News March 11, 2025

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు 65% పూర్తి: కిషన్ రెడ్డి

image

TG: హన్మకొండ(D) కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు పనులు 65% పూర్తయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు రివైజ్డ్ బడ్జెట్ రూ.716 కోట్లు అని పేర్కొన్నారు. 160 ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని అభివృద్ధి చేస్తున్నామని, ఇది ఏడాదికి 2,400కు పైగా వ్యాగన్లను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను Xలో షేర్ చేశారు.

News March 11, 2025

Stock Markets: తప్పని విలవిల..

image

స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో చలిస్తున్నాయి. నిఫ్టీ 22,356 (-104), సెన్సెక్స్ 73,724 (-383) వద్ద ట్రేడవుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ భయం, అమెరికా మార్కెట్లు కుప్పకూలడం నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. చమురు, రియాల్టి, హెల్త్‌కేర్ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. మిడ్, స్మాల్ క్యాప్, మీడియా, ఐటీ, ప్రైవేటు బ్యాంకు, వినియోగ, ఆటో, బ్యాంకు షేర్లు విలవిల్లాడుతున్నాయి. ఇండస్ఇండ్, ఇన్ఫీ, M&M, విప్రో టాప్ లూజర్స్.

News March 11, 2025

రోహిత్ వల్లే ఓడిపోయాం: శాంట్నర్

image

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఓడిపోవడంపై NZ కెప్టెన్ శాంట్నర్ స్పందించారు. బ్యాటింగ్‌లో 20రన్స్ తక్కువగా చేశామని, ఆపై రోహిత్ అసాధారణ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని తెలిపారు. హిట్‌మ్యాన్ బ్యాటింగే రెండు టీమ్‌ల మధ్య తేడా అన్నారు. బలమైన జట్టు చేతిలోనే ఓడిపోయామని వివరించారు. తమ జట్టు మంచి క్రికెట్ ఆడి INDకు గట్టి పోటీ ఇచ్చిందని చెప్పారు. ఈ ఓటమి చేదు, తీపితో కూడుకున్నదని తెలిపారు.

News March 11, 2025

త్వరలో 900 అంగన్వాడీలు ప్రారంభం: మంత్రి సంధ్యారాణి

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండుమూడు నెలల్లో 900 అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించనున్నట్లు మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అంగన్వాడీల్లో తాగునీరు, టాయిలెట్స్ కోసం రూ.7 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే గిరిజనుల కోసం 18 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని బడ్జెట్ ఆమోదం కోసం జరిగిన చర్చలో వివరించారు. మరోవైపు మహిళల సాధికారత TDPతోనే ప్రారంభమైందని వివరించారు.

News March 11, 2025

IPL: లక్నోకు బిగ్ షాక్!

image

ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం కారణంగా ఈ సీజన్ ఫస్టాఫ్‌కు అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గత సీజన్‌లో అదరగొట్టడంతో మెగా వేలంలో రూ.11 కోట్లు చెల్లించి మయాంక్‌ను LSG రిటైన్ చేసుకుంది. 150kmph వేగంతో బంతులు వేయడం మయాంక్ ప్రత్యేకత. కాగా మార్చి 24న లక్నో తన తొలి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

News March 11, 2025

18 సీజన్లు.. ఒక్కడే కింగ్: RCB

image

విరాట్ కోహ్లీని 2008లో సరిగ్గా ఇదే రోజున IPL ఆక్షన్‌లో కొనుగోలు చేసినట్లు RCB ట్వీట్ చేసింది. ‘U19 ప్లేయర్ డ్రాఫ్ట్ నుంచి ఈ టాలెంటెడ్ బాయ్‌ను తీసుకున్నాం. 18yrs తర్వాత కూడా ఈ గేమ్‌కు అతడే కింగ్. ఇది చాలా గొప్ప ప్రయాణం. థాంక్యూ విరాట్. 18 సీజన్లు, 1 టీమ్, 1 కాన్‌స్టాంట్ కింగ్’ అని ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని RCB ఈసారైనా ఛాంపియన్‌గా నిలుస్తుందేమో చూడాలి.

News March 11, 2025

కూటమి MLC అభ్యర్థుల ఆస్తుల వివరాలు

image

AP: MLA కోటా MLC ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఐదుగురు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. కూటమికి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంఛనమే. వారి ఆస్తుల వివరాలిలా..
* బీద రవిచంద్ర- రూ.41కోట్లు
* బీటీ నాయుడు- రూ.5.68కోట్లు
* కావలి గ్రీష్మ- రూ.1.78కోట్లు
* సోము వీర్రాజు- రూ.2.81కోట్లు
* నాగబాబు- రూ.70.32కోట్లు

News March 11, 2025

నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ

image

TG: తెలంగాణ భవన్‌లో KCR అధ్యక్షతన ఇవాళ BRS శాసనసభాపక్షం భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ప్రజాప్రతినిధులకు KCR దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లడంపై మార్గనిర్దేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 17 లేదా 19న ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

News March 11, 2025

తిరుమల: 13 కంపార్టుమెంట్లలో భక్తులు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,746 మంది దర్శించుకోగా, 23,649 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, పుష్కరిణిలో సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

News March 11, 2025

‘వేరే మార్గం లేక చనిపోతున్నాం.. క్షమించండి’

image

HYDలో పిల్లల్ని చంపి దంపతులు ఉరివేసుకున్న <<15717792>>ఘటనలో<<>> కీలక విషయాలు వెలుగుచూశాయి. కుమారుడు విశ్వాన్‌కు విషమిచ్చి, కూతురు శ్రీతకు ఉరివేసిన తర్వాత చంద్రశేఖర్, కవిత ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘మా చావుకు ఎవరూ కారణం కాదు. కెరీర్, మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా. వేరే మార్గం లేక చనిపోతున్నాం క్షమించండి’ అని చంద్రశేఖర్ సూసైడ్ నోట్ రాశారు. ఆయన 6 నెలల క్రితం లెక్చరర్‌గా జాబ్ మానేశారు.