News December 9, 2024

రేపటి నుంచి సమ్మెలోకి సమగ్ర శిక్ష ఉద్యోగులు

image

TG: తమను రెగ్యులర్ చేస్తామని CM రేవంత్ ఇచ్చిన హామీ నెరవేరలేదని సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10నుంచి సమ్మెకు దిగుతున్నట్లు చెప్పారు. 20ఏళ్లుగా తక్కువ జీతాలకు పని చేస్తున్నామని, పెరిగిన నిత్యావసరాలకు అనుగుణంగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమ్మెతో కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, భవిత సెంటర్లలో బోధన నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు ఆందోళనలో ఉన్నారు.

News December 9, 2024

నేడు తెలంగాణ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

image

TG: ములుగు జిల్లా చల్పాక <<14757563>>ఎన్‌కౌంటర్‌<<>>కు నిరసనగా మావోయిస్టులు నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఆహారంలో విష ప్రయోగం చేసి కాల్చి చంపారని వారు ఆరోపించారు. మావోల బంద్ పిలుపు నేపథ్యంలో ఏజెన్సీలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. విద్యాలయాలు, వ్యాపార సంస్థలు బంద్‌ను పాటించాలని మావోయిస్టులు కోరుతూ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే.

News December 9, 2024

అందుబాటులోకి ‘మీ సేవ’ మొబైల్ యాప్‌

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘మీ సేవ’ మొబైల్ యాప్‌ను మంత్రి శ్రీధర్ బాబు లాంచ్ చేశారు. ఈ యాప్ ద్వారా ఇంటి నుంచే 150 రకాల సేవలు పొందవచ్చు. కులం, ఆదాయం, జనన ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. బిల్లుల చెల్లింపులు చేయవచ్చు. ఈ యాప్‌తో పాటు ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే టీ ఫైబర్ నెట్ సేవలనూ ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా పెద్దపల్లి, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో అమలు చేయనుంది.

News December 9, 2024

మంగళ, శనివారాల్లో సాగర్- శ్రీశైలం లాంచీలు

image

నాగార్జున‌సాగర్ నుంచి శ్రీశైలానికి ఇకపై వారానికి 2 రోజులు లాంచీలు నడవనున్నాయి. ఈ ఏడాది నవంబరులో లాంచీ ట్రిప్పులను ప్రారంభించి, వారానికి ఒక లాంచీ చొప్పున 800మందిని శ్రీశైలం తీసుకెళ్లినట్లు పర్యాటక శాఖ తెలిపింది. ఇక నుంచి మంగళ, శనివారాల్లో లాంచీలు నడుపుతామని పేర్కొంది. ఒకవైపు టికెట్ ధర పెద్దలకు రూ.2వేలు, పిల్లలు(12ఏళ్ల లోపు) రూ.1600, 2వైపులా రూ.3,000..రూ.2వేలుగా నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.

News December 9, 2024

గోకులం: ఉపాధి కూలీల వేతనాల వాటా పెంపు

image

AP: గోకులం కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ నిధులతో పశువుల కొట్టాలు, గొర్రెల షెడ్లను నిర్మిస్తున్నారు. వీటికి అందించే ఆర్థిక సాయంలో కొంత వాటా కూలీలకు వేతనాల రూపంలో చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పశువుల కొట్టాల నిర్మాణంలో పాల్గొనే కూలీలకు 46 పనిదినాలకు గాను అదనంగా రూ.13,371లు చెల్లించనుంది. అలాగే గొర్రెల షెడ్లకు 67 పని దినాలకు గాను రూ.20,205లు వారి ఖాతాల్లో జమ చేయనుంది.

News December 9, 2024

రేపటి నుంచి వర్షాలు.. 17న మరో ముప్పు

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 11నాటికి నైరుతి బంగాళాఖాతానికి చేరుకొని TN-శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపటి నుంచి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడతాయంది. ఈ నెల 17న అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.

News December 9, 2024

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు 69 ఏళ్లు పూర్తి

image

కోట్లాది తెలుగు ప్రజలకు జీవనాధారంగా మారిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు నేటితో 69 ఏళ్లు పూర్తి అయ్యాయి. 1955 డిసెంబర్ 10న అప్పటి ప్రధాని నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాతి జలాశయాల్లో ఒకటైన దీని విస్తీర్ణం 110చ.మైళ్లు కాగా, గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు. ప్రాజెక్ట్ కుడి కాలువను జవహర్ కాలువగా, ఎడమ దాన్ని లాల్ బహదూర్ కాలువగా పిలుస్తారు.

News December 9, 2024

అసెంబ్లీ సమావేశాలకు KCR వస్తారా?

image

TG: నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. కాగా, BRS అధినేత KCR సభకు వస్తారా? రారా? అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయన అసెంబ్లీకి రావాలని, ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇవ్వాలని CM పలుమార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. KCR సభకు వస్తారా? రారా? Comment చేయండి.

News December 9, 2024

నేడు, రేపు ‘కళా ఉత్సవ్’ రాష్ట్రస్థాయి పోటీలు

image

AP: విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేలా నేడు, రేపు రాష్ట్రస్థాయి ‘కళా ఉత్సవ్’ పోటీలు విజయవాడలో జరగనున్నాయి. మిమిక్రీ, ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్, ఓకల్ మ్యూజిక్, జానపద కీర్తనలు- నృత్యం, క్లాసికల్ డాన్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. 9, 10, ఇంటర్ విద్యార్థులు వ్యక్తిగత, గ్రూప్ విభాగాల్లో పాల్గొంటారు. సత్తా చాటిన వారిని జనవరి 2 నుంచి 7 వరకు భోపాల్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపుతారు.

News December 9, 2024

మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగింది?

image

మంచు కుటుంబంలో <<14827893>>విభేదాలు<<>> చర్చనీయాంశంగా మారాయి. మోహన్‌బాబు తన ముగ్గురు పిల్లలకు ఆస్తులు పంచేయగా, విద్యాసంస్థల్లో వాటాపై మనోజ్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ అంశంపైనే శనివారం రాత్రి డైలాగ్ కింగ్ నివాసంలో భేటీఅయ్యారు. గొడవ జరగడంతో మోహన్‌బాబు అనుచరుడు వినయ్ మనోజ్‌పై దాడి చేసినట్లు సమాచారం. దీంతో అతను ఫోన్ చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారని, తర్వాత కాంప్రమైజ్ అయినట్లు చెప్పడంతో వెళ్లిపోయారని టాక్.