India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నటి మలైకా అరోరా తండ్రి అనిల్ కుల్దీప్ మెహతా ఆత్మహత్య చేసుకునే ముందు కుమార్తెలైన మలైకా అరోరా, అమృతా అరోరాకు చివరిగా ఫోన్ కాల్ చేసినట్లు సమాచారం. ‘అనారోగ్యంతో బాధపడుతున్నా. నేను పూర్తిగా అలసిపోయా’ అని కుమార్తెలకు ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అటు తండ్రి మరణం తమ కుటుంబాన్ని ఎంతో బాధిస్తోందని మలైకా అరోరా సోషల్ మీడియాలో ఎమోషనల్ <<14079653>>పోస్ట్ <<>>చేశారు.
AP: డిగ్రీలో చేరేందుకు విద్యార్థులకు ఉన్నత విద్యామండలి మరో అవకాశం ఇచ్చింది. ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 15వ తేదీకి పొడిగించింది. 18వ తేదీ వరకు విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చని, 19న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని పేర్కొంది. 22న సీట్ల కేటాయింపు జరుగుతుందని, 22 నుంచి 25వ తేదీలోగా కాలేజీల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాలని సూచించింది.
క్రితం సెషన్లో నష్టాల పాలైన స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాల్లో మొదలయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 25,049 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 312 పాయింట్లు ఎగిసి 81,827 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా పాజిటివ్ సిగ్నల్స్ రావడం, యూఎస్ సీపీఐ డేటా అంచనాల కన్నా మెరుగ్గా ఉండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్.
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. గత నెల 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో పాటు నార్నె నితిన్ నటించిన ‘ఆయ్’ మూవీ కూడా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చింది.
TG: రుణమాఫీ కాలేదని, పెట్టుబడి సాయం అందలేదని కొందరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని KTR అన్నారు. ‘KCR రైతును రాజును చేస్తే, కాంగ్రెస్ సర్కార్ వారి ప్రాణాలు తీస్తోంది. రుణమాఫీ, రైతు భరోసా బోగస్. రుణమాఫీలో పావు శాతం కూడా పూర్తి చేయకుండా చేతులెత్తేశారు. రైతన్నలకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి. ఢిల్లీ యాత్రలు చేయటం కాదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి’ అని ట్వీట్ చేశారు.
మోకాలి కింద ఉండే కండరాలను రెండో గుండెగా పరిగణిస్తారనే విషయం మీకు తెలుసా? ‘ధమనులు గుండె నుంచి రక్తాన్ని శరీరమంతా పంప్ చేస్తాయి. సిరలు పైకి తీసుకొస్తాయి. ఈ ప్రక్రియ గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా జరుగుతుండడంతో కాలి కండరం పంపింగ్లో సహాయపడుతుంది. అడుగు వేసినప్పుడల్లా రక్తం పంప్ అవుతుంది. కాబట్టి నడక ఎంతో అవసరం. ఎక్కువ సేపు కూర్చుంటే పాదాన్ని ముందుకు, వెనుకకు కదిలించాలి’ అని వైద్యులు తెలిపారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ నమోదు చేశారు. నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. మొత్తం 9 మంది రేవ్ పార్టీని నిర్వహించారని, హేమతో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిపారు. హేమ MDMA డ్రగ్స్ తీసుకున్నట్లు మెడికల్ రిపోర్టును జతపరిచారు.
కొన్ని అలవాట్ల వల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేమి, అల్పాహారం తినకపోవడం, సరిపడా నీరు తాగకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి, ఒంటరితనం, ప్రతికూల ఆలోచనలు, చీకటి గదిలో ఉండటం, అతిగా తినడం, నిరంతరం హెడ్ ఫోన్స్ వాడటం, ప్రతిదీ గూగుల్ చేయడం, మొబైల్ ఎక్కువగా చూడటం వంటి అలవాట్ల వల్ల బ్రెయిన్కు నష్టం కలుగుతుంది. వీటన్నింటిని తగ్గించుకుంటేనే మెదడు ప్రభావవంతంగా పనిచేస్తుంది.
సినీ ఇండస్ట్రీలో నెపోటిజం వల్ల తాను కొన్ని అవకాశాలు కోల్పోయినట్లు హీరోయిన్ రకుల్ ప్రీత్ వెల్లడించారు. కానీ ఈ విషయంలో తానెప్పుడూ బాధపడలేదన్నారు. ‘స్టార్ కిడ్స్కు సినిమాల్లో ఈజీగా అవకాశాలు రావడానికి కారణం వారి పేరెంట్స్ పడిన కష్టమే. నేను కూడా భవిష్యత్తులో నా పిల్లలకి అవసరమైతే సాయం చేస్తాను. లైన్లో నిలబడి అదృష్టాన్ని పరీక్షించుకోండి అని చెప్పను’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
TG: హెల్త్ ప్రొఫైల్, హెల్త్ కార్డుల్లోని సమాచారం ప్రజలకు సకాలంలో వైద్యం అందించేందుకు సాయపడేలా ఉండాలని అధికారులను మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. మొదట వ్యక్తుల పేరు, అడ్రస్, వృత్తి వంటి ప్రాథమిక సమాచారం సేకరించాలని, ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు, అనారోగ్య కారక అలవాట్లు వంటివి నమోదు చేయాలన్నారు. యూనిక్ నంబర్, బార్ కోడ్, ఫొటోతో హెల్త్ కార్డులను తయారు చేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.