News September 16, 2024

స్టీల్ ప్లాంట్‌పై రాజకీయ సెగలు.. గతంలానే టీడీపీ కార్నర్!

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో బ్లాస్ట్ ఫర్నేస్-3ను నిలిపేయడం రాజకీయ చిచ్చుకి ఆజ్యం పోసింది. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కేంద్రం చూస్తోందని విపక్షాలంటున్నాయి. ప్లాంట్‌ను కాపాడలేకుంటే కేంద్రం నుంచి కూటమి బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో ప్రత్యేక హోదా విషయంలోనూ TDPని విపక్షాలు ఇలాగే కార్నర్ చేశాయి. ఏదేమైనా స్టీల్ ప్లాంట్‌‌కు వ్యతిరేకంగా తీసుకునే ఏ నిర్ణయమైనా APలో రాజకీయంగా పెను దుమారమే రేపనుంది.

News September 16, 2024

దేవరలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్?

image

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించినట్లు తెలుస్తోంది. సినిమాలో మూడో పాత్ర చుట్టే కథ తిరుగుతుందని సమాచారం. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఈ నెల 27న వరల్డ్ వైడ్‌గా మూవీ విడుదల కానుంది.

News September 16, 2024

ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్ ఇండియా

image

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సౌత్ కొరియాతో జరిగిన సెమీస్‌లో 4-1 ఆధిక్యంతో భారత్ జయభేరి మోగించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ రెండు గోల్స్ సాధించి టీమ్ ఇండియా విజయానికి బాటలు పరిచారు. జర్మన్ ప్రీత్, ఉత్తమ్ చెరో గోల్ సాధించారు. మరోవైపు ఇప్పటికే పాక్‌తో జరిగిన సెమీస్‌లో గెలిచి చైనా ఫైనల్‌కు చేరుకుంది. రేపు జరగబోయే ఫినాలేలో భారత్, చైనా తలపడనున్నాయి.

News September 16, 2024

అలాంటి సన్నాసులా మా గురించి మాట్లాడేది?: రేవంత్

image

TG: సెక్రటేరియట్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘కొందరు సన్నాసులు పదేపదే వారసత్వ రాజకీయాలపై మాట్లాడుతున్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరా గాంధీ ఎలాంటి పదవి చేపట్టలేదని వీళ్లకు తెలియదా? తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని మంత్రి పదవులు పొందినవాళ్లు గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తారా?’ అని రేవంత్ ప్రశ్నించారు.

News September 16, 2024

లండన్‌లో చదవాలంటే రూ.15 లక్షలు అకౌంట్‌లో ఉండాల్సిందే!

image

లండన్‌లో ఉన్నత చదువు చదవాలనుకునే విదేశీ విద్యార్థుల నెలవారీ ఖర్చులకు అవసరమయ్యే నిధుల పరిమితిని యూకే పెంచింది. లండన్‌లో చదవాలనుకునే వారు నెలకు రూ.1.63 లక్షలు (1,483 పౌండ్లు), లండన్ బయట చదవాలనుకునేవారు రూ.1.25 లక్షలు (1,136 పౌండ్లు) తమ అకౌంట్‌లో చూపించాలని స్పష్టం చేసింది. 9 నెలల కంటే ఎక్కువ కాలం చదివేవారు దాదాపు రూ.14.77 లక్షలు అకౌంట్లో ఉన్నట్లు వీసా చెకింగ్ సమయంలో చూపాలని పేర్కొంది.

News September 16, 2024

రాజీవ్ విగ్రహం కూల్చేస్తామనడం సిగ్గుచేటు: కోమటిరెడ్డి

image

TG: సెక్రటేరియట్ ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చేస్తామన్న KTRపై మంత్రి కోమటి రెడ్డి ఫైర్ అయ్యారు. ‘KTR మానసిక ఆరోగ్యంపై అనుమానాలున్నాయి. ఆయన వెంటనే డాక్టర్లతో చెక్ చేయించుకోవాలి. యువత ఓటుతోనే దేశం మలుపు తిరుగుతుందని భావించి, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన మహా నేత రాజీవ్ గాంధీ. ఆయన విగ్రహం కూల్చేస్తామనం సిగ్గుచేటు’ అని రాజీవ్ విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో మండిపడ్డారు.

News September 16, 2024

పిల్లలు స్కూల్‌కు వెళ్లనంటున్నారా? ఇలా చేయండి

image

* పిల్లల్ని మీరే స్కూల్‌‌కు, ఇంటికి తీసుకువెళ్లాలి.
* నచ్చిన స్నాక్స్‌ను లంచ్ బాక్స్‌లో పెట్టాలి. గిఫ్ట్స్ ఇవ్వాలి.
* తిడుతూ, కొడుతూ పంపవద్దు. ఇలా చేస్తే మరింత భయపడతారు.
* ఎందుకు వెళ్లనంటున్నారో కారణం అడగాలి. టీచర్లకు భయపడితే ఓసారి టీచర్లతో మాట్లాడి ఆ భయాన్ని పోగొట్టాలి.
* తెలిసిన/పక్కింటి వారు వెళ్తున్న స్కూళ్లలో చేర్పించాలి. ఫ్రెండ్స్ ఉంటే స్కూల్‌కు వెళ్లాలనే ఆసక్తి పెరుగుతుంది.

News September 16, 2024

RC16 లోడింగ్.. చరణ్ స్పెషల్ పోస్ట్

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించనున్న RC16 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చరణ్ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు. తాజాగా ‘బీస్ట్ మోడ్ ఆన్ RC16 లోడింగ్’ అని ఆయన ఇన్‌స్టాలో ఓ ఫొటోను పంచుకున్నారు. తన ఫిట్‌నెస్ కోచ్ శివోహంను ఫొటోకు ట్యాగ్ చేశారు. దీంతో సినిమా కోసం చెర్రీ మరోసారి తన బాడీని బీస్ట్‌గా మార్చేందుకు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది.

News September 16, 2024

కడుపు నిండా తింటున్నారా.. ఇది చదవండి

image

ఇష్టమైన ఫుడ్ ఉంటే సుష్ఠుగా లాగించేస్తుంటాం. కానీ అది మంచి పద్ధతి కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పొట్టను 80శాతం నింపి, 20 శాతం ఖాళీగా వదిలేయాలని పేర్కొంటున్నారు. దీని వలన అరుగుదల, ఆరోగ్యం బాగుంటాయని సూచిస్తున్నారు. పొట్ట పెరిగే సమస్య కూడా తగ్గుతుందంటున్నారు. జపనీయులు ఇదే విధానాన్ని అనుసరిస్తుంటారు. ఆకలి తీరడానికే తప్ప కడుపు పూర్తిగా నింపని ఈ ప్రక్రియను వారు ‘హర హచి బు’గా వ్యవహరిస్తారు.

News September 16, 2024

ITలో ప్రతి నలుగురిలో ఒకరు తెలుగువారే: చంద్రబాబు

image

AP: గతంలో ITని ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయని CM చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ప్రతి నలుగురు భారత IT నిపుణుల్లో ఒకరు తెలుగు వారు ఉన్నారని చెప్పారు. అహ్మదాబాద్‌లో జరిగిన రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌లో CM మాట్లాడారు. ‘ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ నడుస్తోంది. విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలు వచ్చాయి. APలో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.