India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. వారు పార్టీని వీడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే బాలినేని, ఉదయభాను వంటి నేతలు వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతకుముందు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావుతో పాటు పలువురు నేతలు ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే.
‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఈనెల 23 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే రోజు నుంచి పవన్ కళ్యాణ్ షూట్లో పాల్గొంటారని, హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ సమక్షంలో యాక్షన్ సీన్స్ షూట్ చేయనున్నట్లు తెలిపారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ మూవీలో కొంత భాగానికి క్రిష్ దర్శకత్వం వహించగా, మిగిలిన భాగానికి జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయనున్నారు.
బెంగాల్ కోర్టులను ఉద్దేశించి CBI చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మండిపడింది. 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండ కేసులను CBI విచారిస్తోంది. రాష్ట్రంలో సాక్షులను బెదిరించే ఆస్కారం ఉందంటూ కేసులను బదిలీ చేయాలని CBI పిటిషన్ వేసింది. అయితే ఇందులో బెంగాల్లోని కోర్టులు నిష్పక్షపాతంగా ఉండవంటూ రాసిన వ్యాఖ్యానాలపై కోర్టు మండిపడింది. దీన్ని సవరిస్తేనే కేసును విచారిస్తామంది.
TG: దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అలాగే లాభాల్లో కూడా వాటా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ‘మొత్తం 25 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షల చొప్పున ఇస్తున్నాం. ఇందుకోసం రూ.796 కోట్లు కేటాయించాం. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం. కార్మికులు, ఉద్యోగుల కళ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు.
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 308 పరుగులు ఆధిక్యంలో నిలిచింది. బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా 4 వికెట్లతో చెలరేగారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రీజులో రిషభ్ పంత్ (12), శుభ్మన్ గిల్ (33) ఉన్నారు.
AP: చదువుకున్న యువత పిల్లల్ని కనడంపై ఆసక్తి కనబర్చడం లేదని CM చంద్రబాబు అన్నారు. ‘కొన్ని దేశాలు జనాభా తగ్గి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతి మహిళా ఇద్దరు పిల్లల్ని కంటేనే జనాభా సమతుల్యత ఉంటుంది. APని గాడిలో పెడతానని నన్ను గెలిపించారు. మన GOVT కొనసాగి ఉంటే ఎంత అభివృద్ధి చెందేదో ఆలోచించండి? ఇంకో వ్యక్తి వచ్చి ఏదో చేస్తానంటే ప్రజలు మోసపోతున్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది’ అని అన్నారు.
AP: ప్రతి నెల ఒకటో తేదీన ‘పేదల సేవలో’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. ప్రకాశం(D) మద్దిరాలపాడులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో మాట్లాడారు. ‘MLAలు, కలెక్టర్లు, అధికారులు పేదల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకుని సాయం అందించాలి. ప్రస్తుతం ఏపీ వెంటిలేటర్పై ఉంది. 21 మంది MPలను గెలిపించడంతో ఢిల్లీలో మన పరపతి పెరిగింది. దీంతో APకి ఆక్సిజన్ తీసుకొస్తున్నాం’ అని తెలిపారు.
AP: నటి కాదంబరి జెత్వానీ కేసుకు సంబంధించి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఆయనను అదుపులోకి తీసుకుని రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. కాగా తనపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచి వేధించారని జెత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేశారు.
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో 6 పరుగులు చేసిన హిట్మ్యాన్ రెండో ఇన్నింగ్స్లో 5 రన్స్కే పెవిలియన్ చేరారు. తస్కిన్ అహ్మద్ బౌలింగ్లో జాకీర్ హసన్కు క్యాచ్ ఇచ్చి అందరినీ నిరాశ పరిచారు. కాగా చిన్న జట్టుపై తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో రోహిత్కు ఏమైందంటూ ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
దలాల్ స్ట్రీట్లో బుల్ రంకెలేసింది. గ్లోబల్ మార్కెట్స్లో పాజిటివ్ సెంటిమెంట్తో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. సెన్సెక్స్ 1,359 పాయింట్ల లాభంతో 84,544 వద్ద, నిఫ్టీ 375 పాయింట్ల లాభంతో 25,790 వద్ద స్థిరపడ్డాయి. దీంతో BSE నమోదిత సంస్థల ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లకు చేరింది. PSU రంగ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు లాభాలు గడించాయి.
Sorry, no posts matched your criteria.