News February 7, 2025

కులగణన మళ్లీ చేయాలి: మాజీ మంత్రి

image

TG: కులగణన మళ్లీ చేయాలని, రెండోసారి సర్వే చేస్తే ప్రజల్లో ఎలాంటి అయోమయం ఉండదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సర్వే లెక్కల్లో స్పష్టత లేదని, ప్రజలకు ఎన్నో అనుమానాలున్నాయని పేర్కొన్నారు. 2014 కేసీఆర్ సర్కార్ నిర్వహించిన సర్వే కంటే ఇప్పటి సర్వేలో జనాభా 62 లక్షలు తగ్గిందన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

News February 7, 2025

ఈ ఊళ్లో అసలు చెప్పులు వేసుకోరు..!

image

AP: తిరుపతికి 50 కి.మీ దూరంలో ఉన్న ఉప్పరపల్లి పంచాయతీ వేమన ఇండ్లు గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు. ఆ గ్రామానికి కలెక్టర్, సీఎం వచ్చినా ఊరవతల చెప్పులు వదిలి రావాల్సిందే. ఇది వారి తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. వేంకటేశ్వరస్వామిపై ఉన్న భక్తితోనే వారు చెప్పులు ధరించరు. బయట ఫుడ్ అసలు తినరు. స్కూళ్లో మధ్యాహ్న భోజనం కూడా ముట్టరు. బయటి వ్యక్తులను తాకరు. అనారోగ్యంగా ఉన్నా ఆస్పత్రులకు వెళ్లరు.

News February 7, 2025

భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు

image

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లలో అనిల్ కుంబ్లే (956) తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రవిచంద్రన్ అశ్విన్(765), హర్భజన్ సింగ్ (711), కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్ (610), రవీంద్ర జడేజా (600), జవగళ్ శ్రీనాథ్ (551), మహ్మద్ షమీ (452) ఉన్నారు. ఇవాళ్టి మ్యాచులో జడేజా 600 వికెట్ల ఘనతను అందుకున్న సంగతి తెలిసిందే. వీరిలో మీ ఫేవరెట్?

News February 7, 2025

మహారాష్ట్రలో 173 GBS కేసులు

image

మహారాష్ట్రలో <<15225307>>గిలియన్ బార్ సిండ్రోమ్‌<<>> కేసుల సంఖ్య 173కి చేరింది. ఇవాళ కొత్తగా 3 కేసులు నమోదవగా, ఒక మరణం సంభవించింది. దీంతో ఆ రాష్ట్రంలో GBS అనుమానిత మరణాల సంఖ్య 6కి చేరింది. ఇప్పటివరకు ఆస్పత్రి నుంచి 72 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. పుణే సిటీలో 34, మున్సిపాలిటీ సరిహద్దు గ్రామాల్లో 87, ఇతర ప్రాంతాల నుంచి మిగిలిన కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

News February 6, 2025

పడుకునే ముందు ఈ పనులు చేస్తే..

image

రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు వ్యాయామం చేయడం మానుకోవాలి. దీని వల్ల శరీరం ఉత్తేజితమై నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాఫీ, చాక్లెట్లు తినకూడదు. వీటిలో ఉండే కెఫీన్ నిద్రలేమిని కలిగిస్తుంది. నిద్రించేముందు ఆల్కహాల్ తీసుకోకూడదు. అలాగే నీరు కూడా ఎక్కువగా తాగకూడదు. రాత్రి వేళల్లో స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉండాలి. పడుకునే ముందు ఫోన్‌ను వేరే గదిలో ఉంచడం బెటర్.

News February 6, 2025

కోహ్లీ గాయం శ్రేయస్‌కు వరమైంది!

image

కోహ్లీ గాయపడటం వల్లే ENGతో తొలి వన్డేలో తనకు ఆడే అవకాశం వచ్చిందని శ్రేయస్ అయ్యర్ తెలిపారు. ‘మ్యాచులో ఆడట్లేదని తెలిసి నిన్న రాత్రి సినిమా చూద్దామని అనుకున్నా. అప్పుడే కెప్టెన్ నుంచి కాల్ వచ్చింది. కోహ్లీ మోకాలికి గాయమైందని, అతని స్థానంలో ఆడేందుకు సిద్ధంగా ఉండమని చెప్పారు. అందుకే తొందరగా నిద్రపోయా’ అని మ్యాచ్ అనంతరం వెల్లడించారు. ఈ మ్యాచులో శ్రేయస్ 36 బంతుల్లో 59 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.

News February 6, 2025

కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ

image

TG: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఢిల్లీలో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఎంపీలు కూడా వేణును కలిశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ పనితీరు, మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయనతో చర్చిస్తున్నట్లు సమాచారం.

News February 6, 2025

రూ.72 లక్షలు పెట్టి కష్టపడి వెళ్లినా..

image

అమెరికా పిచ్చితో హరియాణాకు చెందిన ఆకాశ్ (20) 2.5 ఎకరాల భూమి అమ్మి రూ.65 లక్షలతో అక్రమ మార్గంలో US వెళ్లాడు. ఏజెంట్లకు మరో రూ.7 లక్షలు చెల్లించాడు. పనామా, మెక్సికో మార్గంలో ఎన్నో కష్టాలు భరించి అక్కడికి వెళ్లానని తెలిపాడు. తాజాగా ఆకాశ్‌ను అమెరికా ప్రభుత్వం ఇండియాకు పంపడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు. కాగా పంజాబ్, హరియాణా యువకుల్లో చాలా మందికి ఇంగ్లిష్‌పై పట్టు లేక US వీసాలు పొందలేకపోతున్నారు.

News February 6, 2025

త్వరలో వాట్సాప్‌లోనే బిల్స్ కట్టేయొచ్చు!

image

వాట్సాప్ ద్వారా కరెంటు బిల్లు, ఫోన్ రీఛార్జ్, LPG గ్యాస్, వాటర్ బిల్స్ కట్టే ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇతర యాప్‌లతో పనిలేకుండా ఇందులో నుంచే బిల్ పేమెంట్స్ చేసేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. కాగా భారత్‌లోని సెలక్టెడ్ యూజర్లకు ఈ యాప్ 2020లో మనీ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆ సేవలను యూజర్లందరికీ విస్తరించింది.

News February 6, 2025

GREAT: పండ్లు అమ్ముతూ జీవనం.. వచ్చిన లాభంతో అన్నదానం!

image

కేరళలోని త్రిసూర్‌లో జేసన్ పాల్ అనే వ్యక్తి పండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. అయినప్పటికీ ఆయన తనకొచ్చిన లాభంలో అధిక మొత్తాన్ని పేదల ఆకలి తీర్చేందుకు వెచ్చిస్తున్నారు. ఆయన వారంలో ఆరు రోజులు 100 నుంచి 150 మంది పేదలకు భోజనం అందిస్తున్నారు. పట్టలం రోడ్డులో రోజూ మధ్యాహ్నం 12 గంటలకు క్యాంపు ఏర్పాటు చేసి భోజనం పెడుతున్నారు. అన్నార్తుల ఆకలి తీర్చుతున్న జేసన్ పాల్ గొప్ప మనసును అభినందించాల్సిందే.