India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు ఇండియా మార్కెట్లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఎప్పటిలాగే అమెరికాలో ఐఫోన్ ప్రారంభ ధరలు తెలుసుకునేందుకు చాలామంది వెతుకుతున్నారు. iPhone 16(ఇండియాలో రూ.79,900 – USలో రూ.66,700). iPhone 16 Plus (ఇండియాలో రూ.89,900 – USలో రూ.75,049). iPhone 16 Pro (ఇండియాలో రూ.1,34,900 – USలో రూ.83,397), iPhone 16 Pro Max (ఇండియాలో రూ.1,59,900 – USలో రూ.1,00,093).
AP: తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులతో సమీక్షిస్తున్నారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీటీడీ ఈవో శ్యామలారావు, ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. కల్తీ నెయ్యిపై ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై చర్చిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై అర్చకులు, పండితుల సూచనలను ఈవో సీఎం చంద్రబాబుకు వివరించారు.
అంతర్జాతీయ క్రికెట్లో గత ఏడాది నుంచి ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా శుభ్మన్ గిల్ నిలిచారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 76 ఇన్నింగ్స్లో 3,094 రన్స్ చేశారు. ఇందులో 10 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలున్నాయి. అతని తర్వాత వరుసగా కుశాల్ మెండిస్(2,851), రోహిత్ శర్మ(2,801), ట్రావిస్ హెడ్ (2,622), నిస్సాంక (2,398), డారెల్ మిచెల్(2,396), విరాట్ కోహ్లీ (2,367), శాంటో(2,280) ఉన్నారు.
జంతువులు, చేపల నుంచి వచ్చేది యానిమల్ ఫ్యాట్. నట్స్, సీడ్స్, అవకాడో, ఆలివ్, పొద్దుతిరుగుడు విత్తనాలు, సోయాబీన్, ఆవనూనె, పల్లీ నూనె నుంచి తీసేది ప్లాంట్ ఫ్యాట్. యానిమల్ ఫ్యాట్స్లో సంతృప్త కొవ్వులు, A,D,E,K విటమిన్స్, అధికంగా కొలెస్ట్రాల్ ఉంటాయి. ప్లాంట్ ఫ్యాట్స్లో అసంతృప్త కొవ్వులు, A,D,E,K ఉంటాయి. కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది. ప్లాంట్ ఫ్యాట్స్ తినేవారికి 16శాతం తక్కువగా గుండె సమస్యలు వస్తాయి.
క్యాన్సర్పై పోరాటంలో భాగంగా ఇండో-పసిఫిక్ దేశాలకు భారత్ తరఫున 40 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను అందిస్తామని PM మోదీ హామీ ఇచ్చారు. క్యాన్సర్ మూన్షాట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్లతోపాటు రేడియోథెరపీ, క్యాన్సర్ నిర్మూళనకు సామర్థ్యాల పెంపులో సాయం చేస్తామన్నారు. కోట్లాది ప్రజల జీవితాల్లో ఇది ఆశాకిరణంగా నిలుస్తుందని చెప్పారు. క్వాడ్ ప్రపంచ శ్రేయస్సు కోసం పనిచేస్తుందన్నారు.
ఆన్లైన్ పేమెంట్స్ రిసీవ్ చేసుకునేందుకు బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ స్మార్ట్ వాచ్లో క్యూఆర్ కోడ్ చూపించడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతుండగా, ఈయన మరీ అడ్వాన్స్డ్గా ఉన్నారంటూ నెటిజన్లు పలు రకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ‘ఇది యూపీఐ స్వాగ్. పేమెంట్స్ చేయడం చాలా ఈజీ’ అని Xలో పోస్ట్ చేశారు.
తిరుమల లడ్డూ కల్తీ అవడం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని ఆధ్యాత్మిక గురువులు సద్గురు, రవిశంకర్ అన్నారు. అందుకే దేవాలయాల నిర్వహణ బాధ్యతలను భక్తులకు అప్పగించాలని వ్యాఖ్యానించారు. భక్తి లేని చోట పవిత్రత ఉండదని సద్గురు పేర్కొన్నారు. ఆలయాల నిర్వహణ బాధ్యతలను వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలకు కాకుండా మత పెద్దలు, భక్తులకు అప్పగించాల్సిన టైమ్ వచ్చిందని రవి శంకర్ ట్వీట్ చేశారు.
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్టు 4వ రోజు ఆట మొదలైంది. 6 వికెట్లు చేతిలో ఉన్న బంగ్లా 357 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగింది. ప్రస్తుత స్కోర్ 187/4గా ఉంది. క్రీజులో శాంటో(61), షకీబ్ అల్ హసన్(21) ఉన్నారు. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 328 రన్స్ చేయాలి. భారత్ గెలవాలంటే బంగ్లాను ఆలౌట్ చేయాల్సి ఉంది. అటు ఇంకో రోజు ఆట మిగిలి ఉంది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.
డెలావేర్లో క్వాడ్ సమ్మిట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా MQ-9B ప్రిడేటర్ డ్రోన్ ఒప్పందం, కోల్కతాలో సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటుతో సహా పలు అంశాలపై నేతలు చర్చించారు. ఇరుదేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మెరుగుపరచడంపై, ఇండో-పసిఫిక్ ప్రాంతంతో సహా ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
TG: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై బస్సు క్లీనర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. APలోని సామర్లకోటకు చెందిన మహిళ(28) HYD కూకట్పల్లిలో నివాసముంటోంది. స్వగ్రామానికి వెళ్లేందుకు ఈ నెల 18న బస్ బుక్ చేసుకుంది. బస్సు రన్నింగ్లో ఉండగా క్లీనర్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.