News December 12, 2024

మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు

image

నటుడు మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. TV9 రిపోర్టర్‌పై దాడి చేసినందుకు నిన్న ఆయనపై బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద FIR నమోదు చేసిన పోలీసులు ఇవాళ దాన్ని మార్చారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని బీఎన్ఎస్ 109 సెక్షన్ కింద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. మరోవైపు ఘర్షణలో గాయపడ్డ మోహన్‌బాబు ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News December 12, 2024

ఈ నెల 19 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్

image

TG: ఈ నెల 19 నుంచి 29 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే పుస్తక ప్రదర్శనలో 350 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బుక్ ఫెయిర్‌లో తెలంగాణ వంటకాలతోపాటు ఇరానీ చాయ్, బిర్యానీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ ప్రదర్శనను సీఎం రేవంత్‌తోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని తెలిపారు.

News December 12, 2024

STOCK MARKETS: సానుకూల సంకేతాలే..

image

స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలై లాభాల బాటపట్టొచ్చని విశ్లేషకులు అంటున్నారు. EU, US సూచీలు నిన్న లాభపడ్డాయి. ఆసియా నుంచి నేడు సానుకూల సంకేతాలే అందుతున్నాయి. జపాన్, తైవాన్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం 14 పాయింట్లే పెరిగింది. ఫియర్ఇండెక్స్ INDIA VIX కూల్ ఆఫ్ అవుతుండటం సానుకూలం. STOCKS TO WATCH: NUVAMA WEALTH, GLAND PHARMA, RELIANCE POWER, VARROC ENGINEERING, IOB, VEDL

News December 12, 2024

తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి

image

TG: రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. మాజీ క్రికెటర్ వి.చాముండేశ్వరీనాథ్‌పై ఆయన 34 ఓట్ల తేడాతో నెగ్గారు. జితేందర్‌కు 43 ఓట్లు రాగా, చాముండికి 9 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాగా టీఓఏ కార్యదర్శిగా మల్లారెడ్డి, కోశాధికారిగా డి.సతీశ్ గౌడ్ ఎంపికయ్యారు. మరో 23 పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. త్వరలోనే జితేందర్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది.

News December 12, 2024

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫాం?

image

AP: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించనున్న సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి స్టూడెంట్స్‌కు కొత్త యూనిఫామ్ అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న యూనిఫామ్, బెల్టులు, బ్యాగ్‌ల రంగులను మారుస్తోంది. కొత్త యూనిఫామ్ నమూనా సోషల్ మీడియాలో వైరలవుతోంది.

News December 12, 2024

అర్ధరాత్రి అమిత్ షా, ఫడ్నవీస్ భేటీ

image

కేంద్రమంత్రి అమిత్ షాతో మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడణవీస్ బుధవారం అర్ధరాత్రి ఢిల్లీలో సమావేశం అయ్యారు. రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఎవరికి ఏ పదవి ఇవ్వాలి? అనే విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. CM పదవి ఇవ్వలేదని అలకబూనిన శిండే Dy.CMగా ఉండేందుకు ఇంకా అంగీకరించలేదని సమాచారం. దీంతో ఆయనను ఒప్పించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

News December 12, 2024

మీ వాట్సాప్ పనిచేస్తోందా?

image

నిన్న రాత్రి నుంచి ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. మెసేజ్‌లు వెళ్లడంలేదని యూజర్లు ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు. అలాగే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కూడా సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే సాంకేతిక కారణాలతోనే సమస్య ఏర్పడిందని, త్వరలోనే పరిష్కరిస్తామని ‘మెటా’ ప్రకటించింది. మరి మీ వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా పనిచేస్తున్నాయా?

News December 12, 2024

జమిలితో GDP పెరుగుతుంది: కోవింద్

image

దేశంలో జమిలి ఎన్నికలతో GDP 1%-1.5% పెరుగుతుందని ఈ ఎన్నికల కమిటీ ఛైర్మన్ రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారని తెలిపారు. జమిలి ఎన్నికలు అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీ అభిప్రాయమో కాదని దేశ ప్రజల కోరిక అని చెప్పారు. ఈ ఎన్నికల బిల్లు చట్టరూపం దాల్చితే దేశంలోని అన్ని అసెంబ్లీలు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికల నిర్వహించాలి. ఆపై 100రోజుల్లోనే మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలుంటాయి.

News December 12, 2024

షుగర్ పేషెంట్లలో తమిళనాడు టాప్

image

దేశంలో అత్యధిక మంది షుగర్ పేషెంట్లు తమిళనాడులో ఉన్నారని కేంద్రం తెలిపింది. అక్కడ 80.90 లక్షల మంది వ్యాధిబారిన పడినట్లు పేర్కొంది. ఈ జాబితాలో TG 4వ ప్లేస్‌లో ఉంది. రాష్ట్రంలో 24.52 లక్షల మంది డయాబెటిక్ బాధితులున్నారు. రెండో స్థానంలో MH(39.81 లక్షలు), మూడో ప్లేస్‌లో KA(28.74 లక్షలు) నిలిచాయి. ఇక APలో 20.92 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు. అత్యల్పంగా ఢిల్లీలో 1,108 మంది బాధితులే ఉండటం గమనార్హం.

News December 12, 2024

రాష్ట్రానికి తప్పిన ముప్పు

image

AP: రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పింది. ‘ఫెంగల్’తో ఇబ్బందులు పడిన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల వైపు వచ్చిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడి శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు వెళ్లి తీరం దాటుతుందని చెప్పింది. దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయంది.