News October 12, 2024

నాకు ఆ సమస్య ఉంది: ఆలియా భట్

image

తనకు ఆరోగ్యపరంగా ఉన్న సమస్య గురించి బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. ‘మా కూతురు రాహా ఫొటోను షేర్ చేయడంపై ఆసక్తి ఉండేది కాదు. తను ఇన్‌స్టాలో రీల్ కావడం నాకిష్టం లేదు. రాహాతో కలిసి ఫొటో దిగుదామని రణ్‌బీర్ అన్నప్పుడు కంగారుపడ్డా. ఎందుకంటే ప్రతి క్షణం నేను ఆందోళనకు గురవుతా. కొన్నిసార్లు అది తీవ్రంగా ఉంటుంది. రణ్‌బీర్ నా సమస్యను అర్థం చేసుకుని ప్రవర్తిస్తుంటాడు’ అని తెలిపారు.

News October 12, 2024

కశ్మీరీ పండిట్లకు ఫరూక్ అబ్దుల్లా కీలక వినతి

image

కశ్మీర్ వ్యాలీ నుంచి వలస వెళ్లిపోయిన పండిట్లు తిరిగి స్వస్థలాలకు రావాల్సిందిగా ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. నేషనల్ కాన్ఫరెన్స్‌ను శ‌త్రువులా భావించ‌వ‌ద్ద‌ని కోరారు. ‘వెళ్లిపోయిన వారు తిరిగి రావ‌డానికి స‌మ‌యం వ‌చ్చేసింది. మేము కేవ‌లం క‌శ్మీరీ పండిట్ల గురించే కాకుండా జ‌మ్మూ ప్ర‌జ‌ల గురించి కూడా ఆలోచిస్తాం. మ‌నం అంద‌రం భార‌తీయులం. అంద‌రినీ క‌లుపుకొని ముందుకెళ్లాలి’ అని పేర్కొన్నారు.

News October 12, 2024

ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత

image

ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 10 రోజులుగా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 9 ఏళ్లు జైలు జీవితం గడిపిన సాయిబాబా ఈ ఏడాది మార్చిలో విడుదల అయ్యారు. తూ.గో. జిల్లా అమలాపురంలో జన్మించిన సాయిబాబా పోలియో కారణంగా ఐదేళ్ల వయసు నుంచి వీల్ చైర్ ఉపయోగిస్తున్నారు.

News October 12, 2024

‘RAPO 22’ మూవీ అనౌన్స్‌మెంట్

image

మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్‌లో రామ్ పోతినేని ఓ సినిమా చేయనున్నారు. విజయదశమి సందర్భంగా ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ డైరెక్టర్ మహేశ్ బాబు చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రామ్‌కు ఇది 22వ చిత్రం కాగా నవంబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారు. హై ఎనర్జీతో న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్‌తో మూవీ ఉంటుందని నిర్మాణ సంస్థ తెలిపింది.

News October 12, 2024

ఈ విమాన ప్రయాణం ఒకటిన్నర నిమిషమే!

image

అత్యంత తక్కువ విమాన ప్రయాణ సమయమెంతో తెలుసా..? కేవలం ఒకటిన్నర నిమిషమే! స్కాట్లాండ్‌లోని ఓర్క్నీ దీవుల నుంచి పాపా వెస్ట్రే దీవుల మధ్య 1.7 మైళ్ల దూరం తిరిగే లోగన్‌ఎయిర్ విమానం ఆలోపే ప్రయాణికుల్ని గమ్యం చేరుస్తుంటుంది. ఈ రూట్‌లో స్టువర్ట్ లింక్‌లేటర్ అనే పైలట్ 53 సెకన్లలోనే ప్రయాణించి రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే ఈ ఫ్లైట్స్‌లో 10మంది మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది.

News October 12, 2024

పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొననున్న పవన్

image

ఈ నెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పల్లెపండుగ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించే వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. మొత్తం 13,324 పంచాయతీల్లో రూ.4,500 కోట్లతో ప్రభుత్వం పనులు చేపట్టనుంది. ఇంకుడు గుంతలు, పశువుల శాలలు, రోడ్లు ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

News October 12, 2024

HATSOFF: పొదల్లో పసిబిడ్డ.. దత్తత తీసుకున్న పోలీసు

image

అది యూపీలోని ఘజియాబాద్. పాపం ఇంకా కళ్లు కూడా తెరవని ఓ పసిగుడ్డును ఎవరో కఠినాత్ములు పొదల్లో వదిలేశారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ పుష్పేంద్ర సింగ్ అక్కడికి చేరుకున్నారు. ఆ బుజ్జాయిని చూసి చలించిపోయారు. పెళ్లై ఆరేళ్లైనా ఆయనకు పిల్లలు కలగలేదు. దీంతో దశమి రోజు దేవుడిచ్చిన వరంగా భావించి భార్యతో కలిసి ఆ చంటిదాన్ని దత్తత తీసుకున్నారు. ఆయన నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

News October 12, 2024

T20ల్లో టీమ్ ఇండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు

image

35 బాల్స్- రోహిత్ శర్మ vs శ్రీలంక
40- సంజూ శాంసన్ vs బంగ్లాదేశ్
45- సూర్య కుమార్ యాదవ్ vs శ్రీలంక
46*- అభిషేక్ శర్మ vs జింబాబ్వే
46- కేఎల్ రాహుల్ vs వెస్టిండీస్

News October 12, 2024

కూతురి హత్యకు తల్లి సుపారీ.. మతిపోయే ట్విస్ట్ ఏంటంటే..

image

ప్రేమలో ఉన్న కూతురిని హత్య చేయించాలనుకుందో తల్లి. అందుకోసం ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌కి సుపారీ ఇచ్చింది. అయితే ఆ కిల్లర్ తల్లినే చంపేశాడు. మతిపోయే ట్విస్ట్ ఏంటంటే.. కూతురి లవర్ ఆ కిల్లరే! ఈ నేరకథా చిత్రం యూపీలో చోటుచేసుకుంది. ఈ నెల 6న మృతురాలి శవాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా విషయం వెలుగుచూసింది. మృతురాలి కూతురు, ఆమె లవర్ కమ్ కిల్లర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

News October 12, 2024

కేసీఆర్ ఇంట దసరా వేడుకలు

image

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంట విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. సతీమణి, కుమారుడు, కోడలు, మనుమరాలుతో గులాబీ దళపతి వేడుకల్లో పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్న ఆయన మనుమడు హిమాన్షు అందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. తొలిసారిగా కుటుంబం దగ్గర లేకుండా దసరా చేసుకుంటున్నానని తెలిపారు. చాలా రోజుల తర్వాత బయటికొచ్చిన తమ అధినేత ఫొటోను బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.