News September 6, 2024

కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాలేదు: CM చంద్రబాబు

image

AP: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయంగా రూ.3,300 కోట్లు ఇచ్చిందనేది ప్రచారం మాత్రమేనని CM చంద్రబాబు అన్నారు. సాయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. వరద నష్టంపై ప్రాథమిక అంచనా రిపోర్టు రూపొందించి రేపు ఉదయం కేంద్రానికి పంపిస్తామని సీఎం స్పష్టం చేశారు. బాధితులకు సాయం విషయంలో కేంద్రంతో పాటు బ్యాంకర్లతో మాట్లాడుతున్నామన్నారు. బీమా కట్టిన వారందర్నీ త్వరగా ఆదుకోవాలని కోరుతున్నామని తెలిపారు.

News September 6, 2024

72% పారిశుద్ధ్య పనులు పూర్తయ్యాయి: CM

image

AP: వరద ప్రభావిత ప్రాంతాల్లో 72% పారిశుద్ధ్య పనులు పూర్తయ్యాయని CM చంద్రబాబు వెల్లడించారు. మనుషులు వెళ్లలేని చోట్ల డ్రోన్లతో బాధితులకు ఫుడ్ అందించామన్నారు. AI, ఊబరైజేషన్ టెక్నాలజీ ఉపయోగించామని చెప్పారు. వరద బాధిత ప్రాంతాల్లో ఉచిత బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి సరకులు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు.

News September 6, 2024

తెలంగాణ‌కు నాలుగో స్థానం

image

విదేశీ ప్ర‌త్యేక్ష పెట్టుబ‌డుల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. DPIIT డేటా ప్రకారం 2024-25 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్‌) రూ.70,795 కోట్ల పెట్టుబ‌డుల‌తో మ‌హారాష్ట్ర మొద‌టిస్థానంలో నిల‌వ‌గా, క‌ర్ణాట‌క‌, ఢిల్లీ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ రూ.9,023 కోట్ల పెట్టుబ‌డుల‌ను ఆకర్షించి నాలుగో స్థానంలో నిలిచింది. గుజరాత్, తమిళనాడు, హరియాణా తరువాతి స్థానాల్లో నిలిచాయి.

News September 6, 2024

మాజీ క్రీడాకారిణితో పుతిన్‌కు ఇద్దరు పిల్లలు?

image

రష్యా మాజీ ఒలింపిక్ క్రీడాకారిణి అలీనా కబేవాతో ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు బిడ్డల్ని కన్నారని ఫోర్బ్స్ నివేదిక సంచలన కథనాన్ని ప్రచురించింది. మాస్కోలో పుతిన్‌కు చెందిన ఓ భారీ బంగ్లాలో అలీనా, ఆమె బిడ్డలు ఇవాన్, వ్లాదిమిర్ జూనియర్ కట్టుదిట్టమైన భద్రత మధ్య నివసిస్తున్నారని రాసుకొచ్చింది. కాగా పుతిన్‌కు ఓ మాజీ భార్య ఉన్నారు. ఆమెతో ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు కలిగారు.

News September 6, 2024

85శాతం జిల్లాల్లో విపరీత వాతావరణ పరిస్థితులు: అధ్యయనం

image

దేశవ్యాప్తంగా 85శాతం జిల్లాల్లో విపరీత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని ఐపీఈ గ్లోబల్, ఇస్రీ ఇండియా చేసిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. సంప్రదాయ వరద ప్రభావిత ప్రాంతాలు కరవుతో, సంప్రదాయ కరవు ప్రాంతాలు వరదలతో అల్లాడుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. 1973 నుంచి 2023 మధ్యకాలంలో వాతావరణ పరిస్థితుల వివరాలను అధ్యయనం చేసిన మీదట గత దశాబ్దకాలంలో వాతావరణంలో విపరీత మార్పులు ఐదింతలు పెరిగాయని వెల్లడించింది.

News September 6, 2024

పెళ్లి కార్డుపై వినాయకుడి ఫొటోనే ఎందుకు?

image

విఘ్నేశ్వరుడిని వివేకం, జ్ఞానం ప్రసాదించే దేవుడిగా భావిస్తారు. వివాహానికి సంబంధించిన పనులు వివేకంతో చేస్తూ విజయం సాధించాలని గణపతిని పూజిస్తారు. వినాయకుడు ఆదిపూజ్యుడు. నవ దంపతులు సంతోషకరమైన జీవితం కోసం ఆయన ఆశీర్వాదం పొందడానికి శుభలేఖపై ఫొటోను ముద్రిస్తూ భక్తిని చాటుకుంటారు. హిందూ ఆచారాల్లో వివాహం పవిత్రమైనది. ఈ బంధాన్ని చివరి వరకు కొనసాగించేందుకు పెళ్లిలో గణేశుడిని పూజించి ఆశీర్వాదం తీసుకుంటారు.

News September 6, 2024

గోల్డ్‌మన్ సాచ్స్ ఎఫెక్ట్‌.. 11.4% క్షీణించిన VI

image

Vodafone Idea షేర్ ధర శుక్రవారం 11.4% పడిపోయింది. ముందు రోజు ముగింపు రూ.15.09 నుంచి రూ.13.36 కనిష్ట స్థాయికి చేరుకుంది. రాబోయే రోజుల్లో స్టాక్ ధ‌ర‌లో 83% భారీ క్షీణతను చూడవచ్చన్న గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాల నేపథ్యంలో స్టాక్ నష్టాలబాటపట్టింది. ఈ లెక్క‌న స్టాక్ ధ‌ర‌ రూ.2.5 స్థాయికి చేరుకోవచ్చని చెప్పింది. బ‌ల‌హీన వృద్ధి, మార్జిన్ ఆదాయం, బ్యాలెన్స్ షీట్ వ‌ల్ల ధ‌ర త‌గ్గ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేసింది.

News September 6, 2024

సాయం చేయడంలో పార్టీలు, రాజకీయాలు ఉండవు: కేంద్ర మంత్రి

image

TG: వరదల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలను ఒకే <<14038049>>తీరుగా<<>> చూడాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ స్పందించారు. విపత్తుల సమయంలో ప్రజలకు సాయం చేయడంలో పార్టీలు, రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు కలిపి తక్షణ సాయంగా రూ.3,300 కోట్లు ప్రకటించామని వెల్లడించారు. ఇకపైనా అండగా ఉంటామని సెక్రటేరియట్‌లో సీఎంతో భేటీ సందర్భంగా హామీ ఇచ్చారు.

News September 6, 2024

తిరుమలలో మళ్లీ ‘తిలక ధారణ’

image

తిరుమలలో దాదాపు 4ఏళ్ల తర్వాత తిలక ధారణ కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది. దీన్ని టీటీడీ ఈవో శ్యామలరావు పున:ప్రారంభించారు. తిరుమలలోని ఏటీసీ, సుపథం, వరాహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, VQC ఎంట్రీలు, రూ.300 లైన్, KKC మెయిన్ వద్ద నిరంతరాయంగా తిలక ధారణ అందుబాటులో ఉంటుందని చెప్పారు. కాగా కరోనా వల్ల ఈ కార్యక్రమాన్ని టీటీడీ గతంలో నిలిపివేసింది. తాజాగా పున:ప్రారంభించింది.

News September 6, 2024

త్వరలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు!

image

దేశంలో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లీటరుకు రూ.4 నుంచి రూ.6 వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. క్రూడాయిల్ ధర 70 డాలర్లకు చేరువలో ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నవంబర్‌లో మహారాష్ట్ర, హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకూ ధరలు తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు.