India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. 24,900 సపోర్ట్ లెవల్ బ్రేకవ్వడంతో నిఫ్టీ 221 పాయింట్లు పతనమై 24,749 వద్ద క్లోజైంది. ఇక సెన్సెక్స్ 497 పాయింట్లు తగ్గి 81,006 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఐటీ సూచీ మాత్రం 503 పాయింట్లు పెరిగి 42,734 వద్ద ముగిసింది. FIIలు వెళ్లిపోవడం, నెగటివ్ సెంటిమెంటే క్రాష్కు కారణాలు. బజాజ్ ఆటో షేర్ 13.11% క్రాష్ అయింది. ఆటో, రియల్టీ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.
బెంగళూరులో న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమ్ ఇండియా 46 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో భారత కోచ్ గౌతమ్ గంభీర్ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘ఒకేరోజులో 400 రన్స్ కొట్టాలన్నా, 2 రోజుల పాటు ఆడాలన్నా చేయగలిగే జట్టులా ఉండాలని మేం కోరుకుంటున్నాం. టెస్టు క్రికెట్ విషయంలో అటువంటి మార్పు టీమ్లో రావాలి’ అని ఓ ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నారు.
భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమైన బెంగళూరు పిచ్పై కివీస్ ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడుతున్నారు. ఓపెనర్లు కాన్వే, లాథమ్ తొలి వికెట్కు 67 పరుగులు రాబట్టారు. IND బ్యాటర్లు బౌండరీలు కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బందిపడగా NZ ప్లేయర్లు అలవోకగా ఫోర్లు, సిక్సర్లు బాదుతున్నారు. 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లాథమ్ ఔట్ కాగా కాన్వే(65) సెంచరీ వైపు దూసుకెళ్తున్నారు. యంగ్ 22* రన్స్ చేశారు. ప్రస్తుతం NZ స్కోర్ 107/1.
విమానాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. మూడు రోజుల్లోనే డజనుకుపైగా విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలొచ్చాయి. అయితే, ఎయిర్ ఇండియాకు చెందిన 5 విమానాల్లో బాంబులు పెట్టినట్లు ఓ X యూజర్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ‘5 విమానాల్లో పేలుడు పదార్థాలను అమర్చా. త్వరగా దిగిపోండి’ అని @psychotichuman0 అనే X యూజర్ ఎయిర్ ఇండియాకు హెచ్చరించాడు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
TG: మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను సర్కార్ రెండేళ్లకోసారి పెంచుతోంది. ఈసారి వివిధ రకాల బ్రాండ్లపై రూ.20-150 వరకు పెంచాలని బ్రూవరీలు కోరాయి. ఈమేరకు త్వరలోనే ప్రభుత్వం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మద్యం ఆదాయాన్ని ఎక్సైజ్ శాఖ అదనంగా మరో రూ.5,318 కోట్లకు పెంచాలన్న ప్రభుత్వ ఆదేశాలూ ధరల పెంపునకు మరో కారణంగా తెలుస్తోంది.
భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. NOV 18లోపు ఆమెను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుపర్చాలని ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్లపై ఆ దేశంలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆమె బంగ్లాను వీడిన సంగతి తెలిసిందే. ఆమెపై క్రిమినల్ కేసులు సైతం నమోదయ్యాయి. కాగా ఆమె భారత్ చేరుకున్న తర్వాత బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఇండియన్ యాక్టర్గా నిలిచారు. లండన్లోని ఫేషియల్ కాస్మొటిక్ సర్జన్ డా. జూలియన్ డి సిల్వా గోల్డెన్ రేషియో కాన్సెప్ట్తో ప్రపంచంలోని హ్యాండ్సమ్ నటుల జాబితాను రూపొందించారు. అందులో ఏకైక భారతీయ నటుడు షారూఖ్ ఖాన్(86.76%) పదవ స్థానంలో నిలిచారు. ఇంగ్లిష్ యాక్టర్ ఆరోన్ టేలర్ జాన్సన్ (93.04%)తో ప్రథమ స్థానంలో, లూసీన్ లావిస్కౌంట్ (92.41%) రెండో స్థానంలో ఉన్నారు.
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా పూజారా సేవల్ని మిస్ అయిందని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు. చుట్టూ వికెట్లు పడుతున్నా పుజారా గౌరవప్రదమైన స్కోరును జట్టుకు అందించేవారని పేర్కొన్నారు. ‘100 మ్యాచులాడిన అలాంటి ఆటగాడి సేవల్ని భారత్ మిస్ అయింది. అతడైతే బంతిని కొట్టేందుకు వెళ్లకుండా బ్యాట్ మీదకు వచ్చేవరకూ వేచి చూసేవారు. విరాట్ 4వ స్థానంలోనే ఆడాల్సింది’ అని పేర్కొన్నారు.
తెలంగాణ క్యాబినెట్ ఈనెల 23న సాయంత్రం 4 గంటలకు భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైడ్రాకు చట్టబద్ధత, అసెంబ్లీ సమావేశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
TG: రాష్ట్రంలో డిగ్రీ, PG కాలేజీలు రేపటి నుంచి యథావిధిగా నడిపిస్తామని ప్రైవేట్ కాలేజీ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల విషయంలో అసోసియేషన్ సభ్యులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వారు బంద్ను విరమించారు. ఇదిలా ఉంటే బకాయిలు విడుదల చేయకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని R.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.