India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఖమ్మం జిల్లాలోని వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం అందజేయనుంది. అధికారులు 3 రోజులపాటు సర్వే నిర్వహించి జిల్లావ్యాప్తంగా బాధితులను గుర్తించారు. సుమారు 22వేల కుటుంబాలు బాధితులుగా గుర్తించినట్లు సమాచారం. సీఎం రేవంత్ ఇచ్చిన హామీ మేరకు వీరందరికీ రూ.10వేల చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ప్రక్రియ 3 రోజుల్లో ముగియనుంది.
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్ ఉందంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి, చైనాలో బీభత్సం సృష్టిస్తున్న ‘యాగి’ తుఫాన్ కారణంగా ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోందని చెప్పింది. దీంతో కుండపోత వర్షాల ముప్పు తప్పిందని వివరించింది.
చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడినా పత్రిలో గరిక లేకపోతే వినాయకుడు లోటుగా భావిస్తాడని పూజారులు చెబుతున్నారు. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడి పుట్టించి దేవతల్ని ఇబ్బందులకు గురిచేశాడట. ఆ రాక్షసుడిని గణేశుడు మింగేయడంతో ఆయన శరీరం వేడిగా మారిందట. దీంతో రుషుల సూచనతో 21 గరిక పోచలను స్వామి తలపై పెట్టగా, వేడి తగ్గిపోయిందట. అందుకే పూజలో గరికకు ప్రాధాన్యం దక్కినట్లు చెబుతారు.
Jr.NTR ‘దేవర’ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈనెల 10న ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుందని, ఇందులో మూవీ టీమ్ అంతా పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 45 సెకన్లు ఉంటుందని పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈనెల 27న థియేటర్లలోకి రానుంది.
AP: విజయవాడ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం రేపటి నుంచి ఇంటింటి ఆరోగ్య సర్వే చేపట్టనుంది. దీనికోసం ఓ యాప్ను సిద్ధం చేసింది. వరద వల్ల జ్వరాలు, జలుబు, దగ్గు, గాయాలు, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడిన వారి వివరాలను సేకరించనుంది. గత రెండు రోజుల్లో బాధితులకు 50వేలకు పైగా మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపింది. గర్భిణుల వివరాలనూ సేకరించి సాయం చేస్తున్నట్లు పేర్కొంది.
ఫ్యూచర్లో టీమ్ఇండియాకు ఆల్ ఫార్మాట్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ యువ ఆటగాళ్లలో ఇద్దరికే ఉందని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డారు. రిషబ్ పంత్, శుభ్మన్ గిల్కు ఆ సత్తా ఉందని, ఇప్పటికే IPLతో పాటు INDకి కొన్ని మ్యాచుల్లో వారిద్దరూ కెప్టెన్లుగా చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం టీ20లకు సూర్యకుమార్ కెప్టెన్గా ఉండగా, ODI, టెస్టుల్లో రోహిత్ శర్మ లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
TG: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా 29 జిల్లాలను ప్రభుత్వం వరద బాధిత జిల్లాలుగా ప్రకటించింది. ఈ లిస్టులో సిరిసిల్ల, HYD, రంగారెడ్డి, మేడ్చల్ మినహా మిగతా అన్ని జిల్లాలున్నాయి. ఇప్పటికే 4 జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేసినట్లు CS శాంతికుమారి తెలిపారు. మిగతా 25 జిల్లాలకు ₹3కోట్ల చొప్పున విడుదల చేస్తామని పేర్కొన్నారు. సహాయ, పునరావాస చర్యలపై ఎల్లుండి హై లెవెల్ మీటింగ్ నిర్వహిస్తామన్నారు.
TG: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లకు డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పీజీలో 55% మార్కులు, నెట్/స్లెట్/పీహెచ్ ఉన్నవారు అర్హులని, ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జూనియర్ కాలేజీల్లో పనిచేసే లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లకూ పదోన్నతులు కల్పించనుంది. వారికి కూడా అప్లై చేసుకునే అవకాశాన్నిచ్చింది.
రాష్ట్రకూట, శాతవాహన, చాళుక్యుల కాలం నుంచి గణేశ్ చతుర్థిని జరుపుకుంటున్నారు. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ గణేశ్ చతుర్థిని జరిపించారు. తర్వాత పీష్వా రాజవంశం దీనిని కొనసాగించింది. 1893లో పుణేలో తొలిసారి బహిరంగంగా గణేశ్ ఉత్సవాలు మొదలెట్టారు. జాతీయోద్యమంలో హిందువులందరినీ ఏకతాటిపైకి తేవడానికి బాలగంగాధర్ తిలక్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఆ తర్వాత నుంచి దేశమంతటా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు.
వినాయక చవితి రోజున ప్రసాదం అంటే కుడుములు, ఉండ్రాళ్లే చేస్తాం. దానికో కారణముందంటారు పెద్దలు. ఈ దక్షిణాయన కాలంలో మన జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. అరుగుదల, ఆకలి రెండూ పెద్దగా ఉండవు. ఈ నేపథ్యంలో బియ్యప్పిండితో ఆవిరిమీద చేసిన వంటకాలు తేలిగ్గా అరగడమే కాక శరీరానికి ఆరోగ్యాన్ని, శక్తిని కూడా అందిస్తాయి. అందుకే చవితి నాడు కుడుములు, ఉండ్రాళ్ల వంటివాటిని వండుకుంటామనేది పెద్దల మాట.
Sorry, no posts matched your criteria.