News September 28, 2024

IPL: ఆ ఆటగాళ్లకు రూ.18 కోట్లు?

image

ఒక్కో ఫ్రాంచైజీకి రిటెన్షన్ పర్స్ కింద రూ.75 కోట్ల వరకు బీసీసీఐ అనుమతించినట్లు తెలుస్తోంది. మొట్టమొదటగా రిటెన్షన్ చేసుకునే ఆటగాడికి, నాలుగో రిటెన్షన్ ఆటగాడికి రూ.18 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. థర్డ్ రిటెన్షన్‌ రూ.11 కోట్లు, సెకండ్ అండ్ ఫిఫ్త్ రిటెన్షన్ ఆటగాడికి రూ.14 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ.120 కోట్లలో మిగతా రూ.45 కోట్లతో మెగా వేలంలో ఆటగాళ్లను కొనాల్సి ఉంటుంది.

News September 28, 2024

IPL: ఫ్రాంచైజీ పర్స్ విలువ భారీగా పెంపు?

image

IPL 2025 కోసం BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీల పర్సు విలువను రూ.115 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో పర్స్ వ్యాల్యూ రూ.90 కోట్లుగా ఉండేది. నవంబర్ రెండో వారంలో 2 రోజులపాటు మెగా ఆక్షన్ జరుగుతుందని సమాచారం. మరోవైపు ఐదుగురి రిటెన్షన్‌పై మెజారిటీ ఫ్రాంచైజీలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రేపు అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

News September 28, 2024

కంపెనీ మేనేజర్ CV రిజెక్ట్.. HR టీమ్ తొలగింపు

image

3 నెలలుగా HR టీమ్ నియామకాలు చేస్తున్నా కంపెనీలోకి క్వాలిఫైడ్ అభ్యర్థులు రాకపోవడంతో ఓ మేనేజర్ విసుగు చెందారు. ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలుసుకోవడానికి తన CVని పంపగా నిమిషాల్లోనే తిరస్కరణకు గురైంది. HR సిస్టమ్‌లో లోపం వల్ల ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అవుతున్నట్లు ఆయన గుర్తించారు. దీనిపై తప్పుడు సమాచారం ఇవ్వడంతో HR టీమ్ మొత్తాన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ ఉదంతాన్ని ఆయన Redditలో షేర్ చేయగా వైరలవుతోంది.

News September 28, 2024

భోజనం చేశాక ఇలా చేస్తే..

image

భోజనం చేశాక 10 నిమిషాలు నడిస్తే జీర్ణక్రియ మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. పేగుల్లో కదలికలు జరిగి ఆహారం త్వరగా జీర్ణమవుతుందని.. ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం లాంటి సమస్యలూ తగ్గుతాయని చెబుతున్నారు. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయులు తగ్గేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే తిన్న వెంటనే కాకుండా 5-10 నిమిషాల తర్వాత నడవాలని సూచిస్తున్నారు.

News September 28, 2024

IPL: ఆరుగురు ప్లేయర్ల రిటెన్షన్‌కు ఆమోదం?

image

IPL-2025 మెగా వేలానికి ముందు BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా ఆరుగురు ప్లేయర్లను రిటెన్షన్(తమ వద్దే ఉంచుకోవడం) చేసుకునేందుకు వీలు కల్పించినట్లు తెలుస్తోంది. ఇందులో స్వదేశీ, విదేశీ ప్లేయర్ల సంఖ్యతో సంబంధం లేదని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈసారి దుబాయ్ వేదికగా నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్‌లో మెగా ఆక్షన్ జరగనుంది.

News September 28, 2024

దేశ పర్యాటకం మెరుగుపడుతోంది.. కానీ!

image

2024 ప్రథమార్థంలో 4.78 మిలియన్ల మంది విదేశీయులు భారత్‌లో పర్యటించారు. US, బంగ్లాదేశ్ నుంచి అధికంగా వ‌స్తున్న‌ట్టు ప‌ర్యాట‌క శాఖ తెలిపింది. వ‌ర‌ల్డ్ టూరిజం డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన డేటా ప్ర‌కారం ఇది టూరిజం వృద్ధిని సూచిస్తున్న‌ప్ప‌టికీ క‌రోనా ముందు ఉన్న ప‌రిస్థితుల కంటే వెనుక‌బ‌డిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. భార‌త టూరిజం హ‌బ్ ల‌క్ష్యాల‌ను ఇది ప్ర‌భావితం చేస్తుంద‌ని ఆ శాఖ పేర్కొంది.

News September 28, 2024

ఒకే టైంలో చాలామందితో డేటింగ్ చేశా: నటి

image

అప్పట్లో ఒకే సమయంలో చాలామందితో డేటింగ్ చేశానని నటి కల్కి కొచ్లిన్ తెలిపారు. అదొక ప్రత్యేక అనుభూతి అని ఆమె చెప్పారు. ‘ప్రస్తుతం అలాంటి వాటి గురించి ఆలోచించడం లేదు. నాకు భర్త, పాప ఉన్నారు. ఇప్పుడు నా భర్తను పట్టించుకునేంత టైమ్ కూడా నాకు లేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా గయ్ హెర్ష్‌బర్గ్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కిన ‘అరణ్య’లో ఈమె హీరోయిన్‌గా నటించారు.

News September 28, 2024

IPL: క్రికెటర్లకు సూపర్ న్యూస్ చెప్పిన జైషా

image

IPLలో ఆడే క్రికెటర్ల పంట పండనుంది. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఆటగాడికి మ్యాచ్ ఫీజు కింద రూ.7.50 లక్షలు ఇవ్వనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. లీగ్ మ్యాచులన్నీ ఆడిన క్రికెటర్‌కు కాంట్రాక్టెడ్ అమౌంట్‌కు అదనంగా రూ.1.05 కోట్లు ఇస్తామని వెల్లడించారు. మ్యాచ్ ఫీజు చెల్లించేందుకు ప్రతి ఫ్రాంచైజీ రూ.12.60 కోట్లు కేటాయించాలని చెప్పారు. ఇది చరిత్రాత్మక నిర్ణయం అని జైషా Xలో పేర్కొన్నారు.

News September 28, 2024

మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరు?: కేటీఆర్

image

TG: మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లా అని KTR ప్రశ్నించారు. ‘తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80వేల కోట్లయితేనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలుపెట్టింది కాంగ్రెస్. ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరు? CMకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకన్నా మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ? మూడింతలు పెంచిన మూసీ అంచనా వ్యయం కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యం’ అని ట్వీట్ చేశారు.

News September 28, 2024

‘దేవర’లో NTR భార్య గురించి తెలుసా?

image

దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. ఇందులో ఒకరి పాత్రకు భార్యగా మరాఠీ బ్యూటీ శృతి మరాఠే నటించారు. 37 ఏళ్ల శృతి తొలుత మోడల్‌గా తన జర్నీని ప్రారంభించారు. 2008లో సినిమాల్లోకి వచ్చి, తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చారు. మరాఠీలో రామ మాధవ్, తప్తాపడి, బంద్ నైలోంచేతో పాటు తమిళంలో అరవన్, నాంగ రొంబ మూవీలు చేశారు. 2016లో ఈమె మరాఠీ నటుడు గౌరవ్ ఘటనేకర్‌ను పెళ్లి చేసుకున్నారు.