India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమిళనాడు కవరైపెట్టైలో ఆగి ఉన్న గూడ్స్ రైలును భాగమతి ఎక్స్ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. రైలు మెయిన్ లైన్లో వెళ్లేలా సిగ్నల్ ఇవ్వగా, ట్రాక్ మాత్రం రైలును క్లోజ్డ్ లూప్ వైపు మళ్లించినట్లు దక్షిణ రైల్వే జీఎం ఆర్ఎన్ సింగ్ వెల్లడించారు. మెయిన్ లైన్పై వెళ్లాల్సిన రైలు ఎక్కడో తప్పు జరిగిన కారణంగా గూడ్స్ ఉన్న లైన్లోకి వెళ్లిందన్నారు. త్వరలోనే ఏం జరిగిందనేది ప్రకటిస్తామన్నారు.
హరియాణాలో BJP ప్రభుత్వం Oct 17న కొలువుదీరనుంది. పంచకులలో జరిగే కార్యక్రమంలో నాయబ్ సింగ్ సైనీ మరోసారి CMగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు నూతన మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణం చేయనున్నారు. ప్రధాని మోదీ, BJP పాలిత రాష్ట్రాల CMలు కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. కొత్త సభ్యులకు ఈసారి మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యం దక్కనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
గుజరాత్లోని జామ్నగర్ సంస్థాన మహారాజు శత్రుశల్య సిన్హ్జీ దిగ్విజయ్ సిన్హ్జీ జడేజా తమ వారసుడిగా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా పేరును ప్రకటించారు. తమ వారసుడిగా ఉండేందుకు అజయ్ అంగీకరించారని ఓ ప్రకటనలో తెలిపారు. జడేజా 1992-2000 మధ్యకాలంలో భారత్ తరఫున 15 టెస్టులు, 196 వన్డేలు ఆడారు. అనంతరం కొన్ని సినిమాల్లోనూ నటించారు. గత ఏడాది వరల్డ్ కప్లో అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్కు మెంటార్గా కూడా పనిచేశారు.
మైసూరు-దర్భంగా రైలు ప్రమాదం నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్నటి రైలు ప్రమాదం బాలాసోర్ ఘోర ప్రమాదాన్ని గుర్తుచేసింది. లెక్కలేనన్ని ప్రమాదాల్లో భారీ సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి పాఠాలు నేర్చుకోవడం లేదు. జవాబుదారీతనం అనేది పైనుంచే మొదలవుతుంది. ఇంకెన్ని కుటుంబాలు నాశనమైతే ఈ సర్కారు కళ్లు తెరుస్తుంది?’ అని మండిపడ్డారు.
ఐపీఎల్ వేలంలో అమ్ముడైన తర్వాత టోర్నీ నుంచి తప్పుకొంటే లీగ్ నుంచి రెండేళ్ల పాటు నిషేధం విధించాలన్న నిబంధనను బీసీసీఐ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ పాట్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నేనెప్పుడూ అలా తప్పుకోలేదు. కానీ నాకు తొలి ప్రాధాన్యం దేశానికి టెస్టులు, ఐసీసీ ట్రోఫీలు ఆడటమే. షెడ్యూల్ బట్టి IPL వంటి టోర్నీలు ఆడాలా వద్దా అని నిర్ణయించుకుంటుంటాను’ అని వెల్లడించారు.
దసరా రోజున కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగి రూ.77,670 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.250 ఎగసి రూ.71,200కి చేరుకుంది. గత రెండు రోజుల్లోనే 10 గ్రాములపై గోల్డ్ ధర రూ.1000కి పైగా పెరిగింది. కేజీ సిల్వర్ ధర రూ.1,000 పెరగడంతో రూ.1,03,000 పలుకుతోంది.
AP: శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడలిపై జరిగిన అత్యాచార <<14338493>>ఘటనపై <<>>సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన ఆయన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. అటు నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
ITBPలో 545 కానిస్టేబుల్(డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు నవంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10% ఖాళీలను ఎక్స్-సర్వీస్మెన్కు కేటాయించారు. టెన్త్ పాసైన 21 నుంచి 27 ఏళ్లు వారు దరఖాస్తుకు అర్హులు. హెవీ వాహనాలు నడిపే లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎంపికైన వారికి ₹21,700-69,100 పేస్కేల్ ప్రకారం జీతం చెల్లిస్తారు. ఫీజు ₹100. మరిన్ని వివరాలకు ఇక్కడ <
అస్సాంలోని మోరిగావ్ జిల్లా జైలు నుంచి శుక్రవారం రాత్రి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. లుంగీలు, దుప్పట్లను తాడులా చేసి 20 అడుగుల జైలు గోడను దూకేశారు. ఖైదీలు సైఫుద్దీన్, జియారుల్ ఇస్లాం, నూర్ ఇస్లాం, మఫీదుల్, అబ్దుల్ రషీద్ పోక్సో కేసుల్లో నేరస్థులని, వారి కోసం జిల్లావ్యాప్తంగా జల్లెడ పడుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఖైదీలకు ఎవరైనా సాయం చేశారా అనే కోణంలోనూ విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
దుర్గమ్మకు ఓ భక్తుడు ఏకంగా తలనే సమర్పించాలనుకున్న ఘటన ఇది. మధ్యప్రదేశ్లోని ‘మా బీజాసన్’ గుడికి శుక్రవారం వచ్చిన భక్తుడు తన తలను సమర్పించాలని యత్నించాడు. రేజర్తో మెడ కోసుకుంటుండగా ఇతర భక్తులు అడ్డుకున్నారు. అప్పటికే లోతుగా తెగిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సర్జరీ అనంతరం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. 9 రోజుల పాటు ఉపవాసం ఉండి తల ఇచ్చేందుకు ఆలయానికి వచ్చాడని పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.