India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు మెరుగైన ఎక్స్గ్రేషియాను అందిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్ర గాయాలైనవారికి రూ.2.5 లక్షలు, గాయాలైనవారికి రూ. 50వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000ను PMNRF నుంచి ఇస్తామని ప్రకటించారు.
ఆ హాస్పిటల్/మెడికల్ కాలేజీ స్థాపించి 13 ఏళ్లు. ఇంతవరకు ఒక్క సర్జరీ జరగలేదు. ఒక్క MBBS గ్రాడ్యుయేట్ కాలేజీ నుంచి బయటకు రాలేదు. ఇదీ పంజాబ్లోని వైట్ Pvt మెడికల్ కాలేజీ దుస్థితి. ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో దీనికి NMC అనుమతులు నిరాకరిస్తూ వస్తోంది. దీంతో విద్యార్థుల్ని వేరే కాలేజీలకు షిఫ్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. కర్ణాటకలోని GRకాలేజీదీ ఇదే పరిస్థితి కాగా విద్యార్థుల్ని తరలించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి’ సినిమాలో మరికొందరు స్టార్స్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపికా, దిశా పటానీ కన్ఫర్మ్ అయ్యారు. తాజాగా మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా స్పెషల్ క్యారెక్టర్లో కనిపించనున్నారట. అర్జునుడి పాత్రలో విజయ్ నటిస్తున్నారట. ఈనెల 27న కల్కి రిలీజవుతుంది.
AP: సీఎం చంద్రబాబు తలచుకుంటే కేంద్రం నుంచి సులభంగా ప్రత్యేక హోదా సాధించవచ్చని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన చేయాల్సిందల్లా కేంద్రాన్ని అడగటమే అని అన్నారు. టీడీపీ మద్దతుపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడిన తరుణంలో చంద్రబాబు బీజేపీ పెద్దలను కలిసి ప్రత్యేక హోదాపై చర్చించాలని పేర్కొన్నారు.
AP: కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా, అచ్చెన్నాయుడు రాష్ట్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. మంత్రులైన తర్వాత సొంత జిల్లా శ్రీకాకుళానికి ఇవాళ తొలిసారి వచ్చారు. దీంతో పార్టీ శ్రేణులు వారికి ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలలు వేశారు. భోగాపురం నుంచి శ్రీకాకుళం ఆర్చి, 7రోడ్స్ జంక్షన్, అరసవల్లి జంక్షన్ మీదుగా ర్యాలీ నిర్వహించారు.
AP: సచివాలయంలో మంత్రి పవన్ కళ్యాణ్కు ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 గదిని ఆయన కోసం రెడీ చేస్తున్నారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్కు కూడా అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు. ఆయా ఛాంబర్లలో ఫర్నిచర్, ఇతర సామగ్రిని అధికారులు సమకూరుస్తున్నారు. కాగా ఎల్లుండి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తారు.
<<13455686>>ప.బెంగాల్<<>>లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికుల్లో భయాందోళనలు కలిగించింది. ఇదిలా ఉంటే <<13455953>>వరుస<<>> ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పదవి నుంచి తప్పుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మోదీ చేసిన ట్వీట్ కింద కామెంట్స్ చేస్తున్నారు. గతంలో నితీశ్ కుమార్ రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి తప్పుకున్నారని గుర్తు చేస్తున్నారు.
AP: రాష్ట్రంలో రబీ సీజన్లో ఏర్పడిన కరవుపై అంచనా కోసం ఏపీకి కేంద్రం నుంచి 3 బృందాలు రానున్నాయి. రేపటి నుంచి శుక్రవారం వరకు ఒక బృందం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు, రెండో టీం కర్నూలు, నంద్యాల జిల్లాలు, మూడోది నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించి పరిస్థితిని తెలుసుకోనున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
చార్ ధామ్ యాత్ర నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈక్రమంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలతో అధికారులు ‘యాంటీ వేస్ట్ డ్రైవ్’లను నిర్వహించారు. 3 టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించి విక్రయించడం ద్వారా జోషిమఠ్ మున్సిపాలిటీకి రూ.1.02 కోట్ల ఆదాయం వచ్చింది. పర్వతాలకు సమస్యగా మారుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చుకున్నారు.
పశ్చిమ బెంగాల్లో రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితులకు ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఇవ్వనున్నారు. ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఈ ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోగా 60మంది గాయపడ్డారు. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.