India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రేపటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై జుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ చేపట్టనుంది. అఫిడవిట్లు ఇచ్చిన ఇంజినీర్లు, అధికారులను విచారించనుంది. ఎవరిని విచారించాలనే అంశమై కమిషన్ ఛైర్మన్ పీసీ.ఘోష్ నిర్ణయం తీసుకోనున్నారు. గత నెలలో పలువురు అధికారులను ఆయన విచారించిన సంగతి తెలిసిందే.
తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ హీరోకు సింగర్ కెనీషాతో ఉన్న సంబంధమే దీనికి కారణమని టాక్. తరచూ గోవా వెళ్లే ఆయన అక్కడే ఓ బంగ్లాను కొనుగోలు చేసి గాయనితోనే ఉంటున్నారని సమాచారం. దీనిపై ఆర్తికి తెలిసినా సన్నిహితులు నచ్చజెప్పడంతో ఆమె తగ్గారని తెలుస్తోంది. సడన్గా ఆయన విడాకులు ప్రకటించడంతో ఆర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
NDA 3.0 ప్రభుత్వానికి రానున్న రోజులు కత్తిమీదసాములా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా జనగణన చేయాల్సి ఉంది. ఇప్పటికే ఆమోదించిన మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే 2026లోపు జనగణన పూర్తి చేయాలి. అనంతరం ఈ లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాల పెంపు, మహిళల సీట్ల రిజర్వ్ కోసం డీలిమిటేషన్ కమిషన్ వేయాలి. మరోవైపు జమిలి ఎన్నికల కోసం కీలక రాజ్యాంగ సవరణలను ఆమోదింపజేయాలి.
జమిలి ఎన్నికలపై రాంనాథ్ కోవింద్ ప్యానెల్ 62 పార్టీల అభిప్రాయాలను కోరగా 47 పార్టీలే స్పందించాయి. అందులో 32 అనుకూలంగా, 15 పార్టీలు వ్యతిరేకంగా స్పందించాయి. బీజేపీ, NPP, అన్నాడీఎంకే, అప్నాదళ్, అసోం గణ పరిషత్, బిజూ జనతాదళ్, శివసేన, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు మద్దతిచ్చాయి. కాంగ్రెస్, సమాజ్వాదీ, బీఎస్పీ, సీపీఎం, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వ్యతిరేకించాయి. టీడీపీ, వైసీపీ, BRS స్పందించలేదు.
US ఫెడ్ వడ్డీ రేట్ల కోతతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ప్రీ ఓపెన్ మార్కెట్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 419 పాయింట్లు, నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ఆరంభించాయి. ఎనర్జీ, మోటార్, ఫైనాన్స్ రంగ షేర్లు లాభాలతో ఓపెన్ అయ్యాయి. ఐటీ, స్టీల్ రంగ షేర్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78,690 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,086 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్లు చేకూరింది.
జమిలీ ఎన్నికల కోసం చేయాల్సిన రాజ్యాంగ సవరణలకు పార్లమెంటులో 2/3 వంతు సభ్యుల ఆమోదం అవసరం. NDAకి ప్రస్తుతం ఉన్న మద్దతు ఏ మాత్రం సరిపోదు. అదనంగా సభ్యుల మద్దతు కూడగడితే తప్పా ఈ సవరణలు ఆమోదం పొందే పరిస్థితి లేదు. లోక్సభలో NDAకు 293 మంది సభ్యుల బలం ఉంటే, సవరణల ఆమోదానికి 362 మంది మద్దతు అవసరం. ఇక రాజ్యసభలో 121 మంది బలం ఉంటే, అదనంగా 43 మంది సభ్యుల బలం అవసరం ఉంది.
లోక్సభ, రాజ్యసభ కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83, 83(2) *అసెంబ్లీల గడువు కుదింపునకు ఆర్టికల్ 172 (1) *రాష్ట్రపతి పాలనకు వీలుకల్పించే ఆర్టికల్ 356, ఎన్నికల కమిషన్ పరిధికి సంబంధించి ఆర్టికల్ 324 *లోక్సభ, అసెంబ్లీల ముందస్తు రద్దుకు రాష్ట్రపతి, గవర్నర్కు అధికారం కల్పించే ఆర్టికల్ 83(2), 172(1)ను సవరించాలి. ఈ సవరణలు ఆమోదం పొందితే తప్పా జమిలి ఎన్నికలు సాధ్యం కావు.
రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టుచేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడాన్ని KTR ఖండించారు. రుణమాఫీ హామీ నిలబెట్టుకోవాలని రైతులు ‘చలో ప్రజాభవన్’కు పిలుపునిస్తే వారిని అరెస్ట్ చేస్తున్నారన్నారు. ‘ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలి. ముఖ్యమంత్రికి రైతులంటే ఎందుకింత భయం? ఏ రాజకీయపార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదు’ అని ట్వీట్ చేశారు.
న్యూస్ పేపర్ కొనుగోలు కోసం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు ప్రతి నెలా ఇచ్చే రూ.200 భత్యాన్ని రద్దు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల ఏడాదికి రూ.102 కోట్ల నష్టం వాటిల్లిందని, దీనిపై కమిటీ వేసి పూర్తి వివరాలను సేకరించాలని CM చంద్రబాబు సూచించారు. మరోవైపు ‘సాక్షి’ పేపర్ కొనుగోలుతో రెండేళ్లలో రూ.205 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.