India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టెస్టుల్లో రోహిత్ శర్మ ఫ్లాప్ షో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఆయన 3 పరుగులకే ఔటయ్యారు. గత 11 ఇన్నింగ్స్లలో 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3 రన్స్ చేసి నిరాశపరిచారు. వీటిలో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉండటం గమనార్హం. హిట్మ్యాన్ ఇకనైనా ఫామ్ అందుకోవాలని, లేదంటే టీమ్లో కొనసాగే అవకాశం ఉండకపోవచ్చని పలువురు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వాసన్ బాల డైరెక్షన్లో ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘జిగ్రా’ ఓటీటీలోకి వచ్చింది. నెట్ఫ్లిక్స్లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. ఓ అక్రమ కేసులో తమ్ముడు జైలుకు వెళ్లకుండా కాపాడుకునే పాత్రలో ఆలియా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

గుండెలో సొంత నరాల వ్యవస్థ ఉందని, దానినే మినీ బ్రెయిన్గా పిలుస్తారని కొలంబియా యూనివర్సిటీ కొత్త స్టడీ తెలిపింది. గుండె లయ నియంత్రణలో దీనిదే కీలక పాత్రని పేర్కొంది. ఇన్నాళ్లూ నరాల వ్యవస్థ ద్వారా మెదడు పంపించే సంకేతాలు పొంది పనిచేస్తుందన్న భావనను ఈ స్టడీ సవాల్ చేసింది. హృదయ కుడ్యాల్లోని సంక్లిష్ట న్యూరాన్స్ నెట్వర్క్ను గుర్తించింది. మనిషిని పోలిన గుండె కలిగిన జీబ్రాఫిష్ను ఈ టీమ్ స్టడీచేసింది.

ప్రముఖ కంపెనీలు ఆడి, <<14802633>>హ్యుందాయ్<<>> తరహాలోనే మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. 2025 జనవరి నుంచి కనీసం 4శాతం పెంచుతామని తెలిపింది. దీంతో కార్ల మోడళ్లను బట్టి ధరలు పెరిగే అవకాశం ఉంది. ముడి సరకు, రవాణా, నిర్వహణ ఖర్చులు పెరగడమే ఈ ధరల పెంపునకు కారణమని సంస్థ తెలిపింది. అయితే ఈ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయకతప్పడం లేదని పేర్కొనడం గమనార్హం.

గరం మసాలాతో భారతీయుల బంధం ఈనాటిది కాదు. కొన్ని వేల ఏళ్ల కిందటే ఆహారంలో దీనిని భాగం చేసుకున్నారు. మితంగా తింటే ఔషధంగా పనిచేసే ఈ దినుసుల కోసం యుద్ధాలే జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా 36 మసాలా పొడులను పరీక్షించిన టేస్ట్ అట్లాస్ భారతీయ గరం మసాలాకు రెండో ర్యాంకు ఇచ్చింది. ఇక చిలీలో దొరికే చిల్లీ పెప్పర్ అజితో చేసిన పొడికి NO1 ర్యాంకు కట్టబెట్టింది. జాటర్, జెర్క్, షిచిమి టొగారషి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

APకి చంద్రబాబు నాయకత్వం వహించలేరని, పవన్ ముందుకు రావాలని <<14805109>>VSR<<>> చేసిన ప్రతిపాదనపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ’74 ఏళ్ల గాంధీజీ క్విట్ ఇండియాతో యావత్ దేశాన్ని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడపగా లేనిది CBN APని లీడ్ చేయలేరా? బుర్ర పెట్టి ఆలోచించండి. APని ఎవరు పాలించాలో ప్రజలు నిర్ణయిస్తారు. అది మీ పని కాదు. చేసిన తప్పు ఒప్పుకొని జైలుకెళ్లి శిక్ష అనుభవించి రండి’ అని Xలో కౌంటర్ ఇచ్చారు.

అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసేలా కలెక్షన్లు కొల్లగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ పొందిన ఈ సినిమా తొలిరోజు నైజాంలో ఆల్ టైం రికార్డు సాధించింది. తాజా PR లెక్కల ప్రకారం ఏకంగా రూ.25 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో గతంలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అయ్యాయని సినీ వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో పుష్ప రాజ్ మాస్ జాతర ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి.

పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ను ఆదుకున్న తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి, అడిలైడ్ టెస్టులోనూ ఆపద్బాంధవుడయ్యారు. 3 సిక్సులు, 3 ఫోర్లతో 54 బంతుల్లో 42 రన్స్ చేసి జట్టు స్కోరును 180 పరుగులకు చేర్చారు. పింక్ బాల్ స్వింగ్ అవుతుండటంతో మేటి బ్యాటర్లు చేతులెత్తేసినా నితీశ్ టాప్ స్కోరర్గా నిలవడం విశేషం. భారత్కు సరైన ఆల్రౌండర్ దొరికాడంటూ నెట్టింట నితీశ్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది రోదసిలో నడవనున్నారు. అందుకోసం అవసరమైన ఏర్పాట్లను ఆమె సిద్ధం చేసుకుంటున్నారు. సూట్స్లో డేటా రికార్డర్ బాక్స్, ఆక్సిజన్ పనితీరు వంటివాటిపై ఆమె పనిచేస్తున్నారని నాసా తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆమె భూమికి తిరిగిరానున్నారు. వారం రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె సాంకేతిక కారణాలతో 6 నెలలకు పైగా అక్కడే ఉండిపోయిన సంగతి తెలిసిందే.

అల్లు రామలింగయ్య, మెగాస్టార్ కుటుంబాలు రెండు కాదు ఒక్కటేనని ఏపీ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చెప్పారు. వాళ్లు స్వయంకృషితో ఎదిగారు తప్ప కుటుంబం పేరు వాడుకోలేదన్నారు. ఇప్పుడు పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగులకు పెడార్థాలు తీసి అభిమానుల్లో అగ్గి రాజేసే పనిలో వైసీపీ శ్రేణులు, పెయిడ్ ఎనలిస్టులు ఉన్నారని ఆరోపించారు. సినిమాను సినిమాగానే చూడాలని, వారి ట్రాప్లో పడొద్దని సూచించారు.
Sorry, no posts matched your criteria.