India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమిళ సినిమాలు ఎందుకు రూ.1000 కోట్లు కలెక్ట్ చేయట్లేదన్న ప్రశ్నకు డైరెక్టర్ మురుగదాస్ ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద సమాధానమిచ్చారు. ‘తమిళ దర్శకులను ఇతర భాషల డైరెక్టర్లతో పోల్చొద్దు. ఇతర భాషల డైరెక్టర్లు జనాల్ని ఎంటర్టైన్ మాత్రమే చేస్తారు. కానీ తమిళ దర్శకులు వారిని ఎడ్యుకేట్ చేస్తారు. జీవితంలో ఏం చేయాలి, ఏం చేయొద్దనేది సినిమాల ద్వారా చెబుతారు. అదే ఇండస్ట్రీల మధ్య వ్యత్యాసం’ అని పేర్కొన్నారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. అఫ్గానిస్థాన్తో కలిసి తమ దేశంలో అశాంతికి కుట్ర చేస్తే దాడులు చేస్తామని బెదిరించారు. అఫ్గాన్ ప్రభుత్వం Tehrik-i-Taliban Pakistan (TTP) మిలిటెంట్లను పాక్లోకి పంపిస్తూ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. తాము ఇంత కాలంగా అఫ్గాన్పై దయ చూపామని, కానీ ఇండియాతో కలిసి తమపైనే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.
TG: లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను అక్టోబర్ 2 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. “ఇప్పటికే తొలి విడత సర్వేయర్ల శిక్షణ పూర్తయింది. ఈ నెల 18న రెండో విడత శిక్షణ మొదలవుతుంది. భూ సమస్యల పరిష్కారం కోసం ‘భూభారతి’ తీసుకొచ్చాం. రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి కావడంతో లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను నియమిస్తున్నాం” అని పేర్కొన్నారు.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్-2’ ఇవాళ మధ్యాహ్నం వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. తొలి రెండు రోజుల్లో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాగా నిన్న, ఇవాళ కాస్త తగ్గినట్లు వెల్లడించాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
AP: సినిమాల్లో మహిళలపై వివక్షను కట్టడి చేసేందుకు సమయం ఆసన్నమైందని మంత్రి లోకేశ్ అన్నారు. ‘మహిళలకు మనమిచ్చే గౌరవమే నిజమైన నాగరిక సమాజానికి పునాది. వారి పట్ల లింగ వివక్ష, అవమానకరమైన సంభాషణలను కట్టడి చేయాలి. అలాంటి డైలాగ్స్ ఉన్న మూవీ లేదా సీరియల్ను ఆపేయాలి. ఇంట్లో, స్క్రీన్పై చూసే అంశాలు పిల్లలపై ప్రభావం చూపుతాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఓటర్ల గోప్యతకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమదేనని CEC జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. ఓట్ల చోరీ అంటూ ఈసీపై ఆరోపణలు చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ఓటర్ల విషయంలో ధనిక, పేద, లింగ భేదాలు ఉండవని స్పష్టం చేశారు. బిహార్ ఓటరు జాబితా విషయంలో ECపై ఆరోపణలు చేస్తున్నారని, జాబితా తయారీలో స్పష్టమైన వైఖరితో ఉన్నామని తెలిపారు. బిహార్ SIRలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేశామని పేర్కొన్నారు.
హైదరాబాద్లో రాబోయే గంట సేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ <<17432128>>వర్షాలు<<>> పడతాయని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ADB, HNK, కామారెడ్డి, మెదక్, సూర్యాపేట, వికారాబాద్, WGL జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
TPCC రాజకీయ వ్యవహారాల కమిటీ(PAC) ఈ నెల 23న సా.5 గంటలకు సమావేశం కానుంది. BC రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. PAC మీటింగ్ గురించి చర్చించేందుకు ఇవాళ ఉదయం CM రేవంత్తో TPCC చీఫ్ మహేశ్ కుమార్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, వి.హనుమంతరావు ఈ భేటీలో పాల్గొన్నారు.
BCCI కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్ల్లో ఏ ప్లేయరైనా గాయపడి, ఆడలేని స్థితిలో ఉంటే వారి స్థానంలో మరో ప్లేయర్ను తీసుకోవచ్చు. ఈ రూల్ మల్టీ డే(వన్డే, టీ20లు కాకుండా) ఫార్మాట్ మ్యాచ్లకే వర్తిస్తుంది. ఇటీవల ENGతో టెస్ట్ సిరీస్లో పంత్, వోక్స్ తీవ్ర గాయంతో ఆడటానికి ఇబ్బందిపడిన నేపథ్యంలో ICC కూడా దీన్ని అమలు చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీరేమంటారు?
AP: గీత కార్మికుల కోసం త్వరలో ఆదరణ 3.0 పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి సవిత తెలిపారు. ఈ స్కీమ్ కింద వారికి ద్విచక్ర వాహనాలు (మోపెడ్) అందజేస్తామన్నారు. గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కడానికి అధునాతన పరికరాలు ఇస్తామని చెప్పారు. రంపచోడవరం హార్టికల్చర్ పరిశోధనా కేంద్రంలో నూతన తాటి ఉత్పత్తులు తయారు చేసి, గీత కార్మికులకు ఉపాధి, ఆర్థిక వృద్ధి మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని CM ఆదేశించినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.