News September 14, 2024

8,113 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

రైల్వేలో 8,113(గూడ్స్ ట్రైన్ మేనేజర్-3144, టికెట్ సూపర్ వైజర్-1736, టైపిస్ట్-1507, స్టేషన్ మాస్టర్-994, సీనియర్ క్లర్క్-732) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హతతో 18-36 ఏళ్లలోపు వారు SEP 14 నుంచి OCT 13 వరకు అప్లై చేయవచ్చు. OCT 16-25 మధ్య దరఖాస్తుల సవరణకు ఛాన్సుంది. SCRలో 478, ECoRలో 758 పోస్టులున్నాయి. ఫీజు: రూ.500(పరీక్షకు హాజరైతే రూ.400 రీఫండ్). వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 14, 2024

CSK తొలుత సెహ్వాగ్‌ను తీసుకోవాలనుకుంది: బద్రీనాథ్

image

IPL-2008 వేలంలో భారత క్రికెట్ దిగ్గజం ధోనీని కాకుండా వీరేంద్ర సెహ్వాగ్‌ను CSK తీసుకోవాలనుకుందని ఆ జట్టు మాజీ ప్లేయర్ బద్రీనాథ్ తెలిపారు. కానీ అప్పటికే సెహ్వాగ్ ఢిల్లీ నుంచి ఆఫర్ లెటర్ తీసుకున్నారని చెప్పారు. అలా అనుకోకుండా ధోనీ CSKలో అడుగుపెట్టారని పేర్కొన్నారు. ధోనీని జట్టులోకి తీసుకువచ్చేందుకు VB చంద్రశేఖర్‌దే కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నారు. IPL 2025లో ధోనీ ఆడేదీ లేనిదీ తెలియాల్సి ఉంది.

News September 14, 2024

స్పేస్ నుంచే ఓటు వేయనున్న వ్యోమగాములు

image

NASA వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ అంతరిక్షంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. FEB 2025లో వారు భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే NOV 5న జరిగే USAలో ఎన్నికల్లో వారు అక్కడి నుంచే ఓటు వేయనున్నారు. ఇందుకోసం NASA ఏర్పాట్లు చేసింది. ఇలా ఓటు వేయడం ఇది తొలిసారి కాదు. అంతరిక్షం నుంచి ఓటు వేయడానికి వీలు కల్పించే బిల్లును US ఆమోదించింది. 1997 నుంచి వ్యోమగాములు అక్కడి నుంచే ఓటేస్తున్నారు.

News September 14, 2024

NICకి ధరణి పోర్టల్ బాధ్యతలు?

image

TG: ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(NIC)కి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రైవేటు ఏజెన్సీ ఈ పోర్టల్‌ను నిర్వహించగా, దానికి సంబంధించిన గడువు ఈనెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన NICకి పోర్టల్ బాధ్యతలను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ధరణిలో ఉన్న అప్లికేషన్ ఫీజులను తగ్గించనున్నట్లు సమాచారం.

News September 14, 2024

రుచిగా ఉందని ఎక్కువగా లాగిస్తున్నారా?

image

ఆహారం తక్కువగా తీసుకుంటే పోషకాహారలోపం, ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఎప్పుడూ కంట్రోల్‌గా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా రుచిగా ఉందని ఎక్కువగా తింటే ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్‌తో పాటు గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అవసరమైన మోతాదులోనే కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న ఆహారాలను తినాలని, తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

News September 14, 2024

ఇవాళ భారత్ VS పాకిస్థాన్ మ్యాచ్

image

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్లు ఇవాళ తలపడనున్నాయి. వరుస విజయాలతో భారత్ ఇప్పటికే సెమీఫైనల్ చేరింది. ఇవాళ నామమాత్రపు మ్యాచ్ అయినా దాయాదుల పోరు కావడంతో హైవోల్టేజ్ ఉండటం పక్కా. మ.1.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. సోనీ స్పోర్ట్స్‌లో చూడొచ్చు.
☘ALL THE BEST INDIA

News September 14, 2024

వర్గీకరణ కమిటీలో అగ్రకులానికి ఛైర్మన్ పదవా?: ఎర్రోళ్ల

image

TG: SC వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అగ్రకులానికి చెందిన ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఛైర్మన్‌ను చేయడంపై BRS నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ‘ఇది మాదిగలను దగా చేయడమే. అగ్రకులం వ్యక్తితో మాదిగలకు ఏం న్యాయం జరుగుతుంది? SC వర్గాల ఆకాంక్షలు ఎలా నెరవేరుతాయి? ఆరుగురికి కమిటీలో చోటు కల్పిస్తే ఒక్కరు కూడా SC నాయకులు లేరు. ఈ కమిటీని వెంటనే రద్దు చేసి, కొత్తది నియమించాలి’ అని డిమాండ్ చేశారు.

News September 14, 2024

నేడు పరివర్తన ఏకాదశి.. అంటే ఏంటి?

image

మహా విష్ణువు ఏడాదిలో 4 నెలలు యోగనిద్రలో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కుడి లేదా ఎడమ వైపున మాత్రమే శయనిస్తారు. ఆషాఢ, శ్రావణ మాసాల్లో ఎడమవైపునకు నిద్రించే మహావిష్ణువు కుడివైపుకు తిరిగే కాలాన్నే పరివర్తన ఏకాదశి అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమించి భాద్రపదమాసంలో శుక్లపక్ష ఏకాదశినాడు పరివర్తన చెందుతారు. కార్తికమాసంలో శుక్ల ఏకాదశినాడు నిద్ర నుంచి మేల్కొంటారు.

News September 14, 2024

రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

image

AP: రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వానలు పడతాయని అంచనా వేసింది. కాగా నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. నెల్లూరు జిల్లా కావలి 38.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

News September 14, 2024

ఏపీలో ఆన్‌లైన్ విక్రయాల కోసం ప్రత్యేక యాప్

image

AP: రాష్ట్రంలో రైతులతో పాటు వివిధ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకురానుంది. ప్రొడక్ట్స్ అమ్మకం, కొనుగోలు కోసం ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ONDC) పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి పాలసీ తయారీ కోసం ఒక కమిటీని, పర్యవేక్షణ కోసం మరో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.