News September 18, 2024

అమరావతి రైల్వే లైన్ భూముల సేకరణకు రూ.వెయ్యి కోట్లు?

image

AP: అమరావతి కొత్త రైల్వే లైన్ కోసం 510 ఎకరాల భూమి అవసరమని రైల్వే శాఖ గుర్తించింది. NTR జిల్లాలో 296, గుంటూరులో 155, ఖమ్మంలో 60 ఎకరాల చొప్పున కావాలని ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగానికి ప్రతిపాదనలు పంపింది. ఈ భూముల సేకరణకు రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ వ్యయాన్ని భరించేందుకు రైల్వే శాఖ అంగీకరించినట్లు, పాత అలైన్‌మెంట్ ప్రకారం ఎర్రుపాలెం నుంచి రైల్వే లైన్‌ను ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

News September 18, 2024

దివాలా దిశగా ‘టప్పర్‌వేర్’

image

ప్లాస్టిక్ బాక్సుల తయారీలో దిగ్గజ సంస్థ టప్పర్‌వేర్ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఈ వారంలోనే దివాలా ప్రకటన చేయనున్నట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. కంపెనీ షేర్లు తాజాగా 57 శాతం పడిపోయాయి. 2019లో 40 డాలర్లకుపైగా ఉన్న షేర్ విలువ ప్రస్తుతం 0.51 డాలర్లకు పడిపోయింది. $700 మిలియన్లకుపైగా ఉన్న అప్పులను చెల్లించడం సాధ్యం కావట్లేదు. దీంతో రుణదాతలతో చర్చించి దివాలా ప్రకటించడానికి సన్నాహాలు చేసుకుంటోంది.

News September 18, 2024

SECగా రాణి కుముదిని, విజిలెన్స్ కమిషనర్‌గా గోపాల్

image

TG: రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కమిషనర్‌గా రిటైర్డ్‌ IAS రాణి కుముదినిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రతిపాదనకు గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా విశ్రాంత IAS ఎంజీ గోపాల్‌ను నియమించింది. ఇద్దరూ మూడేళ్లపాటు పదవుల్లో కొనసాగనున్నారు. రాణి కుముదిని 1988 IAS బ్యాచ్ కాగా గోపాల్ 1983 IAS బ్యాచ్. వీరిద్దరూ కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో 30 ఏళ్లకుపైగా పనిచేశారు.

News September 18, 2024

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ భేటీ జరగనుంది. నూతన మద్యం పాలసీ, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపనుంది. పోలవరం, అమరావతికి కేంద్ర సహాయం, వరద నష్టం, పరిహారం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించనుంది. అలాగే కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో మంత్రుల గ్రాఫ్‌ను సీఎం వెల్లడించనున్నారు.

News September 18, 2024

మద్యం వ్యాపారం ప్రైవేటుకే అప్పగింత

image

AP: ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకే అప్పగించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. 3,396 షాపులను నోటిఫై చేయనుంది. గీత కార్మికుల కోసం 396 దుకాణాలను కేటాయిస్తారు. ఏ రాష్త్ర వ్యక్తయినా దరఖాస్తు చేసుకుంటే లాటరీ ద్వారా లైసెన్సులు ఇస్తారు. ఇవాళ క్యాబినెట్ భేటీలో చర్చించి, ఈ నెల 22, 23 తేదీల్లో కొత్త పాలసీపై ఉత్తర్వులిస్తారు. OCT4, 5 నాటికి కొత్త విధానం అమల్లోకి రానుంది.

News September 18, 2024

ట్రంప్‌నకు ఫోన్ చేసి పరామర్శించిన కమల

image

డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి <<14112153>>హత్యాయత్నం<<>> జరిగిన నేపథ్యంలో ఆయనకు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన క్షేమంగా ఉండటంపై సంతోషం వ్యక్తం చేసినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. ట్రంప్‌నకు సమీపంలో కాల్పుల ఘటనను ఆమె ఇప్పటికే ఖండించారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్, డెమొక్రాట్ పార్టీ నుంచి కమలా బరిలో దిగుతున్నారు.

News September 18, 2024

వంట నూనెల ధరలు పెంచొద్దన్న కేంద్రం

image

వంట నూనెల ధరలను పెంచొద్దని సంబంధిత సంస్థలను కేంద్రం ఆదేశించింది. తక్కువ సుంకానికి దిగుమతి చేసుకున్న వంట నూనెల స్టాక్ దాదాపు 30 లక్షల టన్నులు ఉందని తెలిపింది. ఇది 45-50 రోజులకు సరిపోతాయంది. కాగా అధిక దిగుమతులతో నూనె గింజల ధరలు దేశీయంగా పడిపోతుండటంతో కేంద్రం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. దీంతో ధరలు పెరుగుతాయన్న వాదనలు వినిపిస్తుండటంతో పరిశ్రమ వర్గాలతో కేంద్రం సమావేశమై సూచనలు చేసింది.

News September 18, 2024

Learning English: Synonyms

image

✒ Do: Execute, Enact, Finish
✒ Dull: Lifeless, Tedious, Tiresome
✒ Eager: Keen, Fervent, Involved
✒ End: Stop, Finish, Terminate
✒ Enjoy: Appreciate, Delight In,
✒ Explain: Clarify, Define, Interpret
✒ Fair: Impartial, Unbiased, Objective
✒ Fall: Drop, Plunge, Topple
✒ False: Fake, Fraudulent, Counterfeit

News September 18, 2024

కస్టమ్ డ్యూటీ తగ్గింపు.. భారీగా పెరిగిన గోల్డ్ దిగుమతులు

image

గోల్డ్‌పై కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 6 శాతానికి తగ్గించడంతో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. గత ఏడాది AUGలో $4.83 బిలియన్ల విలువైన పసిడిని భారత్ ఇంపోర్ట్ చేసుకోగా, ఈ ఏడాది ఆగస్టులో ఆ మొత్తం $10.6 బిలియన్లకు పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ భారీగా తగ్గినట్లు తెలిపింది. స్విట్జర్లాండ్ నుంచి 40%, UAE నుంచి 16%, దక్షిణాఫ్రికా నుంచి 10% దిగుమతులు ఉన్నాయి.

News September 18, 2024

వచ్చే ఏడాదిలోనూ ధోనీ IPL ఆడాలి: రైనా

image

భారత మాజీ కెప్టెన్ ధోనీ వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లోనూ ఆడాలని సురేశ్ రైనా అన్నారు. దేశమంతా మహీ ఆటను చూడాలనుకుంటోందని చెప్పారు. గత సీజన్‌లో ఆయన మెరుగైన ప్రదర్శన చేశారని చెప్పారు. ప్రతి ప్లేయర్, కోచ్‌లు మిస్టర్ కూల్ ఆటను మరికొంత కాలం చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నట్లు రైనా తెలిపారు.