India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: తప్పు చేస్తే ఎవరైనా ఒకటేనని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరిపైనైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘పేర్ని నాని తప్పు చేయకపోతే నెలరోజులు ఎక్కడికి పారిపోయారు. భార్యను అడ్డుపెట్టుకుని ఆయన రాజకీయాలు చేస్తున్నారు. నాని తప్పు చేయనిది హైకోర్టుకు ఎందుకు వెళ్లారు? ఆయన మేనేజర్ ఎక్కడికి పారిపోయారు’ అని మంత్రి ఫైర్ అయ్యారు.

మెల్బోర్న్ టెస్టులో టీమ్ ఇండియా క్రికెటర్ నితీశ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. నితీశ్ శతకం బాదగానే కామెంట్రీ బాక్సులో ప్రముఖ కామెంటేటర్ రవి శాస్త్రి భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు కారుస్తూనే ఆయన కామెంట్రీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రవి శాస్త్రిని అభినందిస్తున్నారు. యంగ్ ప్లేయర్లను ఆయన ఎంతో ప్రోత్సహిస్తారని అంటున్నారు.

కొన్ని సార్లు తీసుకున్న లోన్కు EMI కట్టడం ఆలస్యం అవుతుంటుంది. అలాంటి సమయంలో కొన్ని మార్గాలు పాటించాలి. సరైన సమయానికి లోన్ చెల్లించలేకపోతే వెంటనే బ్యాంకుకు తెలపాలి. కస్టమర్ కేర్కు కాల్ చేసి మీ పరిస్థితి చెప్పాలి. EMI తగ్గించుకోవడం, చెల్లింపు వ్యవధిని పెంచుకోవాలి. పెనాల్టీ పడితే దానిని మాఫీ చేయమని బ్యాంకును కోరాలి. మరో లోన్ తీసుకుని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. లోన్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు.

రామ్ చరణ్ వీరాభిమాని సూసైడ్ లెటర్ రాయడం కలకలం రేపింది. త్వరలో గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని అందులో పేర్కొన్నాడు. ‘సినిమాకు ఇంకా 13రోజులే ఉంది. అభిమానుల ఎమోషన్స్ను పట్టించుకోవడం లేదు. ఈనెలాఖరు లేదా JAN 1 వరకు రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతాను’ అని రాసుకొచ్చాడు. కాగా దీనిపై స్పందించిన మేకర్స్ ప్రోగ్రామ్స్ ప్లాన్ ప్రకారం జరుగుతాయని చెప్పినట్లు సమాచారం.

మరాఠి నటి ఊర్మిల కోఠారె ప్రయాణిస్తున్న కారు ముంబైలో బీభత్సం సృష్టించింది. మెట్రో పనులు చేస్తున్న ఇద్దరు కార్మికులపైకి ఆమె కారు దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్, నటి ఊర్మిలకు కూడా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.

టీమ్ ఇండియా కెప్టెన్ ఆస్ట్రేలియా పర్యటనలో పూర్తిగా నిరాశపరుస్తున్నారని బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ విమర్శించారు. ఇటు బ్యాటింగ్, అటు కెప్టెన్సీలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ‘రోహిత్ ఆడిన మూడు టెస్టుల్లోనూ పరుగులు రాబట్టలేకపోయారు. ఫామ్ లేమితో ఆయన సతమతమవుతున్నారు. మరోవైపు కెప్టెన్సీలోనూ బౌలర్లను ఉపయోగించడంలో అంతగా ఆకట్టుకోవడం లేదు’ అని ఆయన విమర్శించారు.

అయోధ్య పర్యాటక శోభను సంతరించుకోనుంది. ఈ పది రోజుల్లో బాలరాముడిని లక్షలాది భక్తులు దర్శించుకుంటారని అంచనా. 2024 ముగింపు, 2025 ఆరంభాన్ని ఈ దివ్యధామంలో జరుపుకొనేందుకు చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. JAN 15 వరకు అయోధ్య, ఫైజాబాద్లో హోటళ్లన్నీ బుక్కయ్యాయి. డిమాండును బట్టి ఒక రాత్రికి రూ.10వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు. టెంటులోని రామయ్య భవ్య మందిరంలో అడుగుపెట్టాక వచ్చిన తొలి CY 2025 కావడం విశేషం.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. టెక్నాలజీ చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా హీరోయిన్ సమంత బేబీ బంప్తో ఉన్నట్లు ఫొటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. తొలుత ఇవి చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. క్షుణ్ణంగా పరిశీలిస్తే AI ఇమేజెస్ అని తేలాయి. దీంతో వీటిని తయారుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

భారతమాత ముద్దుబిడ్డ, తొలి సిక్కు ప్రధాని మన్మోహన్ సింగ్ను ప్రస్తుత ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటివరకు మాజీ ప్రధానులందరి అంత్యక్రియలను అధికారిక శ్మశానవాటికలో నిర్వహించారు. కానీ మన్మోహన్ చివరి కార్యక్రమాలు నిగమ్బోధ్ ఘాట్లో జరిపి అవమానించారు’ అని మండిపడ్డారు. అలాగే సింగ్కు మెమోరియల్ ఏర్పాటు చేసి, ఆయనపై గౌరవాన్ని చాటుకోవాలని సూచించారు.

వలస విధానంపై ట్రంప్ కూటమిలో నిప్పు రాజుకుంది. టాప్ టాలెంట్ ఎక్కడున్నా USకు ఆహ్వానించాలని మస్క్, వివేక్ అంటున్నారు. మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ అవసరమని, భారత్లాంటి దేశాలకు పరిమితి విధించొద్దని సూచిస్తున్నారు. అమెరికన్ల ప్రతిభకేం తక్కువంటున్న ట్రంప్ సపోర్టర్స్ వీసాలపై పరిమితి ఉండాలని వాదిస్తున్నారు. గతంలో ‘INDIA FIRST’ అంటూ ట్వీట్ చేసిన శ్రీరామ్ కృష్ణన్ AI సలహాదారుగా ఎంపికవ్వడంతో రచ్చ మొదలైంది.
Sorry, no posts matched your criteria.