News September 16, 2024

REWIND: ద్రవిడ్ చివరి ODI ఆడింది ఈరోజే

image

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తన చివరి ODI మ్యాచ్ ఆడి నేటికి 13 ఏళ్లు పూర్తవుతోంది. 2011లో ఇదేరోజున ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ఇండియా తరఫున ద్రవిడ్ తన చివరి వన్డే ఆడారు. ఆయన 15 ఏళ్ల ODI కెరీర్‌లో 344 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 12సెంచరీలు, 83 అర్ధసెంచరీలతో 10,889 రన్స్ చేశారు. కాగా, ఇదేరోజు ఇంగ్లిష్ గడ్డపై రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన తొలి సెంచరీ నమోదు చేశారు.

News September 16, 2024

ఆప్ కీల‌క స‌మావేశం ప్రారంభం

image

ఢిల్లీ త‌దుప‌రి ముఖ్య‌మంత్రిని ఎన్నుకోవ‌డానికి ఆప్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కేజ్రీవాల్ నివాసంలో స‌మావేశ‌మైంది. లిక్క‌ర్ పాల‌సీ కేసుల‌తో సంబంధంలేని అతిశీ, రాఘ‌వ్ చ‌ద్దా, సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్‌, కైలాశ్ గ‌హ్లోత్ CM రేసులో ముందున్నారు! ఈ స‌మావేశంలో తీసుకొనే నిర్ణ‌యంపై రేపు 11.30 గంట‌ల‌కు జ‌రిగే ఆప్ LP మీటింగ్‌లో చ‌ర్చించి శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ను ఎన్నుకోనున్నారు. అనంతరం కేజ్రీవాల్ రాజీనామా సమర్పించనున్నారు.

News September 16, 2024

రేపు, ఎల్లుండి వైన్స్ బంద్

image

TG: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి వైన్స్‌ మూతపడనున్నాయి. రేపు ఉ.6 గంటల నుంచి ఎల్లుండి సా.6 వరకు మద్యం వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని పోలీస్ కమిషనర్ CV ఆనంద్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక ఇవాళ రా.11 గంటల వరకే అవకాశం ఉండటంతో వైన్స్ రద్దీగా మారాయి.

News September 16, 2024

ఒక్క స్కూటీపై ఆరుగురు.. పిల్లల ప్రాణాలతో చెలగాటం!

image

వినాయక నిమజ్జనాలు చూపించేందుకు హైదరాబాద్‌లోని మొజాంజాహి మార్కెట్‌ వద్ద ఐదుగురు పిల్లలతో ఓ వ్యక్తి స్కూటీపై కనిపించారు. ఈక్రమంలో పిల్లల ప్రాణాలతో చెలగాటం అవసరమా? అని TGSRTC ఎండీ సజ్జనార్ ప్రశ్నించారు. ‘పిల్లలకు చిన్నతనం నుంచే ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించాల్సింది పోయి ప్రమాదకర రీతిలో వారిని ఇలా బైక్​పై తీసుకెళ్లడం బాధాకరం. చిన్న ప్రమాదం జరిగినా ప్రాణాలకే ముప్పనే విషయం తెలియదా?’ అని ఫైరయ్యారు.

News September 16, 2024

ఈ వైద్యులను అభినందించాల్సిందే!

image

ఒడిశాలోని కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లో వరదల్లోనూ ఇద్దరు వైద్యులు చూపిన ధైర్యసాహసాలను నెటిజన్లు అభినందిస్తున్నారు. బరియా గ్రామంలోని ప్రజలు కలుషిత నీటిని తాగడంతో అనారోగ్యానికి గురయ్యారు. ఇది తెలుసుకున్న వైద్యులు అనంత్ కుమార్ దార్లీ, సుజీత్ కుమార్ రోగుల ప్రాణాలు కాపాడేందుకు సాహసమే చేశారు. వీరిద్దరూ వరద నీటిలో ఈదుకుంటూ గ్రామానికి చేరుకొని రోగులకు చికిత్స అందించారు.

News September 16, 2024

చంద్రబాబు పేదల వ్యతిరేకి: జగన్

image

AP: ప్రభుత్వ స్కూళ్లలో CBSE సిలబస్ రద్దు చేయడం ఏంటని మాజీ CM జగన్ ప్రశ్నించారు. CM చంద్రబాబు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకున్నారని విమర్శించారు. ‘CBSE రద్దు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులపై చంద్రబాబు, లోకేశ్‌కు వివక్ష ఎందుకు? వాళ్లు ఎప్పటికీ అలాగే కిందిస్థాయిలో ఉండాలా? సీబీఎస్‌ఈని రద్దు చేయడం ఎంతవరకు సమంజసం?’ అని ఆయన ట్వీట్ చేశారు.

News September 16, 2024

బంగ్లాతో టెస్టు.. గెలిచేదెవరో?

image

బంగ్లాదేశ్‌తో ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగే తొలి టెస్టులో స్పిన్నర్లు అశ్విన్, జడేజా, కుల్దీప్ జట్టులో ఆడతారని పీటీఐ పేర్కొంది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో అక్షర్ పటేల్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు టెస్టుల సిరీస్‌లో గెలిచేదెవరో కామెంట్ చేయండి.

News September 16, 2024

రూ.100+ కోట్ల షేర్ కలెక్ట్ చేసిన హీరోలు

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అత్యధికంగా రూ.100+కోట్ల షేర్ కలెక్ట్ చేసిన సినిమాలు కలిగిన హీరోగా నిలిచారు. ఆయన నటించిన ఆరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.వంద కోట్లకు పైగా సాధించాయి. ఆయన తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు (5), చిరంజీవి(3), రామ్ చరణ్(2), అల్లు అర్జున్(2), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (1) ఉన్నారు. కాగా, రూ.50+ కోట్ల షేర్ కలెక్ట్ చేసిన సినిమాలు అత్యధికంగా మహేశ్ ఖాతాలో ఉన్నాయి.

News September 16, 2024

వరల్డ్ రిచెస్ట్ స్పోర్ట్స్ లీగ్ ఇదే!

image

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను దేశంలో అత్యంత ఖరీధైన స్పోర్ట్స్ ఈవెంట్‌గా పరిగణిస్తారు. అయితే, ప్రపంచంలోనే రిచెస్ట్ స్పోర్ట్స్ లీగ్ ఏంటో మీకు తెలుసా? నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL). దీని విలువ 18 బిలియన్ డాలర్లు. దీని తర్వాత మేజర్ లీగ్ బేస్‌బాల్ (MLB) 11.5 బిలియన్ డాలర్లు, నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (NBA), IPL-9 బిలియన్ డాలర్లు, ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (EPL), నేషనల్ హాకీ లీగ్ (NHL) ఉన్నాయి.

News September 16, 2024

ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఉహాగానాలు

image

ఫెడరల్ రిజర్వ్ (US Fed) వడ్డీ రేట్లను తగ్గించనుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. సెప్టెంబర్ 18న ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ఈ విషయంపై ప్రకటన చేయనున్నారు. ఆర్థిక మాంద్యం భ‌యాలు వీడ‌డం, ద్రవ్యోల్బణం తగ్గడంతో ఫెడ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడానికి సిద్ధమవుతున్న‌ట్టు మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల కొన్ని నెల‌ల ముందు ఫెడ్ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.