India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: జమిలి ఎన్నికల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేస్తారా అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. దీనిపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని ఆయన అన్నారు. ‘పార్టీ నేతలతో చర్చించాకే జమిలిపై తమ నిర్ణయం వెల్లడిస్తాం. రాష్ట్రంలో బలహీనవర్గాలను కాంగ్రెస్ దగా చేస్తోంది. బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి. రూ.25 నుంచి రూ.35 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
ఏర్పడి పదేళ్లే అయినా తెలంగాణ దేశంలోని ధనిక రాష్ట్రాల్లో 2వ స్థానం దక్కించుకుంది. ఇందులో సింహభాగం క్రెడిట్ హైదరాబాద్కు దక్కుతుంది. విభేదాలకు అతీతంగా ప్రజలందరూ సామరస్యంగా తమ పని తాము చేసుకుపోవడం, సాఫ్ట్వేర్ రంగంలో అద్భుత ప్రగతి, రాష్ట్రానికి వెల్లువెత్తుతున్న పెట్టుబడులు ఇవన్నీ ఈ కోటి రతనాల వీణను ధనిక రాష్ట్రంగా నిలబెట్టాయి. త్వరలోనే రెండు తెలుగురాష్ట్రాలు అగ్రస్థానానికి చేరాలని కోరుకుందాం.
AP: వెనుకబడిన వర్గాల వారికి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదలను ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. బీసీలు ఆర్థికంగా వెనుకబడి ఉండటానికి రాజకీయపరంగా వారికి తగిన అవకాశాలు లేకపోవడమేనన్న విషయాన్ని గుర్తిస్తూ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
TG: 2050 నర్సింగ్ ఆఫీసర్స్(స్టాఫ్ నర్స్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 17న CBT విధానంలో పరీక్ష జరుగుతుంది. ఎంపికైన వారికి రూ.36,750-1,06,990 పేస్కేల్ విధానంలో జీతం చెల్లిస్తారు. GNM లేదా బీఎస్సీ(నర్సింగ్) అర్హత ఉన్న 18 నుంచి 46 ఏళ్లలోపు వారు అర్హులు. పూర్తి నోటిఫికేషన్ కోసం ఇక్కడ <
AP: తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన <<14134836>>వ్యాఖ్యలు <<>>అత్యంత దుర్మార్గమని TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ‘కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసి చంద్రబాబు పెద్ద పాపమే చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా ఆయన వెనకాడరని మరోసారి నిరూపితమైంది. ఈ విషయంలో ఆ దేవదేవుని సాక్షిగా కుటుంబంతో కలిసి ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. చంద్రబాబు సిద్దమా?’ అని సవాల్ విసిరారు.
TG: బీఆర్ఎస్ హయాంలో సాధించిన విజయాలను కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఇలా గొప్పలు చెప్పుకుంటూ కాలం గడుపుతోందని ఆయన మండిపడ్డారు. ‘BRS హయాంలోనే MSMEల అభివృద్ధి జరిగింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇవి మూతపడ్డా, ఇక్కడ మాత్రం సగర్వంగా ఎదిగింది. ఎంఎస్ఎంఈ రంగంలో స్థిరమైన వృద్ధి సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది’ అని ఆయన పేర్కొన్నారు.
AP: ఉమ్మడి నెల్లూరు(D) YCP అధ్యక్షుడిగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని, పల్నాడు(D) అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని YCP నియమించింది. నెల్లూరు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకులుగా అనిల్ కుమార్ యాదవ్ను నియమించింది. ఇటు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో ప.గో(D) పాలకొల్లుకి చెందిన నేత మేకా శేషుబాబుని YCP సస్పెండ్ చేసింది.
భారత్లోని ధనిక, పేద రాష్ట్రాల జాబితాను ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి(PMEAC) తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం.. ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, హరియాణా, తమిళనాడు దేశంలో తొలి ఐదు ధనిక రాష్ట్రాలుగా నిలిచాయి. ఇక బిహార్, ఝార్ఖండ్, యూపీ, మణిపుర్, అస్సాం రాష్ట్రాలు తొలి ఐదు పేద రాష్ట్రాలుగా ఉన్నాయి. రాష్ట్రాల GDP ప్రామాణికంగా ఈ జాబితాను రూపొందించింది.
రామ్చరణ్ ‘గేమ్ఛేంజర్’ అప్డేట్స్ సరిగ్గా లేకపోవడం పట్ల మెగాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వారందరికీ ఆ సినిమా సంగీత దర్శకుడు తమన్ గుడ్ న్యూస్ చెప్పారు. ‘గేమ్ఛేంజర్ ఈవెంట్లకు వచ్చేవారం నుంచి అడ్డూఆపూ ఉండదు. డిసెంబరు 20న విడుదలయ్యే వరకు వెల్లువలా అప్డేట్స్ వస్తాయి’ అని ట్వీట్ చేశారు. దీంతో త్వరగా అప్డేట్స్ ఇస్తే బ్రేక్ ఇస్తామంటూ చరణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పట్ల సహచరులు అత్యంత గౌరవంగా వ్యవహరిస్తారని జట్టు కోచ్ గంభీర్ తెలిపారు. అతడి నాయకత్వంతో ఆ గౌరవాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ‘సిబ్బంది ఎంతమంది ఉన్నా జట్టు అనేది కెప్టెన్దే. అతడే ముందుండి నడిపించాలి. జట్టు సభ్యులందరితోనూ రోహిత్ బంధం బాగుంటుంది. నేను ఆడుతున్న రోజుల్లో మా ఇద్దరి మధ్య స్నేహం కూడా అద్భుతంగా ఉండేది. అతనో గొప్ప వ్యక్తి’ అని కొనియాడారు.
Sorry, no posts matched your criteria.