News April 4, 2025

అవి తప్పుడు వార్తలు.. మేం విప్ జారీ చేశాం: వైసీపీ

image

AP: రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా వైసీపీ తమ ఎంపీలకు విప్ జారీ చేయలేదని వస్తున్న వార్తలను ఆ పార్టీ ఖండించింది. అది పూర్తిగా తప్పుడు ప్రచారం అని, తాము అధికారికంగా విప్ జారీ చేశామని ట్వీట్ చేసింది. కొందరు రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. తాము సెక్యులర్ విలువలకు కట్టుబడి ఉన్నామని వైసీపీ స్పష్టం చేసింది.

News April 4, 2025

SRHకు వెంకటేశ్ అయ్యర్ కౌంటర్?

image

క్రికెట్‌లో దూకుడు అంటే ప్రతీ బాల్‌ను బాదడం కాదని, పరిస్థితులకు తగ్గట్లు ఆడటమని KKR ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ అన్నారు. ‘బాగా ఆడినప్పుడు 250, ఆడనప్పుడు 70 రన్స్‌కు పరిమితమవ్వాలని మా జట్టు కోరుకోదు. కండీషన్స్‌ బట్టి అంచనా స్కోరుకు మరో 20 రన్స్ అదనంగా చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలు SRHను ఉద్దేశించినవేనని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News April 4, 2025

ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

image

TG: ఇంటర్ ఫలితాలను ఈ నెల చివరి వారంలోగా రిలీజ్ చేసేందుకు ఇంటర్ బోర్డ్ ఏర్పాట్లు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 10వ తేదీకి పూర్తి కానుంది. కాగా, 35 మార్కులు రాని విద్యార్థులు నష్టపోకుండా వారి జవాబు పత్రాలను చీఫ్ ఎగ్జామినర్, సబ్జెక్ట్ నిపుణులతో ర్యాండమ్‌గా వాల్యుయేషన్ చేయిస్తున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. అటు ఏపీలో ఈ నెల 15లోపు ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది.

News April 4, 2025

బుచ్చిబాబుకు రామ్ చరణ్ స్పెషల్ గిఫ్ట్

image

డైరెక్టర్ బుచ్చిబాబుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక బహుమతి ఇచ్చారు. ఇటీవల 40వ బర్త్ డే జరుపుకున్న చరణ్.. జై శ్రీరామ్ అని రాసి ఉన్న ఆంజనేయస్వామి పాదుకలను డైరెక్టర్‌కు బహుమతిగా పంపారు. గిఫ్ట్ అందుకున్న బుచ్చిబాబు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బుచ్చిబాబు రామ్ చరణ్‌తో ‘పెద్ది’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

News April 4, 2025

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు

image

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. డా.ఎన్.గౌతమ్ రావును బరిలో నిలపాలని నిర్ణయించింది. సోషియాలజీలో డాక్టరేట్ పొందిన గౌతమ్ రావు విజ్ఞాన భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, 25న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.

News April 4, 2025

వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా వైసీపీ ఓటు?

image

రాజ్యసభలో వైసీపీ వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోందని నేషనల్ మీడియా పేర్కొంది. వైసీపీ, బీజేడీ (ఒడిశా) పార్టీలు ఓటింగ్ సందర్భంగా తమ ఎంపీలకు విప్ జారీ చేయకపోవడమే దీనికి నిదర్శనమని తెలిపింది. దీంతో ఏడుగురు వైసీపీ ఎంపీలు ఆ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి ఉంటారని వెల్లడించింది. కాగా బిల్లుకు 95 వ్యతిరేక ఓట్లు పడగా అందులో INDI కూటమి 88, BRS 4, అన్నాడీఎంకేవి 3 ఓట్లు ఉన్నట్లు సమాచారం.

News April 4, 2025

రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ‘స్లాట్ బుకింగ్’ సేవలు ప్రారంభం

image

AP: రాష్ట్రంలోని ప్రధాన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ‘స్లాట్ బుకింగ్’ సేవలను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త విధానాన్ని నెలాఖరు నుంచి దశల వారీగా అన్ని రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని వివరించారు. పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు.

News April 4, 2025

300 కాదు.. సగం కూడా కష్టమే!

image

IPL-2025: 300 లోడింగ్. SRH ఆడే ప్రతి మ్యాచుకు ముందు అభిమానుల ఆశ ఇది. 300 సంగతి పక్కన పెడితే అందులో సగం కూడా చేయలేకపోతోంది సన్‌రైజర్స్. ఉప్పల్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో అక్కడ భారీగా పరుగులు చేస్తున్నారు. మిగతా స్టేడియాల్లో పిచ్, పరిస్థితులను అంచనా వేయకుండా బ్యాట్ ఊపడమే పనిగా పెట్టుకున్నారు. ఫలితంగా ఓపెనర్లు తొలి ఓవర్లలోనే ఔట్ అవుతుండటంతో బ్యాటింగ్ కుప్పకూలుతోంది.

News April 4, 2025

GET READY: మరో రెండు రోజుల్లో..

image

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. మరో రెండు రోజుల్లో ఫస్ట్ షాట్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ట్వీట్ చేసింది. ఈ విషయం తెలుపుతూ కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

News April 4, 2025

ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్.. పెరగనున్న ఐఫోన్ ధరలు?

image

ట్రంప్ ప్రతీకార టారిఫ్‌ల వల్ల ఐఫోన్ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ల ప్రొడక్షన్ ప్రధానంగా చైనాలో జరుగుతోంది. ఆ దేశ ఉత్పత్తులపై US భారీగా టారిఫ్‌లు విధించింది. ఫలితంగా ఐఫోన్ ధరలు 30-40% వరకు పెరగనున్నాయి. ప్రధాన మార్కెట్లలో ఇప్పటికే ఐఫోన్ విక్రయాలు పడిపోగా, తాజా పరిస్థితుల్లో అమ్మకాలు మరింత పతనం కానున్నాయి. ఫలితంగా చైనా బయట ప్రొడక్షన్ జరిగే శామ్‌సంగ్ తదితర మొబైళ్ల కంపెనీలు లాభపడనున్నాయి.