India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: లోక్సభ స్పీకర్ రేసులో రాజమండ్రి BJP MP దగ్గుబాటి పురందీశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతోపాటు కటక్ BJP MP భర్తృహరి మహతాబ్ పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు ఓం బిర్లానే స్పీకర్ అభ్యర్థిగా నిలబెట్టవచ్చంటూ వార్తలు వస్తున్నాయి. కాగా స్పీకర్ పదవి కోసం TDP, JDU తీవ్రంగా పోటీ పడుతున్నాయి. కానీ కమలం నాయకత్వం మాత్రం ఒడిశా లేదా ఏపీ BJP MPలనే స్పీకర్ అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు మొగ్గుచూపుతున్నట్లు టాక్.
PM కిసాన్ పథకం కింద 17వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసి వేదికగా ఆయన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి నిధులు విడుదల చేశారు. ఈ విడతలో భాగంగా 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల నిధులు జమ కానున్నాయి. అర్హులైన ప్రతి రైతు అకౌంట్లో రూ.2వేలు క్రెడిట్ అవుతాయి.
100 రోజుల ఉపాధి హామీ పనిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు కూలీగా మారారో IRS అధికారి. సూర్యపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన సందీప్ భాగ. బెంగళూరు జోన్లోని GST కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఇటీవల తన సొంతూరికి వచ్చిన ఆయన.. MGNREGA కార్మికుడిగా మారి రోజంతా ఎండలో పనిచేశారు. కొన్ని అనుభవాలు జీవితంపై చెరగని ప్రభావాన్ని చూపుతాయని ఆయన ఇన్స్టాలో ఫొటోలను పంచుకున్నారు.
ఈ నెల 30 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ నిర్వహించనున్నారు. ఎన్నికల కారణంగా కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడు దీనిని పున:ప్రారంభించాలని ప్రధాని నిర్ణయించారు. కాగా మన్ కీ బాత్ ద్వారా మోదీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతారు. ఈ కార్యక్రమం 2014 అక్టోబర్ 3న ప్రారంభించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
AP: బ్యాలెట్ పేపర్తో పోలింగ్ నిర్వహించాలన్న జగన్పై టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు Xలో మండిపడ్డారు. ‘ప్రజల గాలి తన వైపు లేదని ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న ఈ మనిషి నిజంగా మనిషేనా? తాను గెలిస్తే అన్నీ బాగున్నట్టు, ఓడిపోతే ఈవీఎంల మీద నెపాన్ని నెడతారా? ఇలాంటి దుర్మార్గుడు, రాక్షసుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది’ అని <<13442979>>అనుచిత<<>> వ్యాఖ్యలు చేశారు.
దూకుడుకు మారు పేరైన కోహ్లీ ముందు ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్స్ చేయబోనని KKR బౌలర్ హర్షిత్ రాణా చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ‘కోహ్లీకి ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరా?’ అనే ప్రశ్న రాణాకు ఎదురైంది. రాణా పైవిధంగా బదులిచ్చారు. SRH బ్యాటర్ అగర్వాల్కు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం ప్లాన్ ప్రకారం చేసింది కాదని వివరించారు. ఆ ఫ్లయింగ్ కిస్ వల్ల రాణా విమర్శలతో పాటు పెనాల్టీ, ఒక మ్యాచ్ సస్పెన్షన్ కూడా ఎదుర్కొన్నారు.
దేశంలోని పలుచోట్ల జియో నెట్వర్క్ స్తంభించిపోయినట్లు తెలుస్తోంది. మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్, ఫైబర్ వంటి సర్వీసులు నిలిచిపోయినట్లు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. డౌన్డిటెక్టర్ ప్రకారం మొబైల్ ఇంటర్నెట్ యూజర్లలో 54% మంది, ఫైబర్ యూజర్లలో 38%, సాధారణ నెట్వర్క్ యూజర్లలో 7% మంది ఈ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.
దేశవ్యాప్తంగా 40 ఎయిర్పోర్టుల్లో బాంబులు పెట్టామంటూ దుండగులు మెయిల్స్ చేశారు. ఢిల్లీ, పట్నా, జైపూర్, వడోదరా, కోయంబత్తూర్ తదితర విమానాశ్రయాలను పేల్చేస్తామని బెదిరించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది బాంబ్ స్వ్కాడ్తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తమ కొడుకు చనిపోయినప్పటికీ మరో ఆరుగురిలో జీవించి ఉంటారనే ఉద్దేశంతో ముష్టిపల్లి శ్రీనివాస్ కుటుంబం అవయవదానం చేసేందుకు ముందుకొచ్చింది. అతని రెండు కిడ్నీలు, లివర్, గుండె, 2 కళ్లు దానం చేయడం ద్వారా ఆరుగురికి పునర్జన్మనిచ్చారని తెలంగాణ జీవన్దాన్ Xలో పోస్ట్ చేసింది. శ్రీనివాస్ ఈనెల 14న మరణించినట్లు వెల్లడించింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాను అక్టోబర్ 31 లేదా డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు టాక్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.