India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రతి స్త్రీ జీవితంలో మెనోపాజ్ స్థితి ఒకటి. అయితే ఈ క్రమంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. ముఖ్యంగా క్యాల్షియం, డి విటమిన్ లోపాలు ఎముకల్ని బలహీనంగా మారుస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి మెనోపాజ్ దశలో స్త్రీలు తమ రోజువారీ ఆహారంలో సుమారు 1200 మి.గ్రా క్యాల్షియంను అదనంగా తీసుకోవాలి. అలానే, పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్ ఎక్కువగా ఉండే డైట్ని తీసుకోవాలంటున్నారు.

TG: హైదరాబాద్ శామీర్పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.

<

* నెల్లూరు(D)లో గ్రీన్ఫీల్డ్ ఫైబర్ సిమెంట్ ప్లాంటు ఏర్పాటుచేయనున్నట్లు ‘బిర్లాన్యూ’ వెల్లడించింది. తొలి దశలో ₹127Cr వెచ్చిస్తామని, 600 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొంది.
* పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు PPP విధానాన్ని అనుసరిస్తున్నట్లు మున్సిపల్ శాఖ తెలిపింది. 2029 నాటికి ₹66000Cr పెట్టుబడులు సమీకరిస్తామంది.
* తిరుపతిలో ప్రత్యేకంగా సంస్కృత అకాడమీ ఏర్పాటు: తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్ విల్సన్

ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు క్లే మాస్కులు వాడటానికే మొగ్గు చూపుతున్నారు. వీటితో ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. వాటిల్లో ఒకటి సీ క్లే. దీన్నే ఫ్రెంచ్ గ్రీన్ క్లే అని పిలుస్తారు. ఆకుపచ్చ రంగులో ఉండే దీంట్లో ఐరన్ ఆక్సైడ్స్, మెగ్నీషియం, కాల్షియం, కాపర్ వంటి మినరల్స్ కూడా అందుతాయి. మొటిమలు, మచ్చల్ని దూరం చేస్తుంది. ఆయిల్, సెన్సిటివ్ స్కిన్ వారికి ఈ మాస్క్ బాగా పనిచేస్తుంది.

TG మంత్రులు, కొంతమంది ప్రజల <<18366823>>వాట్సాప్ గ్రూపులు<<>>, అకౌంట్లు హ్యాకవడంతో సైబర్ క్రైమ్ అధికారులు జాగ్రత్తలు సూచించారు. ‘వెంటనే www.whatsapp.com/contactలో, 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. యాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవాలి. 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయాలి. ఫోన్ ఓవర్ హీట్, బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అవుతుంటే ఫోన్ హ్యాక్ అయినట్లే. వెంటనే ఫోన్ను రీసెట్ చేయాలి’ అని సూచిస్తున్నారు.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జమ్మూ టూరిజాన్ని ఢిల్లీ బ్లాస్ట్ మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టింది. వింటర్ సీజన్ కావడంతో టూరిజం కార్యకలాపాలపై CM ఒమర్ అబ్దుల్లా సహా ట్రావెల్ ఏజెంట్లూ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల జరిగిన ఢిల్లీ బాంబుదాడితో టూరిస్టుల్లోనూ భయం నెలకొంది. పైగా దాడిలో కశ్మీర్ మూలాలున్న ఇద్దరిని NIA అరెస్టు చేసింది. ఇది మరోసారి జమ్మూ టూరిజంపై ఎఫెక్ట్ పడేలా చేసింది.

ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)లో 20గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంజినీరింగ్ డిగ్రీ, డిగ్రీ (B.Com, BA, BSc, BBA), డిప్లొమా ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు నెలకు రూ.15వేలు, డిప్లొమా అప్రెంటిస్లకు రూ.12వేలు చెల్లిస్తారు. అభ్యర్థులు NATS పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్సైట్: aai.aero.

ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో చక్ర వ్యవసాయం(QUICK CYCLE FARMING) ట్రెండ్ నడుస్తోంది. ఈ విధానంలో తక్కువ సమయంలో చేతికొచ్చే పంటలను సాగు చేస్తారు. నిపుణుల సూచనలతో అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఎన్నుకొని, సరైన యాజమాన్యం, నీటి పారుదల కల్పించి తక్కువ సమయంలో అధిక ఆదాయం పొందుతున్నారు. ఉల్లిపాయలు, పాలకూర, మెంతులు, కొత్తిమీర మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి. శివానీ కూడా ఇలాగే కొత్తిమీరతో లాభాలు పొందారు.
Sorry, no posts matched your criteria.