News September 8, 2024

గణేశ్ మండపాలు.. నిర్వాహకులకు జాగ్రత్తలు

image

*కరెంట్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కాటన్, పరదాలు సులభంగా కాలిపోతాయి కాబట్టి గమనిస్తూ ఉండాలి.
*కొందరు మెయిన్ లైన్ల నుంచి తప్పుడు మార్గంలో కరెంట్ తీసుకుంటారు. అది ఎప్పటికీ ప్రమాదం అని గుర్తించాలి.
*భారీ శబ్దంతో డీజే పెట్టుకుని డాన్స్ చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.
*నిమజ్జనంలో చెరువులో దిగకుండా ఉండాలి.
>>ఈ పండుగ మీ తల్లిదండ్రులకు విషాదం కాకుండా చూసుకోండి.

News September 8, 2024

ప్రకాశం బ్యారేజీని కూల్చేయడానికి జగన్ కుట్ర: టీడీపీ

image

AP: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీని కూల్చేయడానికి జగన్ కుట్ర చేశారని టీడీపీ ఆరోపించింది. ‘ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు రామ్మోహన్‌కు చెందిన 3 బోట్లను కట్టేసి ఒకేసారి వదిలేశారు. 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్న సమయంలోనే బ్యారేజీని కూల్చేసి విజయవాడను జలసమాధి చేయాలని జగన్ క్రిమినల్ ప్లాన్ వేశాడు. అయితే అదృష్టవశాత్తు ఎక్కువ నష్టం జరగలేదు. దీనిపై విచారణ జరుగుతోంది’ అని ట్వీట్ చేసింది.

News September 8, 2024

త‌మిళగ వెట్రి క‌ళ‌గంకు ఈసీ గుర్తింపు

image

త‌మిళ స్టార్ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ స్థాపించిన త‌మిళగ వెట్రి క‌ళ‌గం పార్టీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం గుర్తింపు దక్కింది. రిజిస్ట‌ర్డ్ పార్టీగా నమోదు చేసినట్టు ఆ పార్టీకి ECI కబురు పంపింది. ఫిబ్ర‌వ‌రిలో గుర్తింపు కోసం ఆ పార్టీ వర్గాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇటీవ‌ల జెండాను కూడా ఆవిష్క‌రించిన విజ‌య్ పార్టీ సంస్థాగ‌త నిర్మాణంపై దృష్టి సారించారు. రాష్ట్ర మహాసభలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

News September 8, 2024

మరో ముప్పు.. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి: కిషన్ రెడ్డి

image

TG: వరద బాధితులను మోదీ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన వెంటనే పూర్తి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. సాయం విషయంలో కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదన్నారు. మరోసారి తుఫాన్ ముప్పు పొంచి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితులను ఆదుకునేందుకు సామాజిక, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

News September 8, 2024

ఘోరం.. ఆసుపత్రి బిల్లు కట్టేందుకు చిన్నారిని అమ్మేశాడు

image

యూపీలో ఘోరం జరిగింది. ఆసుపత్రి బిల్లు కట్టేందుకు ఓ తండ్రి మూడేళ్ల చిన్నారిని అమ్మేశాడు. భార్య ఆరో బిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి బిల్లు కడితేనే పంపుతామని యాజమాన్యం తేల్చిచెప్పడంతో తన మూడేళ్ల కొడుకును అమ్మకానికి పెట్టాడు. ఇది కాస్త స్థానికంగా చర్చనీయాంశంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు.

News September 8, 2024

నేడు పారిస్ పారాలింపిక్స్ చివరి రోజు

image

పారిస్ పారాలింపిక్స్ ఆదివారంతో ముగియ‌నుంది. చివ‌రి రోజు మహిళల కయాక్ సింగిల్ 200M – KL1 సెమీఫైనల్స్‌లో భార‌త్ త‌ర‌ఫున‌ పూజా ఓజా పోటీ పడుతున్నారు. మ‌ధ్నాహ్నం 1.30 జ‌రిగే సెమీస్ గెలిస్తే, 2.55 గంట‌ల‌కు ఫైన‌ల్లో పోటీప‌డాల్సి ఉంటుంది. ఈ పారాలింపిక్స్ భార‌త్‌కు ఒక మైలురాయి. గ‌తం కంటే ఘ‌నంగా ఈసారి 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో భార‌త బృందం 29 పతకాలు గెలుచుకుంది.

News September 8, 2024

ధోని రికార్డును సమం చేసిన ధ్రువ్ జురెల్

image

టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ దిగ్గజ ప్లేయర్ ధోని రికార్డును సమం చేశారు. దులీప్ ట్రోఫీలో ఇండియా-Bతో జరుగుతున్న మ్యాచులో ఒకే ఇన్నింగ్సులో జురెల్ ఏడు క్యాచులు అందుకున్నారు. 2004-05లో ఈ దేశవాళీ టోర్నీలో ధోని 7 క్యాచులు అందుకున్నారు. కాగా ఆ తర్వాతి స్థానాల్లో బెంజమిన్, విశ్వనాథ్ ఆరేసి క్యాచులతో ఉన్నారు.

News September 8, 2024

ఖమ్మంలో కిషన్ రెడ్డి పర్యటన.. బాధితులకు పరామర్శ

image

TG: ఖమ్మం నగరంలో మున్నేరు నది వరదతో నష్టపోయిన బాధితులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వరదలో కొట్టుకుపోయిన ఇళ్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ఓదార్చారు. పునరావాస కార్యక్రమాలను పరిశీలించారు. కిషన్ రెడ్డి వెంట మంత్రి పొంగులేటి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు.

News September 8, 2024

న‌ల్గొండకు జాతీయ అవార్డు.. గాలి నాణ్యత మెరుగుదలకు గుర్తింపు

image

దేశంలో 3 ల‌క్ష‌లు అంత‌కంటే త‌క్కువ జ‌నాభా గ‌ల న‌గ‌రాల్లో గాలి నాణ్య‌త మెరుగుద‌లలో రాయ్‌బ‌రేలీ మొద‌టి స్థానంలో నిల‌వ‌గా న‌ల్గొండ 2వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో 10 ల‌క్ష‌లపైన జ‌నాభా న‌గరాల్లో సూర‌త్ మొద‌టి స్థానంలో, ఫిరోజాబాద్‌, అమ‌రావ‌తి(మ‌హారాష్ట్ర‌) త‌రువాతి స్థానాల్లో నిలిచాయి. వాయుకాలుష్యంలో PM10 స్థాయి తగ్గుదలకు గుర్తింపుగా కేంద్రం స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డులను ప్ర‌దానం చేసింది.

News September 8, 2024

పెరుగుతున్న మృతుల సంఖ్య

image

UP లక్నోలోని ట్రాన్స్‌పోర్ట్ న‌గ‌ర్‌లో మూడంత‌స్తుల భ‌వ‌నం కూలిన ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 8కి చేరింది. శ‌నివారం సాయంత్రం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురి మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కి తీశారు. సహాయ‌క చ‌ర్య‌లు జ‌రుగుతున్న‌ప్పుడు శిథిలాల కింద‌ మ‌రో ముగ్గురి మృత‌దేహాల‌ను గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 28 మంది గాయ‌ప‌డిన‌ట్టు అధికారులు తెలిపారు. వర్షం కురుస్తుండగా గోడళ్లో పగుళ్లు వచ్చి భవనం కూలినట్లు బాధితులు తెలిపారు.