India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతి లడ్డూ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ రాజకీయ విమర్శలతో ఆలయాలకు స్వేచ్ఛ అవసరమనే అభిప్రాయం భక్తుల్లో వ్యక్తం అవుతోంది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల నియంత్రణ నుంచి ఆలయాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని భక్తులు, నెటిజన్లు కోరుతున్నారు. కోట్ల మంది మనోభావాలు, నమ్మకం, విశ్వాసాలకు సంబంధించిన ఆలయాలకు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు?
అమెరికాలో ఓ కొత్త వైరస్ పిల్లలపై దాడి చేస్తోంది. శ్వాసకోసపై దాడి చేసి వారిలో పోలియో తరహాలో పక్షవాతాన్ని కలుగజేస్తోందని అక్కడి పరిశోధకులు తెలిపారు. చిన్నారుల్లో నరాల సంబంధిత సమస్యల్ని తీసుకొచ్చే ఎంటెరోవైరస్ డీ68 స్ట్రెయిన్ను దేశవ్యాప్తంగా మురుగునీటిలో గుర్తించినట్లు వెల్లడించారు. పిల్లల కాళ్లూచేతులు చచ్చుబడిపోతున్నాయని, ప్రస్తుతానికి దీనికి చికిత్స లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
AP: అర్హులకు పెన్షన్లు అందేలా చూసేందుకు త్వరలోనే సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సెర్ప్పై CM చంద్రబాబుతో సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడారు. ‘పెన్షన్లు అందని వారికి పెన్షన్లు ఇస్తాం. 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేసే అంశంపై చర్చించాం. 50-60 ఏళ్ల మధ్య ఉన్న వారు 15 లక్షల మంది ఉన్నారు. త్వరలోనే వారికి పెన్షన్లు ఇవ్వడంపై మార్గదర్శకాలు రూపొందిస్తాం’ అని మంత్రి చెప్పారు.
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా అరుదైన రికార్డు నెలకొల్పారు. ఒక్క టెస్టు కూడా ఆడకుండానే 100 వన్డేలు ఆడిన క్రికెటర్గా అరుదైన ఘనత సాధించారు. ఈ ఫీట్ సాధించిన తొలి ఆస్ట్రేలియన్ క్రికెటర్గా రికార్డులకెక్కారు. కాగా జంపా ఇప్పటివరకు 100 వన్డేల్లో 170 వికెట్లు, 92 టీ20ల్లో 111 వికెట్లు తీశారు. త్వరలో ఇంగ్లండ్తో జరగబోయే యాషెస్ సిరీస్కు ఆయన ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
బెటాలియన్ బ్లాక్ పేరిట రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లో కొత్త వేరియెంట్ను తీసుకొచ్చింది. గోల్డ్ పిన్ స్ట్రైపింగ్, బెంచ్ సీట్, పెద్ద సైజు నేమ్ బ్యాడ్జిలతో వింటేజ్ బుల్లెట్ను గుర్తుచేసేలా దీన్ని డిజైన్ చేసింది. 349సీసీ సింగిల్ సిలిండర్, 5 స్పీడ్ గేర్ బాక్స్, ముందు 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్, వెనుక వైపు 153 ఎంఎం డ్రమ్ బ్రేక్, సింగిల్ ఛానల్ ఏబీఎస్ అందిస్తోంది. ధర రూ.1.75 లక్షలు(ఢిల్లీ ఎక్స్ షోరూమ్).
బంగ్లాదేశ్తో టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అరుదైన ఘనత సాధించారు. కెరీర్లో తొలి 10 ఇన్నింగ్సుల్లోనే(స్వదేశంలో) 750కు పైగా రన్స్ చేసిన క్రికెటర్గా నిలిచారు. వెస్టిండీస్ ఆటగాడు జార్జ్ హీడ్లీ 1935లో 747 రన్స్ చేయగా తాజాగా జైస్వాల్ ఆ రికార్డును బద్దలుకొట్టారు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన తొలి ఆటగాడిగా అవతరించారు.
టీమ్ ఇండియా క్రికెటర్ శుభ్మన్ గిల్ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. ఒక క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు డకౌటైన ఆరో భారత ఆటగాడిగా గిల్ నిలిచారు. బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో గిల్ డకౌటైన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో మొహిందర్ అమర్నాథ్ (5) అగ్రస్థానంలో ఉన్నారు. విరాట్ కోహ్లీ, అలీఖాన్ పటౌడీ, దిలీప్ వెంగ్సర్కార్, వినోద్ కాంబ్లీ కూడా మూడేసి సార్లు డకౌట్ అయ్యారు.
AP: తిరుపతి లడ్డూ తయారీలో ఎద్దు కొవ్వు, చేప నూనె వాడారంటూ టీడీపీ శ్రేణులు పోస్ట్ చేస్తున్న <<14141948>>ల్యాబ్ రిపోర్టు<<>>పై వైసీపీ శ్రేణులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. నెయ్యి శాంపిల్ తీసుకున్నది జులై 17వ తేదీ అని, రిపోర్టు వచ్చింది జులై 24వ తేదీ అని దీని ప్రకారం లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ ఎవరి హయాంలో జరిగిందో చెప్పాలని సీఎం చంద్రబాబు, టీడీపీ శ్రేణులను ప్రశ్నిస్తున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ మూవీ రీ రిలీజ్కు సిద్ధమైంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 22న ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దశరథ్ తెరకెక్కించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. దిల్ రాజు నిర్మించారు. 2011లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.
TG: బీజేపీ ఎంపీ కంగన రనౌత్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దిగజారి మాట్లాడటం సరికాదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆమెను కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు. గతంలో సోనియా గురించి అసోం సీఎం అభ్యంతరకరంగా మాట్లాడితే కేసీఆర్ ఖండించారని కేటీఆర్ గుర్తు చేశారు. మహిళల పట్ల అగౌరవ వ్యాఖ్యలను పార్టీలు సమర్థించకూడదన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలని ఆయన కోరారు.
Sorry, no posts matched your criteria.