి చేరువైంది. ఉదయమే అందరికీ పలకరింపుగా, ప్రతి ఊరు తరఫున ప్రశ్నించే గొంతుగా మారడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ప్రజలకు వేగంగా, సులువుగా సమాచారం అందించాలనే మా ఆశయానికి మీ ఆశీర్వాదం తోడవడంతోనే ఈ విజయయాత్ర సాధ్యమైంది. మనమంతా వార్తా ప్రపంచంలో కొత్త గమ్యాలు చేరేందుకు ఇలాగే సహకరిస్తారని ఆశిస్తూ.. కృతజ్ఞతలు!
-Team Way2News

బొబ్బిలిరాజా సినిమాలో కొండ చిలువను పట్టుకునే సీన్ హాలీవుడ్ మూవీ నుంచి రిఫరెన్స్గా తీసుకున్నట్లు విక్టరీ వెంకటేశ్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బొబ్బిలి రాజాలో ఒకటి కాదు ఏకంగా వంద పాములతో కలిసి సీన్ చేసినట్లు వెల్లడించారు. అది గ్రాఫిక్స్ కాదని స్పష్టం చేశారు. మొదట ఆ సీన్ చేసేందుకు భయపడినా తర్వాత ధైర్యం తెచ్చుకొని చేసినట్లు పేర్కొన్నారు.

వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ నుంచి మాగ్నస్ కార్ల్సన్(నార్వే) నిష్క్రమించారు. జీన్స్ ధరించి గేమ్లో పాల్గొనగా FIDE నిబంధనలను ఉల్లంఘించారని ఆయనకు 200 డాలర్ల జరిమానా విధించింది. డ్రెస్ కోడ్ నిబంధనలు పాటిస్తేనే 9వ రౌండ్లో పాల్గొనే అవకాశముందని తేల్చి చెప్పింది. FIDE నిర్ణయంపై అసహనంతో టోర్నీ నుంచి నిష్క్రమించినట్లు కార్ల్సన్ తెలిపారు. తన ఫ్యాన్స్కు క్షమాపణలు చెప్పారు.
Sorry, no posts matched your criteria.