India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి అన్నామలై రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తాను మరోసారి అధ్యక్ష పదవి రేసులో ఉండనని స్పష్టం చేయడంతో ఏ క్షణంలోనైనా అన్నామలై రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉంది. పార్టీలో ఎంతోమంది గొప్ప నేతలు ఉన్నారని, వారి నుంచే కొత్త నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని ఆయన తెలిపారు.

TG: పాల సేకరణ ధరల్లో విజయ డెయిరీ సవరణ చేసింది. 7% వెన్న ఉన్న గేదె పాల ధరను లీటర్కు రూ.56 నుంచి రూ.59.50కు, 10% వెన్న ఉంటే రూ.80 నుంచి రూ.84.60కి పెంచింది. 3% వెన్న ఉన్న ఆవు పాల ధర ఇప్పటి వరకు లీటర్కు రూ.40 ఉండగా రూ.36.50కు తగ్గించింది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. గేదె పాలు విక్రయించే రైతులకు లబ్ధి చేకూరనుండగా, ఆవు పాలు అమ్మే వారికి కాస్త నష్టం కలగనుంది.

AP: రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పంపకం కొనసాగుతోంది. ఇటీవల 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించగా, ఇవాళ మరో 38 కమిటీలకు ప్రభుత్వం నియామకాలు చేసింది. ఇందులో 31 టీడీపీకి, 6 జనసేనకు, ఒకటి బీజేపీకి దక్కింది. త్వరలోనే మిగతా కమిటీలకు ఛైర్మన్లను ప్రకటిస్తామని టీడీపీ వెల్లడించింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా 218 మార్కెట్ కమిటీలున్నాయి.

అమెరికా సుంకాల వేళ భారత స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు, నిఫ్టీ 345 పాయింట్లు కోల్పోవడంతో సుమారు రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో ONGC, హిందాల్కో, సిప్లా షేర్లు అత్యధికంగా 6శాతం చొప్పున నష్టపోయాయి. టారిఫ్ దెబ్బకు ఆటోమొబైల్, ఫార్మా, ఐటీ, మెటల్ రంగాల షేర్లు కుదేలయ్యాయి.

ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. వెన్నెముక గాయంతో BGT సిరీస్ ఆఖరి మ్యాచ్లో ఆయన దూరమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రికవరీలోనే ఉన్న ఈ పేసర్ తిరిగి ఫిట్నెస్ సాధించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరో రెండు మ్యాచ్ల తర్వాత నుంచి ఆయన అందుబాటులోకి రానున్నారని తెలిపాయి. ఈలోపు తుది దశ ఫిట్నెస్ టెస్టుల్లో పాల్గొంటారని సమాచారం.

TN BJP అధ్యక్ష రేసులో తాను లేనని ఆ పార్టీ ప్రస్తుత చీఫ్ అన్నామలై స్పష్టం చేశారు. ‘పార్టీలో ఎంతోమంది గొప్ప నేతలున్నారు. వారి నుంచే నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం’ అని పేర్కొన్నారు. ఇక.. వచ్చే ఏడాది ఎన్నికల్లో BJP ఒంటరిగా బరిలోకి దిగాలని అన్నామలై యోచిస్తుండగా ఆ పార్టీ AIADMKతో పొత్తు పెట్టుకోవచ్చన్న ఊహాగానాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అధ్యక్ష బరినుంచి తప్పుకున్నారన్న చర్చ నడుస్తోంది.

ప్రపంచంలోనే అతి చిన్నదైన పేస్మేకర్ను నార్త్వెస్ట్రన్ వర్సిటీ(US) సైంటిస్టులు రూపొందించారు. ఇది 1.8mm వెడల్పు, 3.5mm పొడవుతో ఒక బియ్యపు గింజ కంటే కూడా చిన్నగా ఉంటుంది. ఇది అన్ని సైజుల గుండెలకు పనిచేస్తుంది. అయితే గుండె జబ్బులతో జన్మించిన పిల్లలకు బాగా సూటవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హార్ట్ ఆపరేషన్ల సమయంలో టెంపరరీ పేస్మేకర్ కీలక పాత్ర పోషిస్తుందని, సైజ్ కూడా కీలకమేనని పేర్కొంటున్నారు.

తెలంగాణలో గ్రూప్1 పోస్టుల భర్తీకి న్యాయ చిక్కులు తొలగాయి. జీవో నెం.29ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు కొట్టేసింది. దీంతో ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇచ్చిన TGPSC త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచే అవకాశముంది.

మిలీనియమ్ ఇయర్ 2000లో భారత్లో 10 గ్రా. బంగారం సగటు ధర ₹4,400. తర్వాతి ఐదేళ్లలో ₹3వేలే పెరిగింది. ఆ తర్వాతి మూడేళ్లకు 2008లో ప్రపంచ మాంద్యంతో ₹13వేలకి చేరింది. 2018లో ₹30వేలు, 2020లో ₹50వేలు దాటింది. 2021లో ₹48వేలకు తగ్గినా 2022లో పెరిగి ₹55వేలకు వెళ్లింది. 2023లో ₹63వేలు, 2024లో ₹78వేలు పలికిన పసిడి ఇప్పుడు ₹90వేలపై కూర్చుంది. ఈ ఏడాది చివరికి లక్షకు చేరడం ఖాయమట. ఇది గోల్డ్ సిల్వర్ జూబిలీ కథ.

AP: పరిశ్రమల తరహాలోనే ఆస్పత్రుల నిర్మాణానికీ రాయితీలు ఇస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. వైద్యారోగ్య శాఖపై సమీక్షలో మాట్లాడుతూ ‘ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని నిర్మించాలి. PHC, CHCలలో వర్చువల్ వైద్య సేవలు అందించాలి. 13 డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టుకు చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.