News May 8, 2025

ఫేస్ టేపింగ్ చేస్తున్నారా?

image

ముఖంపై ముడతలు తగ్గాలని చాలామంది ఫేస్ టేపింగ్ టెక్నిక్ వాడతారు. ముడతలు ఉన్న ప్రాంతాల్లో టేపులను వేసి, రాత్రంతా ఉంచుతారు. దీనివల్ల తాత్కాలిక ప్రయోజనమే ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ ఫేస్ టేపింగ్ ఎక్కువగా వాడితే ముఖంపై ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇలా కాకుండా స్కిన్ కేర్‌పై దృష్టి పెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటేనే చర్మం అందంగా, యవ్వనంగా మెరిసిపోతుందని సూచిస్తున్నారు.

News May 8, 2025

టెన్త్ షార్ట్ మెమోలు విడుదల

image

AP: టెన్త్ పాసైన విద్యార్థుల షార్ట్ మెమోలు(సబ్జెక్టుల వారీగా మార్కుల లిస్టు) విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వాటిని స్కూల్ లాగిన్ నుంచి HMలు డౌన్‌లోడ్ చేసుకుని, సైన్ చేసి స్టూడెంట్లకు అందజేయాలన్నారు. మెమోలలో ఏవైనా తప్పులుంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. స్కూల్ అడ్మిషన్ రికార్డ్‌తోపాటు HM అటెస్ట్ చేసిన షార్ట్ మెమో కాపీలను ఈ నెల 25లోగా తమకు పంపాలని కోరారు.

News May 8, 2025

అతిథి దేవోభవ .. లద్దాక్ సేవాస్ఫూర్తి!

image

‘ఆపరేషన్ సిందూర్’ కారణంగా పలు చోట్ల విమాన రాకపోకలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆల్ లద్దాక్ హోటల్ అండ్ గెస్ట్ హౌస్ అసోసియేషన్(ALHAGHA) తన ఆతిథ్య స్ఫూర్తిని చాటుకుంది. లద్దాక్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయిన పర్యాటకులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఫ్లైట్లు రద్దై ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు తమ హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో ఎలాంటి ఖర్చు లేకుండా బస చేయొచ్చని ప్రకటించి మానవత్వం చాటుకుంది.

News May 8, 2025

అభిమానిగా రామ్.. ఈ నెల 15న టైటిల్ గ్లింప్స్

image

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ‘RAPO22’ మూవీ టైటిల్ గ్లింప్స్ ఈ నెల 15న రానుంది. ఇందులో రామ్ ఓ సినీ అభిమానిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. చేతిలో టికెట్లు పట్టుకొని ఉన్న ఫొటోను మూవీ టీమ్ షేర్ చేసింది. ‘ఒక అభిమాని.. ఒక షో.. మిలియన్ ఎమోషన్స్’ అంటూ పేర్కొంది. ఈ మూవీకి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ P.మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు.

News May 8, 2025

దర్యాప్తు ప్రతిపాదనకు దీటైన బదులు

image

ఇరు దేశాల మధ్య దాడులపై నిష్పక్ష దర్యాప్తు జరగాలన్న పాక్ ప్రతిపాదనకు భారత్ దీటుగా బదులిచ్చింది. గతంలో ఎన్నో ఉగ్రదాడుల్లో పాక్ జాతీయుల ప్రమేయం ఉందని ఆధారాలతో సహా నిరూపించినా ఆ దేశం దర్యాప్తునకు సహకరించలేదని వెల్లడించింది. ముంబై ఉగ్రదాడి దోషి కసబ్‌ను అడ్రస్, DNAతో సహా నిరూపించినా పట్టించుకోలేదని MEA సెక్రటరీ విక్రమ్ మిస్రీ గుర్తు చేశారు. ఇప్పుడు వారు దర్యాప్తు కోరడం హాస్యాస్పదంగా పేర్కొన్నారు.

News May 8, 2025

ఢిల్లీకి 90 విమానాలు రద్దు

image

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 27 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఢిల్లీకి వచ్చి వెళ్లే 90 విమానాలు రద్దయ్యాయి. వాటిలో 11 ఇంటర్నేషనల్ సర్వీసులు కూడా ఉన్నాయి. కేంద్రం ఆదేశాలతో త్వరలోనే విమానాలు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. కాగా PAKలోని ఉగ్రవాద కేంద్రాలే లక్ష్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతోందని కేంద్రం ప్రకటించింది.

News May 8, 2025

Parenting: పిల్లల్ని ఒంటరిగా పెంచుతున్నారా?

image

అమ్మానాన్న విడిపోవడం లేదా ఇద్దరిలో ఒకరు చనిపోయినప్పుడు ఒంటరిగానే పిల్లలను పెంచాల్సి వస్తుంది. అప్పుడు ఎదురయ్యే సవాళ్లను తట్టుకొని నిలబడాలి. మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు, కోపం, స్వీయసానుభూతి దూరం పెట్టాలి. ఉద్యోగం, పిల్లల సంరక్షణపై శ్రద్ధ, జీవితాన్ని సమన్వయం చేసుకోవడంపై సాధన చేయాలి. పిల్లలు కుంగుబాటుకు గురవకుండా వారికి తోడుగా ఉన్నామనే భరోసా కలిగించాలి. అప్పుడే వారు జీవితంలో ముందడుగు వేస్తారు.

News May 8, 2025

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్ర: రేవంత్

image

TG: హైడ్రా అంటే ప్రభుత్వ, ప్రజల ఆస్తులను రక్షించేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చేద్దామంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వాన్ని ముందుకు వెళ్లనీయకుండా ప్రజలకు మేలు జరగకుండా కుట్ర చేస్తున్నాయని దుయ్యబట్టారు. పెట్టుబడులు రావడం ద్వారానే అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లాభిస్తుందన్నారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాలకు HCUకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

News May 8, 2025

OTTలోకి వచ్చేసిన మూడు చిత్రాలు

image

ఇవాళ మూడు కొత్త చిత్రాలు ఓటీటీలోకి వచ్చేశాయి. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి జంటగా నటించిన ‘జాక్’, అజిత్-త్రిష కీలక పాత్రలు పోషించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల-2 మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఈ చిత్రాలన్నీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

News May 8, 2025

పాక్ మీడియా, ఓటీటీ కంటెంట్‌పై నిషేధం

image

పాక్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా రూపొందిన ఓటీటీ కంటెంట్, వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్ కాస్ట్‌లు, ఇతర మీడియా కంటెంట్‌ను మన దేశంలో బ్యాన్ చేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటన విడుదల చేసింది.