India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు తమిళనాడు శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ ఓనర్ శ్రీనివాసన్ క్షమాపణలు చెబుతున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తిగతమైన వీడియో బయటికి వెళ్లడం బాధాకరమని పేర్కొన్నారు. శ్రీనివాసన్కు ఫోన్ చేసి మాట్లాడానని, తమిళనాడు వ్యాపార వర్గాల్లో ఆయన ఓ దిగ్గజమని ఈ సందర్భంగా అన్నామలై కొనియాడారు.
ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియాలో 315 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. సీనియర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, పర్సనల్ అసిస్టెంట్ విభాగాల్లో ఖాళీలున్నాయి. అభ్యర్థులు SEP 30వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. విద్యార్హత, వయో పరిమితి, జీతభత్యాల వివరాల కోసం ఈ <
21వ శతాబ్దంలో క్రికెట్లో ఎంతోమంది బౌలర్లు వచ్చారు, వెళ్లారు. మరి వీరందరిలో అత్యుత్తమ టెస్టు బౌలర్లు ఎవరు? దీనిపై నిపుణుల ప్యానెల్ సాయంతో క్రిక్ఇన్ఫో ఓ జాబితా తయారు చేసింది. డేల్ స్టెయిన్ అందులో అగ్రస్థానంలో నిలిచారు. తర్వాత వరసగా జేమ్స్ ఆండర్సన్, జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్, రబాడ, స్టువర్ట్ బ్రాడ్, ట్రెంట్ బౌల్ట్, వెర్నన్ ఫిలాండర్ ఉన్నారు. మరి మీ దృష్టిలో బెస్ట్ బౌలర్ ఎవరు? కామెంట్ చేయండి.
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ను<<14093820>> కేంద్రం శ్రీవిజయపురంగా మార్చిన<<>> సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ ప్రభుత్వం ఈ దీవుల్లో కాలనీలను ప్రారంభించాలని భావించింది. దానికోసం ఆర్చిబాల్డ్ బ్లెయిర్ అనే అధికారిని 1788లో తమ ప్రతినిధిగా నియమించింది. బ్రిటన్ సిబ్బంది, సేవకులతో కలిసి ఆయన ఇక్కడ నివసించేవారు. కాలక్రమంలో అతడి పేరునే రాజధానికి పోర్ట్ బ్లెయిర్గా పెట్టారు.
‘ప్రపంచ భయంకరమైన బాడీబిల్డర్’గా పేరొందిన ఇలియా గోలెం(36) హార్ట్ఎటాక్తో కన్నుమూశారు. ఈనెల 6న గుండెపోటుకు గురైన ఆయన చికిత్స పొందుతూ 11న ప్రాణాలు కోల్పోయారు. బెలారస్కు చెందిన ఈ బాడీబిల్డర్కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అభిమానులు అతడిని ‘ది మ్యుటాంట్’ అనే నిక్నేమ్తో పిలుచుకుంటారు. 154 కేజీల బరువున్న అతడి ఎత్తు 6.1 అడుగులు. చెస్ట్ 61 అంగుళాలు కాగా బైసెప్స్ 25 ఇంచులు ఉండటం విశేషం.
అండమాన్ దీవులకు మలయ్ జాతి ప్రజలు ఆ పేరును పెట్టినట్లు చరిత్రకారులు చెబుతారు. ఇండోనేషియాకు చెందిన మలయ్ జాతి ప్రజలు అండమాన్ గిరిజనుల్ని బంధించి బానిసలుగా విక్రయించేవారు. రామాయణంలోని హనుమాన్ పేరు మీదుగా దీవుల్ని మలయ్ ప్రజలు హండుమాన్గా పిలిచేవారు. కాలక్రమంలో అదే అండమాన్ అయిందని ఓ కథనం.
ఉల్లి ఎగుమతులపై పూర్తిగా ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ఏడాది మే నెలలో ఆనియన్ ఎక్స్పోర్ట్స్పై నిషేధం ఎత్తివేయగా, ఇవాళ మినిమం ఎక్స్పోర్ట్ ప్రైజ్(MEP)ను కూడా తొలగించింది. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో టన్ను ఉల్లి ధర కనీసం 550డాలర్లు(₹46,000)గా ఉంటేనే ఎగుమతికి అనుమతి ఉండేది. దీనిపై 40% సుంకం చెల్లించాల్సి వచ్చేది.
AP: ప్రభుత్వం మారినా కొందరు పోలీసుల తీరు మారడం లేదని జనసేన ట్వీట్ చేసింది. బాధితులకు రక్షణ కల్పించాల్సింది పోయి ఎదురు కేసులు పెడతామని బెదిరిస్తున్నారనే ఫిర్యాదులు జనవాణి కార్యక్రమంలో వస్తున్నాయంది. గత ప్రభుత్వంలో YCP నేతల దౌర్జన్యాలకు సహకరించిన పోలీసుల వల్ల నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారంది. ఇప్పటికీ కొందరు పోలీసులు అదే తీరును కొనసాగిస్తున్నట్లు వారు వాపోయారని తెలిపింది.
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి నేరుగా చెన్నై చేరుకున్నారు. అదే విమానంలో ప్రయాణించిన ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ ఆయనతో సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశారు. ‘కోట్లాది మనసులను గెలుచుకున్న వ్యక్తి కోహ్లీ. ఆట పట్ల నిబద్ధతతో ఆయన మనల్ని గర్వపడేలా చేస్తారు. విరాట్తో కలిసి ప్రయాణించడం ఆనందంగా ఉంది. సెల్ఫీ ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.
AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది ఆగ్నేయ బంగ్లాదేశ్ సమీపంలో కేంద్రీకృతమైందని, క్రమంగా బలపడుతోందని తెలిపింది. రేపటికి వాయుగుండంగా మారనుందని పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు పడతాయని ప్రకటించింది. కాగా ఇవాళ విశాఖలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వాన కురుస్తోంది.
Sorry, no posts matched your criteria.