News September 10, 2024

మలయాళ సినిమాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు థాంక్స్

image

అల్లు అర్జున్‌కు కేరళలోనూ భారీగా అభిమానులున్న విషయం తెలిసిందే. అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్లూ ఉన్నాయి. ఇటీవల మాలీవుడ్‌లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ ‘తలవన్’ మూవీ ఎండ్‌కార్డులో ‘ఆల్ కేరళ అల్లు అర్జున్ ఫ్యాన్స్& వెల్ఫేర్ అసోసియేషన్‌’కు మేకర్స్ థాంక్స్ చెప్పారు. హీరోకు ధన్యవాదాలు చెప్పడం కామన్ అని, అభిమానులకూ చెప్పడం bhAAi రేంజ్‌కు నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News September 10, 2024

రంజీ ట్రోఫీ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

image

భారత దేశవాళీ క్రికెట్ అంటే మొదటగా గుర్తొచ్చేది రంజీ ట్రోఫీనే. అలనాటి భారత క్రికెటర్ రంజిత్ సింగ్ పేరు మీదుగా టోర్నీకి రంజీ పేరు పెట్టారు. 1872, సెప్టెంబరు 10న రైతు కుటుంబంలో జన్మించిన రంజిత్ యాషెస్‌లో ఇంగ్లండ్ తరఫున ఆస్ట్రేలియాపై ఆడారు. భారత్‌కు క్రికెట్‌ను పరిచయం చేసింది ఆయనే. రంజిత్ ఆటను చూసి, క్రికెట్‌ను కనిపెట్టిన బ్రిటిషర్లు సైతం ముగ్ధులయ్యేవారని చెబుతారు. నేడు రంజిత్ సింగ్ జయంతి.

News September 10, 2024

3 నెలల్లో 23 కేజీలు తగ్గిన హీరో

image

హాలీవుడ్ హీరో ఓర్లాండ్ బ్లూమ్ ఇటీవల రిలీజైన ‘ది కట్’ చిత్రం కోసం 3 నెలల్లో 23 కేజీలు తగ్గినట్లు వెల్లడించారు. ఒకేసారి చాలా బరువు కోల్పోవడంతో మానసిక సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఆకలి, కోపంతో ఇబ్బంది పడేవాడినని చెప్పారు. సినిమా షూటింగ్ ముగిశాక ఓ రాత్రి తాను చనిపోతానేమో అనిపించిందన్నారు. తన లవర్ కేటీ పెర్రీ సహకారం వల్ల ముందుకెళ్లగలిగానని పేర్కొన్నారు.

News September 10, 2024

ప్రముఖ రచయిత నటేశ్వర శర్మ కన్నుమూత

image

TG: ప్రముఖ రచయిత, అష్టావధాని అయాచితం నటేశ్వర శర్మ కన్నుమూశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన ఆయన అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన రచనలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2023లో దాశరథి పురస్కారంతో సత్కరించింది. 1956లో జన్మించిన నటేశ్వర శర్మ సంస్కృతం, తెలుగు భాషల్లో 50కి పైగా రచనలు రాశారు. వందకు పైగా అష్టావధానాలు చేశారు. ఆముక్తమాల్యదపై ఆయన విమర్శనా గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు.

News September 10, 2024

నా రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు: మురళీధరన్

image

టెస్టుల్లో తన అత్యధిక వికెట్ల(800) రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరని శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ మురళీధరన్ అభిప్రాయపడ్డారు. తాము 20 ఏళ్లు క్రికెట్ ఆడామని, ఇప్పుడు ప్లేయర్ల కెరీర్ తగ్గిపోయిందని తెలిపారు. అందరూ షార్ట్ ఫార్మాట్లపై ఫోకస్ చేస్తున్నారన్నారు. టెస్టు క్రికెట్ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. కాగా యాక్టీవ్ క్రికెటర్లు లియాన్(530), అశ్విన్(516) ముత్తయ్య కంటే ఎంతో వెనుక ఉన్నారు.

News September 10, 2024

ఐదు నెలల్లో 6,916 డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్

image

TG: గత 5 నెలల్లో నిబంధనలు ఉల్లంఘించిన 6,916 మంది డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ వెల్లడించింది. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్ చేసిన వారి లైసెన్సులు సస్పెండ్ చేశామంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా గత ఐదేళ్లలో రోడ్డు ప్రమాదాల్లో 35,053 మంది మరణించారని పేర్కొంది. వీరిలో 25-40 ఏళ్ల వారే అధికమని తెలిపింది.

News September 10, 2024

పత్తి మద్దతు ధర క్వింటా ₹7,521: మంత్రి అచ్చెన్నాయుడు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 50 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. క్వింటా ₹7,521 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని తెలిపారు. CCI, మార్కెటింగ్ శాఖ గుర్తించిన మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేలా మార్గదర్శకాలు విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది 5.79L హెక్టార్లలో 6 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు.

News September 10, 2024

మాజీ లవర్‌కు రోజూ వెయ్యి కాల్స్ చేసి..

image

మాజీ లవర్‌కు రోజూ వేలాది కాల్స్ చేసి ఓ నర్స్ వేధించిన ఘటన USలో జరిగింది. పెన్సిల్వేనియాలో డాక్టర్ డేవిడ్(54), నర్స్ సోఫీ(30) ప్రేమించుకున్నారు. కొన్నాళ్లకు సోఫీ అతడికి బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత మళ్లీ అతని వెంటపడింది. డేవిడ్‌పై నిఘా పెట్టేందుకు కారులో ట్రాకింగ్ డివైజ్ పెట్టింది. రోజుకు వెయ్యికి పైగా కాల్స్ చేసి విసిగించింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదుచేయగా, వారు ఆమెను అరెస్టు చేశారు.

News September 10, 2024

భారత్‌లో అత్యధికంగా యువత ఆత్మహత్యలు

image

భారత్‌లో యువత ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా వెల్లడించింది. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో దాదాపు 40 శాతం మంది 30 ఏళ్లలోపువారే. ప్రపంచ సగటుతో పోలిస్తే యూత్ సూసైడ్స్ భారత్‌లో రెండింతలు ఎక్కువ. రోజుకు సగటున 160మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అంచనా. ఆత్మహత్యలు పరిష్కారం కాదని తాత్కాలిక ఆగ్రహావేశాలతో నిండు జీవితాన్ని బలి చేసుకోవద్దని మానసిక నిపుణులు కోరుతున్నారు.

News September 10, 2024

డ్రీమ్ క్రికెట్‌ను వదిలి ఒలింపిక్స్‌లో గోల్డ్ సాధించి!

image

పాకిస్థాన్ జావెలిన్ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. అయితే, బాల్యం నుంచే క్రికెటర్ కావాలని నదీమ్‌కు కోరిక ఉండేదని ఆయన సోదరుడు షాహీద్ తెలిపారు. నదీమ్‌‌కు నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉండగా తండ్రి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవారు. నదీమ్‌ను క్రికెటర్ చేసేందుకు అయ్యే ఖర్చును తండ్రి భరించలేకపోవడంతో జావెలిన్ వైపు వచ్చేశారు.