News December 8, 2024

PM కిసాన్ రూ.12వేలకు పెంచాలని డిమాండ్

image

వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను ఒక శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. PM కిసాన్ వార్షిక సాయాన్ని ₹6K నుంచి ₹12Kకు పెంచాలని కోరారు. PM ఫసల్ బీమా యోజన కింద సన్నకారు రైతులకు జీరో ప్రీమియంతో ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రీబడ్జెట్ సంప్రదింపుల సమావేశంలో విన్నవించారు. పురుగుమందులపై GSTని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని PHD ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతిపాదించింది.

News December 8, 2024

OTTలోకి వచ్చేసిన ‘కంగువా’

image

శివ డైరెక్షన్‌లో సూర్య నటించిన కంగువా మూవీ OTTలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 14న విడుదలైంది. సూర్య నటనకు ప్రశంసలు దక్కినా సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. బాబీ డియోల్, దిశా పటానీ, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు.

News December 8, 2024

హెడ్ విషయంలో సిరాజ్ విలన్ అయ్యారు: గవాస్కర్

image

ట్రావిస్ హెడ్‌ ఔట్ అయిన అనంతరం భారత బౌలర్ సిరాజ్‌కు, ఆయనకు మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అది పూర్తిగా అనవసరమని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. ‘హెడ్ ఒకట్రెండు పరుగులు కాదు.. 140 రన్స్ చేశారు. ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అలాంటి ఆటగాడిని ఔట్ చేయడం ద్వారా హీరో అవ్వాల్సిన సిరాజ్, తన చర్యతో విలన్ అయ్యారు. హెడ్‌ను అభినందించి ఉంటే ప్రేక్షకుల అభిమానం పొంది ఉండేవారు’ అని పేర్కొన్నారు.

News December 8, 2024

దక్షిణ కొరియా మాజీ రక్షణమంత్రి అరెస్ట్

image

సౌత్ కొరియా మాజీ రక్షణ మంత్రి కిమ్ యాంగ్-హ్యున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అధ్యక్షుడు యూన్ సుక్ మార్షల్ లా ప్రకటించడం వెనుక కిమ్ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నెల 4న ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుని విచారించింది. కిమ్‌తో పాటు అధ్యక్షుడు యూన్‌పైనా దేశద్రోహం కేసు నమోదు చేయాలని ప్రతిపక్షాలు ఇప్పటికే ఫిర్యాదు చేశాయి.

News December 8, 2024

అన్ని వైద్య కళాశాలల్లో ART సెంటర్లు

image

TG: రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో ART సెంటర్లు ఏర్పాటు చేయాలని జాతీయ వైద్య కమిషన్ ఆదేశించింది. దీంతో ఇప్పుడున్న 22కేంద్రాలతో పాటు త్వరలో 34సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో 1.20లక్షల మంది HIV/ఎయిడ్స్ బాధితుల్లో లక్షమందికి పైగా రెగ్యులర్‌గా మందులు తీసుకుంటున్నారు. 33 జిల్లాల్లో పరీక్షల నిర్వహణ, బాధితులకు సకాలంలో మందుల సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

News December 8, 2024

LIC స్కాలర్‌షిప్ స్కీమ్.. నేటి నుంచి దరఖాస్తులు

image

టెన్త్/ఇంటర్/డిప్లొమాలో 60% మార్కులు సాధించిన పేద విద్యార్థుల కోసం LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ <>స్కాలర్‌షిప్ స్కీమ్‌ను<<>> ప్రారంభించింది. 2021-22, 22-23, 23-24లో పాసైన వారు, 2024-25లో ఫస్టియర్ చదువుతున్న వారు అర్హులు. ఇవాళ్టి నుంచి ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెడిసిన్‌కు ఏటా ₹40వేలు, ఇంజినీరింగ్‌కు ₹30వేలు, డిగ్రీ, ITI కోర్సులకు ₹20వేల సాయం అందనుంది.
వెబ్‌సైట్: https://licindia.in/

News December 8, 2024

కోహ్లీ బ్యాటింగ్‌ టెక్నిక్‌లో సమస్య ఉంది: మంజ్రేకర్

image

విరాట్ కోహ్లీ అడిలైడ్ టెస్టులో 2 ఇన్నింగ్స్‌లలోనూ తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ఆయన ఆడుతున్న విధానంలో లోపం ఉందని కామెంటేటర్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ఆఫ్‌స్టంప్ ఆవల స్వింగ్ అయ్యే బాల్‌ను ఆడేందుకు కోహ్లీ కొత్త టెక్నిక్ ఎంచుకున్నారని, అది సత్ఫలితాలను ఇవ్వడంలేదని పేర్కొన్నారు. మరోవైపు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విరాట్‌కు మద్దతుగా నిలిచారు. ఇదే టెక్నిక్‌తో కోహ్లీ 9వేల పరుగులు చేశారని గుర్తుచేశారు.

News December 8, 2024

ఇంటింటి కులగణన సర్వే పూర్తి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం గత నెల 6న చేపట్టిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వే పూర్తయింది. GHMC మినహా అన్ని జిల్లాల్లో 100% సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. సర్వేలో సేకరించిన సమాచారాన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో భద్రపరుస్తున్నారు. మరో 4, 5 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. కాగా కులగణన సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ఎవరికీ ఇవ్వవద్దని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.

News December 8, 2024

BREAKING: రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

image

AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొత్త కారుకు పూజ చేసుకుని తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

News December 8, 2024

మహాయుతి గెలుపుపై ప్రజల్లో అసంతృప్తి ఉంది: పవార్

image

మహారాష్ట్ర ఎన్నికల్లో ‘మహాయుతి’ గెలుపుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని NCP(SP) చీఫ్ శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ధైర్యాన్ని కోల్పోకూడదని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. ‘మనం ఓడిన మాట నిజమే. దానిపై ఎక్కువ చింతించడం వల్ల ఉపయోగం లేదు. తిరిగి ప్రజల్లోకి వెళ్లాలి’ అని హితబోధ చేశారు. ఎంవీఏ కూటమిని సమాజ్‌వాదీ పార్టీ వీడటాన్ని పవార్ తోసిపుచ్చారు. ప్రతిపక్ష ఐక్యత కీలకమని అఖిలేశ్ భావిస్తున్నారని తెలిపారు.