News December 20, 2024

‘భూ భారతి’ బిల్లు ఆమోదంపై రూపకర్త ఏమన్నారంటే?

image

TG: ‘భూ భారతి’ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంపై భూ చట్టాల నిపుణుడు, బిల్లు రూపకర్త భూమి సునీల్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చట్టం రూపొందించేందుకు ఆయన ఎంతలా శ్రమించారో Xలో రాసుకొచ్చారు. ‘ఓ సంవత్సర కష్టం. వందల గంటల మీటింగ్‌లు. వేల మంది అభిప్రాయాలు. 24 డ్రాఫ్ట్‌లు. భూభారతి (ఆర్.ఓ.ఆర్) చట్టం. ఈరోజు అసెంబ్లీ ఆమోదించింది’ అని పేర్కొన్నారు.

News December 20, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయంది.

News December 20, 2024

తాజ్‌మహల్‌కు తగ్గి, అయోధ్య రామాలయానికి పెరిగిన రద్దీ!

image

ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గినట్లు యూపీ పర్యాటకశాఖ తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు పర్యాటకులకు వచ్చేవారని, ఈ స్థానంలో అయోధ్య రామాలయం చేరిందని పేర్కొంది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్యకు 13.55 కోట్ల మంది వస్తే, తాజ్‌మహల్‌ చూసేందుకు 12.51 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు.

News December 20, 2024

ఫిజిక్స్ వాలా కంపెనీతో ఒప్పందం: లోకేశ్

image

APలో డీప్-టెక్‌ను అభివృద్ధి చేసేందుకు రెండు ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఫిజిక్స్ వాలా (PW) ఎడ్యుటెక్ కంపెనీ తన భాగస్వామి అమెజాన్ వెబ్‌తో కలిసి AI-ఫోకస్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్నొవేషన్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్‌తో మరో ఒప్పందం కుదిరిందని వెల్లడించారు.

News December 20, 2024

పాక్‌తో మెరుగైన బంధానికి ఓకే చెప్పా: యూనస్

image

పాకిస్థాన్‌తో సంబంధాల బలోపేతానికి అంగీక‌రించిన‌ట్టు బంగ్లా ప్ర‌భుత్వ చీఫ్ మ‌హ్మ‌ద్ యూన‌స్ వ్యాఖ్యానించారు. ఈజిప్ట్‌లో జ‌రిగిన ఓ కాన్ఫ‌రెన్స్ సంద‌ర్భంగా పాక్ PM షెహ‌బాజ్ ష‌రీఫ్‌ను యూన‌స్ క‌లిశారు. 1971 యుద్ధ త‌రువాత ఇస్లామాబాద్‌తో అప‌రిష్కృతంగా ఉన్న అంశాలను ప‌రిష్క‌రించుకోవాల‌ని యూనస్ కోరుకున్నారు. ద్వైపాక్షిక బంధాల మెరుగుకు ఇరు దేశాలు సంయుక్తంగా క‌ట్టుబ‌డి ఉన్నాయని ష‌రీఫ్ కూడా పేర్కొన్నారు.

News December 20, 2024

గూగుల్‌లో మళ్లీ లేఆఫ్స్

image

గూగుల్ ఉద్యోగుల మెడపై మరోసారి లేఆఫ్స్ కత్తి వేలాడుతోంది. 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తామని ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు, మేనేజ్‌మెంట్‌లో ఉన్నవారినీ తొలగిస్తామని చెప్పారు. వీరిలో కొందరిని వేరే బాధ్యతల్లోకి, మరికొందరిని పూర్తిగా తీసేయనున్నట్లు తెలుస్తోంది. ఓపెన్ ఏఐ వంటి సంస్థల నుంచి పోటీ నెలకొనడంతో గూగుల్‌తోపాటు మరికొన్ని కంపెనీలు లే ఆఫ్స్ బాటపడుతున్నాయి.

News December 20, 2024

బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’!

image

క్రికెట్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం సాధారణంగా బ్యాటింగ్ లేదా బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడికి ఇస్తారు. కానీ వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్ గస్ లోగీ ఆ రెండూ చేయకుండా ఫీల్డింగ్‌తో ఆ అవార్డు దక్కించుకున్న తొలి ఆటగాడిగా నిలిచారు. 1986లో పాక్‌తో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లో 3 అద్భుత క్యాచ్‌లు పట్టి 2 రనౌట్‌లు చేయడంతో ఆయనకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది.

News December 20, 2024

ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా

image

అనన్య నాగళ్ల, యువచంద్ర కృష్ణ మెయిన్ రోల్స్‌లో నటించిన ‘పొట్టేల్’ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలంగాణ గ్రామీణం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 25న పొట్టేల్ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.

News December 20, 2024

అరెస్టు నుంచి రిలీఫ్.. విచారణకు పిలిచే అవకాశం!

image

TG: ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌ను ఏసీబీ ఇవాళో, రేపో అరెస్ట్ చేస్తుందని జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనను 10 రోజులపాటు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు చెప్పింది. అదే సమయంలో విచారణ కొనసాగించొచ్చని పేర్కొంది. దీంతో ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ-కార్ రేసులో నిధుల దుర్వినియోగంపై ప్రశ్నల వర్షం కురిపించవచ్చు.

News December 20, 2024

8వ వేతన సంఘానికి బదులుగా కొత్త విధానం?

image

8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్రం స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం లేదు. అయితే, వేత‌న సవరణ విధానాన్ని మార్చాల‌ని యోచిస్తున్న‌ట్టు Financial Express నివేదిక తెలిపింది. ఉద్యోగుల‌ పనితీరు ఆధారంగా లేదా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వివిధ స్థాయుల్లో వేత‌న స‌వ‌ర‌ణ విధానాన్ని అమ‌లు చేయాల‌ని కేంద్రం భావిస్తున్న‌ట్టు వివ‌రించింది. 7వ వేత‌న సంఘం గ‌డువు ముగుస్తుండ‌డంతో త‌దుప‌రి కేంద్ర చ‌ర్య‌ల‌పై ఉత్కంఠ నెల‌కొంది.