India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) కన్నుమూశారు. ఇవాళ సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు. అయితే కొద్దిసేపటికే మన్మోహన్ తుది శ్వాస విడిచినట్టు వారు ప్రకటించారు.

TG: కుటుంబంలో ఎంత మంది పేర్ల మీద భూమి ఉన్నా ఏడెకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో వరుసగా రెండేళ్లు ఫ్యామిలీలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తే భరోసా వర్తించదని తెలుస్తోంది. ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేసిన భూమికే లబ్ధి చేకూర్చనుంది. పంటలు సాగు చేశారో లేదో తెలుసుకునేందుకు శాటిలైట్ సర్వే నిర్వహించనుంది. ఈ మేరకు మార్గదర్శకాల రూపకల్పన దాదాపు పూర్తయింది.

AP: విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా రేపు వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద ర్యాలీలు నిర్వహిస్తారు. విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలను కలుపుకుని వైసీపీ ఈ కార్యక్రమం చేపట్టనుంది.

SBI 600 పీఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి అప్లికేషన్ విండో ఓపెన్ కానుంది. ఇది 16 జనవరి 2025 వరకు కొనసాగుతుంది. ఏదైనా డిగ్రీ పాసైనవారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.750 కాగా మిగతావారికి ఉచితం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చే ఏడాది మార్చి 8-15 వరకు జరగనుంది. మెయిన్స్ ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉంది.
వెబ్సైట్: <

TG: జనగణనలోనే కులగణన చేపట్టాలని సీఎం రేవంత్ అన్నారు. బెలగావిలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ‘త్వరలో దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. ఒకవేళ జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది నష్టపోతుంది. తక్కువ ఎంపీ సీట్లు వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

నిన్న కజకిస్థాన్లో ఘోర విమాన ప్రమాదానికి ముందు పైలట్ మాట్లాడిన మాటలు వెలుగులోకి వచ్చాయి. ఉ.8.16 గంటలకు ఫ్లైట్ను పక్షి ఢీకొట్టిందని పైలట్ రాడార్కు సమాచారమిచ్చాడు. అయితే విమానాన్ని ఎడమవైపు ఆర్బిట్లో నడపాలని చెప్పగా ‘నా కంట్రోల్లో ఏమీ లేదు’ అని పైలట్ సమాధానం ఇచ్చాడు. కొద్దిసేపటికే రాడార్తో సిగ్నల్స్ పూర్తిగా కట్ అయ్యాయి. ఆ తర్వాత అరగంటకే కజకిస్థాన్లోని ఆక్తావులో ఫ్లైట్ నేలను ఢీకొట్టింది.

వచ్చే నెల(JAN-2025)లో తెలంగాణ స్కూల్ విద్యార్థులకు 11 రోజులు సెలవులు ఉండనున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా JAN 1న, అలాగే 11 నుంచి 17 వరకు సంక్రాంతి హాలిడేస్. ఇవి 8 రోజులు కాగా మరో 3 ఆదివారాలు రానున్నాయి. దీంతో మొత్తం 31 రోజుల్లో 11 రోజులు విద్యార్థులు ఇంటి వద్దే ఉండనున్నారు. ఇక 2025 ఏడాదికి సంబంధించి ఇప్పటికే సెలవులను ప్రకటించిన ప్రభుత్వం 27 పబ్లిక్, 23 ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చింది.

భారతీయ సినీ ప్రపంచంలో 2024 పలు విషాదాలు నింపింది. DECలో తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్, దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్, ‘బలగం’ మొగిలయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. JUNEలో నిర్మాత, మీడియా మొఘల్ రామోజీరావు దివికేగారు. సంగీతకారుడు ఉస్తాద్ రషీద్ ఖాన్, గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్, నటులు రితురాజ్, డేనియల్ బాలాజీ, సూర్యకిరణ్, నటీమణులు సుహానీ భట్నాగర్, పవిత్రా జయరామ్, జానపద గాయని శారదా సిన్హా మరణించారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్లోని ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తన వివాహం గురించి హీరోయిన్ శృతి హాసన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆమె తన ప్రియుడు శాంతనుతో వివాహం చేసుకుంటారని వార్తలు రాగా దీనిని ఆమె ఖండించారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అడగటం ఇక ఆపేయండంటూ సూచించారు. ‘నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ రిలేషన్లో ఉండేందుకు ఇష్టపడతా. నాకు రొమాన్స్ అంటే ఇష్టం. ఒకరితో నన్ను నేను ఎక్కువగా అటాచ్ చేసుకోవాలంటే కొంచెం భయంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.
Sorry, no posts matched your criteria.