News September 8, 2024

నేటి ముఖ్యాంశాలు

image

*AP: వరద బాధితులను చూస్తే గుండె తరుక్కుపోతోంది: చంద్రబాబు
* బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తి: మంత్రి నిమ్మల
* వరద వచ్చి 8 రోజులైనా ఇంకా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి: జగన్
* TG: పారాలింపిక్స్ పతక విజేత దీప్తికి ప్రభుత్వం నజరానా
* ఖమ్మంలో భారీ వర్షాలు.. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
* కాంగ్రెస్ ఘనతను వర్ణించడానికి మాటలు రావట్లేదు: KTR సెటైర్

News September 7, 2024

ర‌జ‌నీకాంత్ కామెంట్స్‌పై రాధిక స్పంద‌న‌

image

మాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన జ‌స్టిస్ హేమా క‌మిటీ నివేదిక గురించి త‌న‌కు తెలియ‌ద‌ని ర‌జ‌నీకాంత్ వ్యాఖ్యానించ‌డంపై న‌టి రాధిక స్పందించారు. క‌మిటీ నివేదిక‌పై ఆయ‌న‌కు ఎవ‌రూ చెప్పి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, ఒక‌వేళ ఆయ‌న‌కు తెలిసివుంటే స్పందించేవార‌ని రాధిక పేర్కొన్నారు. మ‌హిళా ఆర్టిస్టుల‌పై వేధింపుల విష‌యంలో స‌హ‌చ‌ర న‌టులు మౌనంగా ఉండ‌డంపై ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల‌కు సంఘీభావం ప్ర‌క‌టించాలని సూచించారు.

News September 7, 2024

హై అలర్ట్.. వరదలపై ప్రభుత్వం WARNING

image

విజయవాడలో కురుస్తున్న భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరే అవకాశం ఉందని, అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సృజన ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. బుడమేరు గండ్లను పూడ్చివేయడం వల్ల కొత్తగా అక్కడికి వరద నీరు చేరడం లేదని, అయినా వర్షాల వల్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటు ఖమ్మం పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది.

News September 7, 2024

రేపే యూఎస్ ఓపెన్ టెన్నిస్ ఫైనల్

image

US ఓపెన్ టెన్నిస్ పురుషుల‌ ఫైన‌ల్స్ ఆదివారం జ‌ర‌గ‌నుంది. అమెరికాకు చెందిన 26 ఏళ్ల టేలర్ ఫ్రిట్జ్ టైటిల్ గెలిచిన రెండో అమెరిక‌న్‌గా నిలుస్తాడా? లేదా 23 ఏళ్ల ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్‌ ఇట‌లీ స్టార్ జ‌న్నిక్ సిన్న‌ర్ టైటిల్ గెలిచి చ‌రిత్ర సృష్టిస్తాడా? అన్న‌ది రేపు తేల‌నుంది. మ‌ణిక‌ట్టు గాయాన్ని సైతం లెక్క చేయ‌కుండా సిన్న‌ర్ క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు గెలిచినా అది చ‌రిత్రే.

News September 7, 2024

సచివాలయాలు, వాలంటీర్లు ఉండి ఉంటే..: జగన్

image

CM చంద్రబాబు ప్రచార ఆర్భాటాల వల్ల సహాయక చర్యల్లో సమన్వయ లోపం నెలకొందని YS జగన్ ట్వీట్ చేశారు. ‘మీకూ, మంత్రి నాదెండ్లకు మధ్య జరిగిన సంభాషణపై వైరల్ అయిన వీడియోనే దీనికి సాక్ష్యం. వర్షాలు ఆగి 5 రోజులు అయిన తర్వాత కూడా మీరు ఎలాంటి పాలన చేస్తున్నారు? సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థపై కక్ష పెంచుకుని వాటిని నిర్వీర్యం చేయడం వల్ల ఈ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నది వాస్తవం కాదా?’ అని ప్రశ్నించారు.

News September 7, 2024

జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయని తెలిసినా పట్టించుకోలేదు: జగన్

image

AP: చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే విజయవాడను వరద ముంచెత్తిందని YS జగన్ విమర్శించారు. ‘ఆగస్టు 30 నుంచి భారీ వర్షాలు, వరదలు వస్తాయని 28నే మీకు అలర్ట్ వచ్చింది. కృష్ణాపై ఉన్న జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయని తెలిసినా పట్టించుకోలేదు. ఉన్నతాధికారులతో రివ్యూ చేసి బాధ్యతలు అప్పగించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా? బుడమేరు విషయంలో మీరు చేసిన నిర్వాకం వల్ల ఇంత విపత్తుకు దారితీసింది’ అని ట్వీట్ చేశారు.

News September 7, 2024

త్వరలో గంటకి 250 కిమీ వేగంతో నడిచే రైళ్లు!

image

రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గంట‌కు 250 KM వేగంతో న‌డిచే 2 రైళ్ల రూప‌క‌ల్ప‌న‌, త‌యారీకి బిడ్లు ఆహ్వానించింది. ఈ ఏడాది జూన్‌లో 2 స్టాండర్డ్ గేజ్ రైళ్ల త‌యారీకి రైల్వే శాఖ‌ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి లేఖ రాసింది. 8 కోచ్‌లు ఉండేలా ఉక్కుతో త‌యారై 220 KM రన్నింగ్ సామర్థ్యంతో గరిష్ఠంగా 250 KMPH వేగం కలిగి ఉండాలని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం వందే భారత్ 160 KMPH వేగంతో నడవగలవు.

News September 7, 2024

బంగ్లా జాతీయ గీతం మార్చాలన్న డిమాండ్‌.. సర్కారు నిరాకరణ!

image

జాతీయ గీతాన్ని, జెండాను మార్చాలంటూ బంగ్లాలో డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఆ గీతం స్వతంత్ర బంగ్లాను ప్రతిఫలించడం లేదని, బ్రిటిష్ కాలంనాటి దేశాన్ని గుర్తుచేస్తోందని పలువురు అభ్యంతరాలను లేవనెత్తారు. భారత్ కారణంగానే అది తమ జాతీయగీతమైందని ఆరోపించారు. ఆ డిమాండ్లకు స్పందించిన బంగ్లా మధ్యంతర సర్కారు గీతాన్ని, జెండాను మార్చే ఉద్దేశాలేవీ లేవని తేల్చిచెప్పింది.

News September 7, 2024

మ్యాజిక్ కంటిన్యూ చేస్తారా?

image

’గేమ్ ఛేంజర్‘ నుంచి రిలీజ్ కాబోయే సెకండ్ సాంగ్‌లో ఫార్మల్ డ్రెస్‌లో తలకు ఎర్ర కండువా చుట్టిన రామ్ చరణ్ లుక్ తెగ ఆకట్టుకుంటోంది. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇదే కండువాతో సూపర్ హిట్ సాంగ్స్ చేశారు. ముఠామేస్త్రీలో హోయి రబ్బా, గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో చరణ్ కూడా అదే మ్యాజిక్ కంటిన్యూ చేస్తారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

News September 7, 2024

జగన్ అన్నా.. మనం సాయం చేసి చూపిద్దాం: బ్రహ్మాజీ

image

AP: రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అంటూ వైసీసీ చీఫ్ జగన్ చేసిన ట్వీట్‌కు నటుడు బ్రహ్మాజీ స్పందించారు. ఈ ప్రభుత్వం సాయం చేయలేదని, మనమైనా చేద్దామని తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ‘ఫస్ట్ రూ.1000 కోట్లు రిలీజ్ చేద్దాం. వైసీపీ కేడర్‌ను రంగంలోకి దింపుదాం. మనకు జనాలు ముఖ్యం. ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం. జై జగన్ అన్న’ అంటూ రాసుకొచ్చారు.