India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సచివాలయంలో విగ్రహ ప్రతిష్ఠను నిలిపివేయాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరి గౌరీ శంకర్ కోరారు. త్వరలోనే ఈ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేయనుంది. ఈ విగ్రహంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

AP: అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం రాయలసీమ అని, ఇదొక చదువుల నేల అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గాడిచర్ల సర్వోత్తమరావు లాంటి మహానుభావులు ఇక్కడే పుట్టారన్నారు. రాయలసీమ అంటే అభివృద్ధిలో వెనుకబాటు కాదని, అవకాశాల కోసం ముందుండి నడిచే ప్రాంతం కావాలని ఆకాంక్షించారు.

AP: కడప మున్సిపల్ హైస్కూలులో నిర్వహించిన మెగా పేరెంట్స్& టీచర్స్ మీటింగ్లో Dy.CM పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. స్కూల్ ప్రాంగణంలో తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడారు. మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం జరగడం అభినందనీయమన్నారు. అంతకుముందు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను ప్రతిబింబిస్తూ ‘డ్రగ్స్ వద్దు బ్రో’ క్యాంపెయిన్ పోస్టర్ను ఆవిష్కరించారు.

AP: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కేంద్రం తరహాలో 730 రోజులు చైల్డ్ కేర్ లీవులను మంజూరు చేయాలని APJAC అమరావతి డిమాండ్ చేసింది. ప్రస్తుతం 180 రోజులే ఇస్తున్నారని తెలిపింది. పెన్షనర్ చనిపోతే భాగస్వామికి, ఇరువురూ మరణిస్తే వితంతు, విడాకులు తీసుకున్న కుమార్తెలకు పెన్షన్ ఇవ్వాలని కోరింది. 3 నెలలకోసారి ఉద్యోగులతో సమావేశమై సమస్యలను పరిష్కరించాలంది. ఈ మేరకు సీఎంవో ముఖ్యకార్యదర్శికి వినతిపత్రం సమర్పించింది.

AP: రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషకరమని APCC చీఫ్ షర్మిల అన్నారు. సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1,750కోట్ల ముడుపులపై విచారణ ఎప్పుడని ప్రభుత్వాన్ని Xలో ప్రశ్నించారు. ఆధారాలు, అధికారం దగ్గర పెట్టుకుని చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. నాడు జగన్ మాదిరే బాబూ అదానీకి అమ్ముడుపోయారని అర్థమవుతోందన్నారు. తక్షణమే సోలార్ డీల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇంగ్లండ్ టీమ్ చరిత్ర సృష్టించింది. టెస్టుల్లో 5 లక్షల రన్స్ చేసిన తొలి టీమ్గా నిలిచింది. కివీస్తో జరుగుతున్న రెండో మ్యాచ్లో ఈ ఘనత సాధించింది. క్రికెట్కు జన్మనిచ్చిన ENG 1877లో తొలి అధికారిక టెస్ట్ ఆసీస్తో ఆడింది. ఇప్పటి వరకు 1,081 టెస్టులు ఆడి 399 గెలుపులు, 327 అపజయాలు నమోదు చేసింది. 355 మ్యాచ్లు డ్రా అయ్యాయి.

డొనాల్డ్ ట్రంప్, మెలానియా జోడీ ఓ బంపరాఫర్ ఇచ్చింది! తమతో ప్రత్యేకంగా డిన్నర్ చేసే అవకాశాన్ని ఫ్యాన్స్కు కల్పించింది. కాకపోతే చిన్న షరతు పెట్టారు. ప్రమాణ స్వీకారానికి ముందు నిర్వహించే ఓ కార్యక్రమానికి డొనేషన్ ఇవ్వాలి. సొంతంగా రూ.8 కోట్లు విరాళం ఇవ్వాలి. లేదా రూ.16.5 కోట్లు విరాళాన్ని సేకరించి అందజేయాలి. కాబోయే ప్రెసిడెంట్లు ఇలా చేయడం USలో ఆనవాయితీ. 2009లో ఒబామా, 2021లో బైడెన్ ఇలాగే చేశారు.

AP: మార్కులు తక్కువ వచ్చాయని పిల్లలను తిట్టకుండా పేరెంట్స్ ప్రోత్సహించాలని మంత్రి నారాయణ సూచించారు. ప్రతి విద్యార్థి మేధావేనని, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే ఉన్నత స్థాయికి చేరుతారని చెప్పారు. నెల్లూరులో జరిగిన పేరెంట్స్&టీచర్స్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ‘నేను 1972లో టెన్త్ ఫెయిలయ్యా. దీంతో నాలో కసి పెరిగింది. కష్టపడి చదివి డిగ్రీ, PGలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా మారా’ అని గుర్తుచేసుకున్నారు.

TG: మాజీ మంత్రి హరీశ్రావును రీజినల్ రింగ్ రోడ్ బాధితులు, రైతులు కలిశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకోవడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణ సర్వే నిర్వహిస్తోందని వివరించారు. పత్రాలపై బలవంతంగా సంతకాలు సేకరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం కాకుండా తక్కువ ధరకే భూములు లాక్కుంటున్నారని, అండగా నిలబడాలని కోరారు. తాము అండగా ఉంటామని హరీశ్ భరోసా ఇచ్చారు.

అల్లు అర్జున్ రూ.25 లక్షల సాయంపై <<14814040>>విమర్శలు<<>> చేసిన జనసేన అడ్వకేట్ శాంతి ప్రసాద్పై ఆయన ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. సాయం ముష్టిగా కనపడుతోందా? అని మండిపడుతున్నారు. ‘తక్షణ సాయంగా రూ.25 లక్షలు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటానని వీడియోలో స్పష్టంగా భరోసా ఇచ్చారు. మీలాంటి వారు అభిమానుల మధ్య చిచ్చుపెట్టే పరిస్థితి తీసుకురాకూడదు’ అని పేర్కొంటున్నారు.
Sorry, no posts matched your criteria.