India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
Vodafone Idea షేర్ ధర శుక్రవారం 11.4% పడిపోయింది. ముందు రోజు ముగింపు రూ.15.09 నుంచి రూ.13.36 కనిష్ట స్థాయికి చేరుకుంది. రాబోయే రోజుల్లో స్టాక్ ధరలో 83% భారీ క్షీణతను చూడవచ్చన్న గోల్డ్మన్ సాచ్స్ అంచనాల నేపథ్యంలో స్టాక్ నష్టాలబాటపట్టింది. ఈ లెక్కన స్టాక్ ధర రూ.2.5 స్థాయికి చేరుకోవచ్చని చెప్పింది. బలహీన వృద్ధి, మార్జిన్ ఆదాయం, బ్యాలెన్స్ షీట్ వల్ల ధర తగ్గవచ్చని అంచనా వేసింది.
TG: వరదల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలను ఒకే <<14038049>>తీరుగా<<>> చూడాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ స్పందించారు. విపత్తుల సమయంలో ప్రజలకు సాయం చేయడంలో పార్టీలు, రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు కలిపి తక్షణ సాయంగా రూ.3,300 కోట్లు ప్రకటించామని వెల్లడించారు. ఇకపైనా అండగా ఉంటామని సెక్రటేరియట్లో సీఎంతో భేటీ సందర్భంగా హామీ ఇచ్చారు.
తిరుమలలో దాదాపు 4ఏళ్ల తర్వాత తిలక ధారణ కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది. దీన్ని టీటీడీ ఈవో శ్యామలరావు పున:ప్రారంభించారు. తిరుమలలోని ఏటీసీ, సుపథం, వరాహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, VQC ఎంట్రీలు, రూ.300 లైన్, KKC మెయిన్ వద్ద నిరంతరాయంగా తిలక ధారణ అందుబాటులో ఉంటుందని చెప్పారు. కాగా కరోనా వల్ల ఈ కార్యక్రమాన్ని టీటీడీ గతంలో నిలిపివేసింది. తాజాగా పున:ప్రారంభించింది.
దేశంలో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లీటరుకు రూ.4 నుంచి రూ.6 వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. క్రూడాయిల్ ధర 70 డాలర్లకు చేరువలో ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నవంబర్లో మహారాష్ట్ర, హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకూ ధరలు తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం తనకు TPCC చీఫ్ బాధ్యతలు అప్పగించడంపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నిర్దేశానుసారం, సీనియర్ల మార్గదర్శకత్వంలో పని చేస్తానన్నారు. తెలంగాణ ప్రజల సేవలో పార్టీని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.
శాకాహార భోజనం ధరలు జులైతో పోలిస్తే ఆగస్టులో 8 శాతం తగ్గినట్లు క్రిసిల్ తాజా నివేదికలో వెల్లడించింది. అలాగే నాన్వెజ్ భోజనం ధరలు 12 శాతం తగ్గినట్లు పేర్కొంది. టమాటా, ఎల్పీజీ, అందులో వినియోగించే సరకుల ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని తెలిపింది. మరోవైపు చికెన్ ధరలు భారీగా 50 శాతం తగ్గడంతో నాన్వెజ్ థాలీ ధరలు దిగి వచ్చినట్లు వెల్లడించింది.
ఆర్టికల్-370 అనేది ముగిసిన అధ్యాయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కశ్మీర్ పర్యటనలో స్పష్టం చేశారు. దాన్ని తిరిగి తీసుకురావడం జరగదని తేల్చిచెప్పారు. 370వ అధికరణను తిరిగి తీసుకొస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడంతో షా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాగా.. జమ్మూకశ్మీర్లో 2014 తర్వాత తొలిసారిగా ఈ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 8న ఫలితాలు వెల్లడవుతాయి.
TG: డీఎస్సీ ఫైనల్ కీ విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు కీ కోసం ఇక్కడ <
టాలీవుడ్ హీరో నితిన్ తండ్రయ్యారు. ‘మా కుటుంబంలోకి కొత్త తారకు స్వాగతం’ అంటూ ఆయన ఒక ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ క్రమంలో అతడి ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. నితిన్ 2020 జులైలో షాలినిని వివాహమాడారు. అటు ‘తమ్ముడు’ టైటిల్లో ఆయన ఓ సినిమా చేస్తున్నారు.
TG: 2 రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ను CM రేవంత్ కోరారు. ‘వరద ప్రభావిత జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లు, ఇళ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ పంట నష్టం వాటిల్లింది. వరద నష్టం రూ.5,438 కోట్లుగా అంచనా వేశాం. తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ కోసం నిధులు ఇవ్వండి. APకి ఎలా సాయం అందిస్తారో మాకూ అలాగే చేయండి’ అని విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.