India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న భక్తురాలు ఝాన్సీ(32) గుండెపోటుతో కుప్పకూలింది. తోటి భక్తులు, నర్సులు సీపీఆర్ చేసి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించేలోపు ఆమె ప్రాణాలు కోల్పోయింది. కడపకు చెందిన ఝాన్సీకి ఇద్దరు కవల పిల్లలున్నారు. కాగా అంబులెన్స్ గంట ఆలస్యంగా రావడంతోనే తమ కూతురు చనిపోయిందని తండ్రి బోరున విలపించాడు.
వినాయక చవితి సందర్భంగా దేవుడికి పూజ చేస్తూ..
‘‘ఓం గన్ గణపతయే నమో నమః
శ్రీ సిద్ధివినాయక నమో నమః
అష్టవినాయక నమో నమః
గణపతి బప్పా మోరియా’’ అనే మంత్రాన్ని పఠించాలి. ఇది దేవుడి గొప్ప గుణగణాలను కొనియాడే మంత్రం. జ్ఞానం, తెలివికి అధిపతి అయిన గణేశుడికి నమస్కరిస్తున్నానని దీనర్థం. విఘ్నేశ్వరుడిలోని లక్షణాలు మన జీవితంలోనూ అలవడాలని కోరుకోవాలి.
పాకిస్థాన్ T20, ODI కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజమ్ను తప్పించాలని PCB నిర్ణయించినట్లు సమాచారం. అతని స్థానంలో కీపర్ రిజ్వాన్ను నియమిస్తారని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. నవంబర్లో AUSతో జరిగే సిరీస్ నుంచి ఈ మార్పులు జరిగే ఛాన్సుంది. రిజ్వాన్ ఓకే చెబితే టెస్ట్ కెప్టెన్సీ కూడా అతడికే ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. షాన్ మసూద్ కెప్టెన్సీలో ఇటీవల BANపై PAK టెస్ట్ సిరీస్ ఓడిన సంగతి తెలిసిందే.
త్రిమూర్తులతో పాటు అనేక మంది దేవుళ్లకు స్త్రీ శక్తిరూపాలున్నాయి. అలాగే వినాయకుడికీ ఉంది. పూర్వం పార్వతీదేవిని అంధసారుడు మోహించగా, శివయ్య అతడిని త్రిశూలంతో చీల్చేస్తాడు. అయితే ప్రతి రక్తపు బొట్టు నుంచి అంధకాసురులు పుట్టుకొస్తారు. దీంతో పార్వతి అందరు దేవుళ్లూ ఏకంకావాలని పిలుపునిస్తుంది. ఆ క్రమంలోనే వినాయకుడి నుంచి స్త్రీ శక్తి స్వరూపం బయటికొస్తుంది. ఈమెను గణేశ్వరి, వినాయకి అని పిలుస్తారు.
AP: విజయవాడలో వరద బాధితులకు నిత్యావసరాలు, పాలు, వాటర్ బాటిల్స్, యాపిల్స్, బిస్కట్ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం వేగంగా సాగుతోంది. తొలి రోజు 15వేల కుటుంబాలకు ఇవ్వగా, ఇవాళ మరో 40 వేల ఫ్యామిలీలకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆధార్, రేషన్ కార్డులు లేనివారి నుంచి మొబైల్ నంబర్, కుటుంబ వివరాలు తీసుకుని ఉచిత సరుకులు ఇవ్వాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.
AP: ఖరీఫ్లో జిల్లాల వారీగా ఎంపిక చేసిన పంటలకు ఉచితంగా PMFBY, RWBCIS పథకాలను అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ-క్రాప్లో నమోదు చేసుకుంటేనే బీమా వర్తిస్తుందని, రైతు చెల్లించాల్సిన ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. రబీ నుంచి బీమా కావాలంటే రైతులే తమ వాటా ప్రీమియం (ఆహార ధాన్యాలు, నూనె గింజలకు 1.5%, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5% చొప్పున) చెల్లించాలని తెలిపింది.
TG: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన పంటలకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. కనీసం 33% నష్టపోయిన పంటలకు పరిహారం అందజేయాలని నిర్ణయించింది. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఈనెల 12లోగా వివరాలు అందజేయాలని ఆదేశించింది. వాటిని జిల్లా అధికారులు నిర్ధారించి, కలెక్టర్లకు పంపాలని పేర్కొంది. వారి ఆమోదంతో అర్హులైన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కోసం ప్రతిపాదనలు పంపాలంది.
క్రికెట్ చరిత్రలో తొలి 7 టెస్ట్ సెంచరీలను 7 వేర్వేరు జట్లపై చేసిన తొలి క్రికెటర్గా ఇంగ్లండ్ ప్లేయర్ ఒలి పోప్ నిలిచారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఈ ఫీట్ను సాధించారు. పోప్ కు ఇది 49వ టెస్ట్ కాగా, ఇప్పటివరకు 7 సెంచరీలు బాదారు. వీటిని ఆరు వేర్వేరు మైదానాల్లో చేయడం విశేషం. SA, NZ, IND, SL, WI, IRE, PAK జట్లపై ఆయన శతకాలు నమోదు చేశారు.
AP: టెన్త్ క్లాస్ 2022, 2023, 2024 బ్యాచ్ ఫెయిలైన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఏడాది పదో తరగతి సిలబస్లో మార్పులు జరగడం, సీబీఎస్ఈ సిలబస్ను అమలు చేస్తుండటంతో పాత విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. దీంతో అధికారులు క్లారిటీ ఇచ్చారు. వారు చదువుకున్న సిలబస్తోనే ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపారు.
TG: మంత్రి సీతక్కకు ఫోన్ చేసి తిట్టిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 4న గుర్తుతెలియని వ్యక్తి సీతక్కకు మూడుసార్లు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించాడు. తీవ్రంగా పరిగణించిన ఆమె తన డ్రైవర్ శ్రీనుతో పీఎస్లో ఫిర్యాదు చేయించారు. మొబైల్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.