India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(APP) పరీక్ష డిసెంబర్ 14న నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఎగ్జామ్ 2 షిఫ్టుల్లో జరుగుతుంది. ఉ.10 నుంచి మ. ఒంటిగంట వరకు మల్టిపుల్ ఛాయిస్, మ.2.30 నుంచి సా.5.30 గంటల వరకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 1,743 పోస్టులకు 3,132 అప్లికేషన్లు వచ్చిన విషయం తెలిసిందే.
* ప్రతిరోజూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్-2’ ఓటీటీలో రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తోంది. ఆర్మాక్స్ లెక్కల ప్రకారం గత వారం ఇండియాలో అత్యధిక మంది చూసిన సినిమాగా నిలిచింది. నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రానికి అత్యధికంగా 3.5 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు పేర్కొంది. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో భారీ అంచనాలతో తెరకెక్కిన వార్-2 థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
TG: SCలో దాఖలు చేసిన <<17999644>>పిటిషన్<<>>లో ప్రభుత్వం పలు అంశాలను ప్రస్తావించింది.
* రిజర్వేషన్లపై 50% పరిమితి ఉన్నట్లు రాజ్యాంగంలో లేదు. * ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్లు ఇవ్వొచ్చని గతంలో SC చెప్పింది. * సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే 2024-25లో రాష్ట్ర జనాభాలో 56.33% మంది బీసీలున్నారు. * శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లులను 3నెలల్లో గవర్నర్, రాష్ట్రపతి ఆమోదించకపోతే ఓకే చేసినట్లే.
భారత్లోని 3 ఫార్మా కంపెనీలకు చెందిన కాఫ్ సిరప్లను వాడొద్దని WHO హెచ్చరించింది. ఇందులో ఇటీవల 22 మంది పిల్లల మరణానికి కారణమైన శ్రేసన్ ఫార్మా ‘కోల్డ్రిఫ్’ కూడా ఉంది. దాంతో పాటు రెడ్నెక్స్ ఫార్మా ‘రెస్పిఫ్రెష్ TR’, షేప్ ఫార్మా ‘రీలైఫ్’ సిరప్లు ఆరోగ్యానికి హానికరమని పేర్కొంది. కాగా ఈ దగ్గు మందులు ఇతర దేశాలకు ఎగుమతి కాలేదని ఇండియన్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ WHOకు తెలిపింది.
క్యాడెట్స్ ట్రైనింగ్ వింగ్ ఆఫ్ మిలటరీ కాలేజీ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (MCTE)18 అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, ఎంఎస్, MSc, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 31 వరకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
శివుడి దివ్య సందేశం ప్రకారం.. శివుడి ధ్యానాన్ని విడవడమే మానవులలో అజ్ఞానం ప్రవేశించడానికి కారణం. నిజమైన జ్ఞానంతో ఉంటే మనుషులు కూడా శివుడితో సమానమైన సారూప్యాన్ని పొందే అవకాశం ఉండేది. అందుకే, అహంకారాన్ని నిర్మూలించి, జ్ఞానసిద్ధి పొందడానికి ఓంకారాన్ని జపించాలని శివుడు ఉపదేశించాడు. శివుడి ముఖం నుంచే జనించిన ఈ సర్వ మంగళప్రదమైన ఓంకారాన్ని నిత్యం స్మరిస్తే, శివుడిని స్మరించినట్లే అవుతుంది. <<-se>>#SIVOHAM<<>>
AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు వేంకటేశ్వర స్వామి దర్శనానికి 12గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 78,569 మంది భక్తులు దర్శించుకోగా.. 27,482 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.93కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
తిరుమల <<17999947>>పరకామణి<<>>లో 2023లో ఉద్యోగి రవికుమార్ దొంగతనం చేయడంపై CID విచారణ జరగాలని స్థానిక జర్నలిస్టు శ్రీనివాసులు గతేడాది HCలో పిటిషన్ వేశారు. ఈ చోరీపై 2023 APRలో పోలీసులకు ఫిర్యాదు చేసిన TTD విజిలెన్స్ ఆఫీసర్ సతీష్, SEPలో లోక్ అదాలత్లో రవితో రాజీ చేసుకున్నారని తెలిపారు. దీంతో అదాలత్ నిర్ణయాన్ని సస్పెండ్ చేసిన జస్టిస్ రామకృష్ణ.. ఖజానా రికార్డులు, రాజీ ఉత్తర్వుల సీజ్కు CIDని ఆదేశించినా ఆ పని చేయలేదు.
TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ నాటి MD హరిరామ్ ఆస్తుల జప్తుకు ఇరిగేషన్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. మర్కూక్లో 28, బొమ్మలరామారంలో 6ఎకరాలు, పటాన్చెరులో 20గుంటలు, షేక్పేట, కొండాపూర్లో విల్లాలు, మాదాపూర్, శ్రీనగర్ కాలనీ, నార్సింగిలో 2 ఇళ్లు, ఫ్లాట్లు, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ప్లాట్లు, అమరావతిలో స్థలం, కొత్తగూడెంలో బిల్డింగ్ను జప్తు చేయనున్నారు.
ఏపీలో డీజీపీ, పోలీస్ శాఖ నిద్రావస్థలో ఉన్నాయని హైకోర్టు మండిపడింది. డిపార్టుమెంటును మూసేయడం మంచిదని అసంతృప్తి వ్యక్తం చేసింది. TTD పరకామణి విషయంలో లోక్ అదాలత్లో రాజీ రికార్డుల సీజ్కు HC SEP 19న ఆదేశాలిచ్చింది. CIDలో సీజ్ అధికారం గల IG పోస్టు ఖాళీగా ఉండటంతో ఆ పని చేయలేదన్న పోలీస్ శాఖను తప్పుబట్టింది. సదుద్దేశం ఉంటే తమకు ఆ విషయం చెప్పేవారని లేదా మరో IG స్థాయి అధికారితో ఆ పని చేయించేవారంది.
Sorry, no posts matched your criteria.