News February 10, 2025

గాజాను సొంతం చేసుకొని పునర్నిర్మిస్తాం: ట్రంప్

image

గాజాను సొంతం చేసుకొని పునర్నిర్మిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మధ్య ఆసియాలోని ఓ ప్రాంతానికి దాన్ని అప్పగించి తమ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. హమాస్ అక్కడికి తిరిగి రాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే పాలస్తీనా శరణార్థులు కొందరిని అమెరికాలోకి అనుమతించేందుకు అవకాశం ఉందని, అయితే ఆ మేరకు వచ్చిన వినతులను సమీక్షించిన తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు.

News February 10, 2025

వాలెంటైన్స్ వీక్: ఇవాళ టెడ్డీ డే

image

వాలెంటైన్స్ వీక్‌లో నాలుగో రోజును టెడ్డీ డేగా పిలుస్తారు. ఇవాళ ప్రియురాలికి టెడ్డీని బహుమతిగా ఇస్తారు. తమ మధ్య ప్రేమబంధానికి ప్రతీకగా దీనిని భావిస్తారు. వీటిలో రెడ్ కలర్ డీప్ లవ్, పింక్ కలర్ ప్రపోజల్, ఆరెంజ్ హ్యాపీనెస్, ఎగ్సైజ్‌మెంట్‌కు గుర్తు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ థియోడర్ టెడ్డీ రూజ్ వెల్ట్ పేరు మీదుగా ‘టెడ్డీ’ బేర్ అనే పేరు వచ్చింది.

News February 10, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. నిబంధనలు ఇవే..

image

TG: సర్వే సమయంలో స్థలం చూపిన చోటే నిర్మించాలి. ముగ్గు పోసుకున్నాక గ్రామ కార్యదర్శికి చెబితే ఫొటోలు తీసి జియో ట్యాగింగ్ చేస్తారు. 400 చ.అ. కంటే తక్కువగా నిర్మాణం చేపట్టొద్దు. పునాది పూర్తయ్యాక తొలిదశలో రూ.లక్ష జమ చేస్తారు. 8 ట్రాక్టర్ల ఇసుక ఫ్రీగా ఇచ్చి, హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా సిమెంట్, స్టీలు తక్కువ ధరకు అందేలా చూస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యే దశను బట్టి AE/MPDOలు నగదు జమకు సిఫార్సు చేస్తారు.

News February 10, 2025

శ్రీవారి సర్వ దర్శనానికి 15గంటల టైమ్

image

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వర స్వామి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 84,536 మంది దర్శించుకోగా, 25,890 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

News February 10, 2025

రైతు బజార్లలో సబ్జీ కూలర్లు.. ఒక్కోటి రూ.27 లక్షలు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో సబ్జీ కూలర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరగా పాడయ్యే కూరగాయలు, పూలు, ఆకు కూరలను 3-5 రోజులపాటు, క్యారెట్, బీట్ రూట్, ముల్లంగి వంటి వాటిని వారం రోజులపాటు వీటిలో నిల్వ చేసుకోవచ్చు. ఒక్కో కూలర్‌ ధర రూ.27 లక్షలు ఉంటుంది. ఇందులో 50% ఉద్యాన శాఖ సబ్సిడీ ఇవ్వనుండగా, మిగతా 50% రైతు బజార్లలోని స్టాల్స్ నిర్వాహకులు భరించాల్సి ఉంటుంది.

News February 10, 2025

అర్చకుడిపై దాడి.. ప్రభుత్వం ఏం చేస్తోంది?: కేటీఆర్

image

TG: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు <<15408903>>రంగరాజన్‌పై దాడి ఘటనపై<<>> మాజీ మంత్రి KTR స్పందించారు. ఈ పిరికి చర్యపై హిందు ధర్మ రక్షకుల నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. దాడికి సంబంధించిన వీడియోలు ఉన్నాయని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు. ధర్మరక్షకులు దాడులు చేస్తే.. రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారని సెటైర్లు వేశారు.

News February 10, 2025

6 నెలల్లో అటవీశాఖలో పోస్టుల భర్తీ

image

AP: అటవీ శాఖలోని ఖాళీలను వచ్చే 6 నెలల్లో భర్తీ చేయనున్నామని ఆ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి తెలిపారు. APPSC ద్వారా రేంజి, సెక్షన్, బీట్ అధికారుల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అలాగే, రాష్ట్రంలో 50చోట్ల రూ.50కోట్లతో ఎకో టూరిజం డెవలప్ చేసి 4వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అటవీ శాఖ పట్టుకున్న 905MT ఎర్రచందనాన్ని త్వరలో విక్రయిస్తామని, రూ.350cr ఆదాయం వస్తుందని వివరించారు.

News February 10, 2025

నేడు సుప్రీంలో పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ

image

TG: పార్టీ మారిన 10 మంది MLAలపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్లపై నేడు SCలో విచారణ జరగనుంది. కడియం, దానం, తెల్లం వెంకట్రావుపై పాడి కౌశిక్, కేపీ వివేక్ పిటిషన్ వేయగా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలో చెప్పాలని అసెంబ్లీ సెక్రటరీని గత విచారణలో SC ఆదేశించింది. ఇక పోచారం, సంజయ్, యాదయ్య, కృష్ణమోహన్, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్, అరికెపూడిపై KTR, హరీశ్ రిట్ పిటిషన్ వేశారు.

News February 10, 2025

సర్పంచ్ పదవికి రూ.27 లక్షలు!

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే కొన్ని గ్రామాల్లో ఎలక్షన్ సందడి నెలకొంది. జోగులాంబ గద్వాల(D) గోకులపాడులో సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా, భీమరాజు అనే వ్యక్తి రూ.27.60 లక్షలకు వేలంపాట పాడారు. ఈ డబ్బును శివాలయం నిర్మాణానికి ఖర్చు చేయాలని గ్రామస్థులు తీర్మానం చేశారు. అయితే భీమరాజుకు ముగ్గురు పిల్లలు ఉండటంతో ఎలక్షన్ రూల్ ప్రకారం ఆయనకు ఈ పదవి దక్కుతుందో లేదో అనే చర్చ జరుగుతోంది.

News February 10, 2025

40 రోజుల్లో 81 మంది హతం

image

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఈ ఏడాదిలో గత 40 రోజుల్లో మొత్తం 81 మంది ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. గత ఏడాది 217 మంది మావోలు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న ఉదయం జరిగిన కాల్పుల్లో 31 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వారి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా 2026 మార్చి కంటే ముందే దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి ప్రకటించారు.