India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టు ప్రదర్శనపరంగా, సిబ్బంది ఎంపిక పరంగా అస్థిరతకు మారుపేరుగా నిలుస్తోంది. వచ్చే సీజన్కు రికీ పాంటింగ్ను నియమించిన ఆ జట్టు గత 7 సీజన్లలో ఆరుగురు కోచ్లను మార్చింది. ఆ టీమ్ ప్రదర్శన చూస్తే.. ఐపీఎల్ చరిత్రలో కేవలం 2సార్లు మాత్రమే ప్లేఆఫ్స్కు వెళ్లింది. గత పదేళ్లలో అయితే ఒక్కసారీ ప్లేఆఫ్ గడప తొక్కలేదు. ఈ ఏడాది 9వ స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో రిటైర్మెంట్ అంటే జోక్గా మారిందని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. కొందరు ఆటకు వీడ్కోలు పలికి తిరిగి ఆడుతున్నారని చెప్పారు. అయితే భారత జట్టులో అలాంటిదేమీ లేదన్నారు. తన రిటైర్మెంట్ విషయంలో మాత్రం క్లారిటీగా ఉన్నానని తెలిపారు. T20Iలకు గుడ్ బై చెప్పిన విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.
భారత్లోని తమ ‘పుదుచ్ఛేరి’ ప్లాంట్లో ఏటా 50వేల ఏఐ ర్యాక్ సర్వర్లు, 2400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు(GPU) ఉత్పత్తి చేయనున్నట్లు లెనోవో ప్రకటించింది. ఈ ఉత్పత్తుల్ని భారత్లో అమ్మడంతో పాటు ఎగుమతులూ చేస్తామని వివరించింది. బెంగళూరులో ఓ ఏఐ కేంద్రీకృత ల్యాబ్ను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. యాపిల్, ఫాక్స్కాన్, డెల్ సంస్థల తరహాలోనే లెనోవో కూడా చైనాలో పెట్టుబడులు తగ్గించి భారత్లో పెంచుతోంది.
AP: ప్రత్యర్థుల దాడిలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కాశీవారిపాకలకు చెందిన పోలవరపు లోవలక్ష్మికి రూ.లక్ష, వాసంశెట్టి శ్రీలక్ష్మికి రూ.50 వేల సాయం అందించారు. ఇటీవల జగన్ పిఠాపురం పర్యటనకు వెళ్లగా, బాధితులు ఆయనకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి సాయం చేయడంతోపాటు లీగల్ టీమ్ కూడా ఏర్పాటు చేశారు.
తమ చిలుక సమాచారమిస్తే రూ.10వేలు రివార్డిస్తామంటూ అయోధ్యలో వెలిసిన పోస్టర్లు ఇంట్రెస్టింగా మారాయి. UP ఫైజాబాద్లోని శైలేశ్ కుమార్ ఈ ‘మిట్టూ’ చిలకను పెంచుకుంటున్నారు. 20 రోజుల క్రితం పొరపాటున పంజరం తెరవడంతో ఎగిరిపోయి ఇంటికి తిరిగి రాలేదన్నారు. తెలివైన, చక్కగా శిక్షణ పొందిన మిట్టూ మనుషుల గొంతును అనుకరించేదని, ఇంటికొచ్చిన గెస్టులను పేరుపెట్టి పిలిచేదన్నారు. దాని జాడ తెలీక వారి కుటుంబం వర్రీ అవుతోందట.
ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-4కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రుని ఉపరితలం నుంచి రాళ్లు, మట్టి తెచ్చేలా చంద్రయాన్-4కి ఇస్రో రూపకల్పన చేసింది. ఇటు గగన్యాన్, శుక్రయాన్ విస్తరణ ప్రాజెక్టులను క్యాబినెట్ ఆమోదించింది. గిరిజన గ్రామాల అభివృద్ధికి రూ.79,516 కోట్లు కేటాయించింది. పీఎం-ఆశా పథకానికి రూ.35 కోట్లు కేటాయింపు, ఎన్జీఎల్ఏ వాహననౌకకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
స్టాక్ మార్కెట్లు నేడు మోస్తరు నష్టాల్లో ముగిశాయి. వడ్డీరేట్ల కోతపై US ఫెడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. భయంతో ఐటీ షేర్లను తెగనమ్మడంతో బెంచ్మార్క్ సూచీలు కనిష్ఠ స్థాయులకు చేరాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు అండగా నిలవడంతో నష్టాల్ని తగ్గించుకున్నాయి. సెన్సెక్స్ 82,948 (-131), నిఫ్టీ 25,377 (-41) వద్ద క్లోజయ్యాయి. టాప్-5 లూజర్స్లో టెక్ షేర్లే ఉన్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా రిలీజ్కు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. తెలుగు సినిమా చరిత్రలో మొట్ట మొదటిసారిగా UKలో ‘డాల్బీ అట్మాస్’లో స్క్రీనింగ్ అవనుందని మేకర్స్ ప్రకటించారు. ఈనెల 26వ తేదీన యూకేలో ప్రీమియర్ షోలు ఉంటాయని తెలిపాయి. కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ ఓవర్సీస్ బుకింగ్స్లోనూ సంచలనాలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.
AP: నూతన మద్యం విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సగటు మద్యం ధర క్వార్టర్కు రూ.99 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అటు భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు మన్యం దొర అల్లూరి సీతారామరాజు పేరును పెట్టాలని నిర్ణయించారు.
AP: రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి, ఐదేళ్లలో ఐదు పూర్తి చేశామని మాజీ మంత్రి విడదల రజినీ తెలిపారు. రాత్రికి రాత్రే అన్ని కళాశాలలను కట్టలేమని ఆమె చెప్పారు. ‘వందేళ్లలో కేవలం 11 కాలేజీలే కట్టారు. అలాంటిది ఐదేళ్లలోనే ఐదు కట్టాం. మరో ఐదు కాలేజీలు నిర్మాణదశలో ఉన్నాయి. మిగతా కళాశాలలను కూడా కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలి. సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలి’ అని ఆమె పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.