India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలో తొలి వందే భారత్ మెట్రో రైలు(అహ్మదాబాద్-భుజ్)ను ప్రధాని మోదీ నేడు ప్రారంభిస్తారు. త్వరలోనే చెన్నై-తిరుపతి, సికింద్రాబాద్-విజయవాడ మధ్య ఈ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. 100 నుంచి 350KM దూరమున్న నగరాల మధ్య 100KM వేగంతో నడిచేలా ఈ AC రైళ్లు రూపొందించారు. రిజర్వేషన్ ఉండదు. నేరుగా టికెట్ తీసుకుని ఎక్కాలి. 16 కోచ్ల రైలులో 1150 మంది కూర్చొని, 2058 మంది నిలబడి ప్రయాణించవచ్చు.
భారీ డిస్కౌంట్లతో ఓనమ్, వినాయక చవితికి కార్లు, బైకులు, ఫ్రిజ్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సేల్స్ బాగా పెరిగాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. డిమాండ్ ఇలాగే ఉంటే దీపావళి నాటికి సేల్స్ మరింత పుంజుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో మారుతీ బుకింగ్స్ 10% పెరిగాయి. కేరళలో టూవీలర్ సేల్స్ నిరుటితో పోలిస్తే 8% పెరిగాయి. ఫ్రిజులు 15%, వాషింగ్ మెషీన్లు 13% ఎక్కువ సేల్ అయ్యాయి.
AP: టెట్ హాల్ టికెట్లు ఈనెల 22 నుంచి <
AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు కష్టాలు తప్పేలాలేవు. 4 నెలల ముందే రైళ్లలోని టికెట్లన్నీ అయిపోయాయి. గౌతమి, కోణార్క్, సింహపురి, గరీబ్రథ్, ఫలక్నుమా, గోదావరి, శబరి, LTT విశాఖ, ఈస్ట్కోస్ట్, చార్మినార్, వందేభారత్ రైళ్లలో జనవరి 10, 11, 12 తేదీల్లో వెయిటింగ్ లిస్టు వందల్లో ఉంది. ఆ పరిమితి కూడా దాటి రిగ్రెట్ కనిపిస్తోంది. ముందుగానే ప్రత్యేక రైళ్ల జాబితా విడుదల చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
TG: వైద్య, ఆరోగ్య విభాగంలో చేపట్టనున్న పలు కార్యక్రమాల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం ₹4,944కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని కేంద్రానికి పంపి నిధుల కోసం వరల్డ్ బ్యాంకు సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ట్రామాకేర్, డయాలసిస్, క్యాన్సర్ పరీక్షా కేంద్రాలు, డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి సారించింది.
టీమ్ ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. అలాంటి బౌలర్ తరానికొక్కరే వస్తారని, వారి గొప్పదనాన్ని అందరూ గుర్తించాలని అభిప్రాయపడ్డారు. ‘భారత్ ఎప్పుడూ బ్యాటర్లకే స్టార్ స్టేటస్ ఇస్తుంటుంది. అది ఎప్పటికీ మారదు. కానీ బౌలర్ అయిన బుమ్రాకు కూడా గౌరవం దక్కుతుండటం ఆనందంగా ఉంది. నా దృష్టిలో ప్రస్తుతం అతడే అత్యంత విలువైన భారత క్రికెటర్’ అని పేర్కొన్నారు.
GDPని లెక్కించేందుకు బేస్ఇయర్ కీలకం. 2011-12గా ఉన్న దీనిని 2023/24కు మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే వినియోగ సరళిలో మార్పులు, ఎకనామిక్ యాక్టివిటీ వేగం తెలుసుకొనేందుకు బ్లింకిట్, బిగ్బాస్కెట్ వంటి యాప్స్లో కొనుగోళ్లను పరిశీలించనుంది. ప్రస్తుతం ఒక కుటుంబానికి అవసరమైన గ్రాసరీస్లో 6% వీటి ద్వారానే కొంటున్నారని అంచనా. GST డేటానూ తీసుకుంటే GDP గణాంకాలు పక్కాగా ఉంటాయని కేంద్రం భావిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ అవినీతిపై చర్యలేవి అంటూ PM మోదీని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విటర్లో అడిగారు. ‘మీరు RR ట్యాక్స్ గురించి మాట్లాడి 4 నెలలు దాటింది. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడానికి ఏమైనా కారణం ఉందా? రాష్ట్రంలో కాంగ్రెస్ భారీ అవినీతి చేస్తుందని మీరు అంటారు. మీ సహచరులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రం నోరెత్తరు. వారు మీతో ఏకీభవించరా? లేక మీ విమర్శ ఎన్నికల స్టంటా?’ అని ప్రశ్నించారు.
AP: విజయవాడ సహా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కీలక సూచనలు చేసింది. ‘వరదలతో నీరు నిల్వ ఉండటం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి. కాచి, చల్లార్చి, వడపోసిన నీరే తాగాలి. కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లలో నీరు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు పారబోయాలి. అత్యవసరమైతే 108కి ఫోన్ చేయండి’ అని సూచించింది.
వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళనతో ముందు జాగ్రత్తగా 5 లీటర్ల క్యాన్లు, 5-6 ప్యాకెట్లను కొనుగోలు చేస్తున్నారు. సగటున అన్ని రకాల ఆయిల్స్ ధరలు లీటరుపై రూ.15-20 వరకు పెరిగాయి. ఇదే అదనుగా పలువురు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి మరింత ధరకు అమ్ముతున్నారు. ధరలు పెరుగుతాయనే భయంతో మీరూ ముందుగానే కొనుగోలు చేశారా?
Sorry, no posts matched your criteria.