India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఈ నెల 9 నుంచి వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని TGPSC ఓ ప్రకటనలో తెలిపింది. 1,368 సెంటర్లలో ఈ నెల 15, 16వ తేదీల్లో రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 9.30 గంటలు, మ.2.30 గంటలలోపే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. మొత్తం 783 పోస్టులకుగానూ 5.57 లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు.

బిలియనీర్లకు రాయితీలు ఇస్తున్న కేంద్రం, సామాన్యులకు ఆదాయ పన్ను, ఇతరత్రా పన్నుల రేట్లు పెంచుతూ అన్యాయం చేస్తోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రజలపై భారం మోపేలా మోదీ ప్రభుత్వం కొత్త జీఎస్టీ స్లాబ్ను తీసుకొస్తోందని పేర్కొన్నారు. గర్బర్ సింగ్ ట్యాక్స్ ద్వారా రోజూ ఉపయోగించే వస్తువులపై అధిక పన్నులు విధించేందుకు సిద్ధపడుతోందని ఆరోపించారు. దీన్ని వ్యతిరేకిస్తూ గళమెత్తుతామన్నారు.

ఒక గంటసేపు టీవీ చూస్తే 22 నిమిషాల జీవన కాలం తగ్గిపోతుందని అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ హెచ్చరించారు. ‘ఓ అధ్యయనం ప్రకారం.. టీవీ చూడనివారితో పోలిస్తే రోజుకు 6గంటల పాటు టీవీ చూసేవారు 5ఏళ్లు తక్కువగా జీవిస్తారని తేలింది. అందువల్ల టీవీ చూసే సమయాన్ని తగ్గించుకోండి. ఇతర స్క్రీన్లనూ తక్కువ చూడండి. బదులుగా ఏదైనా శారీరక శ్రమ ఉండే పనుల్ని కల్పించుకోండి’ అని సూచించారు.

భారత ప్రధాని మోదీ, అదానీపై ఆరోపణల విషయంలో తమ ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థల హస్తం ఉందన్న BJP వ్యాఖ్యలను అమెరికా ఖండించింది. ఈ రకమైన ఆరోపణలు నిరుత్సాహకరమైనవని పేర్కొంది. కాగా మీడియా సంస్థ OCCRP, రాహుల్ గాంధీతో అమెరికా జట్టుకట్టిందని BJP ఇటీవల ఆరోపించింది. అందువల్లే OCCRP నివేదికలను చూపుతూ అదానీ, మోదీపై రాహుల్ విమర్శలు చేస్తున్నారని కమలం పార్టీ మండిపడింది.

లెబనాన్పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేస్తున్న ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ ఆస్పత్రిపై జరిపిన వైమానిక దాడిలో 29 మంది మృతి చెందారు. వరుస దాడులతో ఆస్పత్రి పరిసరాలు రక్తపుమడుగులతో నిండినట్టు అల్-జజీరా తెలిపింది. 2023 Oct నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటిదాకా 44,612 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా, లక్షకు పైగా గాయపడ్డారు.

AP: పవన్ కళ్యాణ్పై చంద్రబాబు కుట్ర చేస్తున్నారని MP <<14817304>>విజయసాయిరెడ్డి<<>> చేసిన ఆరోపణలపై TDP నేత బుద్దా వెంకన్న స్పందించారు. ‘కూటమి ప్రకటన వచ్చినప్పటి నుంచి మీ ఏడుపులను ప్రజలు గమనిస్తున్నారు. ఎలాగైనా కూటమి మధ్య చిచ్చు పెట్టాలనే మీ తెలివి తక్కువ చేష్టలను ప్రజలు నమ్మరు. ఇకనైనా ఇలాంటి ఫిట్టింగ్ మాస్టర్ పనులు ఆపి మీ పార్టీపై దృష్టి పెట్టండి. లేదంటే ఈసారి ఉన్న 11 సీట్లు కూడా ఊడతాయి’ అని ట్వీట్ చేశారు.

ఓట్మీల్: ఇందులోని ఫైబర్ ఆకలి కానివ్వదు. ఎక్కువ ఆహారం తినకుండా సాయపడుతుంది. గుడ్లు: వీటిలోని ఖనిజాలు ఇన్సూలిన్ సెన్సిటివిటీని తగ్గిస్తాయి. బెండకాయ: ఇందులోని ఫ్లేవనాయిడ్స్, పాలీ సాకరైడ్స్ షుగర్ను తగ్గిస్తాయి. బెర్రీస్: వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు ఇన్సూలిన్ సున్నితత్వాన్ని నిరోధించి షుగర్ను కంట్రోల్ చేస్తాయి. డ్రైఫ్రూట్స్, ఫిష్: ఇందులోని ప్రొటీన్, హెల్తీ ఫ్యాట్స్ ఆరోగ్యానికి సాయపడతాయి.

టెస్టు క్రికెట్లో అత్యంత వేగవంతమైన బాల్ విసిరిన ఘనత ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. 2015లో న్యూజిలాండ్పై 160.4 కిలోమీటర్ల వేగంతో స్టార్క్ బాల్ వేశారు. తాజాగా అడిలైడ్ టెస్టులో భారత బౌలర్ సిరాజ్ ఏకంగా 181.6 కి.మీ వేగంతో బాల్ వేసినట్లు స్పీడ్ గన్లో నమోదయ్యింది. అయితే అది స్పీడ్ గన్లో లోపం వల్ల జరిగిందని తర్వాత నిర్వాహకులు తేల్చారు. దీంతో సిరాజ్పై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.

పుష్ప సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి కారణం దర్శకుడు రాజమౌళి అని సుకుమార్ అన్నారు. ‘పుష్ప-2’ను హిందీలో రిలీజ్ చేయాలని జక్కన్న పట్టుబట్టారని చెప్పారు. ’పుష్ప-2’లో చైల్డ్ హుడ్ సీన్, ట్రక్ సీన్తో పాటు 40 శాతం సినిమాను తన అసిస్టెంట్ శ్రీమన్ డైరెక్ట్ చేశారన్నారు. మూవీకి డైరెక్టెడ్ బై సుకుమార్, శ్రీమన్ అని వేయాల్సి ఉందని తెలిపారు. తన టీమ్లో అందరూ సుకుమార్లేనని పేర్కొన్నారు.

TG: రేవంత్ ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. సరూర్ నగర్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మాయలఫకీర్లా రేవంత్ డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హామీల అమలులోనూ రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి అని మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.