India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: మంచు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ఎదుట విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున విచారణకు సమయం కావాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తితో కోర్టు ఏకీభవించింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. అటు ప్రతి రెండు గంటలకోసారి ఆయన ఇంటి వద్ద పరిస్థితిని సమీక్షించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.

మెదడులో కణితి పెరగడాన్ని బ్రెయిన్ ట్యూమర్గా వ్యవహరిస్తారు. ముందుగా గుర్తిస్తే దీని చికిత్స సాధ్యమే. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాల గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారంటే.. తరచూ తలపోటు, ఫిట్స్, చూపు మందగించడం, వికారం, వాంతులు, శరీరంలో సమన్వయ లోపం, జ్ఞాపకశక్తి తగ్గుదల, తరచూ కోపం రావడం, తడబాటు, బలహీనత, వినికిడి మందగించడం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే చెక్ చేయించుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు.

TG: మంచు మోహన్ బాబు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. తనను విచారణకు పిలుస్తూ రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే కోరుతూ ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ఈ పిటిషన్ను విచారిస్తున్నారు. దీంతో న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

BGTలో మూడో మ్యాచ్ బ్రిస్బేన్లో జరగనుంది. చివరిగా ఈ గ్రౌండ్లో ఆడినప్పుడు భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. పిచ్ వేగంగా ఉంటుందని దాని క్యూరేటర్ తాజాగా తెలిపారు. ‘ప్రత్యేకించి వేగవంతమైన పిచ్నేమీ మేం తయారుచేయలేదు. బౌన్స్ బాగుండేలా చూస్తున్నాం అంతే. సంప్రదాయంగా గబ్బా ఎప్పుడూ ఫాస్ట్ వికెట్టే’ అని వెల్లడించారు. గత మ్యాచ్లో ఆసీస్ గెలవడంతో BGTలో ఇరు జట్లూ సమానంగా ఉన్నాయి.

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుకు అవకాశం లేదన్న అరవింద్ <<14847113>>కేజ్రీవాల్<<>> ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గెలిచే రాష్ట్రాలనూ పోగొట్టుకొనే కాంగ్రెస్తో కలిస్తే ఓటమి తప్పదేమోనని ఆప్ భయపడుతోందని విశ్లేషకులు అంటున్నారు. మహారాష్ట్ర, హరియాణాల్లో ఘోర ఓటమి, JK, ఝార్ఖండ్లో ఆశించిన ప్రభావం చూపకపోవడంతో రాహుల్పై ఇండియా కూటమి నేతలు విశ్వాస రాహిత్యంతో ఉన్నారని చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు?

మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇలాంటి సమయంలో మంచు లక్ష్మి చేసిన ఇన్స్టా పోస్ట్ వైరలవుతోంది. ‘పీస్’ అంటూ ఆమె తన కూతురి వీడియోను షేర్ చేసింది. దీనికి మంచు మనోజ్ భార్య భూమా మౌనిక కూడా లైక్ చేయడం మరింత చర్చకు దారితీసింది. ఇంట్లో తండ్రి, అన్నదమ్ముల మధ్య ఇంత గొడవ జరుగుతున్నా దానిపై స్పందించట్లేదని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఢిల్లీ మాజీ Dy.CM మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. లిక్కర్ పాలసీ కేసులో Aug 9న ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సోమ, గురువారాల్లో విచారణాధికారి ముందు హాజరుకావాలని SC గతంలో ఆదేశించింది. అయితే ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇవ్వాలని సిసోడియా కోరగా సుప్రీంకోర్టు అంగీకరించింది. వారంలో 2 రోజులు హాజరవ్వాల్సిన అవసరం లేదని, ట్రయల్ సందర్భంగా కచ్చితంగా కోర్టుకు హాజరవ్వాలంది.

ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరింత దిగిపోయారు. టాప్30లో కూడా ఆయన నిలవలేకపోయారు. 5 స్థానాలు కోల్పోయి 31లో నిలిచారు. మరోవైపు కోహ్లీ కూడా 6 స్థానాలు దిగి 20వ ప్లేస్లో ఉన్నారు. ఇక హారీ బ్రూక్ అగ్ర స్థానానికి దూసుకొచ్చారు. జో రూట్ రెండో స్థానానికి పడిపోయారు. జైస్వాల్ మూడు, రిషభ్ పంత్ తొమ్మిది, శుభ్మన్ గిల్ పదిహేడో స్థానంలో కొనసాగుతున్నారు.

కోహ్లీ-అనుష్క దంపతులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో అకాయ్ కోహ్లీ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ పేరుకు అర్థమేంటంటూ నెటిజన్లు గూగుల్ని శోధించారు. ఈక్రమంలో 2024లో అత్యధికంగా అర్థం వెతికిన పదాల జాబితాలో అకాయ్ పేరు 2వ స్థానంలో నిలిచిందని గూగుల్ తెలిపింది. తొలిస్థానంలో ‘అన్ని కళ్లూ రఫా పైనే’ అన్న వాక్యం నిలిచింది. పుట్టిన తొలి ఏడాదే అకాయ్ రికార్డులు సృష్టిస్తున్నాడంటూ కోహ్లీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మెలోడియస్ సింగర్ శ్రేయా ఘోషల్ భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ్ గురించి చాలా మందికి తెలియదు. ఆయన రూ.వేల కోట్ల విలువైన స్మార్ట్ఫోన్ యాప్ ‘ట్రూకాలర్’ కంపెనీకి గ్లోబల్ హెడ్. ముంబై యూనివర్సిటీలో బీఈ(ఎలక్ట్రానిక్స్) పూర్తి చేసిన ఆయన పలు కంపెనీల్లో పనిచేసి 2022 నుంచి ట్రూకాలర్లో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నారు. కాగా, 12సార్లు నేషనల్ అవార్డు పొందిన శ్రేయా నికర ఆదాయం రూ.240 కోట్లు అని సినీ వర్గాలు తెలిపాయి.
Sorry, no posts matched your criteria.