India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో AP, TGలో ఇవాళ భారీ వర్షాలు కురవనున్నాయి. ADB, ASF, మంచిర్యాల, PDPL, భూపాలపల్లి, ములుగు, RR, MBNR, NGKL, వనపర్తి, NRPT జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. అటు APలోని మన్యం, అల్లూరి, ELR, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, OGL, KNL, నంద్యాల, ATP జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
రైళ్లలో జనరల్ బోగీల్లో టికెట్ ధర తక్కువే అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యంతో టికెట్ లేకుండానే ప్రయాణిస్తుంటారు. అలాంటి వారు పట్టుబడితే రూ.250 వరకు జరిమానా ఉంటుంది. దాంతో పాటు అప్పటి వరకు ప్రయాణించిన దూరానికి ఛార్జీని కూడా చెల్లించాలి. చెల్లించకపోతే వారిని రైల్వే పోలీసులకు అప్పగించే హక్కు టీసీకి ఉంటుంది. ఇక ఈ తప్పును పదే పదే చేసేవారికి శిక్షల తీవ్రత కూడా అలాగే పెరుగుతుంటుంది.
AP: తనపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన <<14167036>>వ్యాఖ్యలు<<>> సరికాదని మాజీ MLA బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయన చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకి లేఖ రాసినట్లు తెలిపారు. దామచర్ల వ్యవహార శైలిపై పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వైసీపీలో ఇబ్బందుల కారణంగానే తాను జనసేనలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 26న జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు.
దసరా, దీపావళి పండుగలు వచ్చేస్తుండటంతో ఈ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తాయి. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు అధికారిక వెబ్సైట్లలోనే కొనుగోలు చేయాలి. మెసేజ్, ఈ-మెయిళ్లకు స్పందించకపోవడం ఉత్తమం. స్పందిస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బు మాయమయ్యే అవకాశం ఉంది. అన్ని పోర్టల్లకు ఒకే పాస్ వర్డ్ ఉపయోగించకూడదు. ఫ్రీ హాట్స్పాట్లు ఉపయోగించి షాపింగ్ చేయొద్దు. హ్యాకింగ్కు గురయ్యే అవకాశం ఉంది.
TG: కార్యకర్తలు, నాయకులకు అనునిత్యం అందుబాటులో ఉంటానని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% స్థానాలు గెలిచేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కులం, మతం పేరుతో ప్రధాని మోదీ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.
ఉత్తర కొరియాలో పరిస్థితుల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఇద్దరు మహిళల్ని ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉరి తీయించారు. వారిద్దరూ చైనాలో నివాసం ఉంటున్నారు. ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా పారిపోవాలనుకున్న వారికి ఆ ఇద్దరూ సాయం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో వారిని కిమ్ స్వదేశానికి రప్పించి, విచారణ చేయించి ఉరి శిక్ష అమలు చేయించారు. ఇలాంటి ఆరోపణలే ఉన్న మరో 9మందికి జీవిత ఖైదు విధించారు.
IPLలో MS ధోనీ మరిన్ని సీజన్లు ఆడాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన మాత్రం ఆ విషయాన్ని మిస్టరీగా ఉంచుతున్నారు. అయితే త్వరలోనే ఫ్యాన్స్కు గుడ్న్యూస్ వచ్చేలా ఉంది. ధోనీని CSK రిటెయిన్ చేసుకోనున్నట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. దీంతో వచ్చే సీజన్ కూడా ఆయన బరిలో దిగే అవకాశం ఉంది. ఇక ధోనీతో పాటు జడేజా, గైక్వాడ్, దూబే, పతిరణను CSK రిటెయిన్ చేసుకోనున్నట్లు సమాచారం.
భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్, ప్రముఖ స్టైలిస్ట్ శ్రావ్య వర్మను త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఈ జంట పెళ్లి షాపింగ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంకర్ అయిన శ్రీకాంత్ ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్లో 25వ స్థానంలో ఉన్నారు. ఇటు శ్రావ్య ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ బంధువని తెలుస్తోంది.
ఫ్రెంచ్ ఫ్రైస్కి వీలైనంత దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ధూమ, మద్యపానం కంటే ఇవి మరింత డేంజర్ అని తెలిపారు. ‘ఆలూ అనేదే కార్బోహైడ్రేట్లతో కూడుకున్నది. మధుమేహ బాధితులకు అనారోగ్యకరం. ఇక ఆ ఫ్రైస్ను వేపిన నూనెను అప్పటికే ఎన్నిసార్లు వేడి చేసి ఉంటారో లెక్క కూడా ఉండదు. ఆ నూనెతో ఫ్రైస్లో ట్రాన్స్ఫ్యాట్స్ తీవ్రంగా పెరుగుతాయి. ఇవి గుండెకు అత్యంత ప్రమాదకరం’ అని హెచ్చరించారు.
మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ రికార్డు దక్కడం పట్ల ఆయన మేనల్లుడు, నటుడు సాయి దుర్గ తేజ్ హర్షం వ్యక్తం చేశారు. తనకు ఊహ తెలిశాక తెలిసిన ఏకైక హీరో చిరంజీవి మాత్రమేనని ట్వీట్ చేశారు. ‘డాన్స్ అంటే చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే డాన్స్. ఆయన స్టెప్పులే నాకు తెలిసిన డాన్స్. ఆ నాట్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కడం అరుదైన ఘట్టం’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.