News December 13, 2024

రూట్ క్లియర్ చేస్తున్న పోలీసులు

image

మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్‌ను వైద్యపరీక్షల కోసం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారు. ఈమేరకు రూట్ క్లియర్ చేస్తున్నారు.

News December 13, 2024

బన్నీపై నేరం నిరూపణైతే పడే శిక్ష వివరాలు..

image

వ్యక్తి మృతికి కారకులపై BNS (105) సెక్షన్ నమోదు చేస్తారు. దీంతో 5సం.-10సం. శిక్ష పడుతుంది. BNS 118(1) సెక్షన్: ప్రమాదకర ఆయుధాలు, విషం, పేలుడు పదార్థాలతో తీవ్రగాయం చేసేందుకు యత్నించిన వారిపై నమోదు చేస్తారు. దీంతో మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20వేల జరిమానా పడొచ్చు. ఇక BNS section 3(5) ప్రకారం ఒక నేరాన్ని పలువురు వ్యక్తులు ఒకే ఉద్దేశంతో చేస్తే, అందులోని అందర్నీ సమానమైన శిక్షార్హులుగా పరిగణిస్తారు.

News December 13, 2024

కాసేపట్లో పోలీస్ స్టేషన్‌కు చిరంజీవి

image

చిక్కడపల్లి పీఎస్‌కు కాసేపట్లో చిరంజీవి చేరుకోనున్నారు. ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న ఆయన దాన్ని రద్దు చేసుకున్నారు. పీఎస్‌లో ఉన్న అల్లు అర్జున్‌తో మాట్లాడనున్నారు. కాగా ఇప్పటికే అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పీఎస్‌కు తరలించిన పోలీసులు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసుకున్నారు. మరోవైపు ఆయనను రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపట్లో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు.

News December 13, 2024

విజన్ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ ఒక చరిత్ర

image

AP: స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించడం చరిత్రాత్మకమని సీఎం చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే దీనిని రూపొందించామని చెప్పారు. ‘తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఉండాలి. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి. గత ప్రభుత్వంలో ఊహించని విధ్వంసం జరిగింది. ఇప్పుడు దానిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News December 13, 2024

అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్

image

జాతీయ అవార్డు గ్రహీత అల్లుఅర్జున్‌ను అరెస్ట్ చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ఠ అని కేటీఆర్ అన్నారు. ‘తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది. కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు? అల్లు అర్జున్‌ లాంటి వ్యక్తిని ఓ సాధారణ నేరస్థుడిగా భావించి ఇలా చేయొద్దు. ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం సరికాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. హైడ్రా వల్ల చనిపోయినవారి కేసులో రేవంత్‌నూ అరెస్ట్ చేయాలి’ అని ట్వీట్ చేశారు.

News December 13, 2024

హైకోర్టులో అల్లు అర్జున్ ఎమర్జెన్సీ పిటిషన్

image

అల్లు అర్జున్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఆయన లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టును కోరారు. ఈనెల 11నే పిటిషన్ వేశామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. క్వాష్ పిటిషన్ వేసినట్లు పోలీసులకు కూడా తెలిపినట్లు చెప్పారు. అయితే అత్యవసర పిటిషన్లు ఉ.10.30 గంటలకే జత చేయాలని, ఈ పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని పేర్కొంది. అయితే అప్పటివరకు అర్జున్‌పై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ఆయన లాయర్‌ కోరారు.

News December 13, 2024

భార్యకు ముద్దుపెట్టి బయల్దేరిన అల్లు అర్జున్

image

‘పుష్ప-2’ సినిమా విజయంతో సంతోషంతో ఉన్న అల్లు కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు ఇంటికి వచ్చి బన్నీని అదుపులోకి తీసుకోవడంతో ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. వ్యక్తి మరణానికి కారణమైనందుకు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదవడంతో భార్య స్నేహారెడ్డి భయాందోళనకు లోనయ్యారు. దీంతో ఏం టెన్షన్ పడొద్దంటూ బన్నీ ఆమె బుగ్గపై ముద్దు పెట్టి పోలీసులతో వెళ్లిపోయారు.

News December 13, 2024

అల్లు అర్జున్‌పై పెట్టిన కేసులు ఇవే..

image

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. ఆయనపై 2 సెక్షన్లలో కేసులు పెట్టారు. BNS 105 సెక్షన్ కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. 105 సెక్షన్ కింద ఆయనకు 5 నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. కాగా ప్రస్తుతం అర్జున్‌ను వైద్యపరీక్షల కోసం ఉస్మానియా తరలిస్తున్నారు.

News December 13, 2024

స్టాక్ మార్కెట్స్: -1000 నుంచి +400కు సెన్సెక్స్

image

స్టాక్‌మార్కెట్లు చుక్కలు చూపిస్తున్నాయి. అప్పటికప్పుడు పడిపోయి మళ్లీ పెరుగుతున్నాయి. సూచీల దిశ ఏంటో తెలియక ఇన్వెస్టర్లు ఆందోళన పడుతున్నారు. నిఫ్టీ 300 పాయింట్ల నష్టాన్ని పూడ్చుకొని 114 పాయింట్ల లాభంతో 24,662 వద్ద ట్రేడవుతోంది. -1000 పాయింట్ల నుంచి పుంజుకొన్న సెన్సెక్స్ 432 పాయింట్ల లాభంతో 81,719 వద్ద కొనసాగుతోంది. IT, FMCG స్టాక్స్ రికవరీకి సాయపడ్డాయి. AIRTEL, HCLTECH, ULTRATECH షేర్లు పెరిగాయి.

News December 13, 2024

టూరిస్ట్ డెస్టినేషన్‌గా ఏపీ: పవన్ కళ్యాణ్

image

AP: రాష్ట్రాన్ని టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారుస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబు లాంటి మహోన్నత వ్యక్తి సారథ్యంలో రాష్ట్రం దూసుకెళ్తుంది. గోవా వంటి ఫేమస్ టూరిస్ట్ స్పాట్‌లు నాశనమయ్యాయి. మన రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయాలి’ అని ఆయన పేర్కొన్నారు