India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాహుల్ గాంధీ వయనాడ్ MPగా రాజీనామా చేసి, రాయ్బరేలీని అట్టిపెట్టుకోవాలని నిర్ణయించుకోవడంతో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. ఆ స్థానంలో రాహుల్ సోదరి ప్రియాంక పోటీ చేస్తారని ఇప్పటికే INC చీఫ్ ఖర్గే ప్రకటించారు. ఒకవేళ ఆమె గెలిస్తే గాంధీ ఫ్యామిలీ నుంచి ముగ్గురు MPలు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పటికే సోనియా (రాజస్థాన్) రాజ్యసభకు, రాహుల్ (రాయ్బరేలీ) లోక్ సభకు ఎన్నికై ఉన్నారు.
T20 WCలో సూపర్-8 దశలో ఏదైనా ప్రత్యేకంగా చేస్తామని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ‘జట్టులో సభ్యులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. సూపర్-8 షెడ్యూల్ కొంచెం టైట్ ఉన్నా ఈస్థాయిలో అలా ఆడేందుకు అలవాటుపడి ఉన్నాం. మా నైపుణ్యాలకు మరింత పదును పెట్టడంపై దృష్టి సారించాం. ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఎదురుచూస్తున్నాం’ అని వెల్లడించారు. భారత్ ఈ నెల 20 అఫ్గాన్తో, 22న బంగ్లాదేశ్తో, 24న ఆస్ట్రేలియాతో తలపడనుంది.
AP: గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు తిరోగమించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ధర్మవరంలో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి సహజ వనరులను దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఏపీని నంబర్-1 చేస్తామని తెలిపారు. చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని చెప్పారు.
AP: రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. దేశంలోనే నంబర్-1 ఆర్థిక రాజధానిగా విశాఖను చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. క్యాపిటల్ పేరు చెప్పి వైజాగ్ను గంజాయికి రాజధానిగా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని మండిపడ్డారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించి విశాఖకు పునర్వైభవం తీసుకొస్తామని చెప్పారు.
లైంగిక వేధింపుల బాధితురాలి అపహరణలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీదే కీలకపాత్ర అని కర్ణాటక హైకోర్టుకు సిట్ తెలిపింది. ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు బాధితులను మేనేజ్ చేయాలనుకుందని పేర్కొంది. విచారణను ఆమె తప్పుదోవ పట్టిస్తున్నారని, ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరింది. అయితే ఆమె పోలీసులకు అన్నివిధాలుగా సహకరిస్తున్నారని భవానీ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో ఆమెకు ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇచ్చింది.
అందాల పోటీల్లోనూ AI ఎంట్రీ ఇచ్చేసింది. ఫాన్వ్యూ సంస్థ ప్రపంచ దేశాల్లోని ఏఐ మోడల్స్కు అందాల పోటీ నిర్వహిస్తోంది. టాప్ టెన్ చేరిన ఫైనలిస్టుల్లో భారత్కు చెందిన జారా శతావరి చోటుదక్కించుకుంది. రాహుల్ చౌదరి ఈమెను రూపొందించారు. ఇన్స్టాలో 7500కుపైగా ఫాలోవర్లు ఉన్న జారా ఇప్పటికే పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. కాగా టాప్ 3లో నిలిచిన మోడల్స్కు $20వేలు (₹16లక్షలపైనే) ప్రైజ్ మనీ అందనుంది.
కొందరు ఎన్డీఏ నేతలు తమతో టచ్లో ఉన్నారని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన అన్నారు. ‘మా చేతులు కట్టేసిన పరిస్థితుల్లో కూడా మేము ఎన్నికల్లో పోరాడాం. ఎలాంటి వివక్ష లేకుండా ఉండి ఉంటే ఇండియా కూటమికే మెజారిటీ వచ్చేది. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి మనుగడ కష్టమే. ఆ కూటమి బలహీనంగా ఉండటంతో ఎప్పుడైనా ప్రభుత్వం కూలిపోవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
టీ20 వరల్డ్ కప్లో లీగ్ దశలోనే ఎలిమినేట్ కావడంతో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం స్వదేశం వెళ్లలేదు. అమెరికా నుంచి నేరుగా యూకే వెళ్లినట్లు తెలుస్తోంది. అతడితో పాటు ఆమిర్, ఇమాద్, రవూఫ్, షాదాబ్, ఆజం ఖాన్ కూడా అభిమానుల ఆగ్రహానికి భయపడి యూకే వెళ్లారట. కొన్నాళ్లు అక్కడే ఉండి తర్వాత పాక్కు వెళ్తారని సమాచారం. ప్రస్తుతానికి యూకే లోకల్ లీగ్స్లో ఆడాలని వారు భావిస్తున్నట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి.
‘కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్ 2024’ ప్రకారం అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో హాంగ్ కాంగ్ ప్రథమ స్థానంలో నిలిచింది. సింగపూర్, జ్యూరిచ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై (136) నిలిచింది. 2013లో సర్వే ప్రారంభమైనప్పటి నుంచి ఈ నగరం ఇండియాలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ (164), చెన్నై (189), బెంగళూరు (195), హైదరాబాద్ (202) ఉన్నాయి.
NCP(SP) అధినేత శరద్ పవార్ను TMC MPల బృందం కలిసింది. స్టాక్ మార్కెట్ మేనిపులేషన్పై విచారణ జరిపించాలనే వారి డిమాండ్కు పవార్ మద్దతిచ్చారు. తప్పుడు ఎగ్జిట్ పోల్స్తో మోదీ, అమిత్ షా స్టాక్ మార్కెట్ను మేనిపులేట్ చేశారని TMC అధినేత్రి, WB CM మమత ఆరోపిస్తున్నారు. BJP ‘బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్ స్కామ్’కు పాల్పడటంతో ఇన్వెస్టర్లు రూ.30లక్షల కోట్లు నష్టపోయినట్లు రాహుల్ సైతం ఆరోపణలు గుప్పించారు.
Sorry, no posts matched your criteria.