News October 13, 2024

ప్రభుత్వానిదే బాధ్యత.. సిద్దిఖీ హత్యపై రాహుల్

image

MH మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హ‌త్య‌కు ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాలని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాహుల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్దిఖీ కుటుంబ సభ్యుల‌కు సానుభూతిని ప్ర‌క‌టించారు. ఈ హ‌త్య ఘ‌ట‌న MHలో శాంతిభ‌ద్ర‌త‌ల క్షీణ‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని రాహుల్ పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. సిద్దిఖీ హత్య బాలీవుడ్ చిత్రసీమలోనూ తీవ్ర విషాదం మిగిల్చింది.

News October 13, 2024

భారీ వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక

image

ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలతో విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. వర్షాలకు వాగులు, కాలువలు పొంగే అవకాశం ఉందని, పిడుగులు పడొచ్చని తెలిపింది. రైతులు, గొర్రెలకాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. అత్యవసరమైతే 1070, 112, 1080-425-0101 నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపింది.

News October 13, 2024

మద్యంపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధింపు

image

AP: భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం ధరకు సంబంధించి అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫీజు కింద MRPలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు రౌండాఫ్ చేసింది. MRP ₹160.50గా ఉంటే దాన్ని ₹170కి పెంచేలా ఫీజు ఉంటుంది. ప్రభుత్వం క్వార్టర్ బాటిల్ ధర ₹99కే నిర్ధారించడంతో రూ.100లో రూ.1 మినహాయించి విక్రయిస్తారని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

News October 13, 2024

బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలు మూతపడేది ఎప్పుడంటే?

image

శీతాకాలం ప్రారంభం అవుతుండటంతో ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల మూసివేత తేదీలను ఆలయ కమిటీ ప్రకటించింది. NOV 17న బద్రీనాథ్, కేదార్‌నాథ్, నవంబర్ 3న యమునోత్రి, గంగోత్రి ఆలయ తలుపులను మూసివేయనున్నారు. అలాగే రుద్రనాథ్ ప్రవేశద్వారాలు ఈ నెల 17న క్లోజ్ చేస్తారు. ఈ ఏడాది బద్రీనాథ్‌ను 11 లక్షల మంది, కేదార్‌నాథ్‌ను 13.5 లక్షల మంది దర్శించుకున్నారు. శీతాకాలంలో ఈ ఆలయాలు మంచుతో కప్పబడి ఉంటాయి.

News October 13, 2024

దసరా వేడుకల్లో విషాదం

image

AP: కోనసీమ, కడప జిల్లాల్లో దసరా ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా అమలాపురం మండలం కొంకాపల్లిలో డీజే సౌండ్‌కు వినయ్ అనే యువకుడు డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించాడు. మరోవైపు కడపలోని బెల్లంబండి వీధిలో దసరా ఊరేగింపులో పందిరి పైభాగానికి విద్యుత్ తీగలు తగిలాయి. షాక్‌తో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.

News October 13, 2024

ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన 34 ప్రపంచ దేశాలు

image

లెబ‌నాన్‌లోని UN శాంతిప‌రిర‌క్ష‌ణ బ‌ల‌గాల స్థావ‌రాలపై ఇజ్రాయెల్ దాడుల‌ను భార‌త్‌తోపాటు 34 ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇలాంటి చ‌ర్య‌ల‌ను వెంట‌నే విర‌మించుకోవాల‌ని సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. ఇటీవ‌ల ద‌క్షిణ లెబ‌నాన్‌పై ఇజ్రాయెల్ జ‌రిపిన‌ దాడుల్లో ఐదుగురు శాంతి పరిరక్షకులు గాయపడ్డారు. ఈ దాడుల్ని ఉద్దేశ‌పూర్వ‌క చ‌ర్య‌లుగా UNIFIL ఆరోపించింది. బ‌ల‌గాల ర‌క్ష‌ణ అత్యంత ప్రాధాన్యాంశంగా భార‌త్ పేర్కొంది.

News October 13, 2024

సీఐడీ చేతికి మరో 2 కేసులు అప్పగింత

image

AP: మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసును సీఐడీకి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కేసులు మంగళగిరి, తాడేపల్లి పీఎస్‌ల పరిధిలో ఉన్నాయి. విచారణ వేగవంతం కోసం ఈ నిర్ణయం తీసుకోగా, ఆయా ఫైళ్లను సీఐడీకి మంగళగిరి డీఎస్పీ రేపు అప్పగించనున్నారు.

News October 13, 2024

క్రిశాంక్‌కు మెయిన్‌హార్ట్ సంస్థ నోటీసులు

image

TG: BRS నేత మన్నె క్రిశాంక్‌కు సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ విషయంలో తమ కంపెనీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఆరోపణలు చేయడంపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అటు తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గనని, నోటీసులపై KTR, బీఆర్ఎస్ లీగల్ సెల్‌తో చర్చిస్తున్నట్లు క్రిశాంక్ బదులిచ్చారు.

News October 13, 2024

రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ఈ నెల 14 నుంచి 16 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఏలూరు, పశ్చిమగోదావరి, పల్నాడు, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది.

News October 13, 2024

సిద్దిఖీ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం!

image

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హ‌త్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హ‌స్తం ఉన్న‌ట్టు తెలుస్తోంది. సిద్దిఖీని శ‌నివారం ముంబైలో ముగ్గురు దుండ‌గులు కాల్చి చంపారు. ఈ హ‌త్య‌ కేసులో కర్నైల్ సింగ్, ధరమ్‌రాజ్‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచార‌ణ‌లో వీరు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులని అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. హైప్రొఫైల్ సిద్దిఖీ హ‌త్య‌తో ముంబై ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది.