India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
T20WC సూపర్-8లో అఫ్గాన్పై భారత్ 20 ఓవర్లలో 181/8 స్కోర్ చేసింది. సూర్య 28 బంతుల్లో 53 పరుగులతో(3 సిక్సులు, 5 ఫోర్లు) రాణించారు. రోహిత్ 8, కోహ్లీ 24, పంత్ 20, దూబే 10, హార్దిక్ పాండ్య 32, అక్షర్ 12 రన్స్ చేశారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, ఫరూఖీ 3, నవీన్ ఉల్ హక్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
AP: అసంఘటిత రంగంలోని కార్మికులకు అమలు చేస్తున్న వైఎస్సార్ బీమా పథకం పేరును చంద్రన్న బీమాగా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే వైఎస్సార్ కళ్యాణమస్తు-చంద్రన్న పెళ్లి కానుక, వైఎస్సార్ విద్యోన్నతి- ఎన్టీఆర్ విద్యోన్నతి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన- పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ తదితర పేర్లను <<13464132>>మార్చిన<<>> విషయం తెలిసిందే.
భారత్లోని 3,600 IT స్టార్టప్ల ద్వారా గత ఏడాది $850M ఆదాయం వచ్చినట్లు నాస్కామ్ వెల్లడించింది. వాటిలో గత ఏడాదే 480 సంస్థలు ప్రారంభమైనట్లు తెలిపింది. ఈ రంగంలో IND ఆరో స్థానంలో ఉందని, త్వరలో థర్డ్ ప్లేస్కు చేరుకుంటుందని పేర్కొంది. 2014-22 మధ్య AI బేస్డ్ స్టార్టప్లు 62% పెరిగాయంది. క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్, రోబోటిక్స్ కేటగిరీల్లో భారీగా స్టార్టప్లు అందుబాటులోకి వస్తున్నాయని వివరించింది.
నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898AD రిలీజ్ ట్రైలర్ను రేపు సా.6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండండి అంటూ ఓ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికే రిలీజైన తొలి ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచింది. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు నటించిన ఈ మూవీ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో BJP సత్తా చాటిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు హైదరాబాద్లో ‘సెల్యూట్ తెలంగాణ’ ర్యాలీ చేపట్టారు. ముషీరాబాద్, నారాయణగూడ, హిమాయత్ నగర్ మీదుగా ర్యాలీ కొనసాగుతోంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్తో పాటు పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్ తదితరులు ఆ ర్యాలీలో పాల్గొనగా వారికి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి.
APలో ఎకో, టెంపుల్, అడ్వెంచర్ టూరిజం వంటి వాటిని ప్రోత్సహిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. స్టూడియోల నిర్మాణం కోసం ముందుకు రావాలని నిర్మాతలకు ఆహ్వానం పలికారు. సినిమా షూటింగులకు అనుగుణంగా కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. అదృష్టవశాత్తూ ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారన్నారు.
టీ20 వరల్డ్ కప్లో భాగంగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. 9.3ఓవర్లకు 75 రన్స్ చేసింది. రోహిత్(8), పంత్(20), కోహ్లీ(24) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఫరూకీ 1, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, దూబే ఉన్నారు. అఫ్గాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆరంభం కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. 6 ఓవర్లలో 47 రన్స్ చేసింది.
18వ లోక్సభ ప్రొటెం స్పీకర్గా బీజేపీ సీనియర్ నేత భర్తృహరి మెహతాబ్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ఈయన పార్లమెంట్ సమావేశాల్లో ప్రమాణం చేయిస్తారు. 1998లో తొలిసారి ఒడిశాలోని కటక్ ఎంపీగా BJD తరఫున తొలిసారి ఈయన గెలిచారు. తర్వాత వరుసగా 1999, 2004, 09, 14, 19లో విజయం సాధించారు. ఈ ఏడాది బీజేపీలో చేరి విజయ ఢంకా మోగించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న సీఎం కేజ్రీవాల్కు బెయిల్ లభించింది. రూ.లక్ష పూచీకత్తుతో ఆయనకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన తిహార్ జైలు నుంచి రేపు(శుక్రవారం) విడుదలయ్యే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్లో ఆయన లంచం తీసుకున్నారని ఈడీ కేజ్రీవాల్పై ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
NEET నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఈ విషయంలో లోతైన విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నీట్ అవకతవకలపై బిహార్ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. పారదర్శక పరీక్షల నిర్వహణే తమ లక్ష్యమని, విద్యార్థుల ప్రయోజనం విషయంలో రాజీపడబోమన్నారు. అందుకోసం బాధ్యులైన NTA అధికారులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.