India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: తాను వచ్చే వారం TDPలో చేరనున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ఇవాళ ఎంపీ కేశినేని చిన్నితో ఆమె భేటీ అయ్యారు. ఆమె ఇప్పటికే YCPకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సైతం TDP కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈనెల 9న ఆయన ఆ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన చేరికను పలువురు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.

ఈ నెల 5న విడుదలైన ‘పుష్ప-2’లో రష్మిక నటన, డాన్స్తో అదరగొట్టారని అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీ వసూళ్లు రాబడుతున్న ఈ మూవీ రష్మికకు మంచి హిట్ ఇచ్చింది. గత ఏడాది ‘యానిమల్’ మూవీ కూడా ఇదే నెలలో విడుదలై రూ.900 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇందులో గీతాంజలి పాత్రలో ఈ బ్యూటీకి మంచి మార్కులు పడ్డాయి. దీంతో రష్మికకు డిసెంబర్ మాసం కలిసొచ్చిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మహావికాస్ అఘాడీ(MVA) నుంచి తప్పుకొంటున్నట్లు సమాజ్వాదీ పార్టీ (SP) ప్రకటించింది. ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు మిలింద్ నర్వేకర్ బాబ్రీ మసీదు కూల్చివేతను సమర్థించేలా ట్వీట్ చేయడమే దీనిక్కారణమని మహారాష్ట్ర SP అధ్యక్షుడు అబు అసీం అజ్మీ తెలిపారు. శివసేన(UBT) సైతం బాబ్రీ కూల్చివేతకు మద్దతిచ్చేలా పేపర్లో ప్రకటన ఇచ్చిందని గుర్తుచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సమాజ్వాదీ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు.

భారత్తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సులో 337 పరుగులకు ఆలౌటైంది. దీంతో 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ట్రావిస్ హెడ్(140) సెంచరీతో రాణించారు. బుమ్రా, సిరాజ్ చెరో 4 వికెట్లతో రాణించారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్సులో 180 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

భారత యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొన్నారని కొనియాడారు. ‘నితీశ్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడారు. పరిస్థితులకు తగ్గట్టుగా సరైన సమయంలో ఎదురుదాడి చేశారు. భారత క్రికెట్కు మున్ముందు మంచి ఆటగాడవుతారు. వయసు 22 ఏళ్లే అయినా ఏమాత్రం భయం లేకుండా బ్యాటింగ్ చేశారు. ఆ రివర్స్ స్కూప్ షాట్ అద్భుతం’ అని పేర్కొన్నారు.

AP: తమ హయాంలో 11 DSCల ద్వారా 1.50 లక్షల మంది టీచర్లను నియమించామని CM చంద్రబాబు తెలిపారు. ఖాళీ అయిన పోస్టులన్నింటినీ భర్తీ చేసేవాళ్లమన్నారు. ఇకపై ప్రతి ఏటా DSC నిర్వహిస్తామని, టైం టేబుల్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. జూన్లో స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి నియామకాలు పూర్తి చేసేందుకు లోకేశ్ చర్యలు తీసుకుంటారన్నారు. 16,347 టీచర్ పోస్టులతో మెగా DSCపై CM తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే.

DR కాంగో దేశంలో మిస్టీరియస్ వ్యాధి కలకలం రేపుతోంది. చికిత్స లేని ఈ రోగం బారినపడి నవంబర్లో 143 మంది మరణించారు. బాధితుల్లో తీవ్రమైన తలనొప్పి, దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలు, అనీమియా లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో WHO హై అలర్ట్ ప్రకటించింది. అక్కడికి స్పెషల్ టీమ్ను పంపింది. ‘మేం ఏ వ్యాధితో పోరాడుతున్నామో అర్థం కావట్లేదు. అది వైరల్/బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా అనేది తెలియదు’ అని అధికారులు తెలిపారు.

మహారాష్ట్రలో EVMల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తూ MVA MLAలు నేటి ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించారు. ‘గెలుపొందిన మా MLAలు నేడు ప్రమాణం చేయరు. మాకు EVMలపై అనుమానాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం కూనీ అయింది’ అని శివసేన UBT అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ‘ఫలితాలపై సందేహాలొస్తున్నాయి. మొత్తం ప్రక్రియ కళంకితమైంది. ఏదో తప్పు జరిగినట్టు ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు’ అని కాంగ్రెస్ MLA విజయ్ తెలిపారు.

తెలియని ప్రదేశానికి వెళ్లేటప్పుడు చాలామంది అనుసరిస్తున్నది గూగుల్ మ్యాప్స్నే. ఇది రెండువైపులా పదునైన కత్తి. ఎంతగా ఉపయోగపడుతుందో గుడ్డిగా నమ్మితే నట్టేట ముంచడమూ ఖాయమే. మ్యాప్స్ పెట్టుకొని వెళ్లి అడవుల్లో తేలడం, నదిలో మునగడం, వంతెనలపై నుంచి పడిపోవడం తెలిసిందే. ఇలాంటప్పుడు సొంత మెదడు వాడాలని నిపుణులు చెప్తున్నారు. ఆ రోడ్లపై రాకపోకలు లేకున్నా, వాహనాలు, మనుషులు ఎదురవ్వకున్నా అనుమానించాలని అంటున్నారు.

ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు ఇచ్చిన గౌరవాలను బ్రిటిష్ రాజు ఛార్ల్స్ వెనక్కి తీసుకున్నారు. రమీ రేంజర్ అనే వ్యక్తికి కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్, అనిల్ భానోత్ అనే వ్యక్తికి ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అనే బిరుదుల్ని గతంలో ఇచ్చారు. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడిని వారు ఖండించారు. అది ఆ గౌరవాలకు భంగం కలిగించిందని బ్రిటిష్ రాజ్యం భావించినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.