India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

2025 మార్చి నెలకు సంబంధించి శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను ఈనెల 24న విడుదల చేయనున్నట్లు TTD ప్రకటించింది. మరిన్ని వివరాలు..
* 21న ఉ.10 గంటలకు ఆర్జితసేవ, మ.3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు
* 23న ఉ.10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉ.11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు
* 23న మ.3 గం.కు వయోవృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లు.
వెబ్సైట్: <

TG: ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అనుమతి లెటర్ను ఇవాళ రాత్రి లేదా రేపు ఏసీబీకి సీఎస్ పంపిస్తారని వెల్లడించారు. కేటీఆర్ అరెస్టుపై తానేమీ చెప్పలేనని, చట్టప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తుందని వ్యాఖ్యానించారు. తమ బాంబు తుస్సుమనేదైతే ఆయన ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేశారని ప్రశ్నించారు.

LSలో మంగళవారం జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టనుండడంతో పార్టీ MPలకు BJP విప్ జారీ చేసింది. రేపు ఓటింగ్ జరిగే అవకాశం లేకున్నా తదుపరి సార్వత్రిక ఎన్నికల అజెండాను సెట్ చేసే అంశం కావడంతో BJP ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అర్జున్ మేఘ్వాల్ దీన్ని ప్రవేశపెట్టాక చర్చను ప్రారంభిస్తారా? లేక వెనువెంటనే అధికార, విపక్ష సభ్యులతో JPCని ప్రకటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండే గ్రామాల రైతులు ఉదయం 10 నుంచి సాయంత్రం 4లోపు పొలం పనులు చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. సోమవారం మండలిలో ఆమె మాట్లాడుతూ శీతాకాలంలో వన్యప్రాణుల సంచారం అధికంగా ఉండడంతో, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తున్న వారు ప్రమాదాల బారినపడుతున్నారని వివరించారు. Man-Animal Conflict బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. DEC 4న హీరో, హీరోయిన్ రావొద్దని ‘సంధ్య’ యాజమాన్యానికి పోలీసులు చెప్పినట్లు ఓ రిపోర్ట్ వైరల్ అవుతోంది. ‘అనుమతి లేకుండా ర్యాలీగా వచ్చారు. అభిమానులు దూసుకెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లేటప్పుడూ ర్యాలీగా అభివాదాలు తెలుపుతూ వెళ్లారు’ అని పోలీసులు చెప్పినట్లు అందులో ఉంది. దీన్ని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.

జవనరి 13 నుంచి UPలోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా ప్రారంభంకానుంది. పవిత్ర సాన్నమాచరించడానికి ప్రత్యేక ఘడియలను సూచిస్తున్నారు. Jan 13న(పుష్య పూర్ణిమ), 14న (మకర సంక్రాంతి), 29న (మౌని అమావాస్య), ఫిబ్రవరి 4న(వసంత పంచమి), 12న మాఘ పూర్ణిమ, 26న మహా శివరాత్రి రోజున పవిత్ర స్నానాలకు శుభదినాలని చెబుతున్నారు. 2019లో 25 కోట్ల మంది భక్తులు రాగా, ఈసారి 40 Cr మంది వస్తారని అంచనా.

తెలంగాణ గ్రూప్-2 పరీక్షల్లో టీడీపీ, చంద్రబాబుపై కొన్ని ప్రశ్నలు అడిగారు.
*నిజాం సాగర్, కడెం ప్రాజెక్టులు ఎవరి పాలనలో నిర్మించారు.
1.కాంగ్రెస్ 2.నిజాం 3.టీడీపీ 4.TRS
*చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థపై విజన్ 2020 డాక్యుమెంట్ తయారుచేసిన అంతర్జాతీయ సంస్థ ఏది?
1.మెక్కార్ట్నీ 2.మెక్ఆర్థర్ 3.మెక్కిన్సే 4.మెక్గ్రీన్

టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్ టెస్టుల్లో ఆసియా బయట పిచ్లపై తడబడుతున్నారు. టెస్టుల్లో అవకాశాలొస్తున్నా అర్ధ సెంచరీ కూడా చేయలేకపోతున్నారు. గత 16 టెస్టుల్లో ఆయన ప్రదర్శన ఇలా ఉంది. 1, 28, 31, 10, 36, 26, 2, 29, 10, 6, 18, 13, 4, 17, 8, 28 రన్స్ మాత్రమే చేయగలిగారు. కాగా కోహ్లీతో పాటు గిల్ తిరిగి ఫామ్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

AP: జగన్ తప్పు చేస్తే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయకుండా మౌనంగా ఉంటున్నారని CM CBNను APCC చీఫ్ షర్మిల ప్రశ్నించారు. ‘ఒప్పందం సక్రమం కాబట్టే రద్దు చేయడం లేదంటారా? లేకపోతే అదానీ జగన్నే కాదు మిమ్మల్నీ కొన్నారని చెప్తారా? అందుకే ACBని పంజరంలో బంధించారా? మీ 40 ఏళ్ల రాజకీయం ఇదేనా బాబుగారు? ప్రజలపై రూ.లక్షల కోట్ల భారం వేసిన ఈ డీల్పై కాంగ్రెస్ ఉద్యమం ఆపదు’ అని షర్మిల స్పష్టం చేశారు.

>>ఫస్టియర్ ఎగ్జామ్స్:
*మార్చి 5: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
*మార్చి 7: ఇంగ్లిష్ పేపర్-1
*మార్చి 11: మ్యాథ్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1 , పొలిటికల్ సైన్స్ పేపర్-1
*మార్చి 13: మ్యాథ్స్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
*మార్చి 17: ఫిజిక్స్ పేపర్-1, ఎకనమిక్స్ పేపర్-1
*మార్చి 19: కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1 (సెకండియర్ కోసం ఫ్లిప్ చేయండి)
Sorry, no posts matched your criteria.