India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 17న ఏపీలో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవానికి హాజరై ప్రసంగిస్తారు. దీంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా శీతాకాల విడిదిలో భాగంగా ముర్ము ఈ నెల 16 నుంచి 21 వరకు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో బస చేయనున్నారు.

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్లో సమావేశమయ్యారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు శాసనసభ సమావేశాలకు కేసీఆర్ వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇంగ్లండ్ ఆల్రౌండర్ గుస్ అట్కిన్సన్ అరుదైన రికార్డు సృష్టించారు. టెస్టుల్లో అత్యంత వేగంగా ఓ సెంచరీ, హ్యాట్రిక్, ఒకే మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా నిలిచారు. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో హ్యాట్రిక్ వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధ్యమైంది. కేవలం 10 టెస్టుల్లోనే అతను ఈ ఫీట్ నమోదు చేశారు. గతంలో ఇర్ఫాన్ పఠాన్ 26 టెస్టుల్లో ఈ రికార్డు సాధించారు.

AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత <<14819228>>బుద్దా వెంకన్న<<>> పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయవాడ సీపీ రాజశేఖర్బాబుకు లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే VSRను అరెస్టు చేయాలని కోరారు. కాకినాడ పోర్టు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు.

అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ను 198 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆ జట్టులో రిజాన్(47), జేమ్స్(40), ఫైజల్(39) ఫర్వాలేదనిపించారు. భారత్ బౌలర్లలో యుధజిత్, చేతన్, హర్దిక్ రాజ్ తలో 2, కిరణ్, కార్తికేయ, ఆయుశ్ చెరో వికెట్ తీశారు. భారత్ టార్గెట్ 199.

TG: టీఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీని ద్వారా 20Mbps వేగంతో నెలకు రూ.300కే ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించనున్నారు. మొబైల్, కంప్యూటర్, టీవీకి వినియోగించవచ్చని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. దీంతో పాటు మీసేవ మొబైల్ యాప్ను మంత్రి ప్రారంభించారు. దీని ద్వారా 150కి పైగా పౌర సేవలు అందించనున్నారు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో టీమ్ ఇండియా మూడో స్థానానికి పడిపోయింది. అడిలైడ్ టెస్ట్ తర్వాత మూడో స్థానంలో ఉన్న ఆసీస్ (60.71%) టాప్కు వెళ్లింది. ఒకటో స్థానంలో ఉన్న భారత్ (57.29%) మూడో స్థానానికి వచ్చింది. సౌతాఫ్రికా (59.26%) రెండో స్థానంలోనే కొనసాగుతోంది. BGTలో మిగతా 3 టెస్టులు గెలవకపోతే ఇండియా WTC ఫైనల్కు చేరే అవకాశాలు సన్నగిల్లుతాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.

పుష్ప-2 బాలీవుడ్లో అదరగొడుతోంది. 3 రోజుల్లోనే ₹205 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో జవాన్(₹180Cr), యానిమల్(₹176Cr), పఠాన్(₹161Cr) సినిమాలను అల్లు అర్జున్ వెనక్కు నెట్టారు. అలాగే హిందీలో తొలి 3 రోజుల్లో రెండు రోజులు ₹70Cr మార్క్ను దాటిన తొలి చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఈ మూవీ గురువారం ₹72Cr, శుక్రవారం ₹59Cr, శనివారం ₹74Cr సాధించింది.

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్, ఫ్రాన్స్ అధినేత మేక్రాన్తో జెలెన్స్కీ సమావేశమయ్యారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధాన్ని వీలైనంత త్వరగా, న్యాయమైన మార్గంలో ముగించాలని తామంతా కోరుకుంటున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడం, ప్రజల భద్రతపై చర్చించినట్లు పేర్కొన్నారు. వార్ ముగింపు విషయంలో ట్రంప్ దృఢ నిశ్చయంతో ఉన్నారన్నారు. భవిష్యత్తులోనూ తాము కలిసి పనిచేస్తామని చెప్పారు.

TG: ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా వనపర్తి(D) బలిజపల్లి ZP హైస్కూల్లో ఇలాంటి విషాదమే చోటుచేసుకుంది. సీఎం కప్ పోటీల్లో భాగంగా వాలీబాల్ ఆడుతూ సాయి పునీత్(15) అనే టెన్త్ క్లాస్ బాలుడు కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే విద్యార్థి గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Sorry, no posts matched your criteria.