News September 7, 2024

గణపతి పూజలో ‘గరిక’కు ప్రాధాన్యం.. కారణం ఇదే!

image

చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడినా పత్రిలో గరిక లేకపోతే వినాయకుడు లోటుగా భావిస్తాడని పూజారులు చెబుతున్నారు. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడి పుట్టించి దేవతల్ని ఇబ్బందులకు గురిచేశాడట. ఆ రాక్షసుడిని గణేశుడు మింగేయడంతో ఆయన శరీరం వేడిగా మారిందట. దీంతో రుషుల సూచనతో 21 గరిక పోచలను స్వామి తలపై పెట్టగా, వేడి తగ్గిపోయిందట. అందుకే పూజలో గరికకు ప్రాధాన్యం దక్కినట్లు చెబుతారు.

News September 7, 2024

ముంబైలో ‘దేవర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్?

image

Jr.NTR ‘దేవర’ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈనెల 10న ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుందని, ఇందులో మూవీ టీమ్ అంతా పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 45 సెకన్లు ఉంటుందని పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈనెల 27న థియేటర్లలోకి రానుంది.

News September 7, 2024

వరద ముంపు ప్రాంతాల్లో ఇంటింటి ఆరోగ్య సర్వే

image

AP: విజయవాడ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం రేపటి నుంచి ఇంటింటి ఆరోగ్య సర్వే చేపట్టనుంది. దీనికోసం ఓ యాప్‌ను సిద్ధం చేసింది. వరద వల్ల జ్వరాలు, జలుబు, దగ్గు, గాయాలు, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడిన వారి వివరాలను సేకరించనుంది. గత రెండు రోజుల్లో బాధితులకు 50వేలకు పైగా మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపింది. గర్భిణుల వివరాలనూ సేకరించి సాయం చేస్తున్నట్లు పేర్కొంది.

News September 7, 2024

వాళ్లిద్దరిలో ఒకరు INDకి ఆల్ ఫార్మాట్ కెప్టెన్ అవుతారు: DK

image

ఫ్యూచర్‌లో టీమ్‌ఇండియాకు ఆల్ ఫార్మాట్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ యువ ఆటగాళ్లలో ఇద్దరికే ఉందని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డారు. రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్‌కు ఆ సత్తా ఉందని, ఇప్పటికే IPLతో పాటు INDకి కొన్ని మ్యాచుల్లో వారిద్దరూ కెప్టెన్లుగా చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం టీ20లకు సూర్యకుమార్ కెప్టెన్‌గా ఉండగా, ODI, టెస్టుల్లో రోహిత్ శర్మ లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

News September 7, 2024

రాష్ట్రంలో 29 వరద ప్రభావిత జిల్లాలు: సీఎస్

image

TG: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా 29 జిల్లాలను ప్రభుత్వం వరద బాధిత జిల్లాలుగా ప్రకటించింది. ఈ లిస్టులో సిరిసిల్ల, HYD, రంగారెడ్డి, మేడ్చల్ మినహా మిగతా అన్ని జిల్లాలున్నాయి. ఇప్పటికే 4 జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేసినట్లు CS శాంతికుమారి తెలిపారు. మిగతా 25 జిల్లాలకు ₹3కోట్ల చొప్పున విడుదల చేస్తామని పేర్కొన్నారు. సహాయ, పునరావాస చర్యలపై ఎల్లుండి హై లెవెల్ మీటింగ్ నిర్వహిస్తామన్నారు.

News September 7, 2024

జూనియర్ లెక్చరర్లకు త్వరలో ప్రమోషన్లు

image

TG: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లకు డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పీజీలో 55% మార్కులు, నెట్/స్లెట్/పీహెచ్ ఉన్నవారు అర్హులని, ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జూనియర్ కాలేజీల్లో పనిచేసే లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లకూ పదోన్నతులు కల్పించనుంది. వారికి కూడా అప్లై చేసుకునే అవకాశాన్నిచ్చింది.

News September 7, 2024

గణేశ్ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?

image

రాష్ట్రకూట, శాతవాహన, చాళుక్యుల కాలం నుంచి గణేశ్ చతుర్థిని జరుపుకుంటున్నారు. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ గణేశ్ చతుర్థిని జరిపించారు. తర్వాత పీష్వా రాజవంశం దీనిని కొనసాగించింది. 1893లో పుణేలో తొలిసారి బహిరంగంగా గణేశ్ ఉత్సవాలు మొదలెట్టారు. జాతీయోద్యమంలో హిందువులందరినీ ఏకతాటిపైకి తేవడానికి బాలగంగాధర్ తిలక్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఆ తర్వాత నుంచి దేశమంతటా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు.

News September 7, 2024

గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్లే ఎందుకంటే…

image

వినాయక చవితి రోజున ప్రసాదం అంటే కుడుములు, ఉండ్రాళ్లే చేస్తాం. దానికో కారణముందంటారు పెద్దలు. ఈ దక్షిణాయన కాలంలో మన జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. అరుగుదల, ఆకలి రెండూ పెద్దగా ఉండవు. ఈ నేపథ్యంలో బియ్యప్పిండితో ఆవిరిమీద చేసిన వంటకాలు తేలిగ్గా అరగడమే కాక శరీరానికి ఆరోగ్యాన్ని, శక్తిని కూడా అందిస్తాయి. అందుకే చవితి నాడు కుడుములు, ఉండ్రాళ్ల వంటివాటిని వండుకుంటామనేది పెద్దల మాట.

News September 7, 2024

కోసిన ఉల్లిపాయ ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా?

image

తరిగిన లేదా ఒలిచిన ఉల్లిపాయను ఫ్రిడ్జ్‌లో ఉంచడం ప్రమాదకరం. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతుంది. తద్వారా ఫ్రిడ్జ్‌లోని ఇతర పదార్థాలకు బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఇది రకరకాల అనారోగ్యాలకు దారి తీస్తుంది. కట్ చేసిన ఉల్లిపాయను ఫ్రిడ్జ్‌లో పెడితే చేదుగా మారి టేస్ట్ పోతుంది. అందుకే అప్పటికప్పుడు కట్ చేసిన తాజా ఉల్లిపాయలను మాత్రమే వంటకాల్లో వాడటం ఉత్తమం.
> SHARE

News September 7, 2024

ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని గణపతిని కోరుకుంటున్నా: సీఎం

image

AP: తెలుగు ప్రజలకు CM చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ‘తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు అందరికి శుభం కలిగించాలని కోరుకుంటున్నాను. వీధులన్నీ చవితి పందిళ్లతో కళకళలాడాల్సిన సమయంలో వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాల పాలుచేశాయి. వారి బాధలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రానున్న రోజుల్లో రాష్ట్రానికి ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని గణపతిని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.