News April 9, 2025

YS జగన్‌పై కేంద్రానికి టీడీపీ ఎంపీ ఫిర్యాదు

image

AP: మాజీ సీఎం జగన్ తీరు ప్రజాస్వామ్యానికి హానికరంగా మారిందని TDP MP లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ‘జగన్ ప్రసంగాలు శాంతి భద్రతలకు ముప్పు కలిగించేలా ఉన్నాయి. పర్యటనల పేరిట విధ్వంసాలు సృష్టించాలని చూస్తున్నారు. పోలీసుల నైతికతను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. బెయిల్‌పై ఉన్న ఆయన వ్యవస్థలను బెదిరించేలా వ్యవహరించడం బెయిల్ షరతులను ఉల్లంఘించడమే’ అని లేఖలో పేర్కొన్నారు.

News April 9, 2025

వాహనదారులకు BIG ALERT

image

తెలంగాణలో ఏప్రిల్ 1, 2019కి ముందు రిజిస్టర్ అయిన అన్ని వాహనాలకు కచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ (HSRP) అమర్చాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు SEP 30, 2025ని డెడ్‌లైన్‌గా విధించింది. యజమానులు www.siam.in/లో అప్లై చేసుకోవాలని సూచించింది. టూ వీలర్స్ రూ.320-రూ.380, త్రీ వీలర్స్ రూ.350-రూ.450, ఫోర్ వీలర్స్‌కు రూ.590-రూ.700, కమర్షియల్ వాహనాలకు రూ.600-రూ.800 చెల్లించాలి.

News April 9, 2025

GT భారీ స్కోర్.. RR టార్గెట్ ఎంతంటే?

image

IPL: రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 217-6 స్కోర్ చేసింది. సాయి సుదర్శన్ (82) పరుగులతో రాణించగా, బట్లర్ (36), షారుఖ్ (36) ఫర్వాలేదనిపించారు. RR బౌలర్లలో తీక్షణ, తుషార్ దేశ్‌పాండే చెరో 2 వికెట్లు తీయగా, ఆర్చర్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో రాజస్థాన్ గెలవాలంటే 20 ఓవర్లలో 218 రన్స్ చేయాలి.

News April 9, 2025

పిడుగులు పడి 13మంది మృతి

image

బిహార్‌లో పిడుగుపాటుకు గురై వేర్వేరు జిల్లాల్లో 13మంది మృతిచెందారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మధుబనీ జిల్లాలో పొలంలో పనిచేస్తున్న వారిపై పిడుగుపడటంతో తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు. మెుత్తంగా 4 జిల్లాల్లో పిడుగుల కారణంగా 13మంది ప్రాణాలు కోల్పోయారు. వీరికి ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

News April 9, 2025

మోదీని విమర్శించే స్థాయి నీకుందా రేవంత్: TBJP

image

TG: ప్రధాని మోదీపై CM రేవంత్ చేసిన విమర్శలకు తెలంగాణ BJP కౌంటరిచ్చింది. ‘ఓటుకు నోటు కేసులో దొరికిన నీకు మోదీని విమర్శించే స్థాయి ఉందా? రాహుల్ గాంధీకి ఊడిగం చేసే నువ్వా మాట్లాడేది? అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి పేద ప్రజల కడుపు కొడుతూ పబ్బం గడుపుకునే నువ్వా మాట్లాడేది? విదేశీ గడ్డపైనా ప్రశంసలు పొందిన మోదీని విమర్శించావంటే నీ స్థాయి ఏంటో, నీ కురచ బుద్ధి ఎలాంటిదో అర్థమవుతుంది’ అని ట్వీట్ చేసింది.

News April 9, 2025

రేపు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జగన్ సమావేశం

image

AP: ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ చీఫ్ జగన్ రేపు సమావేశం కానున్నారు. తాడేపల్లి కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల నేతలతో భేటీ కానున్నట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మీటింగ్‌కు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జిల్లాకు సంబంధించిన పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, MLAలు, MLCలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారని పేర్కొంది.

News April 9, 2025

గ్రూప్-1 సర్టిఫికెట్ వెరిఫికేషన్‌.. షెడ్యూల్ ఇదే

image

TG: గ్రూప్-1 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి TGPSC షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెలుగు వర్సిటీలో ఈనెల 16, 17, 19, 21న వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది. 22వ తేదీని రిజర్వ్ డేగా ప్రకటించింది. జీఆర్ఎల్ ఆధారంగా అభ్యర్థులను వెరిఫికేషన్‌కు పిలిచింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

News April 9, 2025

ఇండియాలో వెజిటేరియన్లు ఎంత శాతమంటే?

image

పెస్సెటేరియన్లు & శాకాహారులను కలిపితే ప్రపంచ దేశాల్లో అత్యధికంగా ఇండియాలో 20-39శాతం మంది ఉంటారని తాజా నివేదికలో వెల్లడైంది. ఆ తర్వాత మెక్సికో (19%), బ్రెజిల్ (14%), థైవాన్ (13-14%), ఇజ్రాయెల్ (13%), ఆస్ట్రేలియా (12.1%), అర్జెంటీనా(12%), ఫిన్లాండ్ (12%), స్వీడన్ (12%) ఉన్నాయి.
NOTE: పెస్సెటేరియన్లు అంటే చేపలు, ఇతర సముద్ర ఆహారాలతో పాటు శాకాహారం తినేవాళ్లు.

News April 9, 2025

గ్రూప్-2 పోస్టుల భర్తీ.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలివే

image

AP: స్పోర్ట్ కోటా, గ్రూప్-1 పరీక్షలు రాయబోయే అభ్యర్థులు మినహా మిగిలిన గ్రూప్-2 అభ్యర్థులకు ఈనెల 21 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు APPSC ప్రకటించింది. విజయవాడ కార్యాలయంలో ఉ.10 నుంచి సా.5.30 గంటల వరకు ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపింది. గ్రూప్-1 పరీక్షలు ఈనెల 27 నుంచి 30 వరకు జరగనుండగా, వాటికి హాజరయ్యే గ్రూప్-2 అభ్యర్థులకు మే 12 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది.

News April 9, 2025

దుబాయ్ టు ముంబై.. సముద్రంలో బుల్లెట్ ట్రైన్!

image

దుబాయ్ నుంచి ముంబైకి అండర్ వాటర్ బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు యూఏఈకి చెందిన నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ ప్లాన్ చేస్తోంది. దీని సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. హైపర్‌లూప్ వంటి లేటెస్ట్ టెక్నాలజీతో అరేబియన్ సముద్రంలో అల్ట్రా-హై స్పీడ్ ట్రైన్ రానున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా దుబాయ్-ముంబై మధ్య 2వేల కి.మీ దూరాన్ని 2 గంటల్లో చేరుకోవచ్చు.