News June 20, 2024

గంభీర్‌ రాక ఆటగాళ్లకు హెచ్చరికే: ఆకాశ్ చోప్రా

image

టీమ్ఇండియా కోచ్‌గా గంభీర్ ఎంపిక దాదాపు ఖాయమైనట్లేనని, సీనియర్ ప్లేయర్లకు అతడి రాక హెచ్చరికవంటిదని మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అన్నారు. ‘కోచ్‌గా కన్ఫామ్ అయితే 2027 వన్డే ప్రపంచకప్ వరకూ గంభీర్ కొనసాగొచ్చు. రోహిత్, విరాట్, షమీ, జడ్డూ వంటి స్టార్ ఆటగాళ్ల వయసు అప్పటికి 40కి దగ్గర్లోకి చేరుతుంది. ఈ నేపథ్యంలో గౌతీ కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన పదవీకాలం చాలా ఆసక్తిగా ఉండనుంది’ అని పేర్కొన్నారు.

News June 20, 2024

‘నాడు-నేడు’ పథకం పేరు మార్పు

image

AP: ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘నాడు-నేడు’ పథకం పేరును చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. ఇక నుంచి స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్‌మెంట్ (SII) పేరుతో ఆ స్కీమ్‌ను అమలు చేయనుంది. అన్ని పాఠశాలల్లో ఏడాదిలోపు మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు.

News June 20, 2024

ట్యాబ్లెట్ల ధరలు పెంపు

image

డయాబెటిస్, బీపీ సహా 54 రకాల ఔషధాల ధరలను కేంద్రప్రభుత్వం పెంచింది. మధుమేహం రోగులు అధికంగా వినియోగించే మెట్‌ఫార్మిన్, లినాగ్లిప్టిన్, సిటాగ్లిప్టిన్ రేట్లను ట్యాబ్లెట్‌కు రూ.15 నుంచి రూ.20కు పెంచింది. బీపీకి వినియోగించే టెల్మిసార్టన్, క్లోర్థాలిడన్, సిల్ని డిపైన్ మందుల ధరను రూ.7.14గా సవరించింది. యాంటీ బ్యాక్టీరియల్ ఇంజెక్షన్ సిప్రోఫ్లోక్సాసిన్, కాల్షియం, విటమిన్ డీ3 పిల్స్ రేట్లు సైతం పెరిగాయి.

News June 20, 2024

భద్రాద్రిలో జులై 2 నుంచి బ్రేక్ దర్శనం: ఆలయ ఈవో

image

TG: భద్రాచలం రామాలయంలో జులై 2 నుంచి బ్రేక్ దర్శనం అమల్లోకి రానుంది. ఇందుకు టికెట్ ధర రూ.200గా నిర్ణయించారు. ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 7.30 గంటల వరకు బ్రేక్ దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఆ సమయంలో ఉచిత, ప్రత్యేక దర్శనంతో పాటు ఇతర సేవలు నిలిపివేస్తామని పేర్కొన్నారు.

News June 20, 2024

CS పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రానికి సీఎం లేఖ

image

AP: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. నీరభ్ పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన సర్వీసును మరో 6 నెలల పాటు పొడిగించాలని సీఎం కేంద్రప్రభుత్వాన్ని కోరారు. తొలుత 3 నెలల పాటు సర్వీస్ పొడిగింపు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News June 20, 2024

ఏపీ అప్పులు రూ.13 లక్షల కోట్లు: దినకర్

image

AP: జగన్ సీఎంగా దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.13 లక్షల కోట్లకు చేరినట్లు బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. వీటిలో బడ్జెట్ రుణాలు రూ.5.50 లక్షల కోట్లు, బడ్జెటేతర రుణాలు రూ.7.50 లక్షల కోట్లని చెప్పారు. వీటన్నింటికి కలిపి రోజుకు రూ.250 కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంతో ఏపీ పరిస్థితి ప్రమాదంలో పడిందన్నారు.

News June 20, 2024

నేటి నుంచి గ్రూప్-4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్

image

TG: నేటి నుంచి గ్రూప్-4 మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, నాంపల్లిలోని TGPSC కార్యాలయంలో ఆగస్టు 21వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే అభ్యర్థులకు హాల్‌టికెట్ నంబర్ల వారీగా వెరిఫికేషన్ తేదీలను <>వెబ్‌సైట్‌<<>>లో పేర్కొంది. మరోవైపు గ్రూప్-2 దరఖాస్తుల వివరాల్లో తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ గడువు నేటితో ముగియనుంది.

News June 20, 2024

అఫ్గానిస్థాన్‌తో అంత ఈజీ కాదు

image

T20 వరల్డ్ కప్ సూపర్-8లో రోహిత్ సేన అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా లీగ్ దశలో న్యూజిలాండ్‌కు షాకిచ్చిన అఫ్గాన్‌ను భారత్ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. దీంతో భారత జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు లీగ్ దశలో విఫలమైన కింగ్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.

News June 20, 2024

నేడు అమరావతికి చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబునాయుడు నేడు అమరావతిలో పర్యటించనున్నారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. తర్వాత అమరావతి రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటిస్తారు. అధికారుల భవన సముదాయాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారు.

News June 20, 2024

వాయు కాలుష్యంతో రోజుకు 2వేల మంది చిన్నారులు మృతి: రిపోర్ట్

image

ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య సంబంధిత అనారోగ్య సమస్యలతో రోజుకు 2వేల మంది చిన్నారులు మరణిస్తున్నారని యూఎస్‌-హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ నివేదిక పేర్కొంది. 2021లో వాయు కాలుష్యంతో 81 లక్షల మంది మరణించినట్లు తెలిపింది. రక్తపోటు తర్వాత వాయుకాలుష్యమే మరణాలకు రెండో ప్రధాన కారకంగా ఉందని వెల్లడించింది. దీనిని నియంత్రించకపోతే తదుపరి జనరేషన్‌పై ప్రభావం చూపే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది.