News December 8, 2024

రేపు చలో అసెంబ్లీ: సర్పంచుల JAC

image

TG: పెండింగ్ బిల్లులు చెల్లించాలనే డిమాండ్‌తో రేపు అసెంబ్లీని ముట్టడించనున్నట్లు సర్పంచుల జేఏసీ ప్రకటించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్పంచులంతా అసెంబ్లీని ముట్టడిస్తారని జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ హెచ్చరించారు. శాసనసభ సమావేశాల్లో పెండింగ్ బిల్లులపై చర్చించాలని, సమావేశాలు ముగిసేలోగా రూ.500కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

News December 8, 2024

‘ఏపీలో 3వేల మంది బాలికల అదృశ్యం’.. CSకు NHRC సమన్లు

image

AP: రాష్ట్రంలో 3వేల మంది బాలికలు అదృశ్యమయ్యారని అందిన ఫిర్యాదు విషయంలో సీఎస్‌కు NHRC సమన్లు జారీ చేసింది. దీనిపై నివేదికలు పంపాలని రిమైండర్లు పంపినా స్పందించకపోవడంపై మండిపడింది. పూర్తి సమాచారం, డాక్యుమెంట్లతో జనవరి 20లోపు తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. బాలికల మిస్సింగ్‌పై ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా ఓ సామాజిక కార్యకర్త గత జనవరిలో కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

News December 8, 2024

చరిత్ర సృష్టించిన ‘పుష్ప-2’

image

భారత సినీ చరిత్రలో అత్యంత వేగంగా ₹500కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘పుష్ప-2’ రికార్డు సృష్టించింది. అలాగే హిందీలో తొలి 2 రోజుల్లో అత్యధిక వసూళ్ల (₹131కోట్లు) రికార్డు నెలకొల్పింది. తొలి 2 రోజుల్లోనే ₹449cr రాబట్టిన ఈ మూవీ, మూడో రోజు దేశవ్యాప్తంగా ₹120కోట్ల వరకూ రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. మూడో రోజు సౌత్‌(₹45cr) కంటే నార్త్‌లోనే(₹75cr) ఎక్కువ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.

News December 8, 2024

ప్రపంచ ధ్యాన దినోత్సవంగా DEC 21

image

ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలన్న ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ వెల్లడించారు. భారత్, శ్రీలంక, నేపాల్, మెక్సికో దేశాల బృందం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయని తెలిపారు. ‘సర్వజన శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఓ రోజు. డిసెంబర్ 21న ధ్యాన దినోత్సవంగా జరుపుకునేందుకు భారత్ మార్గనిర్దేశం చేసింది’ అని పేర్కొన్నారు.

News December 8, 2024

నాగార్జున‌సాగర్ నుంచి APకి 12TMC నీరు

image

నాగార్జున‌సాగర్ నుంచి APకి 12TMCల నీరు విడుదల కానుంది. 15.86TMCల నీటిని విడుదల చేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB)ను AP ప్రభుత్వం కోరింది. కాగా, ఇప్పటికే వాడుకున్న జలాలను పరిగణనలోకి తీసుకొని 12TMCల నీటిని జనవరి 31 వరకు విడుదల చేసేందుకు KRMB అనుమతి ఇచ్చింది. గత నెల 25తేదీ నాటికి 9.55TMCల నీటిని వాడుకున్నామని, 32.25TMC జలాలను వాడుకునేందుకు అర్హత ఉందని AP ప్రభుత్వం లేఖలో తెలిపింది.

News December 8, 2024

ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రం కొత్త రూల్స్

image

అత్యవసర పరిస్థితుల్లో ఐజీ లేదా ఆ పైస్థాయి పోలీస్ ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశించవచ్చని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ట్యాపింగ్‌కు ఆదేశించిన అధికారి సదరు ఆదేశాలు నిజమైనవేనని 7 పనిదినాల్లో నిర్ధారించకపోతే ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటాను దేనికీ వాడొద్దని, 2 రోజుల్లో ఆ డేటాను ధ్వంసం చేయాలని తెలిపింది. ట్యాపింగ్ ఆదేశాలను సంబంధిత శాఖల కార్యదర్శుల కమిటీ సమీక్షించాల్సి ఉంటుందని పేర్కొంది.

News December 8, 2024

12న ఏపీలో భారీ వర్షాలు

image

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది 11న శ్రీలంక- తమిళనాడు మధ్య తీరం దాటొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో 12న ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నేడు అనకాపల్లి, విశాఖ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.

News December 8, 2024

యాదగిరిగుట్టకు రికార్డ్ స్థాయి ఆదాయం

image

TG: కార్తీకమాసంలో ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, హుండీల ద్వారా యాదగిరిగుట్టకు రికార్డ్ స్థాయి ఆదాయం వచ్చింది. ఒక్క నెలలో రూ.18.03కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. గతేడాది ఇదే మాసంలో రూ.15.08 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఆలయం విమాన గోపురం బంగారు తాపడం కోసం రూ.25.52లక్షలు వచ్చినట్లు అధికారి వివరించారు.

News December 8, 2024

ఐటం సాంగ్స్‌కు శ్రీలీల నో?

image

‘కిస్సిక్’ సాంగ్‌తో మెరిసిన శ్రీలీల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఐటమ్ సాంగ్స్‌కు నో చెప్పాలని డిసైడ్ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి ‘విశ్వంభర’లోనూ ఐటం సాంగ్ ఆఫర్ రాగా ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. పుష్ప-2కు ఉన్న క్రేజ్, పుష్పలో సమంత ఐటమ్ సాంగ్ హిట్ కావడంతో ‘కిస్సిక్’ సాంగ్‌కు ఒప్పుకున్నట్లు సమాచారం. అటు, ఈ నెల 25న ఆమె నటించిన ‘రాబిన్‌హుడ్‌’ విడుదల కానుంది.

News December 8, 2024

ఆసియా కప్ ఫైనల్ నేడు.. భారత్, బంగ్లాదేశ్ ఢీ

image

దుబాయ్ వేదికగా నేడు అండర్-19 ఆసియా కప్ తుదిసమరం జరగనుంది. ఫైనల్‌లో భారత్, బంగ్లాదేశ్ పోటీ పడనున్నాయి. 8సార్లు కప్ గెలిచిన భారత్ ఓ వైపు, డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ మరోవైపు విజయం కోసం వ్యూహాలతో సిద్ధమయ్యాయి. ఇండియా టీమ్‌లో 13ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్‌లో అదరగొడుతుండగా, ఆయుశ్ మెరుగైన సహకారం అందిస్తున్నారు. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో పటిష్ఠంగా కనిపిస్తుండటంతో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది.