India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: మంత్రి కొల్లు రవీంద్ర పాస్పోర్టును పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 20న మంత్రి విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉండటంతో పాస్పోర్ట్ పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. కాగా ఆయనపై క్రిమినల్ కేసులు ఉండటంతో పాస్పోర్ట్ అధికారులు క్లియరెన్స్ నిరాకరించారు. క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయనే కారణంతో పాస్పోర్ట్ తిరస్కరించొద్దని సుప్రీం, హైకోర్టులు తీర్పులిచ్చాయని రవీంద్ర లాయర్ వాదించారు.
AP: గుంటూరు జిల్లా వ్యాప్తంగా రేపు స్కూళ్లు యథావిధిగా పనిచేస్తాయని DEO శైలజా ఆదేశాలు జారీ చేశారు. 2వ శనివారమైనా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వర్కింగ్డేగా ప్రకటించారు. ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో రేపు వర్కింగ్ డేగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవు రద్దు చేయడంపై కలెక్టర్లు నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగనున్న రంజీ ట్రోఫీతో ఆయన పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. ఇటీవల నెట్స్లో రెడ్ బాల్తో బౌలింగ్ చేస్తున్న ఫొటోలు హార్దిక్ షేర్ చేశారు. దీంతో ఆయన భారత టెస్ట్ జట్టులోకి త్వరలోనే ఎంట్రీ ఇస్తారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గాయాల కారణంగా ఆరేళ్లుగా ఈ ఫార్మాట్కు పాండ్య దూరంగా ఉంటున్నారు.
కమర్షియల్ రియల్ ఎస్టేట్ (CRE) ప్రాజెక్టులకు బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇవ్వడం ఆందోళనకరమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. షార్ట్ సెల్లర్లకు ఇది లక్ష్యంగా మారొచ్చని హెచ్చరించారు. ‘లోన్బుక్స్లో అధిక CRE రేషియో వల్ల అంచనా వేయగలిగే, వేయలేని CRE నష్టాలతో బ్యాంకులకు ఇబ్బందే. వీటితో లిక్విడిటీ ఆగిపోతే షార్ట్ సెల్లర్లు టార్గెట్ చేస్తారు. దాంతో ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ మరింత తగ్గుతుంది’ అని అన్నారు.
మర్డర్ కేసులో ఇరుక్కున్న హీరో, అతని ఫ్రెండ్ ఎలా దాని నుంచి బయటపడ్డారనేదే స్టోరీ. తన కామెడీ టైమింగ్తో సత్య ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాడు. స్క్రీన్ ప్లే, BGM ఆకట్టుకుంటుంది. శ్రీసింహా నటన, వెన్నెల కిశోర్, సునీల్ పాత్రలు ప్లస్ పాయింట్లు. సాగదీత సీన్లు, రొటీన్ అంశాలు మైనస్. డైరెక్టర్ కామెడీపై పెట్టిన ఫోకస్ ఇంకాస్త స్టోరీపై పెట్టుంటే బాగుండేది. కామెడీని ఇష్టపడే వారికి నచ్చుతుంది. రేటింగ్ 2.5/5.
బంగ్లాదేశ్తో ఈనెల 19 నుంచి చెన్నైలో జరిగే తొలి టెస్టు కోసం భారత జట్టు ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. కోచ్ గౌతమ్, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు సభ్యులతో మాట్లాడుతున్న ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది. కొత్త బౌలింగ్ కోచ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నే మోర్కెల్ కూడా జట్టులో చేరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఈనెల 19-23 వరకు తొలి టెస్ట్, ఈనెల 27 నుంచి అక్టోబర్ 1 వరకు రెండో టెస్ట్ జరగనుంది.
AP: TDP ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో YCP నేతలు జోగి రమేశ్, దేవినేని అవినాశ్కు సుప్రీంకోర్టు స్వల్ప ఊరట కల్పించింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. సాంకేతిక కారణాలతో ఇవాళ పూర్తి స్థాయి విచారణ చేపట్టలేకపోతున్నామంది. నిందితులు 24 గంటల్లో పాస్ పోర్టులు అప్పగించాలని, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలంది. కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు సుప్రీంను ఆశ్రయించారు.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి రూ.1300 పెరిగి రూ.74,450కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రూ.1200 పెరిగి రూ.68,250 పలుకుతోంది. ఇక వెండి ధర ఏకంగా కేజీ రూ.3,500 పెరిగి రూ.95వేలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని చోట్ల దాదాపు ఇవే ధరలున్నాయి.
కెనడాలోని భారత హైకమిషన్పై ఖలిస్థానీ సపోర్టర్ల బాంబు దాడి కేసులో NIA పంజాబ్లో సోదాలు చేపట్టింది. ఉదయం నుంచే అధికారులు కొందరి ఇళ్లు, కార్యాలయాల్లో రైడ్స్ చేస్తున్నారని తెలిసింది. 2023, మార్చి 23న ఒట్టావాలో హై కమిషన్ ముందు దేశవ్యతిరేక నినాదాలు చేసిన ఖలిస్థానీలు త్రివర్ణ పతాకాలు తొలగించి తమ జెండాలు పాతారు. భవంతిలోకి 2 గ్రెనేడ్లు విసిరారు. దీనిపై నిరుడు జూన్లో NIA కేసు నమోదు చేసింది.
TG: భుజం గాయంతో బాధపడుతున్న మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనతో పాటు పోలీసులు ఆస్పత్రికి వచ్చారు. నిన్న అరెస్ట్, ఆందోళనల సమయంలో ఆయన భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఆస్పత్రికి వెళ్లేందుకు మాత్రమే పోలీసులు తాజాగా ఆయనకు అనుమతినిచ్చారు.
Sorry, no posts matched your criteria.