India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: తేమ శాతం సాకుగా చూపి ధాన్యం కొనట్లేదని మాజీ సీఎం జగన్ చేసిన <<14774443>>ఆరోపణలను<<>> మంత్రి నాదెండ్ల మనోహర్ ఖండించారు. ‘మీ పాలనలో సరిగ్గా ఈ సమయానికి సేకరించిన ధాన్యం 4.43మె.టన్నులు. బాధ్యతతో కూటమి ప్రభుత్వం 9.14మె.టన్నులు సేకరించింది. ఈ లెక్కలు ఓసారి మీ కళ్లారా చూడండి. సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నాం. అన్నదాతకు అండగా నిలుస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్ తిరిగి జట్టులో చేరారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన ఆస్ట్రేలియా నుంచి నవంబర్ 26న ఇండియా తిరిగొచ్చారు. BGT సిరీస్లో భాగంగా 2వ టెస్టు కోసం నిన్న జట్టు అడిలైడ్ చేరుకోగా, గంభీర్ ఇవాళ జట్టులో చేరారు. ఈ వారం రోజులు అభిషేక్ నాయర్, డస్కాటే, మోర్నీ మోర్కెల్ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. తొలి టెస్ట్కు దూరమైన రోహిత్, గిల్ డిసెంబర్ 6న ప్రారంభం కానున్న 2వ టెస్టులో ఆడనున్నారు.

TG: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీచర్ ఎలిజిబిలీటీ టెస్ట్(TET) ఒకే షెడ్యూల్లో జరగనున్నాయి. జనవరి 1 నుంచి 19 వరకు ఈ 2 పరీక్షల షెడ్యూల్ ఉండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. జాతీయ స్థాయిలో జరిగే నెట్ పరీక్షను వాయిదా వేయడం కుదరదని, TETను TG ప్రభుత్వం వాయిదా వేయాలని వారు కోరుతున్నారు.

18వ లోక్సభలో ఎంపీలు కూర్చునే సీట్ల నంబర్లను ఫైనల్ చేశారు. ప్రధాని మోదీకి నంబర్ 1, రాజ్నాథ్ సింగ్కు 2, అమిత్ షాకు 3.. గడ్కరీకి 58 నుంచి 4వ సీటును కేటాయిస్తూ సోమవారం సర్క్యులర్ జారీ చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి 498వ సీట్, ఆయన పక్కన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూర్చోనున్నారు. ఇటీవల వయనాడ్ ఉపఎన్నికలో గెలిచిన ప్రియాంకా గాంధీకి 4వ వరుసలోని 517వ నంబర్ సీటు కేటాయించారు.

తెలంగాణ మలి దశ ఉద్యమ అమరుడు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు ఆయనకు నివాళులర్పించారు. ‘అగ్నికి ఆహుతి అవుతూ జై తెలంగాణ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించిన పోరాట యోధుడు. KCR గారి అరెస్టును, ఉద్యమ కారులపై ప్రభుత్వ అణిచివేతను సహించలేక ఆత్మబలిదానం చేసుకున్న తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళి. జోహార్ శ్రీకాంతాచారి’ అని ట్వీట్ చేశారు.

భారత్కు $1.17 బిలియన్ల విలువైన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను విక్రయించేందుకు US కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. తన నాలుగేళ్ల అధ్యక్ష పదవీకాలం మరి కొన్ని వారాల్లో ముగుస్తుండగా వీటిని భారత్కు అందించేందుకు బైడెన్ ఒకే చెప్పారు. ఇందులో MH-60R మల్టీ మిషన్ హెలికాప్టర్ భాగాలు, జాయింట్ టాక్టికల్ రేడియో సిస్టమ్స్, అడ్వాన్సుడ్ డేటా ట్రాన్స్ఫర్ సిస్టమ్స్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్స్ తదితర సామగ్రి ఉన్నాయి.

హైదరాబాద్ గచ్చిబౌలిలో నటి శోభిత శివన్న ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆమె తల్లి, అక్కాచెల్లెళ్లు నిన్న పోలీసుల విచారణలో పలు విషయాలు వివరించారు. ఆమె ఆత్మహత్యపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. పెళ్లి తర్వాత సీరియల్స్, సినిమాలు మానేసిందని, తెలుగులో అవకాశాల కోసం HYD వచ్చిందని చెప్పారు. ఒంటరిగా ఉండటం, అవకాశాలు రాక డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని వారు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యానికి ఏక్నాథ్ శిండే కారణమంటూ వస్తున్న విమర్శలపై శివసేన నేత కేసర్కర్ స్పందించారు. ‘మహాయుతి’ కూటమి ఐక్యతను కాపాడేలా CM ఎంపిక బాధ్యతను శిండే పూర్తిగా BJPకి అప్పగించారన్నారు. డిసెంబర్ 5న కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. BJP అధిష్ఠానం నియమించిన అబ్జర్వర్లు ఇవాళ సీఎం ఎవరో ప్రకటిస్తారని చెప్పారు. ముంబైలో నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి PM మోదీ వస్తారన్నారు.

IIT మద్రాస్లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థికి రూ.4.3 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. హాంకాంగ్లోని గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ ఈ జాబ్ ఆఫర్ను ఇచ్చింది. జీతం, బోనస్, రీలొకేషన్తో కూడిన ఈ ప్యాకేజీ ఈ సీజన్లోనే అత్యధికం కావడం విశేషం. అతని పేరు ఇంకా బయటకు రాలేదు. బ్లాక్రాక్, గ్లీన్, డా విన్సీ వంటి సంస్థలు పలువురికి రూ.2 కోట్ల కంటే ఎక్కువ ప్యాకేజీలను అందించాయి.

లో ఎర్త్ ఆర్బిట్ (LEO)లోని ఉపగ్రహాల రద్దీ కారణంగా భూమి కక్ష్యలో ట్రాఫిక్ జామ్ను గుర్తించారు. ప్రస్తుతం భూమి చుట్టూ 14,000 ఉపగ్రహాలు తిరుగుతుండగా వాటిలో దాదాపు 3,500 ఉపగ్రహాలు క్రియారహితంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా, గత ఉపగ్రహ ప్రయోగాలు, ఘర్షణల ద్వారా 120 మిలియన్ల శిథిలాలు కక్ష్యలోనే ఉండిపోయాయని అంచనా వేశారు. భవిష్యత్తులో ఇది అంతరిక్ష కార్యకలాపాలకు ముప్పు అని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.